rajesh agarwal
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు. రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. -
క్రిమిసంహారకాల రేట్ల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముడిసరుకుల ధరల పెరుగుదల, రూపాయి మారకం హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్రిమిసంహారకాల రేట్లను 10-15 శాతం మేర పెంచుతున్నట్లు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ఎండీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. విడతల వారీగా ఈ రెండు నెలల్లో (డిసెంబర్, జనవరి) 30 ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. రాబోయే కొన్నాళ్లలో ముడిసరుకుల రేట్లు మరో 5-10% పెరగొచ్చని మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర మార్కెట్ నుంచి ఆదాయం సుమారు 50 శాతం పెరిగి రూ. 150 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు రూ. 100 కోట్లు. ఇక గతేడాది మొత్తం టర్నోవరు రూ. 650 కోట్లు కాగా ఈసారి రూ. 900 కోట్లు అంచనా వేస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు, గడచిన నాలుగేళ్లుగా ఉత్పత్తి సామ ర్థ్యం పెంపుపై సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. తాజాగా రాజస్థాన్లో నిర్మిస్తున్న ఆరో ప్లాంటు జనవరికల్లా అందుబాటులోకి రాగలదన్నారు. ఇక దేశీయ పరిజ్ఞానంతో క్రిమిసంహారకాల తయారీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని అగర్వాల్ చెప్పారు. ఇందులో భాగంగా జపాన్కి చెందిన ఒత్సుక అగ్రిటెక్నో సంస్థతో కలిసి పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా దీనిపై రూ. 50 కోట్లు, తదుపరి నాలుగేళ్లలో మరో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. అటు, కంపెనీ రాబడులు మరింత పెరిగిన పక్షంలో వచ్చే రెండేళ్ల వ్యవధిలో కొంత వాటాల విక్రయం ద్వారా విస్తరణకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.