opposition parties rally
-
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
అదానీపై విచారణ డిమాండ్తో... ఈడీ ఆఫీసుకు విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అవకతవకలపై ఈడీతో లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు సమైక్యంగా కదం తొక్కాయి. ఈ ఉదంతంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటు భవనం నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీలను మార్గమధ్యంలోనే విజయ్ చౌక్ సమీపంలో పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. బారికేడ్లతో రోడ్లను మూసేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతించబోమని చెప్పారు. దీనిపై నేతలంతా మండిపడ్డారు. అదానీపై విచారణ కోరుతూ ఈడీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మోదీ సర్కారు నిరంకుశంగా అడ్డుకుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దాదాపు 200 మంది ఎంపీల శాంతియుత ర్యాలీని అమానుషంగా అడ్డుకున్నారంటూ దుయ్యబట్టారు. అనంతరం ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి వెనుదిరిగారు. ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పాల్గొనకపోవడం విశేషం. అంతకుముందు తృణమూల్ విడిగా ఎల్పీజీ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసింది. -
12వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
సాక్షి హైదరాబాద్ : తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజు నిరవరధికంగా కొనసాగుతోంది. ఈ సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని పలు చోట్లలో ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలు, వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని ఓయూలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎఫ్) భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్.కృష్ణయ్య, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ సమ్మెలో భాగంగా కరీంనగర్ బస్స్టాండ్ చౌరస్తాలో కార్మికుల రాస్తారోకో. నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు బిక్షాటన చేపట్టారు. కార్మికుల నిరసన ఆందోళనలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వేములవాడ బస్టాండ్ ముందు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ ఆర్టీసీ ఉద్యోగి శిరోమండనం చేసుకొని మూల వాగులో కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. సమ్మెకు మద్దతుగా అడ్వకేట్లు జేఏసీ ఉపాద్యాయులు, జేఏసీ నాయకుల సంఘీభావం తెలిపారు. మరోవైపు సిరిసిల్ల డిపో నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్టీసి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని డిపో ముందు కార్మికుల నిరసన వ్యక్తం చేశరు. దీనికి సీపీఐ, సీపీఎం, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. వేములవాడ పరిధిలోని నాంపల్లి వద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది దీంతో డ్రైవర్ అప్రమవ్వడంతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం జిల్లా : ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా 12వ రోజు వినూత్నంగా ఖమ్మం నగరంలోని అన్ని షాపుల ముందు కార్మికులు అర్ధనగ్నంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం డిపో ముందు ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొని ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారుచేసి శవయాత్ర నిర్వహించారు. పాఠశాల తెరిపించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. .కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల మరియు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే విధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముదిగొండ లో రాస్తారోకో చేపట్టారు. దీంతోపాటు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బూర్గంపాడు మండలం అఖిలపక్ష నాయకులు తమ మద్దతు తెలిపారు. మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ చేప్టారు ఈ ర్యాలీకి ఉపాద్యాయులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై క్షవరం చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. మెదక్ : బస్టాండ్ నుంచి వెల్కమ్ బోర్డ్ వరకు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, ఉపాధ్యాయ సంఘలు బైక్ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఉపాధ్యాయ సంఘం టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి మద్దతు ప్రకటించారు. పెద్ద శంకరంపేట్ అక్కోలా రహదారిపై ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్షాలు
-
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
-
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు బుధవారం ర్యాలీ నిర్వహించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఈ ర్యాలీ చేపట్టాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ అంశంపై చర్చించనున్నాయి. కాగా ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. మరోవైపు విపక్షాల ర్యాలీని బీజేపీ తప్పుబట్టింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమం, చారిత్రతాత్మకమని అభివర్ణించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే.