Ranji Trophy semifinals
-
Ranji Semis-2: ముంబై ఎదురీత.. రెండో రోజూ విదర్భదే ఆధిపత్యం
నాగ్పూర్: రంజీ ట్రోఫీలో ముంబై మేటి చాంపియన్ జట్టు. దేశవాళీ టోర్నీలో ఏకంగా 48 సార్లు ఫైనల్ చేరి 42 సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు ఈసారి సెమీఫైనల్లో విదర్భ నుంచి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. తొలి రోజు బ్యాటింగ్లో సత్తా చాటుకున్న విదర్భ... రెండో రోజు బౌలింగ్తో ముంబైని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ఎదురీదుతోంది. ముందుగా ఓవర్నైట్ స్కోరు 308/5తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన విదర్భ 107.5 ఓవర్లలో 383 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లలో యశ్ రాథోడ్ (54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని వెనుదిరిగాడు. కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (34; 4 ఫోర్లు) కాసేపు కుదురుగా ఆడాడు. హర్ష్ దూబే (18; 3 ఫోర్లు), నచికేత్ (11; 2 ఫోర్లు), దర్శన్ నల్కండే (12; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. రెండో రోజు 3 వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు మొత్తం 5 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (171 బంతుల్లో 67 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. శార్దుల్ ఠాకూర్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్), సిద్దేశ్ లాడ్ (35; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఫాలోఆన్ గండాన్ని తప్పించుకున్న ముంబై జట్టు విదర్భ స్కోరుకు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది. ముంబై ఒక దశలో 113/2 స్కోరు వద్ద పటిష్టంగా ఉంది. కేవలం రెండో ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడుతున్న పార్థ్ రెఖాడే తన స్పిన్ మాయాజాలంతో ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. అనుభవజ్ఞుడైన భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై సారథి అజింక్య రహానే (18; 4 ఫోర్లు) సహా టీమిండియా హార్డ్హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0)లను అసలు ఖాతానే తెరువనీయలేదు. ఒకే ఒక్క ఓవర్లో ఈ ముగ్గురినీ పార్థ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన పార్థ్ తొలి బంతికి రహానేను, మూడు, ఐదో బంతులకు సూర్య, దూబేలను బోల్తా కొట్టించాడు. ఇది చాలదన్నట్లు మరుసటి ఓవర్లోనే (42వ) హర్ష్ దూబే... షమ్స్ ములానీ (4) అవుట్ కావడంతో ముంబై 113/2 నుంచి 10 బంతుల వ్యవధిలోనే 118/6 స్కోరుతో కుదేలైంది. ఆనంద్, శార్దుల్ మెరుగ్గా ఆడటంతో ముంబై కోలుకుంది. ప్రస్తుతం ఆనంద్తో పాటు తనుశ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రెఖాడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (సి అండ్ బి) శార్దుల్ 54; అక్షయ్ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ 34; హర్‡్ష దూబే (సి) ఆనంద్ (బి) శివమ్ దూబే 18; నచికేత్ (సి) ములానీ (బి) శివమ్ దూబే 11; దర్శన్ (నాటౌట్) 12; యశ్ ఠాకూర్ (సి)అవస్థి (బి) శివమ్ దూబే 3; ఎక్స్ట్రాలు 26; మొత్తం (107.5 ఓవర్లలో ఆలౌట్) 383. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261, 6–324, 7–346, 8–364, 9–369, 10–383. బౌలింగ్: శార్దుల్ 19–0–78–1, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 18–5–48–2, తనుశ్ 22–0–78–0, శివమ్ దూబే 11.5–1–49–5, షమ్స్ ములానీ 23–4–62–2. ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (బ్యాటింగ్) 67; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ష్ దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బ్యాటింగ్) 5; ఎక్స్ట్రాలు 13; మొత్తం (59 బంతుల్లో 7 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178. బౌలింగ్: దర్శన్ నల్కండే 10–1–40–1, యశ్ ఠాకూర్ 11–0–56–2, హర్‡్ష దూబే 15–1–51–1, నచికేత్ 7–1–22–0, పార్థ్ రెఖాడే 16–6–16–3. -
చరిత్ర సృష్టించిన కేరళ క్రికెటర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కేరళ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ అజహారుద్దీన్ (105 నాటౌట్), సల్మాన్ నిజర్ (40 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ అజహారుద్దీన్ఈ మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. రంజీ సెమీఫైనల్లో సెంచరీ చేసిన తొలి కేరళ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రంజీల్లో కేరళ గతంలో ఒకే ఒక సారి సెమీస్కు చేరుకుంది. 2018-19 సీజన్లో కేరళ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ సెమీస్లో ఏ కేరళ ఆటగాడు సెంచరీ చేయలేదు. అజహారుద్దీనే రంజీల్లో కేరళ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ప్రస్తుత రంజీ సీజన్లో కేరళ అద్భుతమైన ప్రదర్శనలతో క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఎలైట్ గ్రూప్-సిలో కేరళ 7 మ్యాచ్ల్లో 3 విజయాలు, 4 డ్రాలతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్పై ఒక్క పరుగు ఆధిక్యం (తొలి ఇన్నింగ్స్లో) సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.మరో సెమీఫైనల్ మ్యాచ్లో విదర్భ, ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్ శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించాడు. షమ్స్ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్లో దనిశ్ మలేవార్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (29), సిద్దేశ్ లాడ్ (19) క్రీజ్లో ఉన్నారు. 23 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 62/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 321 పరుగులు వెనుకపడి ఉంది. -
శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్లో ఐదు వికెట్లు
