Neradi Barriage
-
వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ఆ ప్రాజెక్టు ఫలాలను 2,55,510 ఎకరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో ముందస్తుగా అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్లోకి నీటిని తరలించే ఎత్తిపోతల పనులకు ఆమోదం తెలిపారు. గొట్టా బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార వరద జలాలను రోజుకు 1,400 క్యూసెక్కులు హిరమండలానికి తరలిస్తారు. దీనికి రూ.189 కోట్లు ఖర్చవుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్ను నింపడం ద్వారా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందిస్తారు. తద్వారా వెనుకబడిన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించి చెరో 57.5 టీఎంసీలు వాడుకొనేలా 1961 జూలై 18న ఏపీ, ఒడిశాల మధ్య ఒప్పందం కుదిరింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో వంశధార స్టేజ్–2, ఫేజ్–2 చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని 19.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే హీరమండలం రిజర్వాయర్లోకి తరలించే పనులు చేపట్టారు. దీనిద్వారా కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార స్టేజ్–1 కింద 2,10,510 ఎకరాలను స్థిరీకరిస్తారు. అయితే, నేరడి బ్యారేజీపై ఒడిశా సుప్రీం కోర్టుకు వెళ్లింది. దానిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు డిజైన్ను మార్చారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై 300 మీటర్ల పొడవున సైడ్ వియర్ నిర్మించి 1,700 క్యూసెక్కుల చొప్పున 8 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్లోకి తరలించే పనులు చేపట్టారు. 2009 నాటికే ఈ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక ఇచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వంశధార జలాలను సమంగా (57.5 టీఎంసీల చొప్పున) రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దీన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పూర్తి ఫలాలు అందించే దిశగా ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రిని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు కోరారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గతేడాది నవంబర్ 3న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టు పూర్తి ఫలాలను ముందస్తుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాట్రగడ్డ సైడ్ వియర్ ద్వారా చేరే 1,700 క్యూసెక్కులకు అదనంగా గొట్టా బ్యారేజీ నుంచి మరో 1,400 క్యూసెక్కుల వరద జలాలను హిరమండలం రిజర్వాయర్లోకి ఎత్తిపోసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా వంశధారకు వరద ఉన్న రోజుల్లో గొట్టా బ్యారేజీ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించి, వరద లేని రోజుల్లో హిరమండలం రిజర్వాయర్ ద్వారా నీరిస్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పటికే వంశధార ప్రాజెక్టు కింద రబీ పంటలకు నీళ్లందిస్తున్నారు. హిరమండలం రిజర్వాయర్ను నింపడం ద్వారా రెండో పంటకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. -
ఎమ్మెల్యే ధర్మాన ప్రతిపాదనలకు సీఎం జగన్ సానుకూలం
సాక్షి, శ్రీకాకుళం: నేరడి.. జిల్లా ప్రజల చిరకాల కల. వైఎస్సార్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శతవిధాలా కృషి చేశారు. అడ్డంకులు అన్నీ తొలగినా పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగి నీరు అందేందుకు కాస్త సమయ పడుతుంది. ఈ లోగానే ఖరీఫ్లో 2.50 లక్ష లు, రబీలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు, ఉద్దానం ప్రాజెక్టుకు తాగునీరు అందించేందుకు మరో ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ఇరిగేషన్లో నిపుణులైన ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కి లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివరించారు. దానిపై మంగళవారం తాడేపల్లిలో జరిగిన ఇరిగేషన్ శాఖ సమీక్షలో సీఎం సానుకూలంగా స్పందించారు. ధర్మాన ప్రతిపాదించిన లేఖ మంత్రిగా ఉన్న సమయంలో ధర్మాన ప్రసాదరావు జిల్లా రైతుల శ్రేయస్సు కోసం తన ప్రతిపాదనలను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైఎస్సార్ వంశధార స్టేజ్–2, ఫేజ్– 2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87, ప్యాకేజీ–88, హిరమండలం రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. నేరడి మాత్రం ఎప్పటి నుంచో కలగానే మిగిలిపోయింది. హిరమండలం రిజర్వాయర్లోకి 19.5 టీ ఎంసీల నీటిని నింపి జిల్లా రైతులకు మేలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.600 కోట్లు అవసరం. వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఒడిశా అభ్యంతరాల వల్ల జాప్యం జరుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే తప్ప రిజర్వాయర్లోకి 19.5 టీఎంసీల నీరు నింపే పరిస్థితి లేదు. వంశధార రిజర్వాయర్ దీంతో నిష్ణాతులైన ఇంజినీర్ల ఆలోచనతో గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, దానితో హిర మండలం రిజర్వాయర్లోకి 19.5 టీఎంసీల నీటిని డంప్ చేసే ప్రతిపాదనను శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీ సమావేశాల సమయంలో లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ లిఫ్ట్ పనులకు సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా. హిరమండలం రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు సాగునీరుతో పాటు, ఉద్దానంకు తాగునీరు, భావనపాడు ఫిషింగ్ హార్బర్కి పుష్కలంగా నీరిచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రతిపాదనకు సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ ఇంజినీర్లతో తాడేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష స మావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్కు సర్వే, తదితర చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఒకే సీజన్లో పూర్తి.. