Part-time jobs
-
‘టాస్క్’ల పేరుతో టోపీ!
సాక్షి, హైదరాబాద్ : పార్ట్టైం, ఫుల్టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట అమాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎర వేసి సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటూ వచి్చన జాబ్ఫ్రాడ్ నేరగాళ్లు ఇటీవల పంథా మార్చారు. బాధితులతో ‘టాస్్క’ల పేరిట ఆన్లైన్లో పనులు చేయించుకొని అందుకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన మొత్తాన్ని కాజేస్తున్నారు. విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్...పార్ట్టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తారని గ్రహించిన జాబ్ఫ్రాడ్ నేరగాళ్లు ప్రధానంగా వారినే తమ మోసాలకు ఎంచుకుంటున్నారు. ఉద్యోగార్థుల వివరాలను జాబ్ పోర్టల్స్తోపాటు లక్కీ డిప్ల పేరిట ప్రజల వివరాలు సేకరించే ఏజెన్సీల నుంచి కొంటున్నారు. ఈ డేటా ఆధారంగా ఆయా ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్లు పంపుతున్నారు. తమ సందేశాలకు స్పందించే వారిని మోసగించే స్కెచ్ను కేటుగాళ్లు పక్కాగా అమలు చేస్తున్నారు. రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బిస్తామని ఆశజూపి.. వినియోగదారుల ప్రమేయం లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు కమీషన్పై భారీ రేటింగ్స్, పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఏజెన్సీలతో జాబ్ఫ్రాడ్ నేరగాళ్లు లింకులు పెట్టుకుంటున్నారు. తమ సందేశాలకు స్పందించిన అమాయకులతో ఆయా షాపింగ్, రెస్టారెంట్ సంస్థల యాప్స్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. వాటికి రేటింగ్, రివ్యూలు (టాస్్కలు) ఇచ్చి ఆ స్క్రీన్ షాట్స్ను పంపాలని కోరుతున్నారు. అలా తొలి ‘టాస్్క’పూర్తి చేసిన బాధితులకు రూ. 240 వెంటనే వారికి బదిలీ చేస్తున్నారు. అనంతరం వారిని మరింతగా ఉచ్చులోకి లాగేందుకు వీలుగా తమ అనుచరులతో కూడిన ‘టెలిగ్రామ్’గ్రూపుల్లో చేర్చి ఇతరుల సక్సెస్ స్టోరీస్ పేరిట పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు. ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే నేరగాళ్లు బాధితులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్చువల్ యాప్స్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నగదు బదిలీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని.. అందువల్ల ఆ మొత్తాన్ని ఈ యాప్స్లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు. నిర్ణిత సమయం తర్వాత సొమ్ము డ్రా చేసుకోవచ్చని చెప్పి రకరకాల ‘టాస్్క’లు చేయించుకుంటున్నారు. కానీ ఆయా ‘టాస్్క’లకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ఏజెన్సీల నుంచి తీసేసుకుంటూ... యాప్స్లోని బాధితుల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ అయినట్లు వర్చువల్గా చూపిస్తున్నారు. మొత్తం రూ. 2 లక్షలు దాటాకే డ్రా చేసుకోవడానికి వీలవుతుందని నమ్మబలకడంతోపాటు మరికొంత బోనస్ సొమ్మును కూడా బాధితులకు వర్చువల్గా చూపిస్తున్నారు. వెంటనే డబ్బు కావాలంటే కొంత కట్టమంటూవర్చువల్ యాప్స్లోని సొమ్ము రూ. 10 లక్షలు దాటాకే విత్డ్రాకు వీలవుతుందంటూ కొత్త కథ అల్లుతున్న కేటుగాళ్లు.. ఆ మొత్తాన్ని తక్షణమే తీసుకోవాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరుతున్నారు. వర్చువల్ యాప్స్లో భారీ మొత్తం కనిపిస్తుండటంతో నేరగాళ్లు కోరిన సొమ్మును అమాయకులు చెల్లిస్తున్నారు. అలా వందలు, వేలాది మంది బాధితుల నుంచి భారీ మొత్తం కొల్లగొట్టాక నేరగాళ్లు ఆయా సోషల్ మీడియా గ్రూపులతోపాటు వర్చువల్ యాప్స్ను కనుమరుగు చేస్తున్నారు.చిన్న మొత్తాలను ఇచ్చి, భారీ మొత్తాలను కాజేసే సైబర్ నేరగాళ్లను నమ్మొద్దు. జాబ్స్, టాస్్కలంటూ ప్రకటనలు ఇచ్చే వాళ్లు అందుకు నగదు చెల్లించకుండా ఎదు రు డబ్బు అడుగుతున్నారంటూ అది మోసమని గ్రహించాలి. ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు (నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్) -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్లో చదువుకుంటున్న సురేష్ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్టైమ్ జాబ్స్ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
ట్రంప్ దూకుడు.. మన విద్యార్థుల్లో ఆందోళన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగాలకు గుడ్బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్టైమ్గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ధీమా పోయింది.. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి. కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది. అతి పెద్ద విద్యార్థి సమూహం... అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్ట్ టైమ్ చీటింగ్!
