breaking news
presidential election polling
-
అమెరికాలో పోలింగ్ నేడే.. కమల వికాసమా! ట్రంప్కే పట్టమా!
భారత మూలాలున్న కమలా హారిస్ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోరులో పైచేయి సాధించి డొనాల్డ్ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది. 60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్ కొద్ది నెలలుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్లోనూ వారిద్దరూ సమవుజ్జీలుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్కు ఒక్క రోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలితాలను నిర్దేశించే కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అభ్యర్థులిద్దరి మధ్యా హోరాహోరీ ఉండగా తాజాగా వాటన్నింట్లోనూ ట్రంపే ముందంజ వేసినట్టు పలు పోల్స్ తేల్చాయి. అదే సమయంలో రిపబ్లికన్ల కంచుకోటైన అయోవాలో హారిస్ పైచేయి సాధించినట్టు మరో పోల్లో వెల్లడవడం విశేషం. అంశాలవారీగా చూస్తే అమెరికన్లను ప్రధాన సమస్యలుగా భావిస్తున్న ఎనాకమీతో పాటు అక్రమ వలసలు తదితరాల్లో తొలినుంచీ ట్రంప్కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనైతేనే దేశానికి గట్టి నాయ కత్వం అందించగలరన్న అభిప్రాయమూ అమెరికన్లలో నెలకొంది. మరోవైపు హారిస్కేమో భార త, నల్లజాతి మూలాలు బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యమున్న ఓటర్లంతా ఆమెకే ఓటేయడం ఖాయ మంటున్నారు. దీనికి తోడు ఈసారి స్వింగ్ స్టేట్లను తోసిరాజని అధ్యక్షున్ని తేల్చడంలో నిర్ణాయకంగా మారగలదని భావిస్తున్న మహిళా ఓటర్ల మద్దతూ హారిస్కే ఉండటం అతి పెద్ద సానుకూలాంశం. అబార్షన్ల వంటి పలు కీలకాంశాల్లో కూడా హారిస్దే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తటస్థ ఓటర్లే ఫలితాన్ని నిర్దేశించేలా ఉన్నారు...ఓటేసిన కమల అధ్యక్షుడు జో బైడెన్ బాటలో హారిస్ కూడా ఈసారి ముందస్తుగా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం డెట్రాయిట్లో ఈ మేరకు విలేకరులకు వెల్లడించారు. ‘‘నేనిప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశాను. అది త్వరలో కాలిఫోరి్నయా చేరనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’’ అని తెలిపారు. మెయిల్ ఓటింగ్ వ్యవస్థను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ ఇటీవలే తన స్వస్థలం డెలావెర్లో ముందస్తు ఓటు వేయడం తెలిసిందే. స్వింగ్ స్టేట్లలో చివరి ప్రయత్నాలు హారిస్, ట్రంప్ ఇద్దరూ కొద్ది రోజులుగా స్వింగ్ స్టేట్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆది, సోమవారాల్లో ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివారం మిషిగన్లో కలియదిరిగిన హారిస్ సోమవారం పెన్సిల్వేనియాలో ర్యాలీల్లో ప్రసంగించారు.2020లో పోలింగ్ 66 శాతమే అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్ నమోదైంది.అమెరికా జనాభా - 34.6 కోట్లు అర్హులైన ఓటర్లు - 23.5 కోట్ల పై చిలుకు నమోదైన ఓటర్లు - 16,14,22,000 ఇప్పటికే ఓటేసింది - 7.7 కోట్ల పై చిలుకు తొలిసారి ఓటేస్తున్నది - 1.9 కోట్ల పై చిలుకు ప్రచార నినాదాలు హారిస్ → అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ → రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ ట్రంప్ → దేశ ఆర్థిక పునరి్నర్మాణం → అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట పోలింగ్ వేళలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా (భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకాకొనసాగుతుంది) అసలు ఎన్నిక డిసెంబర్ 16న!విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లేఅమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. జనవరి 6న ఫలితంజనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమా వేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలేస్తారు. సెనేట్ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న (ఆ రోజు ఆదివారమైతే మర్నాడు) ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్ తర్వాతా ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది!టై అయితే?ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ, అంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. అందుకు ఆస్కారం అతి తక్కువగా కనిపిస్తున్నా, ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్లో జెఫర్సన్ విజేతగా నిలిచారు.అత్యధిక ఓట్లొచ్చినా గ్యారెంటీ లేదుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ప్రత్యర్థి ట్రంప్ కంటే 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓడారు. 2000లో అల్ గోర్ (డెమొక్రాట్) కూడా జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించినా ఓడారు. మెయిన్, నెబ్రాస్కా మినహా 48 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విన్నర్ టేక్స్ ఆల్ విధానమే ఇందుకు కారణం. దాని ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ దక్కుతాయి.