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు ఎంతకాలమో పట్టదు. ఒకే సీజన్లో పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఖరీఫ్లో 2.50లక్షల ఎకరాలకు, రబీలో 1.50లక్షల ఎకరాలకు నీరు అందించడానికి అవకాశం ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్కు చేసే ఖర్చును నాలుగేళ్లలో వెనక్కి తెచ్చుకోవచ్చు. రైతులకు అందించే నీటితో పండే పంట ద్వారా ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి వస్తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సరసన నిలబడేందుకు ఈ లిఫ్ట్ పనులు ఎంతో దోహదపడతాయి. లిఫ్ట్ పథకం జిల్లా ప్రజలకు వరం వెనుకబడిన ప్రాంతంగా శ్రీకాకుళంకు పేరుంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఉన్న వనరులను ప్ర భుత్వాలు సమర్థంగా వాడు కోవాలి. అందులో భాగంగానే వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి జిల్లాకు అందించారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1600 కోట్లు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావాల్సిందే. కానీ ఒడిశా అభ్యంతరాలు చెబుతూనే ఉంది. దీనికి బ్రేక్ వేయాలనే ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. అందుకు ఆయన సా నుకూలంగా స్పందించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కొన్నా ళ్లు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని నిర్మాణానికి కూడా నాలుగైదు సీజన్లు పడుతుంది. అందుకే తక్షణం రైతులకు ఉపయోగపడేలా హిర మండలం రిజర్వాయర్లో 19.5 టీఎంసీల నీటిని నింపేందుకు తగిన సలహాలు, సూచనలు వంశధార ఇంజినీర్లను అడిగాం. జేఈ నుంచి చీ ఫ్ ఇంజనీర్ వరకు అందరి నోటా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గమనే సూచన వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ విషయాన్ని సీఎంకు వివరించాం. గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి హిరమండలం రిజర్వాయర్లోకి 19.5 టీఎంసీల నీటిని నింపవచ్చన్న విషయాన్ని చెప్పాం. దీనికి రూ.300 కోట్లు అవసరమని దీని వల్ల ఖరీఫ్లో 2.50 లక్షల ఎకరాలు, రబీలో 1.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు చేసేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని వివరంగా తెలియ జేశాం. సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. లిఫ్ట్ పనులు పూర్తయితే జిల్లా రూ పురేఖలు మారిపోతాయి. ఖరీఫ్, రబీలో వరితో పాటు వాణిజ్య పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతుల కోసం ఖర్చు చేయడం ధర్మమే. సీఎం సానుకూల స్పందనతో వచ్చే రబీ నాటికే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకుండా కరువు వంటి పరిస్థితులు వచ్చినా హిరమండలం రిజర్వాయర్లో నీటిని ఆయకట్టుకి ఇ చ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కొ త్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లా లో ఉండే 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ప్రజలకు అ«ధికంగా ఉపయోగపడుతుంది. – ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే -
ఒడిశా ముఖ్యమంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
Odisha Tour: శ్రీకాకుళం బయలుదేరిన సీఎం జగన్
-
AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
Updates: సాయంత్రం... ► ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్తో చర్చించారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ►పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు. ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిశారు. మధ్యాహ్నం.. ► ముందుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఉదయం... ►విశాఖపట్నం: భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం -
Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో మంగళవారం సాయంత్రం భువనేశ్వర్లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. సరిహద్దు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకుని కలిసి అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం జగన్ పలు దఫాలు పేర్కొనటం తెలిసిందే. ఈ క్రమంలో చర్చలకు సమయమిస్తే తానే వస్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఒడిశా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. జంఝావతిపై రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతంగా కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం అంశాన్ని కూడా సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా 24,640 ఎకరాలకుగానూ కేవలం ఐదు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించడం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయన్నారు. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురి కానుండగా ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్ కోరనున్నారు. ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు పాతపట్నం చేరుకుని పెళ్లి రిసెప్షన్కు హాజరవుతారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా సీఎం జగన్ వెంట ఒడిశా పర్యటనలో పాల్గొంటారు. నేరడి బ్యారేజీతో ఒడిశాకూ ప్రయోజనం నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను సీఎం జగన్ చర్చల సందర్భంగా ప్రస్తావించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరం కాగా ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పారు. -
సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్ అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ చొరవతోనే.. నేరడికి ఎప్పుడో శంకుస్థాపన పడినా పనుల్లో వేగం చూసింది మాత్రం వైఎస్సార్ హయాంలోనే. 1962 సెప్టెంబర్ 30న ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య 50ః50 ప్రాతిపదికన వంశధార బేసిన్లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రూ. 944.90 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ రెండో దశ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వంశధారపై నేరడి బ్యారే జీ నిర్మించి, అక్కడి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు వరద జలాలను తరలించి, గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు కొత్త గా 45 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించా రు. ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం చెప్పడంతో భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై సైడ్వ్యూయర్ నిర్మించి అక్కడి నుంచి వరద జలాల ను సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు తరలించేలా అలైన్మెంట్ మార్చి పనులు చేపట్టారు. వివాదం తేలిన తర్వాత నేరడి బ్యారేజీ నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. కన్నెత్తి చూడని బాబు.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్–13న ట్రి బ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలయ్యేలా చూడడంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించారు. అప్పట్లోనే ఒడిశాతో చర్చలు జరిపి ఉంటే ఈ పాటికే ప్రాజెక్ట్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ వైఎస్సార్కు పేరు వస్తుందని బాబు ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జిల్లా రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్ తర్వా త మళ్లీ వైఎస్ జగన్ హయాంలోనే ఈ పనులకు కదలిక వచ్చింది. చదవండి: (Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం) ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..? ►వంశధార జల వివాదంపై ట్రిబ్యునల్ ఆంధ్రాకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ►నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ►115 టీఎంసీల నీరు వంశధారలో లభ్యత కాగా, రెండు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని సూ చించింది. ►బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ►కాట్రగడ్డ సైడ్ వ్యూయర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్ను ఏటా జూన్ 1 నుంచి ఎనిమిది టీ ఎంసీలు మళ్లించే వరకూ లేదా నవంబర్ 30 వర కూ తెరిచి ఉంచాలని, డిసెంబర్ –1న మూసి వేయాలని షరతు పెట్టింది. ►నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాట్ర గడ్డ సైడ్ వ్యూయర్ను పూర్తిస్థాయిలో తొలగించాలని, వంశధార నదీ యాజమాన్యం బోర్డు ఏర్పా టు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం చొరవ.. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించగలిగింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఏపీ అవసరాల కోసం బ్యారేజీకి కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. రూ. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా కోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఎంత మేర నీటి అవసరమో అన్న విషయాన్ని గెజిట్ విడుదల చేసిన ఆరు నెలలు లోగా ఏపీకి తెలియజేయాలని సూచించింది. ప్రయోజనాలెన్నో.. ►నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఖరీఫ్లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. ►ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుంది. ►ఇప్పటికే రూ. 700 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. ►వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ►ఒడిశాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ►హిరమండలం రిజర్వాయర్లోకి 19 టీఎంసీల నీరు చేరాలంటే 10 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం 40 రోజుల పాటు రెగ్యులర్గా ఉండాలి. అదే నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ సమస్య తప్పుతుంది. -
ఈ ఏడాదిలోనే నేరడి బ్యారేజీకి శంకుస్థాపన
పాలకొండ రూరల్/అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ పనులకు ఈ ఏడాదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ చెప్పారు. ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో కలిసి నేరడిలో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. 2024 నాటికి బ్యారేజీ పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఇది పూర్తయితే ఏపీలో 2 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఏటా సముద్రంలో కలిసే 100 టీఎంసీలతో పాటు ఒడిశా నుంచి సమకూరే 50 టీఎంసీల నీటినీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చని, తద్వారా దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు పండి జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. అనంతరం మంత్రి అనిల్.. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టును పరిశీలించి, పనుల పురోగతిపై ఆరాతీశారు. ఖరీఫ్కు నీరందించాలని చెప్పారు. అనంతరం శ్రీకాకుళంలోని జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తదితరులున్నారు. -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం ఏపీ, ఒడిశాకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గెజిట్ విడుదలైన తర్వాత వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు ఒడిశా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. కాగా వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. చదవండి: వంశధార జలాల వివాదానికి చరమగీతం ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
