Parag Milk Foods
-
ట్రైనీ నుంచి డైరెక్టర్ దాకా... రూ.2,556 కోట్ల మార్కెట్
నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా. మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్లో ఒక చిన్న డెయిరీ యూనిట్ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్లోనే జాబ్లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్గా తీసుకున్నాను. పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. శ్రేష్టమైన ఉత్పత్తులు..చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్ను చూపించగలిగాను. గడపగడపకూ..ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను. దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ. -
Akshali Shah: విజయంలో సగపాలు
‘పాడి రంగంలో మన దేశంలో మూడొంతుల మంది స్త్రీలే పని చేసి విజయం సాధిస్తున్నారు’ అని గత సంవత్సరం ‘వరల్డ్ డెయిరీ సమ్మిట్’లో ప్రధాని నరేంద్రమోడి అన్నారు. పశు పోషణ చేసి, పాలు పితికి, ఆదాయ మార్గాలు వెతికి విజయం సాధిస్తున్న మహిళలు ఎందరో నేడు ఆ మాటను నిజం చేస్తున్నారు. నేడు ‘వరల్డ్ మిల్క్ డే’ ‘ఎంజాయ్ డెయిరీ ప్రాడక్ట్’ అనేది థీమ్. ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ పేరుతో డెయిరీ ప్రాడక్ట్స్ దేశంలోనే అగ్రశ్రేణిగా నిలిచింది అక్షాలి షా. 32 ఏళ్ల అక్షాలి షా నేడొక దేశంలో ఉంటే రేపు మరో దేశంలో ఉంటుంది. ఏ దేశంలో పాడి రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో, పాడి ఉత్పత్తులలో ఎలాంటి సాంకేతికత చోటు చేసుకుంటున్నదో నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ మార్పులను తాను అధినాయకత్వం వహిస్తున్న ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ సంస్థలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ ప్యాకేజ్డ్ పాల రంగంలో, డెయిరీ ఉత్పత్తుల రంగంలో పరాగ్ సంస్థ అగ్రగామిగా ఉంది. అందుకు పూర్తి క్రెడిట్ అక్షాలి షాకు దక్కుతుంది. 2010లో పగ్గాలు చేపట్టి ఎం.బి.ఏ.లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన అక్షాలి షా తన తండ్రి దేవేంద్ర షా స్థాపించి నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ రంగంలో 2010లో అడుగుపెట్టింది. అయితే తండ్రి ఆమెకు వెంటనే సంస్థ పగ్గాలు అప్పగించకుండా పెరుగు తయారు చేసే ఒక చిన్న ప్లాంట్ను ఇచ్చి దానిని డెవలప్ చేయమన్నాడు. అక్షాలి విజయం సాధించేసరికి మెల్ల మెల్లగా సంస్థలో ఆమె స్థానం, స్థాయి పెరుగుతూ పోయాయి. ‘భారతీయుల సంస్కృతిలో పాలు, గోవు చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి. మన పురాణాల్లో క్షీరం ప్రస్తావన ప్రముఖంగా ఉంటుంది. అందుకే నేను ఈ రంగాన్ని ఆషామాషీగా నిర్వహించదలుచుకోలేదు. నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగలిగితే కనుక సెంటిమెంట్ కనెక్ట్ అవుతుందనుకున్నాను’ అంటుంది అక్షాలి. ప్రొటీన్ ఉత్పత్తులు శాకాహారంలో 84 శాతం, మాంసాహారంలో 65 శాతం ప్రొటీన్ లోపం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య, క్రీడా రంగంలో ప్రొటీన్ ప్రాడక్ట్స్కు నేడు దేశంలో ఏటా 2000 కోట్ల మార్కెట్ ఉంది. ప్రొటీన్ పౌడర్లు తీసుకునే ఫిట్నెస్ ప్రియులు చాలామంది ఉంటారు. అందుకే పాల నుంచి సేకరించిన ప్రొటీన్ ప్రాడక్ట్లను తయారు చేసి విక్రయిస్తున్నాం. అవతార్, గో ప్రొటీన్ పేరుతో మా ప్రాడక్ట్లు ఉన్నాయి’ అంటుంది అక్షాలి. పరాగ్ సంస్థ నుంచి ‘గోవర్థన్’ పేరుతో నెయ్యి దొరుకుతోంది. ఇక చీజ్ అమ్మకాల్లో అక్షాలి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు... ఈ అన్ని ఉత్పత్తుల్లో సంస్థ మంచి అమ్మకాలు సాధిస్తోంది. పూర్వం పాలు, పెరుగు స్త్రీలే అమ్మేవారు. వారికి పాలను ఎలా ఆదాయవనరుగా చేసుకోవాలో తెలుసు. అక్షాలి లాంటి నవతరం డెయిరీ లీడర్లు అదే నిరూపిస్తున్నారు. గడప చెంతకు ఆవుపాలు అక్షాలికి పూణెలో గోక్షేత్రం ఉంది. 