Project Engineer
-
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో మనోజ్కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు. ఎక్స్కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు.. సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి. ఎక్స్కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు. -
బెల్, హైదరాబాద్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), హైదరాబాద్ యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 84 ► పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–33, ప్రాజెక్ట్ ఇంజనీర్లు–51. ► ట్రెయినీ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ప్రాజెక్ట్ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్–500076, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరితేది: 31.12.2021 ► వెబ్సైట్: bel-india.in -
బెల్, మచిలీపట్నంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), మచిలీపట్నం(ఏపీ) యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్–06, మెకానికల్–06, కంప్యూటర్ సైన్స్–03. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్టైం బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.» వయసు: 01.11.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, వైవా వాయిస్ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కుల్లో.. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(హెచ్ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం–521001, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021 ► వెబ్సైట్: bel-india.in -
ఉద్యోగాలు
సీడాక్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డాక్) కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్- 2 అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. సంబంధిత విభాగంలో 2-3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు: 32 ఏళ్లకు మించకూడదు. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ప్రాజెక్ట్ కోఆర్డినేటర్) అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉండాలి. రెండు నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్) అర్హతలు: ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు ప్రాజెక్ట్ అసిస్టెంట్-1(ఫ్యాకల్టీ/ట్రైనర్) అర్హతలు: ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: ఆగస్టు 19 వెబ్సైట్: http://cdac.in