న్యూయార్క్లో బెంగాలీ బ్యాలెట్లుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్లో బ్యాలెట్ పేపర్లపై బెంగాలీ భాష చోటుచేసుకోవడం విశేషం. అధికారక భాషగా ఇంగ్లిష్ కాకుండా బెంగాలీతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు బ్యాలెట్ పేపర్లపై చోటుదక్కింది. న్యూయార్క్లో బెంగాలీలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికం. న్యూయార్క్లో ఏకంగా 200కు పైగా భాషలు మాట్లాడేవాళ్లు నివసిస్తుండటం విశేషం. హారిస్ సానుకూలతలు1. ట్రంప్ పట్ల భయాందోళనలుఅమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షునిగా ట్రంప్ అప్రతిష్టపాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా పేరుండటం హారిస్కు కలిసొచ్చే అంశం. అందుకే ట్రంప్ను ఫాసిస్టుగా, ప్రజస్వామ్యానికే ప్రమాదకారిగా హారిస్ తన ప్రచారంలో పదేపదే అభివర్ణించారు. ఆయన గెలిస్తే అమెరికన్లను మరోసారి విడదీస్తారని హెచ్చరించారు.2. బైడెన్కు సమర్థ ప్రత్యామ్నాయండెమొక్రాట్ల అభ్యర్థిగా ఒక దశలో అధ్యక్షుడు బైడెన్ పేరు దాదాపుగా ఖరారైంది. వయోభారం, మతి మరుపు తదితర సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల ఓటర్లంతా పెదవి విరుస్తున్నట్టు అన్ని పోల్స్లోనూ స్పష్టమైంది. దాంతో ఒక దశలో డెమొక్రాట్లు గెలుపుపైనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే సమయం మించిపోకుండా ఆయన్ను తప్పించి హారిస్ను తెరపైకి తీసుకురావడంతో పోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.3. మహిళల హక్కుల యోధురాలుమహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ట్రంప్తో పోలిస్తే హారిస్ ఎంతో ఎత్తున నిలిచారు. ముఖ్యంగా కీలకమైన అబార్షన్ అంశంపై హారిస్కు మహిళల్లో ఆదరణ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో ట్రంప్ కూడా అబార్షన్ల హక్కును వ్యతిరేకించే విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికతో పాటే అబార్షన్ హక్కులపైనా ఓటింగ్ జరుగుతోంది. ఇది హారిస్కు మరింత కలిసొస్తుందని చెబుతున్నారు.4. ఓటింగ్ శాతంట్రంప్ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంతాల ప్రజలే. హారిస్ మద్దతుదారుల్లో జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ వారే అధిక సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు హారిస్కు బాగా సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.5. ముమ్మర ప్రచారం, వ్యయంఅమెరికా ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ట్రంప్తో పోలిస్తే హారిస్ భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడమే గాక ప్రచారంపై ఎక్కువ వ్యయం చేశారు. ఆలస్యంగా జూలైలో రేసులోకి వచ్చిన ఆమె, జనవరి నుంచి 11 నెలల వ్యవధిలో ట్రంప్ సేకరించిన దానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం విశేషం. ముఖ్యంగా కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో విరాళాల సేకరణలో హారిసే ముందున్నారు. ట్రంప్ సానుకూలతలు1. ప్రభుత్వ వ్యతిరేకతఅమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతి పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత ట్రంప్కు బాగా కలిసి రానుంది. ఉపాధ్యక్షురాలు హారిస్కు ఇది బాగా ప్రతికూలంగా మారవచ్చు. తమ ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా మారాయని ఏకంగా 62 శాతం మంది అమెరికన్లు చెబుతుండటం విశేషం. 79 శాతం మంది దేశం తిరోగమన బాటలో ఉందని భావిస్తున్నారు.2. తగ్గని ప్రజాదరణ2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా క్యాపిటల్ హిల్పైకి దాడులకు మద్దతుదారులను ఉసిగొల్పినా, క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న చెత్త రికార్డును మూటగట్టుకున్నా ట్రంప్కు జనాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది పొడవునా కనీసం 40 శాతం, అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆయనకు మద్దతు పలకడం విశేషం.3. అక్రమ వలసలురెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానన్న ట్రంప్ ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అబార్షన్లపై హారిస్ వైఖరిపైనే డెమొక్రాట్లు ఆశలు పెట్టుకోగా ట్రంప్ ప్రధానంగా అక్రమ వలసల అంశమే తనను గట్టెక్కిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.4. సామాన్యుల దన్నుగ్రామీణులు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న వారు ట్రంప్ను మొదట్నుంచీ అభిమానిస్తూ వస్తున్నారు. వారిలో ఆయనకు ఆదరణ ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు డెమొక్రాట్ల మద్దతిచ్చే కార్మిక సంఘాలు కూడా ఈసారి ట్రంప్కు జై కొడుతున్నాయి. గ్రామీణ ఓటర్లు, స్వింగ్ స్టేట్లలోని పట్టణ శివారు ప్రాంత ఓటర్లు భారీగా ఓటేసేలా చూడగలిగితే ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరుగుతాయి.5. గట్టి నేతగా పేరుఅంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఆధిప త్యాన్ని పరిరక్షించగల సామర్థ్యం ట్రంప్కే ఉందని మెజా రిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన అధ్యక్షు నిగా ఉండగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జర గని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంకలో పోలింగ్ ప్రశాంతం