2011 నాటికి అక్కడి ఆవుల నుంచి పాలు పితికి, కేవలం ఆవుపాలు కోరే 172 మంది ఖాతాదారులకు అందించేవారు. అక్షాలి రంగంలోకి దిగాక శ్రేష్టమైన ఆవు పాల కోసం దేశంలో కోట్ల మంది ఖాతాదారులు ప్రయత్నిస్తుంటారని అర్థం చేసుకుంది. ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో ప్రీమియమ్ ఆవుపాలను అందించడానికి ముందుకు వచ్చింది. మానవ రహితంగా ఆవుల నుంచి పాలను పితికి, ప్యాక్ చేసి, విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చి తాజాగా ఖాతాదారుల గడప దగ్గరకు ప్యాకెట్టు పడేలా నెట్వర్క్ సిద్దం చేసింది. ఇంత శ్రేష్టత పాటించడం వల్ల మార్కెట్లో ఆవు పాల కంటే ఈ పాలు రెట్టింపు ధర ఉంటాయి. అయినా సరే కస్టమర్లు తండోప తండాలుగా ఈ పాలను కోరుకున్నారు. ఇవాళ అక్షాలి సరఫరా చేస్తున్న ఆవుపాలు ఢిల్లీ, ముంబై, పూణె, సూరత్లలో విశేషంగా అమ్ముడు పోతున్నాయి. 2027 నాటికి కేవలం ఈ ఆవుపాల టర్నోవర్ 400 కోట్లకు చేరుకుంటుందని అక్షాలి అంచనా. -
పతంజలి బెంగ మాకు లేదు
రామ్ దేవ్ బాబా పతంజలి అమ్మకాల వృద్ధితో ఇతర ఎఫ్ఎమ్ సీజీ ప్లేయర్లు ఆందోళన చెందుతోంటే.. పరాగ్ మిల్క్ కంపెనీ మాత్రం ధీమాగా ఉంది. ముఖ్యంగా పతంజలి మిల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ చెబుతోంది. మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలి నుంచి తమకు ఎలాంటి ముప్పు ఉండదనీ , పైపెచ్చు తమ బిజినెస్ పెరగడానికి పతంజలి ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. పుణేకు చెందిన విభిన్నమైన డెయిరీ ఉత్పత్తుల ఈ కంపెనీ, గోవర్థన్ బ్రాండ్ లో ఆవు పాలతో తయారుచేసిన నెయ్యిని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు లూజ్ అన్ బ్రాండెడ్, సమ్మిళిత నెయ్యి నుంచి ఆవు పాల నెయ్యి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇది పతంజలితో పాటు తమకు ఎంతో సహకరిస్తుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ సీఎఫ్ఓ భరత్ కేడియా తెలిపారు. గేదె పాల నెయ్యి కంటే ఆవు పాల నెయ్యికి సాధారణంగా ప్రీమియం లభ్యమవుతుంటోంది. ధరల విషయంలో పతంజలి సంస్థ తమకు పోటీగా రావట్లేదని, కొన్నిసార్లు ఆ కంపెనీ ప్రొడక్ట్ లు తమ ధరలతో సమానంగా లేదా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. పతంజలి కంటే తక్కువ ధరలకే తమ ఆవు పాల నెయ్యి మార్కెట్లో లభ్యమవుతుందని కేడియా తెలిపారు. కంపెనీ సీఏజీఆర్(కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) రెవెన్యూ వృద్ధి కూడా గడిచిన ఐదేళ్లలో 17 శాతం నమోదైందని చెప్పారు. అంతకముందు ఈ వృద్ధి 12-13 శాతంగా ఉంది. శుక్రవారం విడుదలైన జనవరి-మార్చి త్రైమాసిక రెవెన్యూ ఫలితాల్లో 20 శాతం వృద్ధిని తాము నమోదు చేశామని, ఆపరేటింగ్ మార్జిన్లను 120 బేసిక్ పాయింట్లను పెంచుకుని 9.7శాతంగా నమోదుచేసినట్టు కంపెనీ పేర్కొంది. -
పరాగ్ మిల్క్ ఐపీఓ పొడిగింపు
♦ తగ్గిన ధర శ్రేణి న్యూఢిల్లీ: డైరీ ఉత్పత్తుల కంపెనీ పరాగ్ మిల్క్ ఫుడ్స్ తన ఐపీఓను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. అంతేకాకుండా ధర శ్రేణిని కూడా సవరించింది. రూ.760 కోట్ల ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పటికీ, శుక్రవారం ముగియాల్సిన ఈ ఐపీఓ గడువును వచ్చే బుధవారం వరకూ పొడిగించామని కంపెనీ తెలిపింది. ధర శ్రేణిని రూ.220-227 నుంచి రూ.215-227కు తగ్గిస్తున్నామని తెలిపింది. ఓవర్ సబ్స్క్రైబ్ అయినా పొడిగింపు.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐపీఓను పొడిగించాలని కోరడంతో మరో మూడు రోజుల పొడిగించామని కంపెనీ వివరించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఐపీఓ 1.32 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన విభాగం 55 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం 2.66 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.72 రెట్ల చొప్పున ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. కొన్ని కేటగిరిల ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం తక్కువగా సబ్స్క్రైబ్ కావడంతో ఐపీఓను కంపెనీ పొడిగించిందని సమాచారం. -
