mutyam
-
మూడు ముత్యాలు
రామకథలో ప్రతి ఘట్టం ఒక ముత్యం. ప్రతి ముత్యం ఒక రామాయణం. ఈ శ్రీరామ నవమికి.. హనుమంతుడు మోసుకొచ్చిన మూడు ముత్యాల పర్వతాలు మీకోసం. హిమాలయాలలో నిద్రిస్తున్న హనుమంతుడికి మెడలోని ముత్యాలహారం చేతికి తగలగానే మెలకువ వచ్చింది! ‘నేడు నా రామయ్య తండ్రి కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు. రామనామం జపిస్తూ భద్రాద్రికి బయలుదేరతాను’ అనుకుంటూ రామనామ స్మరణతో భద్రాద్రి చేరుకున్నాడు. కల్యాణం కనులారా వీక్షించి పరవశించిపోయాడు హనుమంతుడు. కల్యాణం పరిసమాప్తి తర్వాత ఆ దంపతులతో మాట్లాడసాగాడు హనుమంతుడు. నాటి గాథ (ఒకటో ముత్యం) ‘‘నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికివ్వు’ అన్నావు. సీతమ్మ ఆ హారాన్ని అందుకుని సింహాసనం దిగి, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే!’ అన్నాను. ఇదంతా నాటి గాథ’’ అన్నాడు హనుమ. నేటి సందేహం (రెండో ముత్యం) ‘‘తండ్రీ! నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని అందరూ అనుకుంటున్నారు’’ అంటుండగానే... సీతమ్మ అందుకున్నారు. ‘‘హనుమా! రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కోట్లమందికి ప్రభువు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను’’ అని చెప్పింది. రాముడు, ‘‘హనుమా! ఎవరి ఆలోచనలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించిందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో’’ అన్నాడు. రేపటి సందేశం (మూడో ముత్యం) ‘‘రామా! నిన్ను తొలిసారి చూసినప్పుడే నువ్వేమిటో అర్థమైందయ్యా. సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ అడిగావు. నేను నగల మూటను చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు కన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలను గుర్తించవయ్యా’ అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. ఎంత ఉత్తములయ్యా మీరు’’ అన్నాడు హనుమ. ఏటేటా కల్యాణం ‘‘చివరగా ఒక్క మాట తండ్రీ.. ఎన్ని యుగాలు గడిచినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యనే చెప్పుకుంటారు. అది నాకెంతో సంతోషం. నాడు మీ కల్యాణం చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటాం’’ అని, సీతారాముల ఆశీస్సులు తీసుకుని హిమాలయాలలో తపస్సు కోసం నిష్క్రమించాడు హనుమంతుడు. – వైజయంతి -
ఏజెన్సీలోప్రకంపనలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల వేళ మావోయిస్టు కార్యకలాపాలు ఉధృతమవుతుండడం జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. దాదాపు రెండు నెలల కాలంలోనే మూడు ఎన్నికలను నిర్వహించాల్సిన తరుణంలో మావోయిస్టులు ఒకదానిపై ఒకటిగా వరుసగా పోలీసులకు షాకులిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చడం, పట్టపగలే భద్రాచలంలో పోస్టర్లు వేయడం లాంటి ఘటనల తర్వాత.... సీపీఎం నాయకుడు ముత్యంను హతమార్చిన మరుసటి రోజే ఛత్తీస్గఢ్లో ఒకేసారి 15 మంది పోలీసులను మావోయిస్టులు చంపడంతో జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయం... భయం భయం త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారని నిఘావర్గాలంటున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తమ వ్యూహాలకు పదును పెడుతున్న రాజకీయ నేతల్లో కూడా ఈ పరిణామాలు భయం పుట్టిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పోటీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో.. నిలబడ్డ అభ్యర్థులు ప్రచారానికి వెళితే ఏం జరుగుతుందోననే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు అటవీప్రాంత గ్రామాల్లోకి ప్రచారం నిమిత్తం వెళ్లే రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం కూడా పోలీసులకు పెద్ద సవాల్గా