భారత స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో (Ranji Semi Finals) చెలరేగిపోయాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో దూబే (ముంబై) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తరుచూ బ్యాట్తో సత్తా చాటే దూబే ఈ మ్యాచ్లో బంతితో చెలరేగాడు. దూబే ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది.ఓవర్నైట్ స్కోర్ 308/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన దూబే.. రెండో రోజు చెలరేగిపోయి మరో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో దూబే.. పార్థ్ రేఖడే, కీలకమైన కరుణ్ నాయర్, హర్ష్ దూబే, భూటే, యశ్ ఠాకూర్ వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లలో షమ్స్ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్లో దనిశ్ మలేవార్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (7), సిద్దేశ్ లాడ్ (0) క్రీజ్లో ఉన్నారు. 4.4 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 18/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 365 పరుగులు వెనుకపడి ఉంది.మరో సెమీఫైనల్లో గుజరాత్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేరళ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.మొహమ్మద్ అజహారుద్దీన్ (85), సల్మాన్ నిజర్ (28) క్రీజ్లో ఉన్నారు. కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
సెమీఫైనల్ మ్యాచ్.. లంచ్కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్లో కేవలం ఐదుగురే మ్యాచ్ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన కేరళ, ఇన్నింగ్స్ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
రసవత్తరంగా సాగుతున్న రంజీ సెమీఫైనల్
మధ్యప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్-1 రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి లక్ష్యానికి 93 పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్లో విదర్భ గెలవాలంటే మరో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాల్సి ఉంది. సరాన్ష్ జైన్ (16), కుమార్ కార్తికేయ (0) క్రీజ్లో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం గ్యారెంటీ. మరి మధ్యప్రదేశ్ 93 పరుగులు సాధించి విజయం సాధిస్తుందో లేక విదర్భ 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ ఊహించని అద్భుతం ఏదైనా జరిగి మ్యాచ్ డ్రా అయితే మాత్రం తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా మధ్యప్రదేశ్ పైనల్కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్లో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకున్న విదర్భ 402 పరుగులు చేసి మధ్యప్రదేశ్ ముందు ఛాలెంజింగ్ లక్ష్యాన్ని ఉంచింది. సెమీఫైనల్-2లో తమిళనాడుపై విజయం సాధించి ముంబై జట్టు ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. రాణించిన దూబే, హర్ష్.. యశ్ దూబే (94), హర్ష్ గావ్లి (67) అర్దసెంచరీలతో రాణించడంతో మధ్యప్రదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి గెలుపు కోసం పోరాడుతుంది. విదర్భ బౌలర్లలో అక్షయ్ 3, ఆదిత్య సర్వటే 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన యశ్ రాథోడ్.. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే పరిమితమైన విదర్భ.. సెకెండ్ ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకుని 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (141) అద్భుత శతకం సాధించి, విదర్భను తిరిగి మ్యాచ్లోకి తెచ్చాడు. యశ్తో పాటు కెప్టెన్ అక్షయ్ (77), అమన్ (59) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 252 (హిమాన్షు మంత్రి 126, ఉమేశ్ యాదవ్ 3/40) విదర్భ తొలి ఇన్నింగ్స్ 170 (కరుణ్ నాయర్ 63, ఆవేశ్ ఖాన్ 4/49) -
Ranji Trophy: సౌరాష్ట్ర దీటైన జవాబు
బెంగళూరు: కెప్టెన్ అర్పిత్ వాసవద (219 బంతుల్లో 112 బ్యాటింగ్; 15 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (245 బంతుల్లో 160; 23 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించడంతో... కర్ణాటక జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు మరో 44 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 76/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. షెల్డన్ జాక్సన్, అర్పిత్ నాలుగో వికెట్కు 232 పరుగులు జోడించి సౌరాష్ట్ర జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం అర్పిత్, చిరాగ్ జానీ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీయగా, వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్లకు ఒక్కో వికెట్ దక్కింది. బెంగాల్కు భారీ ఆధిక్యం ఇండోర్లో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో బెంగాల్కు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 56/2తో మూడో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ బౌలర్ ఆకాశ్దీప్ (5/42) మధ్యప్రదేశ్ను దెబ్బ కొట్టాడు. బెంగాల్కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ మనోజ్ తివారి మధ్యప్రదేశ్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెంగాల్ ఓవరాల్ ఆధిక్యం 327 పరుగులకు చేరుకుంది. -
మధ్యప్రదేశ్ లక్ష్యం 571
ప్రస్తుతం 99/2 ముంబైతో రంజీ సెమీస్ కటక్: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో ముంబై 571 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆదిత్య శ్రీవాస్తవ (53 బ్యాటింగ్), నమన్ ఓజా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జలజ్ సక్సేనా (25), రజత్ పటిదార్ (4) విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ గెలవాలంటే ఇంకా 472 పరుగులు చేయాలి. బుధవారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 285/3 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్లో 125.1 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (115), ఆదిత్య తారే (109) సెంచరీలు సాధించారు. అభిషేక్ నాయర్ (73 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈశ్వర్ పాండే, హర్ప్రీత్ సింగ్ చెరో 3, పునీత్ 2 వికెట్లు తీశారు.