Phones Tapping
-
దొంగలంతా ఒక్కటై నన్ను బలహీనపర్చాలని చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచాం. గద్వాలలో కూడా కాంగ్రెస్ కచ్చితంగా గెలిచేది. కానీ చివర్లో బీజేపీ అరుణమ్మ అల్లుడికి ఓట్లు వేయించింది. అక్కడ దొంగదెబ్బ తీశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారు. దొంగలంతా ఒక్కటై నన్ను రాజకీయంగా బలహీనపర్చాలని చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు లోక్సభ అభ్యర్థులు వంశీ, మల్లురవిల మీద కోపం లేదు. ఉన్నదంతా నా మీదనే. నన్ను దెబ్బతీస్తే సొంత జిల్లాలో గెలవలేని వ్యక్తి రాష్ట్రమంతా ఏం చేస్తాడని ప్రశ్నించవచ్చనేది వారి ఆలోచన’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరుకు ఏమీ చేయని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించిన రేవంత్ పదేళ్లలో పాలమూరుకు ఏమీ చేయని మోదీ ఇప్పుడేం చేస్తారని..ఇప్పుడు ఓటేస్తే్త మోదీ చంద్రమండలానికి రాజవుతాడా అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం గాంధీభవన్లో ఆయన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వాల్మీకిబోయ సామాజికవర్గ పెద్దలతో సమావేశ మయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో బోయలకు రిజ్వరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే ‘వాల్మీకిబోయలపై కాంగ్రెస్కు అభిమానం ఉంది. కర్ణాటకలో బోయలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వాల్మీకిబోయల డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి మీ సమస్యలు ఎలా తీర్చాలో చెప్పండి. మీ సమస్యలపై మాకు అవగాహన ఉంది. వాటిని తీర్చే బాధ్యత నాది. ఎన్నికల తర్వాత నేనే మీతో మళ్లీ సమావేశమవుతా. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వండి. మేం కచ్చితంగా బోయలకు న్యాయం చేస్తాం. కేసీఆర్లాగా మాట ఇచ్చి మోసం చేయం. వంద రోజుల పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆరు గ్యారంటీలను అమలు చేశాం. అధికారంలోకి 100 రోజుల్లో విశ్వాసం కల్పించాం’ అని రేవంత్రెడ్డి అన్నారు. కేటీఆర్ ఫలితం అనుభవిస్తారు ‘కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. చేస్తే ఏమవుతుందని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు చిప్పకూడు తినాల్సి వస్తోంది. వాళ్లు దుర్మార్గులు, వాళ్ల మాటలు వినొద్దంటే ఆ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేటీఆర్ ఆంబోతులా బరితెగించి మాట్లాడుతున్నా డు. ఫలితం అనుభవిస్తాడు. ట్యాపింగ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంది సంసారాల్లో తొంగి చూడడానికి వీళ్లకేం పని. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు. గతంలో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టే కొడంగల్కు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశా. అక్కడ కూడా కచ్చితంగా గెలవబోతున్నాం. 200 ఓట్లతో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పెగసస్పై ప్యానెల్ చర్చకు బీజేపీ మోకాలడ్డు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి బీజేపీ ఎంపీలు ఆదిలోనే అడ్డుతగిలారు. పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం నేపథ్యంలో పౌరుల భద్రత, పరిరక్షణ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ’ బుధవారం పార్లమెంట్లో సమావేశమైంది. 32 సభ్యులున్న ఈ స్టాండింగ్ కమిటీలో ఎక్కువమంది బీజేపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. పెగసస్ అంశంపై చర్చకు నిరాకరించిన ఈ బీజేపీ ఎంపీలు సమావేశగదిలోకి వచ్చినా అక్కడి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్లో సంతకాల సంఖ్యను లెక్కించే కనీస సభ్యుల సంఖ్య(కోరమ్) ఉందో లేదో లెక్కగడతారు. కోరమ్ ఉంటేనే ప్యానెల్ చర్చను మొదలుపెట్టాలి. కమిటీలో కోరమ్ లేని కారణంగా స్టాండింగ్ కమిటీ పెగసస్పై చర్చ సాధ్యంకాలేదు. -
చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ భద్రత, నేరాల నిర్మూల న కోసం కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్ జరుపుతున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ద్వారా ఫోన్ల ట్యాపింగ్కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వ్యవస్థ లో అక్రమాల నిరోధానికి, తటస్థత (చెక్స్ అండ్ బ్యాలñ న్సెస్)ను కాపాడేందుకు చట్టబద్ధ ఏర్పాట్లున్నాయని తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తోం దని, విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీ సు శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తోందని మహా కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ డీజీపీకి సీఈవో రజత్కుమార్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుకు సంబంధించి కవరిం గ్ లెటర్లో మినహా ఫిర్యాదు ప్రతిలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ ప్రస్థావన లేదని డీజీపీ పేర్కొనడం గమనార్హం. విపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారా.. లేదా అన్న అంశం పై డీజీపీ సూటిగా సమాధానం చెప్పని నేపథ్యంలో ఈ వివరణపై సంతృప్తి చెందారా అన్న విలేకరుల ప్రశ్నకు సీఈవో స్పందిం చారు. తనకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని, ఎవరి పట్ల వివక్ష లేదన్నారు. డీజీపీ వివరణపై సంతృప్తి చెందినట్లు తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్ విషయంలో కేంద్ర హోంశాఖ నిబంధనలను అమలు చేస్తున్నామని పేర్కొనడం ద్వారా రాజకీయ పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేయట్లేదని డీజీపీ పరోక్షంగా తెలిపారని అభిప్రాయపడ్డారు. తనిఖీల్లో కక్ష సాధింపు లేదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విపక్ష పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోదండరాం, ఎల్.రమణల వాహనాలను పోలీసులు తనిఖీ చేశారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. ఇబ్రహీంపట్నం లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నిర్వహిం చిన వాహనాల తనిఖీల్లో టీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ పల్లె గోపాల్రావు కారు నుంచి రూ.27.35 లక్షలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు వాహన యజమానిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని డీజీపీ నివేదించారు. -
ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులందాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా ఫిర్యాదులొచ్చాయా అని లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం సమాధానమిచ్చారు. ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అవి హైకోర్టులో న్యాయవిచారణలో ఉన్నాయని మంత్రి వివరించారు. -
ఫోన్ మాట్లాడాలంటే టెన్షన్ టెన్షన్