rail way
-
దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్లకు ఏమి దక్కాయి?
పొరుగుదేశం పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్(Jaffer Express) హైజాక్ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య రైల్వే సంబంధాలపై చర్చ జరుగుతోంది. దేశవిభజన జరిగాక రైల్వే విషయంలో ఏం జరిగింది? ఆ సమయంలో భారత్, పాక్లకు ఏమేమి దక్కాయనే అంశంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.1947లో భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం విభజనతో పాటు రైల్వేలను కూడా విభజించారు. నాడు మన దేశంలో రైల్వే నెట్వర్క్(Railway network) చాలా తక్కువగా ఉండేది. విభజన తర్వాత పాకిస్తాన్కు కొన్ని రైళ్లు, ఉద్యోగులు, కొంత నగదు అప్పజెప్పారు. భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. భారతీయ రైల్వేలు 1845 మే 8న ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే లైన్ వేసే పని 1848లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, భూసేకరణ తదితర పనులకు మూడేళ్లు పట్టాయి.1853లో బొంబాయి (ఇప్పుడు ముంబై)- థానే మధ్య దాదాపు 34 కి.మీ.ల మొదటి ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్పై మొదటి రైలు 1853, ఏప్రిల్ 16న నడిచింది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు 11 వేల కి.మీ.లకు పైగా పొడవైన రైల్వే లైన్ పాకిస్తాన్ వైపునకు వెళ్ళింది. దీని కారణంగా రైల్వే పెట్టుబడి మూలధనంలో దాదాపు రూ. 150 కోట్లు పాకిస్తాన్ వాటాలోకి వచ్చాయి. విభజన సమయంలో పాకిస్తాన్కు పలు రైళ్లు అప్పగించారు. రైల్వే డివిజన్ వర్క్షాప్(Railway Division Workshop) కూడా పాకిస్తాన్కు దక్కింది. అయితే రైల్వే వర్క్షాప్ను రెండు దేశాలు ఉపయోగించుకోవాలని నాడు నిర్ణయం తీసుకున్నారు.ఈ వర్క్షాప్ను రెండు దేశాలు చాలా కాలం పాటు ఉపయోగించుకున్నాయి. రైల్వే కార్మికులను కూడా రెండు దేశాల మధ్య విభజించారు. రైళ్లను నడపడం నుండి రైల్వేలను నిర్వహించడం వరకు ఇరు దేశాల మధ్య విభజన జరిగింది. దేశ విభజన సమయంలో, దాదాపు 1.26 లక్షల మంది రైల్వే కార్మికులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలోనే దాదాపు లక్ష మంది రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకూ కూడా రెండు దేశాల మధ్య ఒక రైలు నడిచింది. దాని పేరు సంఝౌతా ఎక్స్ప్రెస్. ఈ రైలు 1976 జూలై 22న ప్రారంభమైంది. దీనిని సిమ్లా ఒప్పందం కింద నడిపారు. ఈ రైలు నాడు పంజాబ్లోని అట్టారి నుండి పాకిస్తాన్లోని లాహోర్ వరకు నడిచేది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో 2019, ఫిబ్రవరి 28న ఈ రైలును రద్దు చేశారు.ఇది కూడా చదవండి: బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు -
రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి
సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ 2 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు రైల్వే క్వార్టర్స్లో బుధవారం మృతి చెందారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్ నిలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రైల్వే లాన్సర్ కాలనీలోని 605/4 లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు. -
జల మార్గానికి పోల‘వరం’
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ బ తుకులు ఛిద్రం అవుతాయని ఆందోళన చెం దుతున్న ముంపు ప్రాంతాల ప్రజలకు అలాం టి బెంగ అవసరం లేదని.. ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడి వారికి ప్రయోజనాలు చేకూరతాయని ప్రభుత్వరంగ సంస్థలు తేల్చారుు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తరుుతే.. ఆదివాసీలకు.. ముం పు ప్రాంతాల్లోని ప్రజలకు వృత్తి, వ్యాపా రం, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయ ని స్పష్టం చేస్తున్నారుు. అక్కడి ప్రజల జీవితా ల్లో వెలుగులు నిండుతాయని నిగ్గుతేల్చారుు. కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి పై ఏర్పడే జలమార్గం వల్ల ముంపు ప్రాంతాల ప్రజలకు ప్ర యోజనాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ సంస్థలు చెబుతున్నారుు. ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి రాజ మండ్రితోపాటు వివిధ పట్టణాలకు వెళ్లే దూరం తగ్గుతుందని పేర్కొంటున్నారుు. గత ఏడాది నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ అరుున ఐడబ్ల్యూఏఐ (ఇన్ల్యాండ్ వాటర్వేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా), హైదరాబద్కు చెందిన ఐఐసీ (ఇంటలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) సంస్థలు గోదావరిపై సర్వే నిర్వహించాయి. వరదల సమయంలో తప్ప గోదావరిలో నీటిమట్టం తక్కువగా ఉంటుందని, నీటిలోతు వందమీటర్లు ఉంటేనే లాంచీ ప్రయా ణం సాధ్యమవుతుందని తేల్చారుు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే నదిలో నీటిలోతు పెరుగుతుందని, దానివల్ల జల రవాణా సాధ్యమవుతుందని స్పష్టం చేశారుు. రోడ్డు, రైలు మార్గంతో పోలిస్తే జల మార్గం ద్వారా రాజమండ్రికి వెళ్లే ప్రయూణికులు, యాత్రికులకు దూ రం, ఖర్చు, సమయం తగ్గుతాయి. భద్రాచలం, రాజమండ్రి మధ్యలో ఉన్న పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలు కలుగుతుంది. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి కాటన్ బ్యారేజీ వరకు గోదావరి నది పొడవు 157 కిలోమీటర్లు ఉండగా.. నది ఒడ్డు 171 కిలోమీటర్లు ఉందని సర్వే సంస్థలు నిర్థారించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్లు నీటిలోతు ఉండగా, కుక్కునూరు మండల పరిధిలోని వింజరం రేవులో ఆరు మీటర్లే లోతు ఉందని గుర్తించారుు. పోలవరం ప్రాజెక్టు పూర్తరుుతే నీటిలోతు సుమారు వందమీటర్లు ఉండవచ్చని సర్వే అధికారులు అంచనా వేశారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 209 కిలోమీటర్ల దూరం ప్రయూణించాలి. భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కిలోమీటర్ల దూరం ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కిలోమీటర్లకు తగ్గుతుంది. రాజ మండ్రి, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు సమయం, ఖర్చు, దూరం కలసి వసా ్తరుు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటైతే ముంపు మండలాలు అభివృద్ధి చెందుతారుు. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.