'త్వరలో పట్టణాల్లో పట్టణజ్యోతి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గ్రామాల సమగ్ర అభివృద్ధికోసమే గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టనున్నట్టు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రజలే సారథులుగా ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామజ్యోతి పథకం విజయవంతమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమంగా జరిగితే ఫలితం రాదని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన దళితవాడలు, గిరిజన తండాల నుంచి మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమంలాగానే.. పట్టణాల్లో త్వరలో 'పట్టణ జ్యోతి' కార్యక్రమం ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు.