breaking news
New House
-
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్తో పార్టీ!
ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా బిజీలో ఉన్నాడు. వచ్చే నెల 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ విడుదల చేయగా.. స్పందన బాగానే వచ్చింది. తారక్ అభిమానులకు యాక్షన్ మూవీ చూడబోతున్నామని అంచనాలు పెంచేసుకున్నారు. మరోవైపు ఇతడి ఇంట్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)అయితే ఈ ఫొటోలు ఎన్టీఆర్కి చెందిన జూబ్లీహిల్స్ ఇంటివి అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం.. స్నేహితులతో కలిసి సింపుల్గా ఈ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్తగా అమర్చిన వాల్ ఫ్రేమ్స్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ లాంటివి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. చూస్తుంటే తారక్ ఇంటి కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తున్నాడు.'వార్ 2' రిలీజ్కి రెడీ కాగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు నెల్సన్.. ఎన్టీఆర్తో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు 'దేవర 2' కూడా లైన్లో ఉంది. మరి వీటిలో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
కొత్తిల్లు కొందామా.. పాతిల్లు చూద్దామా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుడి అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్ హ్యాండ్ ఇల్లు బెటరా? అని! – సాక్షి, సిటీబ్యూరోదేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్..ఇల్లు కొనుగోలు చేసిన వారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్థిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతర అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్కు తగ్గట్టు మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.రీసేల్ కొనేముందు..రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.పాత ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల ధరలు తక్కువకొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజి్రస్టేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితం నాటి ప్రమాణాలను అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. -
కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్
బిగ్బాస్ తెలుగు షో వల్ల చోటామోటా సెలబ్రిటీలు కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలు సీజన్లలో విజేతలుగా నిలిచిన వాళ్లు, షోలో పార్టిసిపేట్ చేసినోళ్లు ప్రమోషన్లు చేస్తూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కారు, ఇల్లు లాంటివి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆర్జే కాజల్ కూడా చేరింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)ఎఫ్ఎమ్లో రేడియో జాకీగా కొందరికి తెలిసిన కాజల్.. బిగ్బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఇంకాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఐదో సీజన్లో కొన్ని వారాల పాటు హౌస్లో ఉండి వచ్చింది. బయటకొచ్చిన తర్వాత అడపాదడపా షోలు చేసుకుంటూ సంపాదిస్తుంది. ఇప్పుడు తన దగ్గర దాచుకున్న డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది.తాజాగా గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, సిరి హన్మంతు, సింగర్ లిప్సిక తదితరులు పాల్గొన్నారు. వీళ్లు తమ తమ ఇన్ స్టా ఖాతాల్లో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. వీటిని ఆర్జే కాజల్ తన స్టోరీలో షేర్ చేసింది. కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన) View this post on Instagram A post shared by Lipsika Uday (@lipsikabhashyam) -
కుప్పంలో నారావారి కోట
-
కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ. ఇప్పుడు ఈమె హైదరాబాద్ లో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. శాస్త్రోక్తంగా సోమవారం ఉదయం గృహప్రవేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.'ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం. శ్రీరామ సంజీవని. మా కొత్తింటి పేరు.. జైశ్రీరామ్. జై హనుమాన్' అని అనసూయ ఇన్ స్టాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్)తెలుగు సంప్రదాయ ప్రకారం ఆవుని ఇంట్లోకి తీసుకురావడం, పాలు పొంగించడం, పూజ చేయడం, తన కుటుంబంతో కలిసి దేవుళ్ల పటాలతో ఇంట్లో అడుగుపెట్టడం.. ఏమేమైతే చేసిందో వాటిని ఫొటోలుగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్ని హితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇంటి ఖరీదు రూ.కోట్లలోనే ఉండొచ్చని సమాచారం.పుష్ప 2లో చివరగా కనిపించిన అనసూయ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేస్తుందో తెలీదు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'అరి' రిలీజ్ కావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో ఒకటి రెండు రియాలిటీ షోలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?) -
ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు. ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్సీఆర్ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది. డెలివరీలో వేగవంతం.. 2018–19 మధ్య కాలంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కం హౌసింగ్(ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి. -
ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్
ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన నటుడు నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఇకపోతే మూడు నెలల క్రితం ఇతడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు ఇతడిపై దాడి చేశాడు. తక్షణమే స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతానికైతే అంతా సెట్ అయింది. కానీ సైఫ్ మనసులో మాత్రం భయం అలానే ఉండిపోయింది.దుండగుడి దాడి వల్ల బాగా భయపడిపోయిన సైఫ్ అలీఖాన్.. ఇంకెప్పుడైనా తనపై దాడి జరగొచ్చేమో అనుకుని ఖతార్ దేశంలో ఇల్లు(New House) కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. ఇల్లు కొనడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)'అది నా హాలీడే హోమ్. అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జర్నీ సులభమవుతుంది. అక్కడ చాలా సేఫ్టీగా అనిపించింది. ఖతార్ అందమైన దేశం. అక్కడున్నప్పుడు చాలా రిలాక్స్ డ్ గా అనిపిస్తుంది. ఆ దేశంలో ఓ ఇంటికి మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది. రీసెంట్ గా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు వాతావరణం కూడా అద్భుతంగా అనిపించింది. దీంతో అక్కడ ఇల్లు కొనేశాను. త్వరలో నా కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తా' అని సైఫ్ చెప్పుకొచ్చాడు.సైఫ్ విషయానికొస్తే.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు వరకు హీరోగా చేశాడు. ఇప్పుడు మాత్రం విలన్, సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇతడికి తొలి భార్య వల్ల సారా అలీఖాన్, ఇబ్రహీం సంతానం కలిగారు. కరీనా కపూర్(Kareena Kapoor)ని రెండో పెళ్లి చేసుకోగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇకపోతే సైఫ్ నటించిన జ్యూయెల్ థీప్ మూవీ.. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా) -