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని లక్ష్యంగా చేసుకుంటూ నిండాముంచుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు.. పార్ట్టైమ్ జాబ్ అయినా మంచి జీతం వస్తుందని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నారు.రామగిరి మండలం గరిమేకపల్లికి చెందిన 29 ఏళ్ల నిరుద్యోగి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘పార్ట్టైమ్ ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం పదే పదే నగదు చెల్లింపులు చేస్తూ మొత్తం రూ.80 వేలు కోల్పోయాడు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది. అప్రూవల్ వస్తుందని.. రిజి్రస్టేషన్, వెరిఫికేషన్.. ఇలా పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఉద్యోగం మాత్రం రాలేదు. తర్వాత అంతకు ముందు టచ్లోకి వచ్చిన సెల్ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఇంటి వద్దనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగం వెతుకుతూ.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్గా కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రెండు నెలల పాటు నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని మరో రూ.50 వేలు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు.సాక్షి, పుట్టపర్తి: కష్టపడకుండా డబ్బులు రావు. అలా వచ్చినా నిలబడవు.. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని గూగుల్ లింక్ క్లిక్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నమ్మిస్తూ వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో లెక్క లేనన్ని లింక్లు నిత్యం వస్తుంటాయి. ఏ ఒక్క లింక్ క్లిక్ చేసినా.. ఆ తర్వాత ఫోన్ మన చేతిలో ఉన్నా.. ఆపరేటింగ్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే తదితర నగదు లావాదేవీల యాప్ల ద్వారా నగదు కాజేస్తున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో చోట సైబర్ నేరం బయట పడుతున్నా.. బలి అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాలను వినియోగించడం తెలీక కొందరు బలి అవుతుండగా.. డబ్బుపై అత్యాశతో ఇంకొందరు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ఆఖరికి కేటుగాళ్ల బారిన పడిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో కూడా కొందరు బయటికి చెప్పకుండా నష్టపోయినట్లు తెలుసుకుని మౌనంగా ఉండిపోతున్నారు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ లింక్లను క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జ్ ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – వి.రత్న, ఎస్పీ, సత్యసాయి జిల్లా -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు!
ఒట్టావా: కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇకపై ఒక వారమంతా కలిపి 24 గంటలపాటు మాత్రమే కాలేజీక్యాంపస్ బయట పనిచేసే అవకాశం కలి్పస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. కోవిడ్ సంక్షోభకాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగసంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న ‘వారానికి 20 గంటల పని’పరిమితిని ఎత్తేసింది. దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటలపాటు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసేవారు. దీంతో విద్యార్థుల అద్దె, సరుకులు, ఇతరత్రా ఖర్చుల భారం కాస్తంత తగ్గింది. వారానికి 20గంటల పని పరిమితికి ఇచి్చన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జత చేసి ‘వారానికి 24 గంటల నిబంధన’ను తీసుకొస్తున్నారు. ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి. 2022 ఏడాదిలో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో 2.26 లక్షల మంది భారతీయులేకావడం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో 3.2 లక్షల మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు(గిగ్ వర్కర్లు)గా పనిచేస్తూ కెనడా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ఆఫ్–క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే చిన్న మొత్తాలు.. విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి. పనివేళల నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా 8 గంటలే పనిచేయొచ్చు. ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడ్రోజులే పని దొరికే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు. గత ఏడాది ఈ వేతనం 16.65 కెనడియన్ డాలర్లుగా ఉండేది. దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదముంది. ‘‘ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చేదెంత? నెలవారీ సామగ్రి కొనడం కూడా కష్టమే’’అని భారతీయ విద్యార్థి నీవా ఫతర్ఫేకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో సరి్టఫికేట్ కోర్సు చేస్తున్నా. ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండటం చాలా కష్టం. అందుకే స్నేహితుల గదిలోకి మారా. అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుకుంటా’అని నీవా చెప్పారు. ‘‘కనీస ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు. ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలి’’అని బార్బరా షెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాయర్ అయిన దీపా మాటో చెప్పారు. -
‘అమ్మో’రికా విద్య!
* కల్లలవుతున్న అమెరికా ఆశలు * సంపాదించుకోవచ్చనే ఆ దేశం బాట పడుతున్న భారత విద్యార్థులు * గ్రాడ్యుయేషన్లో చేరగానే.. పార్ట్టైమ్ ఉద్యోగాల వెతుకులాట * దీనివల్ల స్థానిక అమెరికన్లతో గొడవలు * అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం * ఓటర్లకు గాలం వేసేందుకు ‘ఔట్సోర్సింగ్’ నియంత్రణపై ప్రభుత్వ దృష్టి * విద్యార్థుల ప్రొఫైల్స్పై క్షుణ్ణంగా పరిశీలన * డబ్బుకట్టే తాహతు, ప్రతిభ ఉంటేనే అనుమతి * ఎలాంటి సందేహం వచ్చినా వెనక్కే సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో చదువుకోవడమంటేనే ఓ స్టేటస్ సింబల్గా భావించే పరిస్థితి ఉంది. అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే ఎంతో గొప్పగా కూడా చెప్పుకొంటారు. దీనికి కారణం అక్కడ ఏ ఉద్యోగం చేసుకున్నా.. అంతో ఇంతో వెనకేసుకోవడానికి అవకాశం ఉండడమే. కొన్నేళ్ల కింద అమెరికాకు వెళ్లినవారంతా బాగానే సంపాదించుకోగలిగారు కూడా. దీంతో ఆర్థికంగా వెనుకబడినా అమెరికా వెళ్లాక పార్ట్టైమ్ ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చన్న భరోసా, పెద్దగా ప్రతిభ లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి బతకొచ్చన్న ఆశతో వేలాది మంది అమెరికాకు క్యూ కడుతున్నారు. ఇలా వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతూ.. 2015లో 1.65 లక్షలు దాటింది. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడుతోంది. భారత్ వంటి విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా తమకు ఉద్యోగాలు దొరకక స్థానిక అమెరికన్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దానికితోడు ఆసియా దేశాల నుంచి వచ్చిన కొందరికి ఉగ్రవాద మూలాలు ఉండడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం కావడంతో... విదేశీ విద్యార్థుల ‘వడపోత’ మొదలైంది. ఆర్థికంగా సమర్థత లేకపోయినా, చదువులో వెనుకబడిన చరిత్ర ఉన్నా, పార్ట్టైం ఉద్యోగం చేస్తారనే సందేహం వచ్చినా... అమెరికా అధికారులు విమానాశ్రయాల నుంచే తిప్పి పంపేస్తున్నారు. సీబీపీ విభాగానికి విద్యార్థుల ప్రొఫైల్.. అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో సీటు వచ్చింది కదా, కాన్సులేట్ వీసా కూడా ఇచ్చింది కదా ఇక ఇబ్బందేముంది అనుకుంటే పప్పులే కాలేసినట్టే. వీసా రావడంతోనే అంతా అయిపోయినట్టు కాదని విద్యార్థులు గమనించడం లేదు. అమెరికా వర్సిటీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు సంబంధించి వారు పదో తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు దాకా చదివిన ప్రతి తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి, మొదటిసారి పాసయ్యారా లేదా, బీటెక్ అయితే నాలుగేళ్లలో ఏమైనా బ్యాక్లాగ్లు ఉన్నాయా; జీఆర్ఈ, టోఫెల్ స్కోరు ఎంత వంటి పూర్తి వివరాలతో ‘కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)’ విభాగానికి ప్రొఫైల్స్ అందుతాయి. విమానాశ్రయంలో విద్యార్థులు చెకిన్ అయిన వెంటనే వారి వివరాలన్నీ సీబీటీ అధికారి కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. విద్యార్థుల ప్రొఫైల్స్ను ‘ఏ, బీ, సీ, డీ, ఈ, ఓ’లుగా వర్గీకరిస్తారు. ఏ, బీ ప్రొఫైల్స్ ఉన్న విద్యార్థులను పెద్దగా విచారణతో పనిలేకుండానే దేశంలోకి అనుమతిస్తారు. సీ ప్రొఫైల్ విద్యార్థులను సీబీపీ ప్రత్యేక విభాగానికి తరలించి ప్రశ్నిస్తారు. అక్కడి నుంచి బయటపడితే అమెరికాలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. లేదంటే మళ్లీ స్వస్థలానికి విమానం ఎక్కేయడమే. ఇక ‘డీ, ఈ , ఓ’ ప్రొఫైల్ల విద్యార్థులకు అదృష్టం కలసి వస్తే తప్ప అంతే సంగతులు. అమెరికాకే ఎందుకు..? అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు వెనకేసుకోవాలనుకునే వారంతా వారి విద్యార్హతలతో నిమిత్తం లేకుండా అమెరికాకు వెళుతున్నారు. మంచి విద్య అభ్యసించాలనుకునే వారు వారి అర్హతలను బట్టి దేశాన్ని, మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది జూలై-సెప్టెంబర్ మాసాల్లో భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన మొత్తం విద్యార్థుల్లో 86 శాతం మంది అమెరికాకు వెళ్లారు. 11 శాతం మంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. మిగతా వారిలో ఒక్కో శాతం చొప్పున బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్లకు వెళ్లారు. ఇంత పెద్ద మొత్తంలో భారత విద్యార్థులు తమ దేశానికే ఎందుకు వస్తున్నారన్నది ఇప్పుడు అమెరికా మదిలో మెదులుతున్న సందేహం. గతేడాది జూలై-సెప్టెంబర్ మధ్య 1.34 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఈ గణాంకాలే తదుపరి దశలో భారత విద్యార్థులను అమెరికా ఫిల్టర్ చేయడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 2015 జూన్-ఆగస్టు మధ్య అమెరికాకు చదువుకునేందుకు వచ్చినవారిలో ‘ఎ, బి’ ప్రొఫైల్లు ఉన్నవారు కేవలం 19 శాతం మందే. ‘సి’ ప్రొఫైల్వారు 26 శాతం మంది ఉండగా... మిగతా 55 శాతం మంది ‘డి, ఈ, ఎఫ్, ఓ’ ప్రొఫైల్ల విద్యార్థులని అమెరికా విద్యా, సాంస్కృతిక విభాగం అక్కడి సెనేటర్ ఒకరికి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలిసింది. ఇప్పుడే ఎందుకు కఠినంగా.. విద్యార్థులకు వారి అర్హతలను బట్టి ప్రొఫైల్ ఉండటం కొత్త కాదు. గతంలో ‘ఓ’ ప్రొఫైల్తో వెళ్లిన వేలాది మంది అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. కానీ ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడం, రిపబ్లికన్ పార్టీ అచ్చంగా ఔట్సోర్సింగ్ తగ్గించి ఉద్యోగాల కల్పనను పెంచుతామని హామీ ఇవ్వడం నేపథ్యంలో... అధికార డెమొక్రాటిక్ పార్టీ ఇలా ‘వెనక్కి తిప్పి పంపే’ విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలోనూ ఇలాంటివి ఉన్నా ఏడాదిలో పది కేసుల కంటే తక్కువ ఉండేవి. కానీ ఈ ఏడాది భారత్, చైనాలకు చెందినవారినే దాదాపు వెయ్యి మందికిపైగా తిప్పిపంపడం గమనార్హం. దానికి తోడు ఈ రెండు దేశాల నుంచి 2015 ఫాల్ (జూలై- డిసెంబర్)కు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చేరారు. అయితే స్థానికంగా పార్ట్టైమ్ ఉద్యోగాల విషయంలో అమెరికన్లకు, విదేశాల