-
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్ప్రదేశ్లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్స్టా అకౌంట్ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్చైర్లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎస్ కర్ణన్ అరెస్ట్
చెన్నై: సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పాండిచ్చేరి కర్ణన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణన్ మహిళలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు మాజీ జస్టిస్ కర్ణన్ న్యాయవ్యవస్థలోని మహిళా సిబ్బందిపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేయడమే కాక సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేశారు. అంతేకాక కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో కొందరి పేర్లను కూడా వీడియాలో వెల్లడించారు. 2017 లో, కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న కాలంలో, జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణన్ తన జైలు శిక్ష అనుభవించారు. -
వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లకు వార్నింగ్
వారణాసి : వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తూ గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్న వారు ఇక నుంచి చాలా అప్రమత్తతగా ఉండాల్సి ఉంది. అడ్మిన్గా కేవలం గ్రూప్లో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా.. గ్రూప్లో పోస్టు అయ్యే వాటిపైనా ఓ కన్నేసి ఉండాలట. లేకపోతే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన తప్పిదానికి వీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. గ్రూప్లో పోస్టు చేసే రూమర్లకు, ఫేక్ న్యూస్ స్టోరీలకు లేదా అసహ్యకరమైన వీడియోలకు గ్రూప్ అడ్మిన్లు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని వారణాసి కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తప్పుడు వార్తలకు, మార్పుడ్ ఫోటోగ్రాఫ్లకు, అభ్యంతరకరమైన వీడియోలకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారనే ఆరోపణల మేరకు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది. గ్రూప్లో ఇతర యూజర్లు పోస్టు చేసిన కంటెంట్కు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టిస్తూ వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తామని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు కలిసి తమ అభిప్రాయాలను, ఫోటోలను, తమకు నచ్చిన వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు గ్రూప్ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించాయి. వారణాసి ప్రభుత్వ ఆర్డర్తో సోషల్ మీడియా గ్రూప్ను క్రియేట్ చేసే అడ్మిన్లే ఇక నుంచి అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదైనా తప్పుడు వార్తను, అభ్యంతరకరమైన పోస్టులను గ్రూప్ సభ్యులు పెడితే, వెంటనే ఆ పోస్టుల తొలగించి, గ్రూప్ నుంచి ఆ సభ్యుడికి ఉద్వాసన పలకాలని ఆదేశించింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
వన్స్ మోర్ వైఎస్ జగన్...
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. ఇరువర్గాలు పరస్పర దాడి
USA: నకిలీ బొమ్మ శవాలతో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది -వికాస్ రాజ్
త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..
చల్లటి కబురు..నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
అమేథీలో గెలుపెవరిది..?
సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం (ఫొటోలు)
తప్పక చదవండి
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
Advertisement