నేరడి నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కోరారు. ఈ మేరకు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు శనివారం లేఖ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో నెలకొన్న సమస్యలను సంప్రదింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంప్రదింపులకోసం వచ్చి కలుస్తానని, సమయం కేటాయించాలని ఒడిశా సీఎంను కోరారు. అనేక సంవత్సరాలుగా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నమ్మకమైన.. సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నాయని, అంతేగాక పరస్పర సంప్రదింపుల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్నామని జగన్ తన లేఖలో గుర్తు చేశారు. నేరడితో ఏపీతోపాటు ఒడిశాకూ ఉపయోగం.. వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ 13–09–2017న ఇచ్చిన తుది తీర్పును సీఎం వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావిస్తూ.. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతించిందని తెలిపారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏపీతోపాటు ఒడిశా అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. నేరడి బ్యారేజ్ ఎడమ వైపున లెఫ్ట్ హెడ్ స్లూయిజ్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అనుమతించిందని, ఇది ఒడిస్సా రాష్ట్రం అవసరాలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనివల్ల కరువు ప్రాంతాలైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలోని గజపతి జిల్లాలోని ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరతాయని తెలిపారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం కోసం రెండు రాష్ట్రాల రైతులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఏటా వరద జలాల్లో 75 శాతం అంటే.. సుమారు 80 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. మానవుని అవసరాలకు నీరు చాలా ప్రధానమైనదని, అలాగే పరిమితంగా ఉండే నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్లో నీటికొరతకు అవకాశముందని ఆయన తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందాం.. ఒడిశా రాష్ట్రం కొన్ని అంశాల్లో స్పష్టత కోసం వంశధార ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రధానంగా సూపర్వైజరీ కమిటీ పనితీరుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారని, అయితే ఆ విషయంపై నేరడి బ్యారేజ్ ఆపరేషన్లోకి వచ్చే ముందుగానే ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ పునరుద్ఘాటిస్తూ.. ఈ నేపథ్యంలో చర్చల కోసం తగిన సమయం కేటాయించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కోరారు. -
‘నేరడి’పై వివాదాల పరిష్కారానికి సీఎం చొరవ
సాక్షి, అమరావతి : వంశధార, జంఝావతి నదీ జలాల్లో వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒడిశా సర్కార్తో సంప్రదింపులు జరిపి వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో కీలకమైన నేరడి బ్యారేజీ.. జంఝావతి రబ్బర్ డ్యామ్ స్థానంలో స్పిల్ వే నిర్మించడం ద్వారా వాటా జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. నేరడి బ్యారేజీ, ఝంజావతి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించి.. వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చదవండి: రేపు రెండో విడత రైతు భరోసా ప్రారంభం నేరడిపై ఒడిశా అభ్యంతరం.. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి ఎనిమిది వేల క్యూసెక్కులను కొత్తగా నిర్మించే సింగిడి రిజర్వాయర్ (0.686 టీఎంసీలు), పారాపురం రిజర్వాయర్ (0.404 టీఎంసీలు), హిరమండలం రిజర్వాయర్ (19.05 టీఎంసీలు)లలో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: ‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’ ఒడిశా ప్రతిపాదన మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆర్నెల్లలోగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 6, 2009న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు వంశధార ట్రిబ్యునల్ను ఫిబ్రవరి 24, 2010న కేంద్రం ఏర్పాటు చేసింది. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి.. బామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి.. గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలు మళ్లించే పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. జంఝావతి వివాదం ఇదీ.. జంఝావతి నదిలో 8 టీఎంసీల నీటి లభ్యతలో చెరి సగం వాడుకునేలా డిసెంబర్ 25, 1978న ఒడిశా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ వాటా నీటిని వినియోగించుకోవడం కోసం విజయనగరం జిల్లాలో జంఝావతిపై కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 3.40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బ్యారేజీ ద్వారా 24,410 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఒడిశాలో ముంపునకు గురయ్యే 1,175 ఎకరాలను సేకరించి అప్పగించడానికి అప్పట్లోనే ఒడిశా సర్కార్ వద్ద ఏపీ ప్రభుత్వం నిధులను డిపాజిట్ చేసింది. కానీ ఒడిశా సర్కార్ భూసేకరణ చేయలేదు. పూర్తిస్థాయి బ్యారేజీ నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చింది. దాంతో జంఝావతి ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ను నిర్మించారు. సంప్రదింపుల ద్వారా వివాదాలు పరిష్కారం.. వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ సెప్టెంబర్ 13, 2017న ట్రిబ్యునల్ తుది తీర్పును ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒడిశా సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు, వంశధార ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముంపు భూమిని గుర్తించేందుకు జాయింట్ సర్వేకు కూడా ఒడిశా సర్కార్ సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించి... జంఝావతిపై 3.40 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయి బ్యారేజీని నిర్మించడానికి మార్గం సుగమం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. -