విద్యార్థులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలో ఇద్దరు పాకిస్తానీయులు విచక్షణారహితంగా కాల్పు లు జరపడం, ఫ్రాన్స్లో గొడవల నేపథ్యంలో ఆసియా నుంచి ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చేవారిని నిశి తంగా పరిశీలిస్తున్నారని అక్కడి కన్సల్టెన్సీ ఏజెన్సీలు చెబుతున్నాయి. హెచ్1బీ విషయంలోనూ ఆ వీసా పొందిన వ్యక్తి ఏదైనా అవాంఛనీయ చర్యలకు పా ల్పడితే.. స్పాన్సర్ చేసిన వారికి ఇబ్బందులు తప్పవని అమెరికా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో ఓ వర్గం వారికి హెచ్1బీ వీసాను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అమెరికా విమానాశ్రయాల నుంచే వెనక్కి వచ్చిన విద్యార్థుల్లో మెజారిటీ ఆ వర్గానికి చెందిన విద్యార్థులదే. ఎంత మంది విద్యార్థులు వెనక్కి డిసెంబర్ 25, 2015: ఈ ఒక్క రోజే అమెరికాలోని వివిధ విమానాశ్రయాల నుంచి 130 మందిని వెనక్కి పంపారు. వీరిలో అక్కడ మంచి యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఆర్థిక స్థోమత లేకుండా వచ్చారంటూ వారి వీసాలు రద్దు చేశారు. డిసెంబర్ 29, 2015: కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల నుంచి 29 మంది విద్యార్థులను విమానాశ్రయాల నుంచే తిప్పిపంపారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించింది. అక్కడ చదువుతూ సెలవుల్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్న వారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 3, 2016: శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, న్యూయార్క్ విమానాశ్రయాల నుంచి 43 మంది విద్యార్థులను వెనక్కి తిప్పి పంపింది, వారి వీసాలు కూడా రద్దు చేసింది. సీబీపీ అధికారి అడిగిన ప్రశ్నలు, ఓ విద్యార్థిని సమాధానాలివీ.. ప్ర: మీ తండ్రి పుట్టినతేదీ చెప్పగలవా? జ: మే నెలలో అనుకుంటా సార్.. కానీ ఎప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోలేదు. ప్ర: మీ తల్లి పేరు, ఇంటి పేరు చెప్పగలవా? జ: సులోచన (పేరు మార్చాము). ప్ర: మీ తల్లి పుట్టినరోజు? జ: జూన్ 10వ తేదీ, కచ్చితంగా సంవత్సరం తెలియదు. ప్ర: మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించారా? జ: ఒకసారి ఇద్దరూ యూఎస్ వచ్చారు. బహుశా రెండేళ్ల క్రితం అనుకుంటా.. కేవలం యూఎస్ చూడటానికి వచ్చారు. ప్ర: మీ తల్లిదండ్రులు చట్టబద్ధంగా యూఎస్ నివాస అర్హత కలిగి ఉన్నారా? జ: లేదు సార్. ప్ర: మీరు వివాహితులా? జ: లేదు సార్. ప్ర: మీకు పిల్లలు ఉన్నారా? జ: లేదు సార్. ప్ర: నువ్వు ఏ విమానంలో ఇక్కడకు వచ్చావు? జ: ఎమిరేట్స్ విమానం ఏకే 225. ప్ర: నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చావు? జ: హైదరాబాద్, ఇండియా నుంచి.. ప్ర: ప్రస్తుతం నీ వద్ద ఎంత డబ్బు ఉంది? జ: ఒక డాలర్, కొన్ని సెంట్లు ఉన్నాయి. ప్ర: నీకు ఏమైనా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా? జ: లేవు సార్. ప్ర: నీ వద్ద ఇంకా ఏ రూపంలో అయినా ఏ రకమైన కరెన్సీ ఐనా (నగదు) ఉందా? జ: సుమారు 240 రూపాయలు (3.5 