munikoti
-
మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఏడాది కిందట ఆత్మాహుతికి పాల్పడిన మునికోటిని గుర్తుచేస్తూ 'సీఎంగారూ.. ఇతనెవరో తెలుసా?'.. అనే శీర్షికన 'సాక్షి' ప్రచురించిన కథనానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ అనుచరులు తిరుపతిలో ఉన్న ముని కోటి కుటుంబానికి రూ.2 లక్షల చెక్ను అందజేసినట్లు సమాచారం. కష్టాల్లో ఉండి తన దృష్టికి వచ్చిన పలువురిని ఆదుకున్నారు పవన్. తాజాగా మునికోటి కుటుంబానికి అండగా నిలవడం మరోసారి ఆయన వితరణ గుణాన్ని చాటింది. సరిగ్గా ఏడాది కిందట ప్రత్యేక హోదా నినాదంతో తిరుపతిలో ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు మునికోటి. అప్పట్లో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినప్పటకీ.. ఏడాది గడచినా మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు. -
సీఎం గారూ..ఇతనెవరో తెలుసా?
-
సీఎం గారూ..ఇతనెవరో తెలుసా?
– సరిగ్గా ఏడాది కిందట మునికోటి ఆత్మాహుతి – ప్రత్యేక హోదా నినాదంతో తిరుపతిలో ఆత్మబలిదానం – ఏడాది గడచినా ఇప్పటికీ అందని ఆర్థిక సాయం – ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆయన పరితపించాడు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా హోదా కోసం నినదించాడు. ప్లకార్డులు చేతబట్టుకుని, ఫ్లెక్సీలను భుజాన వేసుకుని ఉద్యమించాడు. తన ఆత్మబలిదానంతోనైనా కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుందని ఆశ పడ్డాడు. పట్టపగలు.. వందలాది మంది నడుమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివ్వెరపోయాయి. పత్రికలు పతాశ శీర్షికలతో కథనాలు రాశాయి. మునికోటి పార్థివ దేహాన్ని సందర్శించిన ముఖ్యనేతలందరూ సంతాపాలు, సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇదంతా జరిగి సరిగ్గా నేటికి ఏడాది. అప్పట్లో మునికోటి త్యాగాన్ని పెద్ద ఎత్తున ప్రశంసించిన సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం తాలూకు వాగ్దానాన్ని విస్మరించారు. మళ్లీ మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు. తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగళూరు ముని కామకోటి మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ అభిమాని. గత ఏడాది ఆగస్టు 8న తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం పోరుసభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునికోటి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆయన్ని రక్షించే క్రమంలో శేషాద్రి అనే యువకుడు కూడా గాయపడ్డాడు. 70 శాతం గాయపడ్డ మునికోటి మరుసటి రోజున ఆస్పత్రిలో కన్నుమూశాడు. ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్యకు పాల్పడ్డాననని ఆయన మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ సంఘటనపై అన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. ఈ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు స్పందించారు. ‘తిరుపతి సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందనీ, ఎవరూ ప్రత్యేక హోదా కోసం భావోద్వేగాలకు లోను కావద్దని’ హితవు చెబుతూ మునికోటి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఆ తరువాత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మునికోటి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వీరెవ్వరూ మళ్లీ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూసింది లేదు. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరుసటి రోజున బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇవి మాత్రమే ఇప్పటివరకు ఆ కుటుంబానికి అందాయి. అటు ప్రభుత్వం గానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేయక పోవడం బాధాకరంగా ఉందని మునికోటి సోదరుడు మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆరాట పడ్డ తన సోదరుడి ఆశయం నెరవేరకపోగా ఆయన కుటుంబానికీ అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. ఇదేనా చిత్తశుద్ధి..? ప్రత్యేక హోదా విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం హోదా సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వారి విషయంలోనూ అదే వైఖరిని కనబర్చడం అన్యాయమని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా వాసి అయి ఉండి, సొంత జిల్లాలో ఆత్మాహుతి చేసుకున్న మునికోటి కుటుంబాన్ని ఆయన ఆదుకోకపోవడం దారుణమని వీరంటున్నారు. -
మునికోటి కుటుంబసభ్యులను పరామర్శించిన రోజా!
-
మునికోటి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండ
తిరుపతి : ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న మునికోటి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలిచింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మునికోటి కుటుంబాన్ని ఆ పార్టీ ఆర్థికంగా ఆదుకుంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి నారాయణస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డిలు ఆర్థిక సాయం అందజేశారు. మునికోటి కుటుంబసభ్యులకు రూ. 3 లక్షలు, తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నశేషాద్రికి రూ.50వేల నగదు అందజేశారు. మునికోటి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఒక అన్నగా వైఎస్ జగన్... తమను ఆదుకుంటున్నారని... ఆర్థికంగా అండగా నిలిచారని మునికోటి భార్య సంతోషం వ్యక్తం చేశారు. -
శేషాద్రి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్!
-
మునికోటి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ!
-
నేడు కోటీ కుటుంబానికి జగన్ పరామర్శ
-
తిరుపతి బంద్ విజయవంతం
తిరుపతి కల్చరల్: రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి అంత్యక్రియల నేపథ్యంలో కాంగ్రెస్ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన తిరుపతి బంద్ విజయవంతమైంది. మద్దతుగా సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు రోడ్లపైకి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్, పూర్ణకుంభం సర్కిల్, మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టారు. నగర ప్రధాన వీధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. పూర్ణకుంభం సర్కిల్లో ధర్నా సందర్భంగా సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలతో నగర ప్రధాన వీధుల్లో తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత కుట్రలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దతుగా తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి బంద్కు మద్దతు ప్రకటించాయి. నగరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి వేసి ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, నాయకులు నాగభూషణం, నైనార్ శ్రీనివాసులు, ఎస్.కుమార్, శ్రీదేవి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రామానాయుడు, చిన్నం పెంచలయ్య, వెంకయ్య, రాధాకృష్ణ, ఎన్డీ.రవి, ఏఐటీయూసీ నాయకులు రామచంద్రయ్య, హరికృష్ణ, పీ.మురళి, సీపీఎం రాష్ట్ర నేతలు అజయ్, కృష్ణయ్య, కే.కుమార్రెడ్డి, కందారపు మురళి, నాగరాజు, చంద్రశేఖర్రెడ్డి, సుబ్రమణ్యం, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. -
'నాయకుల స్వార్థమే బలి తీసుకుంది'
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటి మృతదేహం తిరుపతికి చేరుకుంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య పలువురు నేతలు చెన్నై నుంచి అతని మృతదేహాన్ని తీసుకొచ్చారు. మునికోటి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు, ప్రజాసంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాజకీయ నాయకుల స్వార్థమే మునికోటిని బలి తీసుకుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏ రకమైన లబ్ధి చేకూరుతుందో తెలిసినా పదవుల కోసం నేతలు ప్రత్యేకహోదా అంశాన్ని పట్టించుకోవడం మానేశారని పేర్కొన్నారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మునికోటి అంత్యక్రియలు జరిగాయి.