Pamban Bridge
-
పంబన్ 2.0
పంబన్ (రామేశ్వరం) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. వంతెనపై ట్రయల్స్ను శనివారం విజయవంతంగా చేశారు.దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..⇒ వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ. ⇒ పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333 ⇒ సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్ఫోర్స్మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు. ⇒ సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ⇒పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. ⇒ స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ⇒ ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు. ⇒ పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ⇒ ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. ⇒ నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. ⇒ 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ⇒ లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. ⇒ లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. ⇒ రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్చార్జిగా ఉన్నారు. ⇒ 1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు. -
ఇంజనీరింగ్ అద్భుతంగా పంబన్ కొత్త బ్రిడ్జి.. ఫోటోలు వైరల్
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతున్న ఈ వంతెన ఫోటోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడమే ఇందుకు కారణం. కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎక్స్లో షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన విషయాలు, విశేషాలను ఆయన పంచుకున్నారు.ఈ బ్రిడ్జి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని, అనేక సార్లు పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.కొత్త బ్రిడ్జి ద్వారా రామేశ్వరం అభివృద్ధి చెందుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్ను కూడా అప్గ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ద్వీపానికి పర్యాటకం, వాణాజ్యం, కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు.పాత వంతెన మధ్య నుంచి పడవలు షిప్లు వెళ్లాలంటే కష్టమయ్యేది.16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది.సముద్ర మట్టానికి 19 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు మాత్రమే వంతెన మధ్య ప్రయాణించేవిసింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది.కొత్త బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ స్పాన్.. పూర్తిగా ఆటోమేటెడ్.ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్సముద్ర మట్టానికి 22 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు, షిప్లు కూడా ప్రయాణించగలవు.డబుల్ ట్రాక్లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు.హై-స్పీడ్ రైలు అనుకూలత, ఆధునిక డిజైన్.వందే ళ్లపాటు సేవలుకాగా రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతెన గురించి అందరికీ తెలిసిందే. దీనిని 1914 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన న 105 ఏళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది.ఇది దేశంలోనే తొలి సముద్ర వంతెన. అంతేగాక 2010లో బాంద్రా- వర్లీ సముద్రపు లింక్ను ప్రారంభించే వరకు దేశంలోనే అతి పొడవైన వంతెన కూడా. 2. 06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్గేజ్ నుంచి బ్రాడ్గేజ్కి మార్చారు. 2022లో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసేశారు.దీని స్థానంలో 2019లో కొత్త వంతెన నిర్మాన్ని ప్రారంభించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఇది 105 ఏళ్ల నాటి పాంత వంతెనను భర్తీ చేయనుంది.🚆The New Pamban Bridge: A modern engineering marvel!🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024 -
105 ఏళ్ల పాంబన్ బ్రిడ్జిని పరిశీలించిన ఐఐటీ బృందం
చెన్నై: 105 ఏళ్ల నాటి పాంబన్ రైల్వే బ్రిడ్జి స్థిరత్వాన్ని పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ బృందం అక్కడికి చేరుకుంది. ఇందుకోసం వంతెనపై 100 చోట్ల సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమయ్యారు. రామనాథపురం జిల్లాతో రామేశ్వరం దీవిని అనుసంధానించేందుకు సముద్రంలో ఏర్పాటైన పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ముఖ్యపాత్ర వహిస్తోంది. 105 ఏళ్లు దాటినా రైల్వే బ్రిడ్జ్పై రైళ్ల రాకపోకలు ఇంకా సాగుతున్నాయి. రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ని రైల్వే శాఖ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఉండగా పాంబన్ సముద్రంలో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి రూ.250 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో గత ఫిబ్రవరి నెల పాంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. చదవండి: పోలీస్ కమిషనర్ మానవీయత ఈలోపున కరోనా వైరస్ వ్యాపించడంతో దీని నియంత్రణకు అమలు చేసిన లాక్డౌన్ కారణంగా పనులను నిలిపి వేశారు. ఈ స్థితిలో పాంబన్ సముద్రంలోని రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు వీలుగా రైళ్లు వెళ్లే సమయంలో ఏర్పడే ప్రకంపనల ప్రభావం, ఉప్పు గాలులతో ఇనుప రాడ్లు, స్థంభాలలో ఏదైనా లోపాలు ఏర్పడ్డాయా అనే విషయంపై పరిశీలన జరిపేందుకు గత మూడు రోజులుగా చెన్నై ఐఐటీ బృందం ఈ వంతెనపై సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమైంది. దీని గురించి ఐఐటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పాంబన్ రైల్వేబ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు ఈ సెన్సర్ పరికరాలను బ్రిడ్జ్పై 100 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులలో గత మూడు రోజులుగా 10మందితో ఈ పనులు చేపడుతున్నామని, ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని తెలిపారు. చదవండి: ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత -
‘పాంబన్’ వంతెనకు వందేళ్లు