Ranjani
-
ఇంతటి ద్రోహాన్ని ఊహించలేదు: రంజినీ శ్రీనివాసన్
న్యూఢిల్లీ: తన వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేయడంతో తనకు తాను అమెరికాను వీడిన భారత్కు చెందిన పీహెచ్డీ విద్యార్థిని రంజినీ శ్రీనివాస్.. కొలంబియా యూనివర్శిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పాటు పని చేసినందుకు తనకు ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్శిటీ నుంచి ఈ తరహా ఉద్వాసన ఊహించలేదని, కానీ అది జరిగిందంటూ ఆమె అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈనెల రెండో వారంలో ఆమెపై పలు ఆరోపణలతో అమెరికా వీసా రద్దు చేయడంతో,.. స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. గత డిసెంబర్ లో ఆమె వీసా రెన్యువల్ అయిన నెలల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడంపై ఆమె కలత చెందారు. అదే సమయంలో కెనడాకు వెళ్లిపోయారు రంజినీ శ్రీనివాసన్. దీనిలో భాగంగా తాజాగా ఆమె మాట్లాడుతూ..ఊహించలేదు.. కానీ జరిగింది.. ‘కొలంబియా యూనివర్శిటీలో ఐదేళ్లు ఉన్నాను. అక్కడ పని చేస్తూ నా పీహెచ్ డీని పూర్తి చేసే పనిలో ఉన్నా. కానీ ఇలా జరిగింది. నేను దీన్ని ఊహించలేదు. కొన్నిసార్లు అక్కడ వారానికి వంద గంటలు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతటి ద్రోహాన్ని అస్సలు ఊహించనే లేదు’ అని అంతర్జాతీయ మీడియా ఏఐ జజీరాకుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పీహెచ్ డీ పూర్తి కావడానికి సంబంధించిన తతంగాన్ని కొలంబియా యూనివర్శిటీ పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. యూఎస్ కు మళ్లీ వెళ్లే అవసరం లేదన్న రంజినీ శ్రీనివాసన్.. ఆ సంస్థ తనకు అర్హత ఇవ్వడం ఇప్పుడు ఒక లాంఛనప్రాయం మాత్రమే అని పేర్కొంది.నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు..‘నా పీహెచ్డీకి సంబంధించిన అన్ని అర్హతలు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్నవి, దాని కోసం నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పింది, దీన్ని కొలంబియా పూర్తి చేయాలని, ఈ విషయాన్ని సదరు యూనివర్శిటీకి చెప్పడానికి యత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.పాలస్తీనాకు మద్దతిచ్చారనే వీసా రద్దుకాగా, భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజినీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేశారు. అయితే, రంజినీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. -
భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!
-
అమెరికాలో రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు.. కారణం ఇదే..
వాషింగ్టన్: భారత్కు చెందిన రంజనీ శ్రీనివాసన్కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.NEW: Columbia rioter Ranjani Srinivasan self deported after her student visa was revoked pic.twitter.com/Fnneiko5qs— End Wokeness (@EndWokeness) March 14, 2025విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది. -
పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు
తోలుబొమ్మలాట కళాకారిణి మూళిక్కల్ పంకజాక్షికి గత ఏడాది పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎనభై నాలుగేళ్ల వయసులో ఈ పురస్కారం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘తోల్ పావకూథు, నూల్ పావకూథు’ శైలి తోలుబొమ్మలాటల ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. తోలుబొమ్మలాటలో అత్యంత క్లిష్టమైన నొక్కు విద్య పావకళి సాధన చేసే కళాకారులు తక్కువే, ప్రదర్శనలు కూడా అరుదు. కేరళలోని ఓ కుగ్రామం మునిపల్లెలోని పంకజాక్షి నొక్కు విద్య పావకళిని సాధన చేసింది. పన్నెండేళ్ల వయసు నుంచి తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. 2008లో పారిస్లో కూడా ప్రదర్శన ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇది అరుదైన కళ మాత్రమే కాదు, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నదనే అవగాహన కూడా వచ్చేసింది. విదేశీ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన సంతోషం కంటే తాను మరణించేలోపు ఈ కళను ఎవరికైనా నేర్పించి చనిపోవాలనే చిన్న ఆశ ఆమెలో కలిగింది. కళ్లు మసకబారడం మొదలైంది. ప్రదర్శనలో తొట్రుపాటు వస్తోంది. క్రమంగా తనది చిన్న ఆశ కాదు, చాలా పెద్ద ఆశ అని, బహుశా తీరని కోరికగా మిగిలిపోతుందేమోననే ఆవేదన కూడా మొదలైంది. ఒక్క మనుమరాలు ఇది పన్నెండేళ్ల కిందటి మాట. పారిస్ ప్రదర్శన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం. నొక్కు విద్య పావకళి అంతరించి పోకూడదనే కృతనిశ్చయంతో పంకజాక్షి తన ముగ్గురు మనవరాళ్లను కూర్చోబెట్టి నొక్కువిద్యకు అవసరమైన మహాభారత, రామాయణ కథలను చెప్పసాగింది. క్రమంగా వారిలో ఆసక్తి రేకెత్తించాలనేది ఆమె ప్రయత్నం. ఆ ముగ్గురిలో అమ్మమ్మ తాపత్రయాన్ని గమనించింది ఒక్క రంజని మాత్రమే. నొక్కు విద్య కథలను నోట్స్ రాసుకుంది. పంకజాక్షి భర్త బొమ్మల తయారీలో నిపుణుడు. తాత దగ్గర బొమ్మల డిస్క్రిప్షన్ కూడా సిద్ధం చేసుకుంది రంజని. ఆ తర్వాత బొమ్మలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కర్రను పై పెదవి మీద ఉంచి బాలెన్స్ చేస్తూ తాడుతో బొమ్మ వెనుక కట్టిన దారాలను కథనానికి అనుగుణం గా కదిలించాలి. ఇది మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. సంవత్సరాల సాధన తర్వాత రంజని నైపుణ్యం సాధించింది. ఇప్పుడు రంజనికి ఇరవై ఏళ్లు. కళను సాధన చేస్తూనే బీకామ్ డిగ్రీ చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనుంది. ‘‘తరతరాలుగా మా కుటుంబం ఈ కళతోనే గుర్తింపు పొందింది. కళను ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన కానుకలతోనే బతుకు సాగేది. క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గిపోవడం తో ప్రదర్శనలూ తగ్గిపోయాయి. మా తల్లిదండ్రుల తరంలో ఇతర వృత్తుల్లో ఉపాధిని వెతుక్కోవడం మొదలైంది. అమ్మమ్మ బాధ పడడం చూసినప్పటి నుంచి ఈ కళను బతికించాలనే కోరిక కలిగింది. అందుకే నేర్చుకున్నాను. ఆ తరంలో వాళ్లకు ప్రదర్శించడం తప్ప ప్రాచుర్యం కల్పించడం తెలియదు. నేను దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తాను’’ అంటోంది రంజని. -
గుడ్ న్యూస్
హీరో కార్తీ ఇంట్లో ఓ గుడ్ న్యూస్. కార్తీ కుటుంబం పెద్దది కాబోతోంది. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారు. 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. తాజాగా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ జంట. -
నాగ్ బ్యానర్లో మరో సినిమా
సీనియర్ హీరో నాగార్జున, దర్శకులను సాంకేతిక నిపుణులను మాత్రమే కాదు.. ఇటీవల తన బ్యానర్లో హీరోలను కూడా పరిచయం చేస్తున్నాడు. అలా నాగ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్. ఆ సినిమా సమయంలోనే అదే బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఇన్నాళ్లు సరైన కథ దొరక్క ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్, అన్నపూర్ణ స్టూడియోస్లో తన రెండో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న లాంచనంగా ప్రారంభించనున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న రాజుగాడు సినిమా రిలీజ్కు రెడీ అవ్వగా, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. -
రాగరంజని
ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ రంజనీ శివకుమార్ గళవిన్యాసానికి బంజారాహిల్స్ రోడ్నంబర్ 8లోని సప్తపర్ణి వేదిక కానుంది. రంజని కర్ణాటక గాత్ర కచేరి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. ఫోన్: 040- 23705440 -
రాగాల పల్లకిలో కోకిలమ్మలు..