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
తెలుగులోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఇతడు దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే ఇప్పుడు నాన్న కల నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) తరుణ్ భాస్కర్ తల్లి గీత గురించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. ఫిదా, ఈ నగరానికి ఏమైంది, హిట్ 2 తదితర చిత్రాల్లో ఈమె నటించింది. తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. ఇప్పుడు దాన్ని నెరవేర్చానని చెబుతూ.. గృహ ప్రవేశం చేసిన ఫొటోలని తరుణ్ పోస్ట్ చేశాడు.'కల నెరవేర్చాను నాన్న, నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా' అని తరుణ్ భాస్కర్ రాసుకొచ్చాడు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. తరుణ్ భాస్కర్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?) -
Amaravathi: రైతుల భూముల్లో నారా ప్యాలెస్
-
పరదాల మాటున చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ
అమరావతి, సాక్షి: ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణం పనులు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై ‘అక్రమ’ నివాసంలో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరదలు వచ్చిన ప్రతీసారి ఆ నివాసం మునిగిపోతూ వస్తోంది.బుధవారం ఉదయం వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ జరిగింది. సచివాలయం వెనుక.. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఈ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారాయన. ఇందుకోసం ఐదెకరాల భూమిని కొనుగులు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే.. ఆ స్థలం వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రీన్ పరదాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగిన నారా వారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి హైదరాబాద్లో ప్యాలెస్లాంటి ఇల్లు ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో ఆ మధ్య బాగా విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఏపీలో కొత్తింటిని నిర్మించుకోబోతున్నారు. ఐదెకరాల భూమిలో.. 25 వేల గజాల్లో హైదరాబాద్ ప్యాలెస్ను తలదన్నెలా భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం. -
రైతుల భూముల్లో నారా ప్యాలెస్
-
అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబు ఇంద్రభవనం
-
అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో
తెలుగులో పలు సినిమాల్లో సహాయ పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. రీసెంట్ టైంలో 'మసూద' మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాంటిది తల్లి చివరి కోరిక తీర్చానని చెప్పి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)2016 నుంచి నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్న తిరువీర్.. ఇన్నాళ్లకు సొంతూరిలో ఇల్లు కట్టుకున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలు షేర్ చేసుకుని మురిసిపోయాడు. పరేషాన్, టక్ జగదీష్, పలాస్ 1978, జార్జ్ రెడ్డి తదితర చిత్రాల్లోనూ తిరువీర్ నటించాడు. సిన్, మెట్రో కథలు, కుమారి శ్రీమతి తదితర వెబ్ సిరీసుల్లోనూ కనిపించాడు. గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని తల్లి చివరి కోరికని నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్
తెలుగులో సింగర్స్ చాలామంది ఉన్నారు. కానీ తనదైన వాయిస్ తో వరస అవకాశాలు దక్కించుకుంటున్న గాయని మంగ్లీ. తెలంగాణకు చెందిన పల్లె పాటలు, ఫోక్ గీతాలు పాడటంలో ఎక్స్ పెర్ట్ అని చెప్పొచ్చు. అదే టైంలో స్టేజీ షోలు కూడా బోలెడన్ని చేస్తూనే ఉంటుంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?)ఇలా సింగర్ గా రెండు చేతులా సంపాదిస్తున్న మంగ్లీ.. ఇప్పుడు ఓ ఇల్లు కట్టుకుంది. సోమవారం గృహప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ రోహిణి ఈ వేడుకలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. కెరీర్ విషయానికొస్తే.. ఊరూ పల్లెటూరు (బలగం), రాములో రాముల (అల వైకుంఠపురములో), సారంగ దరియా(లవ్ స్టోరీ) తదితర గీతాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చెల్లెలు ఇంద్రావతి కూడా సింగరే. 'ఊ అంటావా మావా' పాటతో ఫేమ్ తెచ్చుకుంది. ఇలా ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఓ ఇంటికి యజమానులయ్యారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్) -
హీరోయిన్ నయనతార కొత్త ఇల్లు.. చాలా కాస్ట్ లీ (ఫొటోలు)
-
రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు) -
గృహ ప్రవేశం.. పట్టుచీరలో 'జబర్దస్త్' సత్యశ్రీ (ఫొటోలు)
-
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ చీఫ్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం(అక్టోబర్4) కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి కేజ్రీవాల్కు ఏర్పడింది. సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్ లైన్స్ ఏరియా 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్ కుటుంబం నివసించింది.ఇక నుంచి ఢిల్లీలోని 5, ఫిరోజ్షా రోడ్డులోని ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉండనుంది. కేజ్రీవాల్ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్మిట్టల్ ఇంటినే ఎంచుకున్నారు.లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో పెరిగిన కాలుష్యం -
Sonam Kapoor: కొత్త ఇంటిలో మోడ్రన్ డ్రెస్లతో సోనమ్ స్టన్నింగ్ లుక్స్..!