డాలర్లు) ఉన్నాయి. ప్ర: నువ్వు ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగం చేస్తున్నావా? జ: లేదు సార్. ప్ర: నువ్వెన్ని సంవత్సరాల్లో కాలేజీ విద్య పూర్తిచేశావు? జ: నాలుగేళ్లలో బ్యాచిలర్ డిగ్రీ. ప్ర: నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు? జ: అలేఖ్య. ప్ర: అలేఖ్యకు సమాచారం ఎలా ఇచ్చావు? జ: ఫోన్ ద్వారా. ప్ర: ఫోన్ ద్వారా అలేఖ్యకు సమాచారం అందించడానికి ఏ అప్లికేషన్ వినియోగించావు? జ: వాట్సప్ మెసెంజర్. ప్ర: అలేఖ్య ఇక్కడ ఏ కాలేజీలో చదువుకున్నారు? జ: సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ. ప్ర: ఇప్పుడు నువ్వు హోటల్కు వెడతావా.. లేదా అలేఖ్య ఇంటికి వెడుతావా? జ: హోటల్కు వెళతాను. ప్ర: మరి హోటల్ రూం బుక్ చేసుకున్నావా? జ: లేదు. ప్ర: హోటల్ గదికి అవసరమైన డబ్బు ఎవరు సమకూరుస్తారు? జ: అలేఖ్య. ప్ర: ఆమె ఎందుకు సమకూరుస్తారు? జ: ఆమెకు మా అమ్మ పంపిస్తారు. ప్ర: నువ్వు ఇంతకు ముందు చెప్పినట్లు నీ దగ్గర కేవలం నాలుగు డాలర్లు మాత్రమే ఉన్నాయి. నీ దగ్గర డెబిట్, క్రెడిట్ కార్డులు, ట్రావెల్ కార్డులు లేవు అర్థమవుతుందా? జ: అవును సార్. ప్ర: మరి నువ్వు ఇక్కడ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటావ్? జ: నా తల్లిదండ్రులు నాకు ఫండింగ్ చేస్తారు. ప్ర: నీ తల్లిదండ్రులు నీకు డబ్బు ఎలా పంపుతారు? జ: మా అమ్మ ఫ్రెండ్ కజిన్ ఇక్కడ ఉన్నారు. డెరైక్ట్గా ఆయన అకౌంట్కు బదిలీ చేస్తారు. ప్ర: మీ అమ్మ ఫ్రెండ్ కజిన్ పేరు ఏమిటో తెలుసా? జ: మహేష్. ప్ర: మహేష్ అమెరికా పౌరుడా? జ: నాకు తెలియదు సార్. ప్ర: మహేష్ ఇక్కడ ఏ కాలేజీలో చదివారు? జ: ఆయన ఏదో ఉద్యోగం చేస్తారనుకుంటా సార్. ప్ర: నీకు బ్యాంక్ కార్డులు ఏవీ లేకుండా ఆయన నీకు డబ్బు ఎలా పంపుతారు? జ: నేను తరగతులకు హాజరైనప్పుడు సిలికాన్ వ్యాలీ వర్సిటీ వారు బ్యాంక్ ఖాతా ఇప్పిస్తామన్నారు. ప్ర: నువ్వు ఎప్పుడు ఎస్వీయూ తరగతులకు హాజరవుతావు? జ: డిసెంబర్ 29. ప్ర: ఇంతకు ముందు మేం అడిగినప్పుడు అలేఖ్యకు మీ అమ్మ డబ్బు పంపుతారని చెప్పావు... అర్థమైందా? జ: అవును. ప్ర: మీ తల్లి మీకు డెరైక్ట్గా మనీ ఇవ్వకుండా అలేఖ్యకు ఎందుకు పంపుతామన్నారు? జ: నాకు ట్రావెల్ కార్డులేదు కాబట్టి అలేఖ్య ఖాతాకు పంపుతామని చెప్పారు. ప్ర: మరి ఇప్పుడు ఇక్కడ ఆహారం, బట్టలు, వసతి, రవాణా ఖర్చులు ఎలా భరిస్తావు? జ: మా అమ్మ నేరుగా అలేఖ్య ఖాతాకు పంపిస్తామన్నారు. నేను అలేఖ్య ట్రావెల్ కార్డు వాడుకుంటా. ప్ర: అలాంటప్పుడు నువ్వు సొంతంగా ట్రావెల్ కార్డు ఎందుకు తీసుకోలేదు? జ: మా అమ్మా నాన్న చెప్పారు. నీకు డెరైక్ట్గా 3 రోజుల్లో డబ్బు అందుతుందని. ప్ర: మీ కాలేజీ ట్యూషన్ ఫీజు ఎంత? జ: పది వేల డాలర్లు. ప్ర: మొదటి సెమిస్టర్కు ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నావు? జ: మూడు. ప్ర: ఒక్కో సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్లు ఉంటాయి? జ: నాకు తెలియదు సార్. ప్ర: పర్ యూనిట్కు ఎంత ఖర్చు అవుతుంది? జ: పర్ సబ్జెక్ట్ 1,300 డాలర్లు అనుకుంటా.. నాకు