Mumbai Traffic Police
-
‘సల్మాన్ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సల్మాన్కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
బాడీగార్డ్ బైక్పై అనుష్క శర్మ చక్కర్లు... చలాన్ వేసిన పోలీసులు
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి అటు సినిమా, ఇటు క్రికెట్ ఫ్యాన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రబ్ నే బనాదే జోడీ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ పలు సినిమాలు చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. తన కారు ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుష్క బైక్ను ఆశ్రయించింది. బైక్పై తన బాడీగార్డ్తో కలిసి లొకేషన్కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె, డ్రైవర్ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనిపై ముంబై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్ కమ్ డ్రైవర్ సోనూ షేక్కు రూ.10,500 జరిమానా విధించామని, ఆ డబ్బులు మొత్తం చెల్లించేశారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మధ్యే బిగ్ బీ అమితాబ్ కూడా హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించారు. ఆయనకు రూ.1000 జరిమానా విధించగా ఆ మొత్తాన్ని చెల్లించేశారని పోలీసులు ట్వీట్ చేశారు. Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T — Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023 చదవండి: 11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్లానని తిట్టారు: యాంకర్ శ్యామల -
బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే!
సాక్షి, ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని ముంబై ట్రాఫిక్ పోలీసు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో రూ.500 జరిమాన వసూలు చేస్తారు. లేదంటే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన అధికారిక సర్క్యూలర్ ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసింది. అయితే వెనక సీట్లో కూర్చున్న హెల్మెట్ ధరించని వారికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత పట్టుబడితే బైక్ నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు, జరిమాన వసూలు చేస్తామని హెచ్చరించారు. దీంతో బైక్ నడిపేవారు లేదా యజమానులు ఇప్పటినుంచే అదనంగా ఒక హెల్మెట్ కొనుగోలు చేసుకుని ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. యథేచ్ఛగా నియమాల ఉల్లంఘన కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం 2020 మార్చిలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేకమంది వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించడం మానేశారు. హెల్మెట్ లేకుండా బైక్లు నడపడం, ట్రిపుల్ సీటు డ్రైవింగ్, నో ఎంట్రీ, రాంగ్ రూట్లో వాహనాలు తోలడం, సిగ్నల్స్ జంప్ చేయడం లాంటి అనేక ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల్ని ఎత్తివేసినప్పటికీ వాహన చోదకులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్లు నడపటం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్లో వెళ్లడం లాంటి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బైక్లకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నడిపేవారితోపాటు వెనక కూర్చున్న వారికి కూడా తలకు హెల్మెట్ లేకపోవడంవల్ల ప్రాణనష్టం అధికంగా జరుగుతోంది. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు 1988, సెక్షన్ 126, 194–డి ప్రకారం తలకు హెల్మెట్ లేని ద్విచక్ర వాహన చోదకులకు రూ.500 జరిమాన, అలాగే మూడు నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే నియమాలున్నాయి. ఇప్పుడు ఈ నియమాలను అమలు చేయనున్నారు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా దీంతో ఇకనుంచి బైక్ నడిపే వారితోపాటు వెనక సీట్లో కూర్చునే వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. అందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ముంబై ట్రాఫిక్ పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్ర«ధాన నగరాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో ముంబై అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను, ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నంలో ఉన్నారు. -
ముంబైలో సరికొత్త ప్రయోగం.. కేటీఆర్ ఆసక్తి
-
హారన్పై చెయ్యి పడిందో.. ఇక అంతే..!
సాక్షి, హైదరాబాద్ : జల, వాయు, శబ్ద, నేల కాలుష్యానికి కేరాఫ్గా మారిన ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులకు కొదవే ఉండదు. లక్షలాది వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి తూట్లు పొడుస్తుండగా.. అదేపనిగా మోగించే వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడినా కూడా కొందరు హారన్లతో హోరెత్తిస్తుంటారు. దాంతో అక్కడ పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చెవిపోటు ఖాయం. అందుకే దీనికో పరిష్కారం కనుగొన్నారు ముంబై పోలీసులు. కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబెల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. వాహనదారుల హారన్ మోతలకు కళ్లెం వేశారు. హారన్ శబ్దాలు డెసిబెల్స్ మీటర్లో 85 కంటే ఎక్కువ నమోదైందంటే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. ఎవరిదారిన వారు.. సైలెంట్గా వెళ్లి పోతే సమస్యే లేదు. కాదూ కూడదు అని.. హారన్పై చెయ్యి పడిందో ఇక అంతే..! గ్రీన్ సిగ్నల్ పడినా వెంటనే రెడ్ సిగ్నల్కు జంప్ అవుతుంది. ఈ ప్రయోగం ముంబైలో సత్ఫలితాలనిస్తోంది. దీనిపట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొద్దామని ట్విటర్లో వెల్లడించారు. -
చిన్నారికి పాలిస్తుండగా ఈడ్చుకెళ్లారు!
-
డ్రంకన్ డ్రైవ్!
మద్యం సేవించి కారు నడుపుతూ బుక్కైపోయాడు ‘బాలికా వధు’ నటుడు సిద్ధార్థ్ శుక్లా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ‘ఊగుతూ’ తెగ ఎంజాయ్ చేసిన ఇతగాడు... ఇంటికి తిరిగి వెళుతుండగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. పరిమితికి మించి మద్యం తీసుకున్నందుకు రెండు వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు. లెసైన్స లాక్కున్నారు. దెబ్బకు మత్తు దిగే లోపే... మరో షాకిచ్చారు. రాత్రంతా స్టేషన్లో ఉంచి... తెల్లారి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మొత్తానికి... కొత్త సంవత్సరం సందర్భంగా జుహూలో తన మిత్రులతో కలసి పార్టీ చేసుకున్న సిద్ధార్థ్ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఓ ‘కొత్త’ అనుభూతినీ మిగిల్చింది!