గతవారం బిజినెస్
ఐపీఓకు పరాగ్ మిల్క్ ఫుడ్స్ డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నది. మే 6న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది. రికార్డ్ స్థాయిలో ఎఫ్డీఐలు భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) జోరుగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి రికార్డ్ స్థాయిలో 5,100 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్డీఐలు ఇంతవరకూ ఎన్నడూ రాలేదని డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ వెల్లడించారు. రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్ ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్.. బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్.. ఓవర్నైట్కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72 శాతానికి దిగింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. టెలిఫోన్ వినియోగదారులు-105 కోట్లు దేశంలోని టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరిలో 105.18 కోట్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. ఒకవైపు వైర్లైన్ సబ్స్క్రైబర్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. వైర్లెస్ వినియోగదారుల పెరుగుదలే మొత్తం యూజర్ల పెరుగుదలకు కారణమని వివరించింది. మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 101.79 కోట్ల నుంచి 102.66 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. వైర్లైన్ యూజర్ల సంఖ్య 2.53 కోట్ల నుంచి 2.52 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మెటల్ ఎక్స్ ఆఫర్కు హిందాల్కో ఓకే! ఆస్ట్రేలియాకు చెందిన గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిసై ్టన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు. యాపిల్ షాకింగ్ ఫలితాలు యాపిల్ ప్రకటించిన 2016, జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు కంపెనీ ఇన్వెస్టర్లకు షాకిచ్చాయి. గడిచిన పదమూడేళ్లలో తొలిసారిగా ఆదాయం క్షీణించింది. 2015 ఇదే త్రైమాసికంలో ఆదాయం 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 13 శాతం మేర దిగజారి 50.6 డాలర్లకు పడిపోయింది. నికర లాభం కూడా 22 శాతం క్షీణతతో 13.6 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఎన్హెచ్పీసీ వాటా విక్రయం సక్సెస్ కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన తొలి డిజిన్వెస్ట్మెంట్, ఎన్హెచ్పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. సహారా ఆస్తులు తెలపాలి: సుప్రీం సహారా మొత్తం ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో తెలియజేయాలని సహారా గ్రూప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలరా? లేదా అన్న అంశం నిర్ధారించడానికి ఆస్తుల వివరాలు వెల్లడికావడం అవసరమని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాలు పాటించేంతవరకూ పెరోల్కు వీలు ఉండబోదని స్పష్టం చేసింది. అధిక వేతన సీఈఓల్లో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పది మంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి (2.22 కోట్ల డాలర్లు) 8వ స్థానంలో, ల్యాండెల్బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ (2.45 కోట్ల డాలర్లు) ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వంద మంది జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్ల తో పాటు సత్య నాదెళ్ల (26వ స్థానం-1.83 కోట్ల డాలర్లు) కూడా ఉన్నారు. ఎక్సైజ్ సుంకం తొలగింపులేదు: జైట్లీ వెండి యేతర ఆభరణాలపై ఒక శాతం ఎకై ్సజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు. 