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలూ నమోదు కాలేదు. చివరి సమాచారం అందేసరికి 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ఈయూ, కామన్వెల్త్ తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. 38 మంది బరిలో దిగినా ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు జనాదరణతో దూసుకుపోతున్న జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్యే నెలకొనడం తెలిసిందే. రేసులో దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేస్తారు. పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థి విజేత అవుతాడు. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్బామ్కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. -
రాష్ట్రపతి ఎన్నికలు.. తొలి ఓటు కేటీఆర్ది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు ఓటు వేయలేదు. కరోనా, డెంగీతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఓటు వేయలేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారు. దీనితో తెలంగాణకు సంబంధించి 117 ఓట్లు పోలవగా.. ఏపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ఎన్నికల సంఘం అనుమతితో ఇక్కడే ఓటు వేశారు. దీనితో మొత్తం 118 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఓటు విషయంగా కొంత గందరగోళం నెలకొంది. తొలిఓటు వేసిన కేటీఆర్ సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తొలిఓటు వేయగా.. ఏపీ ఎమ్మెల్యే మహీధర్రెడ్డి రెండో ఓటు వేశారు. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేరుగా అసెంబ్లీకి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, సీతక్క, పోదెం వీరయ్య కలిసి వచ్చి ఓటేయగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి విడివిడిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్లి ఓటేశారు. బీజేపీ ముగ్గురు సభ్యుల్లో రఘునందన్రావు, రాజాసింగ్ ఉదయం, ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఓటు వేశారు. కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా తరఫున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, హన్మంత్ షిండే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పోలింగ్ ఏజెంట్లుగా.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తరఫున బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్ను అసెంబ్లీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మంగళవారం తెల్లవారుజామున వాటిని ఢిల్లీకి తరలించనున్నారు. సీతక్క ఓటుపై అయోమయం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బ్యాలెట్ పేపర్పై ఓటేసే సమయంలో ఎక్కువ సమయం ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్దే ఉండిపోయారు. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ మహేశ్వర్రెడ్డి.. బ్యాలెట్ విషయంగా ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్ తీసుకోవాలని సూచించారు. దీంతో సీతక్క మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరారు. ఓ అభ్యర్థి పేరు పక్కన బాక్స్లో ఒకటి అని ప్రాధాన్యత ఓటు వేసి.. పైన అభ్యర్థుల పేర్లు అని ఉన్న చోట పొరపాటున ‘రైట్ మార్క్’ వేశానని.. మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ఆమె కోరడం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల అధికారులు దీనిపై ఈసీ ఉన్నతాధికారులను సంప్రదించి, మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సీతక్క అదే బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేసి వెనుదిరిగారు. బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాలెట్పై పెన్ను గుర్తు పడడం వల్ల మరో బ్యాలెట్ ఇవ్వాలని కోరానని, అధికారులు ఇవ్వలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సీతక్క.. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టుగా ప్రసార సాధనాల్లో ప్రచారం జరిగింది. దీనిపై సీతక్క ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. తాను ఓటేసేప్పుడు ఎలాంటి తప్పు దొర్లలేదని, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని.. మరో పేపర్ ఇవ్వనందున ఇంకు పడిన బ్యాలెట్నే బాక్సులో వేశానని తెలిపారు. -
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు తర్వాత ఓటు వేశారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్ హౌస్లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్ పోటీలో ఉన్నారు. ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తారు. -
ఏపీలో పోలింగ్ ఇలా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు సచివాలయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పోలింగ్లో అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఉదయం 10 గంటలకు వీరంతా పోలింగ్లో పాల్గొంటారు. పోలింగ్లో ఎన్డీఏ తరపున పోలింగ్ ఏజెంట్గా కాల్వ శ్రీనివాసులు వ్యహరించనున్నారు. మరోవైపు స్టేట్ గెస్ట్హౌస్లో రేపు ఉదయం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీకానున్నారు. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పోలింగ్కు వెళ్లనున్నారు.