వేగంగా నే‘రడి’
సాక్షి, అమరావతి: వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరడి బ్యారేజీని నిర్మించి రోజుకు 8 వేల క్యూసెక్కులను మళ్లించడం ద్వారా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 కింద 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. వంశధార జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నేరడి బ్యారేజీ పనులు చేపట్టేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణం ద్వారా ఒడిశాలో ముంపునకు గురయ్యే 106 ఎకరాలను గుర్తించేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్న అంశాన్ని కేంద్ర జల్శక్తి శాఖ దృష్టికి ఇప్పటికే తెచ్చింది. 106 ఎకరాల భూసేకరణకు అయ్యే వ్యయాన్ని ఒడిశా సర్కార్ వద్ద డిపాజిట్ చేసి నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో పంటకూ సాగునీరు.. ► ఒడిశా సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయిం చడంతో అభ్యంతరాలను పరి శీలించాలని వంశధార ట్రిబ్యునల్ను న్యాయ స్థానం ఆదేశించింది. ► నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు వంశధార ట్రిబ్యునల్ సీడబ్ల్యూసీ ఎస్ఈ నేతృత్వంలో సంయుక్త సర్వేకు ఆదేశిం చినా ఒడిశా సహాయ నిరాకరణతో ముందుకు సాగడం లేదు. ఇదే అం శాన్ని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం వంశ ధార ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలని కోరింది. నేరడి బ్యారేజీ పూర్తయితే వంశధార ఆయకట్టుకు రెండో పంటకూ నీళ్లందించవచ్చునని సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాట్రగడ్డ సైడ్ వియర్తో 8 టీఎంసీలే మళ్లింపు.. ► నాలుగున్నర దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 33.704 కి.మీ. పొడవైన హైలెవల్ కెనాల్ ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించి సింగిడి, పారాపురం, హీర మండలం రిజర్వాయర్ల ద్వారా నీళ్లందించాలని నిర్ణయించారు. ► నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేసి భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. సైడ్ వియర్ నిర్మాణం వల్ల గరిష్టంగా ఎనిమిది టీఎంసీలను మళ్లించవచ్చు. ► నేరడి బ్యారేజీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వంశధార ట్రిబ్యునల్ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది. బ్యారేజీ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్కు, ఎడమ కాలువ ద్వారా ఒడిశాకు నీటిని సరఫరా చేయాలని, వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని నిర్దేశించింది. -
‘నేరడి’పై ట్రిబ్యునల్ కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసే దిశగా వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా జనవరి 10, 2020న ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా ఆదేశాలను రెండు నెలలపాటు నిలుపుదల చేయాలని ఒడిశా చేసిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది. వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుంద శర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం గతేడాది డిసెంబర్ 22 నుంచి 29 మధ్య శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా గతంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న వంశధార ట్రిబ్యునల్.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి.. మ్యాపులు తయారీ చేసి జూన్ 30లోగా ఇవ్వాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్లో ముంపునకు గురయ్యే భూములను సర్వే చేయడానికి రూ. 15.68 లక్షలు, ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించే పనులకు రూ. 5.91 లక్షల వ్యయంతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచింది. కానీ, ఒడిశా సర్కార్ సంయుక్త సర్వేకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సోమవారం ఏపీ సర్కార్ వంశధార ట్రిబ్యునల్కు వివరించింది. దాంతో.. వరదలు తగ్గాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి ఆరు వారాల్లోగా సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది రాజగోపాల్, రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ విచారణకు హాజరయ్యారు. -
ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు
సాక్షి, ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను వంశధార ట్రిబ్యునల్ సోమవారం తోసిపుచ్చింది. గతంలో నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్ సర్వేకు వంశధార ట్రిబ్యునల్ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆర్డర్లో మార్పలు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్ను సిద్ధం చేయాలని, సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకత్వంపై నివేధిక చేయాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజ్కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించి తదుపరి విచారణను జనవరి 10వ తేదికి వాయిదా వేసింది. -
నేరడి బ్యారేజీపై ప్రభుత్వం నిర్లక్ష్యం