తెలియదు సార్. ప్ర: ప్రతి సబ్జెక్ట్కు 1,300 యూఎస్ డాలర్లు ఖర్చు అవుతుందా? జ: నాకు సరిగ్గా తెలియదు సార్. ప్ర: నువ్వు క్లాస్లకు ఎన్రోల్ అయ్యావా? జ: లేదు. ప్ర: ఒక సెమిస్టర్లో మూడు సబ్జెక్ట్లకు ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటున్నావు? జ: కచ్చితంగా తెలియదు.. సుమారు 4000 డాలర్లు అనుకుంటా. ప్ర: నీకు తెలుసా కనీసం ఒక్క క్రెడిట్కు ఎంత ఖర్చు అవుతుందో? జ: తెలియదు. ప్ర: ఒక్కో క్రెడిట్కు ఎంత ఖర్చవుతుందో ఎందుకు తెలుసుకోలేదు? జ: లేదు సార్, సాధారణంగా విద్యార్థులను అడిగాను. ప్ర: వాళ్లు నీకేమీ చెప్పారు? జ: సబ్జెక్ట్కు 1,300 డాలర్లు, సెమిస్టర్కు 5,000 డాలర్లు అని చెప్పారు. ప్ర: నువ్వు ట్యూషన్ ఫీజు ఎప్పుడు చెల్లించాలి? జ: డిసెంబర్ 29. ప్ర: డిసెంబర్ 29నాడు నువ్వు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది? జ: 1,800 యూస్ డాలర్లు. -
పార్ట్టైం ఉద్యోగం కోసమే అక్కడకు...
♦ భారత్, పాక్, చైనా నుంచి విద్యార్థులు అందుకే వస్తున్నారు.. ♦ అమెరికా ప్రభుత్వానికి ఎఫ్బీఐ నివేదిక ♦ కాలిఫోర్నియాలో ఉద్యోగాలకు భారీగా డిమాండ్ ♦ తక్కువ జీతానికే పనిచేసేందుకు ముందుకు వస్తున్న స్టూడెంట్స్ ♦ స్థానికులతో తరచూ ఘర్షణలు.. శాంతిభద్రతల సమస్య ♦ దీంతో గుర్తింపు లేని వర్సిటీలకు వెళుతున్న విద్యార్థుల కట్టడి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : భారతీయ విద్యార్థులు ఎక్కువగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంతోపాటు చదువు కంటే పార్ట్టైం ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా ప్రభుత్వానికి నివేదించింది. భారత్, పాకిస్తాన్, చైనా నుంచి పెద్ద ఎత్తున కాలిఫోర్నియా రాష్ట్రానికి చదువుల పేరుతో వలస వస్తున్నట్లు ఎఫ్బీఐ గుర్తించింది. ఇలా వచ్చిన విద్యార్థుల్లో అత్యధికులు పార్ట్టైం ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, వీరి కారణంగా తరచూ శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతున్నాయని ఎఫ్బీఐ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కారణంగానే గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలకు వచ్చే విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ (హోమ్ల్యాండ్) అధికారులు కట్టడి చేస్తున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 21 దాకా చైనాకు చెందిన దాదాపు 1,000, పాకిస్తాన్కు చెందిన 250, భారత్కు చెందిన 49 మంది విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి స్వదేశాలకు తిప్పి పంపారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఈ మూడు దేశాల రాయబార కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ప్రత్యేకంగా ఆర్థిక వనరులు ఉన్నట్లు రుజువులు ఇవ్వలేకపోయిన వారిని, పార్ట్టైం ఉద్యోగాల భరోసాతో వస్తున్న వారినే వెనక్కి తిప్పి పంపుతున్నామని వారు వివరించారు. ఇదే విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా నివేదించింది. చదువుకోవడానికి అవసరమైన పూర్తి