New House
-
అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో
తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. రీసెంట్ టైంలో 'మసూద' మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాంటిది తల్లి చివరి కోరిక తీర్చానని చెప్పి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)2016 నుంచి నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలు షేర్ చేసుకుని మురిసిపోయాడు. పరేషాన్, టక్ జగదీష్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించాడు. సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని తల్లి చివరి కోరికని నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్
తెలుగులో సింగర్స్ చాలామంది ఉన్నారు. కానీ తనదైన వాయిస్ తో వరస అవకాశాలు దక్కించుకుంటున్న గాయని మంగ్లీ. తెలంగాణకు చెందిన పల్లె పాటలు, ఫోక్ గీతాలు పాడటంలో ఎక్స్ పెర్ట్ అని చెప్పొచ్చు. అదే టైంలో స్టేజీ షోలు కూడా బోలెడన్ని చేస్తూనే ఉంటుంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?)ఇలా సింగర్ గా రెండు చేతులా సంపాదిస్తున్న మంగ్లీ.. ఇప్పుడు ఓ ఇల్లు కట్టుకుంది. సోమవారం గృహప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ రోహిణి ఈ వేడుకలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. కెరీర్ విషయానికొస్తే.. ఊరూ పల్లెటూరు (బలగం), రాములో రాముల (అల వైకుంఠపురములో), సారంగ దరియా(లవ్ స్టోరీ) తదితర గీతాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చెల్లెలు ఇంద్రావతి కూడా సింగరే. 'ఊ అంటావా మావా' పాటతో ఫేమ్ తెచ్చుకుంది. ఇలా ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఓ ఇంటికి యజమానులయ్యారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్) -
హీరోయిన్ నయనతార కొత్త ఇల్లు.. చాలా కాస్ట్ లీ (ఫొటోలు)
-
రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు) -
గృహ ప్రవేశం.. పట్టుచీరలో 'జబర్దస్త్' సత్యశ్రీ (ఫొటోలు)
-
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ చీఫ్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం(అక్టోబర్4) కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి కేజ్రీవాల్కు ఏర్పడింది. సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్ లైన్స్ ఏరియా 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్ కుటుంబం నివసించింది.ఇక నుంచి ఢిల్లీలోని 5, ఫిరోజ్షా రోడ్డులోని ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉండనుంది. కేజ్రీవాల్ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్మిట్టల్ ఇంటినే ఎంచుకున్నారు.లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో పెరిగిన కాలుష్యం -
Sonam Kapoor: కొత్త ఇంటిలో మోడ్రన్ డ్రెస్లతో సోనమ్ స్టన్నింగ్ లుక్స్..!