13 వేల కోట్ల ఎఫ్డీఐలకు ఆమోదం! యాక్సిస్ బ్యాంక్లో ప్రస్తుతమున్న విదేశీ వాటా పరిమితిని 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సహా మొత్తం 13,030 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) మొత్తం 14 ఎఫ్డీఐ ప్రతిపాదనలను పరిశీలించి ఐదింటికి ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. భారత్కు వచ్చే ఉద్దేశం లేదు: మాల్యా బ్యాంకుల చేత ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ముద్ర వేయించుకుని బ్రిటన్లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్మాల్యా భారత్కు వచ్చే విషయంపై నెలకొన్న సస్పెన్స్కు తెరదించారు. తనకు సంబంధించి పరిస్థితులు తీవ్రంగా ఉన్న భారత్కు తిరిగి వెళ్లే తక్షణ ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ‘బలవంతపు ప్రవాస’ స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. డీల్స్.. * రేల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్సైట్ రైల్యాత్రి.ఇన్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. -
మే 4 నుంచి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ
మే 6న ముగింపు రూ. 750 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 4 (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. మే 6న (శుక్రవారం) ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది. ఈ ఐపీఓ నిధులను విస్తరణకు, ప్లాంట్ల ఆధునీకరణకు, అనుబంధ సంస్థలో పెట్టుబడులకు వినియోగించాలని కంపెనీ భావి స్తోంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 1992లో కార్యకలాపాలు ప్రారంభిం చిన ఈ కంపెనీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తోన్న ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. -
హైదరాబాద్లో గోవర్ధన్ ఫ్రెష్ పాలు
వ్యాపారం పెరిగితే తెలంగాణలో ప్లాంటు పీఈ ద్వారా రూ.500 కోట్ల సమీకరణ పరాగ్ మిల్క్ సీఎండీ దేవేంద్ర షా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న పరాగ్ మిల్క్ ఫుడ్స్ హైదరాబాద్ మార్కెట్లో గోవర్ధన్ బ్రాండ్తో తాజా పాల విక్రయాలను ప్రారంభించింది. కంపెనీకి కావాల్సిన పాలను పటాన్చెరు సమీపంలోని పవిత్ర డెయిరీ సరఫరా చేస్తోంది. ఈ ప్లాంటు సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు. మూడు నెలల్లో సామర్థ్యాన్ని ఒక లక్ష లీటర్లకు పెంచనున్నట్టు పరాగ్ మిల్క్ ఫుడ్స్ చైర్మన్ దేవేంద్ర షా తెలిపారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మహేష్ ఇస్రానితో కలసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తొలుత జంట నగరాలకు పాలను సరఫరా చేస్తామని చెప్పారు. ఏడాది చివరికల్లా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు విస్తరిస్తామన్నారు. 100 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పలమనేరు ప్లాంటు విస్తరణ.. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్న కంపెనీ ప్లాంటు సామర ్థ్యం రోజుకు 8 లక్షల లీటర్లు. రూ.200 కోట్లతో చేపట్టనున్న విస్తరణతో సామర్థ్యం రెండింతలకు చేరుకోనుంది. 12 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్లాంటు పుణే వద్ద ఉంది. ఉత్తరాదిన ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తామని కంపెనీ చైర్మన్ తెలిపారు. విస్తరణకుగాను వచ్చే మూడేళ్లలో రూ.400-500 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమీకరిస్తామని వెల్లడించారు. వ్యాపారం పెరిగితే తెలంగాణలో ప్లాంటు పెడతామని పేర్కొన్నారు. తాజా పాలను కొత్తగా ప్రవేశపెట్టగా, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పాల ఉత్పత్తుల విక్రయం ద్వారా కంపెనీకి ఏటా రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోంది. కాగా, హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 24 లక్షల లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మరో పాల ఉత్పత్తుల సంస్థ