ఆర్థిక వనరులు ఉండి, జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీలో మంచి స్కోర్ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఈ నెల రోజుల్లోనే భారత్కు చెందిన 19 వేల మంది విద్యార్థులు కాలిఫోర్నియాలోని వివిధ వర్సిటీల్లో అడ్మిట్ అయ్యేందు కు అమెరికా అనుమతించడం గమనార్హం. కాలిఫోర్నియానే ఎందుకు? అమెరికాలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన కాలిఫోర్నియాలోనే 128 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అమెరికాలోనే మరే రాష్ట్రంలో ఇన్ని వర్సిటీలు లేవు. ఇక్కడ చదివితే పార్ట్టైం ఉద్యోగాలతో పాటు ఇంటర్న్షిప్ తేలిగ్గా లభిస్తుందని భావించి వేలాది మంది విద్యార్థులు తరలి వెళ్తున్నారు. ఈ ఏడాది ఆగస్టుతో మొదలైన విద్యా సంవత్సరానికి అమెరికాలో చదివేందుకు భారత్ నుంచి 1.34 లక్షల మంది వెళ్లగా.. అందులో 40 వేల మంది కాలిఫోర్నియా వెళ్లారు. వీరు కాకుండా మరో 7 వేల మంది ఎంబీఏ చదివేందుకు ఈ రాష్ట్రంలోని బిజినెస్ స్కూళ్లనే ఎంపిక చేసుకున్నారు. భారత్తో పాటు చైనా, పాక్ నుంచి వెళ్లే వారు కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం వైపే మొగ్గుచూపుతున్నారు. 2003 నాటికి కాలిఫోర్నియాలో 67 విశ్వవిద్యాలయాలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 128కి పెరిగింది. ఇందులో గుర్తింపు లేని వర్సిటీలు 22 ఉన్నట్లు అమెరికా గుర్తించినా వాటి జాబితా వెలువరించలేదు. పార్ట్టైం ఉద్యోగాల కోసం ఘర్షణలు భారత్, చైనా, పాకిస్తాన్ నుంచి ఏటా దాదాపు లక్ష మంది కాలిఫోర్నియాకు వెళ్తున్న దృష్ట్యా అక్కడ పార్ట్టైం ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. అమెరికా విద్యా చట్టాల ప్రకారం అక్కడ గ్రాడ్యుయేషన్ చేసేవారు ఆ కాలేజీల్లో మాత్రమే పరిమిత గంటల పాటు పార్ట్టైం ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తారు. కానీ అవి కేవలం తెలివైన కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల అత్యధికులు బయట పార్ట్టైం ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. అతి తక్కువ వేతనానికి పని చేయడానికి ముందుకు వస్తున్న కారణంగా అమెరికా జాతీయులకు పార్ట్టైం ఉద్యోగాలు ఇచ్చేందుకు అక్కడి వాణిజ్య, వ్యాపార సంస్థలు వెనకాడుతున్నాయి. ఈ కారణంగా తరచూ కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో, శాన్జోస్, శాంతాక్రూజ్, శాన్డిగో వంటి నగరాల్లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఎఫ్బీఐ పేర్కొనడం వల్లే విద్యార్థులను కట్టడి చేయడం మొదలుపెట్టారు. ఎంఎస్, ఎంబీఏ చదువు కోసం వెళ్లిన వారు ఖర్చులకు సరిపోక తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్రోల్ బంకులు, హోటళ్లు, వ్యాపార సంస్థల్లో పార్ట్టైం ఉద్యోగాలు చూసుకుంటున్నారు. మామూలుగా అమెరికా జాతీయులు గంట పనికి 25 డాలర్లు వసూలు చేస్తారు. కానీ, భారత్, చైనా దేశాల నుంచి వెళ్లిన విద్యార్థులు గంటకు పది అంతకంటే తక్కువ డాలర్లకే పని చేసేందుకు ముందుకు వస్తున్నట్టు ఎఫ్బీఐ పేర్కొంది.