మారనుంది. ప్రచారంలో భాగంగా పోలీసులకు సరైన వివరాలు తెలపకుండా అటవీప్రాంత గ్రామాల్లోకి వెళ్లవద్దని నాయకులకు చెపుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందనేది అనుమానమే. కాగా, మావోయిస్టుల వరుస దాడులతో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను మోహరించారు. ఛత్తీస్గఢ్ ఘటనతో ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. జిల్లాలోని చింతూరు మండల కేంద్రానికి ఘటనస్థలం సుమారు 150కిలో మీటర్ల దూరంలోనే ఉండటంతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనని సరిహద్దు ప్రాంతంలోని గిరిజను లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మూడునెలల క్రితమే వ్యూహం ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో గత డిసెంబర్ నెలాఖరులో మావోయిస్టుల కీలక సమావేశం జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి వివరాలను సేకరించిన కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఛత్తీస్గఢ్-ఒడిశా దండకారణ్యానికి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర నేతలు, మిలటరీ ప్లాటూన్ కమిటీల కార్యదర్శులు దండకారణ్యంలోని గర్యబంద్ అటవీ ప్రాంతంలో కీలక సమావేశం నిర్వహించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈసమావేశంలో ముఖ్యంగా 2014లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయంతో పాటు దండకారణ్య ప్రజలకు మరింత దగ్గరగా ఎలా వెళ్లాలనే దానిపై వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పీపుల్స్వార్ తదితర సంఘాలతో విలీనమై మావోయిస్టులుగా అవతరించి 10 సంవత్సరాలు కావడంతో 10వ వార్షికోత్సవాలను దండకారణ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలనే దానిపై చర్చలు జరిపారు. దండకారణ్యంలోని ప్రతీ ఆదివాసీ గ్రామాలలో దళ,మిలీషియా,గ్రామ కమిటీ సభ్యులు విధిగా పాల్గొని వారోత్సవాలను ఘనంగా నిర్వహించే విదంగా చర్యలు చేపట్టాలని స్పెషల్ జోనల్ కమిటీ తీర్మానించినట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాలలోని యువతీ ,యువకులను అధిక శాతంలో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మిలటరీ ప్లాటూన్లో సభ్యులు తక్కువగా ఉండడంతో పాటు ఆయుధాలు ఇతర సామగ్రి తక్కువగా ఉన్నాయని సమావేశంలో మిలటరీ కార్యదర్శులు స్పెషల్ జోన్ కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. అందులోభాగంగానే ఇటీవల రిక్రూట్మెంట్ ప్రారంభించారని, కొత్తగా పార్టీలో రిక్రూట్ అయిన వారే పట్టపగలు భద్రాచలంలో పోస్టర్లు వేయడం, సీపీఎం నేతను హత్య చేసిన ఘటనలో పాల్గొన్నారని తెలుస్తోంది. మరోవైపు నరేశ్ ఎన్కౌంటర్ తర్వాత స్తబ్దుగా ఉన్న శబరి ఏరియా కమిటీ కూడా క్రియాశీలమవుతోందని, కొరియర్ వ్యవస్థను మా వోయిస్టులు ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుం టున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఎన్నికయిన సంతో ష్ స్వయంగా ఆపరేషన్లలో పాల్గొంటున్నారని కూడా పోలీసు వర్గాల వద్ద సమాచారం ఉంది. డీ ఐజీతో ఎస్పీ భేటీ : ఛత్తీస్గఢ్లో జరిగిన ఘటనతో జిల్లాలో రెడ్ ఎలర్ట్ ప్రకటించినట్టయింది. ఛత్తీస్గఢ్ ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ ఎ.వి.రంగనాథ్ అక్కడి పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్బి సమావేశ మందిరంలో జ్యూయలరీ షాపుల యాజమానులతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావలసి ఉన్నా ఎస్పీ హాజరుకాలేదు. ఘటన జరిగిన సమయంలో కొత్తగూడెంలో ఉన్న ఆయన ఆ తర్వాత వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావుతో భేటీ అయ్యారు. ఛత్తీస్గఢ్ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిరువురి చాలా సేపు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.