MS agarwal
-
తుప్పు దరిచేరని ఉక్కు
హైదరాబాద్: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ఆధునాతన సాంకేతికత సాయంతో తుప్పు నిరోధక, బలీయమైన ఉక్కు ఉత్పాదనకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి ఎంఎస్ లైఫ్ 600+ సీఆర్ఎస్ (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది.అలాగే రాబోయే 3–4 సంవత్సరాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 18–20 నెలల్లో దేశవ్యాప్తంగా 1,000+ యాక్టివ్ డీలర్లకు విస్తరించనున్నారు. విస్తరణ ద్వారా 5,000+ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. -
ఏపీలో 1,200 కోట్లతో ఎంఎస్ఏఎఫ్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ తయారీలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా అత్యాధునిక స్టీల్ ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇందుకోసం సంస్థ రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. తద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సా మర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లు. కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన.. ఎంఎస్ఏఎఫ్ కొత్తగా ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ లైఫ్ 600, ఏఎఫ్ స్టార్ 500–డి పేరుతో స్టీల్ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్ పార్ట్నర్స్ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు స్టీల్ను సరఫరా చేసింది. -
కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు ముగియకపోవడం, సీలేరు విద్యుత్పై సదరల్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ఇంకా నివేదిక అందకపోవడం తదితర కారణాలరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎంఎస్ అగర్వాల్ మంగళవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. రేడియల్ క్రస్ట్ గేట్లు ఎక్కి దిగువ కృష్ణానదిని పరిశీలించారు. డ్యాం మీదుగా వెళ్లి లిప్టుద్వారా 390,420 గ్యాలరీలలోకి దిగి పరిశీలించారు.