operation fail
-
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
ఆపరేషన్ వికటించి రోగి మృతి
చిత్తూరు, మదనపల్లె టౌన్: ఆపరేషన్ వికటిం చి కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టెకు చెందిన రైతు పోగల గంగయ్య కుమారుడు పి.వెంకటరమణ(60) మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె పట్టణంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. నెల రోజులుగా యూరిన్ పోసే సమయంలో మంట వస్తుండడంతో మదనపల్లె ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నాలుగు రోజుల క్రితం వచ్చాడు. అప్పటి వరకు అతను బాగానే ఆస్పత్రికి నడచుకుంటూ వచ్చాడు. ఒంటికిలో మంటగా ఉందని ఓపీలో ఉన్న డాక్టరుకు చూపించాడు. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని, ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. డాక్టర్ శనివారం రాత్రి ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్ కాస్త వికటించడంతో రోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి చేరడంతో డాక్టర్, అక్కడి సిబ్బంది తెలివిగా రోగిని తిరుపతికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్లో ఆదివారం తిరుపతికి బయలుదేరగా వెంకటరమణ మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లనే వెంకటరమణ చనిపోయాడని వారు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మృతుడికి భార్య నాగమునెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై వెంకటరమణ మృతి విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
ప్రియురాలి గర్భం తీయించబోతే..
-
ప్రియురాలి గర్భం తీయించబోతే..
హైదరాబాద్: ప్రియురాలు గర్భం దాల్చడంతో రహస్యంగా ఆమె గర్భం తొలిగించే ప్రయత్నం చేశాడు ఓ ప్రియుడు. ఆపరేషన్ కాస్త ఫెయిల్ కావడంతో ఆమె మృతిచెందింది. ఈ దారుణ ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. మధు అనే వ్యక్తి ప్రియురాలు హారిక గర్భం దాల్చింది. పెళ్లి కాకముందే గర్భం రావడంతో భయపడ్డ ప్రియుడు మధు ఆమె గర్భం తొలగించేందుకు స్థానిక అనూష నర్సింగ్ హెమ్లో చేర్పించాడు. ఆపరేషన్ ఫేయిల్ కావడంతో హారిక మృతి చెందింది. దీంతో ప్రియుడు మధు, డాక్టర్ గిరిజారాణిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వికటించిన వైద్యం
హిందూపురం రూరల్ : పురిటి నొప్పుల ప్రసవంతో వచ్చిన ఒక మహిళకు శస్త్రచికిత్స (సిజేరియన్) నిర్వహించగా పురుటిబిడ్డ మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. హిందూపురం పట్టణం ఎంఎఫ్రోడ్డులో నివాసం ఉంటున్న దివ్యజ్యోతికి ఏడాది క్రితం మడకశిరలోని శ్రీనివాసులుతో వివాహంమైంది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణంలోని గిరీష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈక్రమంలో 9 నెలలు నిండిన తర్వాత కాన్పు కోసం వెళ్తే స్కానింగ్ చేసి బిడ్డ క్షేమంగా ఉందని.. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. దివ్యజ్యోతి ఉదయం నుంచే ఆస్పత్రిలో ఉంది. అయితే చివరి నిమిషంలో సిజేరియన్ చేయాలని కోరగా చేశారు. కానీ పురిటి బిడ్డ మృత్యువాత పడిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై వైద్యురాలు సంధా్యలక్ష్మిని అడగ్గా సాధారణ కాన్పు చేయాలని కోరారు. అయితే పరిస్థితి మారడంతో సిజేరియన్ చేశామన్నారు. బిడ్డ ఉమ్మి నీరు తాగి తల వాపు రావడంతో మృతి చెందినట్టు తెలిపనారు. విషయం తెలుసుకున్న ఐఎంఏ కార్యదర్శి బాలాజి అక్కడికి చేరుకుని బాధితులకు, వైద్యులకు సర్ది చెప్పారు.