రాగాల పల్లకిలో కోకిలమ్మలు.. సంగీత సామ్రాజ్యంలో విరిసిన జంటస్వరాలు.. ఈ అక్కాచెల్లెళ్లు. తమిళనాట విరిసిన ఈ కర్ణాటక సంగీత ఝరి.. అటుపై ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. చిన్ననాటి నుంచి ఒకే మాట.. ఒకే పాటగా సాగిన వీరి యుగళార్చన.. సరాగాలతో పల్లవించింది. వయోలినిస్ట్లుగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు సోదరీమణులూ.. మధుర గాత్రంతో గంధర్వ గీతికలను వినిపిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన రంజనీ, గాయత్రి సిస్టర్స్ను ‘సిటీప్లస్’ పలకరించింది. తొమ్మిదో ఏట నుంచే ఇద్దరం సంగీతం నేర్చుకోవడం ఆరంభించాం. మా అమ్మ మీనాక్షి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమె సంప్రదాయ సంగీతంలో ప్రసిద్ధులైన పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది. అందుకే చిన్ననాటి నుంచే సంగీతంపై అభిరుచి ఏర్పడింది. చదువుతో పాటు సంగీత సాధన చేశాం. ఆ రోజు పడిన కష్టానికి ఫలితం ఇదిగో ఈ రోజు సంగీత పథంలో మాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదట్లో వయోలినిస్ట్లుగా ఉన్న మేము క్రమంగా గాత్ర కచేరీల్లో స్థిరపడ్డాం.అలా నేర్చుకున్నాం 1997లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చాం. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ పీఎస్ నారాయణస్వామిదగ్గర సంగీతం నేర్చుకున్నాం. ఆయన శిష్యరికంతో మాకు కచేరీలలో ఏ ఆటంకాలు ఎదురుకాలేదు. ప్రముఖ విద్వాంసురాలు డీకే పట్టమ్మాళ్తో కలసి కచేరీలు చేయగలిగాం. ఈ అవకాశాన్ని మా అదృష్టంగా భావిస్తాం. తర్వాతి కాలంలో సీతానారాయణ్ దగ్గర భజనలు, విశ్వాస్ జోషి దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాం. ప్రపంచ ఖ్యాతి పొందిన కొల్హాపూర్కు చెందిన మానిక్ ఖైద్- అప్పాసాహెబ్ దగ్గర కూడా నేర్చుకున్నాం. తిరుమలేశుని కృప మా మొట్టమొదటి కచేరి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాల్లో భాగంగా జరిగింది. వేలాది మంది జనం మధ్య సాగిన ఆ కచేరీని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాం.వేంకటేశుడి కృపతో ఆనాటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ స్వామే మమ్మల్ని నడిపిస్తున్నాడని అనిపిస్తుంటుంది. అలా మొదలైన మా గాత్ర ప్రయాణం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిధ్వనించింది. అమెరికా, యూకే, కెనెడా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం. అభిమానమే అవార్డులు అవార్డులు, బిరుదుల కన్నా.. ప్రేక్షకుల అభిమానమే మాకు ఎక్కువ ఆనందాన్ని పంచుతుంది. ఢిల్లీలోని సంస్కృతి ఫౌండేషన్ ఇచ్చిన అవార్డులతో మొదలు.. కల్కి కృష్ణమూర్తి మెమోరియల్ అవార్డు, యోగం నారాయణ స్వామి అవార్డు ఇలా ఎన్నో వచ్చాయి. ప్రముఖ సితార్ విద్వాంసుడు, భారతరత్న పురస్కార గ్రహీత పండిత్ రవిశంకర్ ఢిల్లీలో మా గాత్ర కచేరీకి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆ ఆనందం వెల కట్టలేనిది. ఇది సరిగమనం హైదరాబాద్తో మా అనుబంధం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఇక్కడ చాలా క చేరీలు నిర్వహించాం. ఇక్కడి వారికి సంగీతంపై మక్కువే కాదు పరిజ్ఞానం కూడా ఉంది. ఎంతో శ్రద్ధగా వింటారు. చక్కగా ఆనందిస్తారు. ఈ తరం పిల్లలు సంగీతం వైపు నడుస్తున్నారు. కార్పొరేట్ కల్చర్లో జీవిస్తున్నా.. శాస్త్రీయ సంగీతంపై మక్కువతో ఈ రంగం వైపు వస్తున్నారు. చదువుతో పాటు సంగీత సాధనలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరిగమల సావాసంతో మనోబలం కలుగుతుంది. ఈ మార్గం వైపు మరింత మంది రావాలి. ..:: కోన సుధాకర్రెడ్డి