resource
-
అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి
న్యూఢిల్లీ: భారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు. ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ వచ్చే బడ్జెట్లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్కు మంత్రి బడ్జెట్ను సమర్పించనున్నారు. 2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష
-
మెప్మా..ఇదేంటి చెప్మా?
బినామీ గ్రూపులతో రూ.కోట్లు స్వాహా క్షేత్ర స్థాయిలో కనిపించని గ్రూపులు మెప్మా, బ్యాంకు సిబ్బంది నిర్వాకం రహస్యంగా విచారణ చేయిస్తున్న అధికారులు సాక్షి, ఖమ్మం: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో రూ.కోట్లలో గోల్మాల్ జరిగింది. బినామీ గ్రూపుల పేరుతో బ్యాంకు లింకేజి తీసుకొని అందినకాడికి స్వాహా చేశారు. లింకేజి తీసుకున్న గ్రూపులు ఎంతకూ చెల్లించకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఓ పది గ్రూపుల లింకేజీపై విచారణ చేయగా.. తీగ లాగితే డొంక కదిలినట్లు అవినీతి బండారం బయటపడింది. ఇందులో ప్రధానంగా మెప్మా అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు బ్యాంకు సిబ్బంది కూడా తోడు కావడం స్వాహా పర్వం కొనసాగింది. మెప్మా పరిధిలో ఖమ్మం నగరంలో మొత్తం 5,007 గ్రూపులున్నాయి. ఇందులో 39,043 మంది సభ్యులుగా ఉన్నారు. గతంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2,266 గ్రూపులకు రూ.45.32 కోట్లు ఇప్పటి వరకు బ్యాంకు లింకేజి మంజూరైంది. తీసుకున్న లింకేజిని సభ్యులు నెలనెలా తమ వాటాగా బ్యాంకులో జమ చేయాలి. అయితే తొలి నాలుగు నెలలు ఎలాంటి అనుమానం రాకుండా చెల్లించారు. ఇందులో కీలకంగా ఉన్న మెప్మా రీసోర్స్ పర్సన్లే ఈ వాటాను చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా మెప్మా సిబ్బంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై సుమారు 30కి పైగా బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి కోట్లలోనే స్వాహా చేసినట్లు తెలిసింది. డొంక కదిలిందిలా.. బ్యాంకుల్లో ఎంతకూ సొమ్ము జమ కాకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. రుణం తీసుకున్న గ్రూపులు గత కొన్నేళ్లుగా సొమ్మును ఎందుకు జమచేయడం లేదనే దానిపై విచారణ చేపట్టారు. నగరంలో సుమారు 30 గ్రూపులకు సంబంధించి కోట్లలో బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీనిపై బ్యాంకు అధికారులతోపాటు మెప్మా సిబ్బంది సైతం గత మూడు రోజులుగా నగరంలోని రమణగుట్ట, గాంధీనగర్, రామన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి నగదు చెల్లించాల్సిన గ్రూపుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు చెల్లించని గ్రూపుల వివరాలను ఆయా బ్యాంకుల మేనేజర్లు మెప్మా కార్యాలయంలో అందజేశారు. దీనిపై విచారణ చేసి గ్రూపు సభ్యుల వివరాలతోపాటు ఆయా వ్యక్తుల ఆర్థిక స్థోమత, అసలు వారు ఉన్నారా..? రుణం తీసుకున్నారా..? లేక బినామీలా..? అనే వివరాలను సేకరిస్తున్నారు. రిసోర్సు పర్సన్లే కీలక పాత్ర.. మెప్మాలో గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలంటే రీసోర్స్ పర్సన్లదే కీలక పాత్ర. వారు సంతకం చేసిన తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆ తర్వాత జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి సంతకం చేయాలి. దీనిని అవకాశంగా తీసుకున్న రీసోర్స్ పర్సన్లు బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై బినామీ పేర్లతో గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందారు. రుణం మంజూరు సమయంలో మెప్మాలో రీసోర్స్ పర్సన్ల నుంచి జూనియర్ మైక్రో ఫైనాన్స్ అధికారి వరకు మామూళ్లు అందుతాయి. ఏదైనా కొత్త గ్రూపు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అందులో 10 మందిని సభ్యులుగా చేర్చాలి. వారు ఆరునెలలు పొదుపు చేసిన తర్వాత మొదటి బ్యాంకు లింకేజీగా రూ.75 వేలు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. మెప్మాలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది బ్యాంకులోని క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై సంఘంలో ఉన్న సభ్యులతోనే మళ్లీ బినామీ పేర్లతో మరో బ్యాంకులో రుణాలు పొందుతున్నారు. నిబంధనలు బేఖాతరు.. లింకేజి కింద రుణం ఇవ్వాలంటే బ్యాంకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో గ్రూపు సభ్యులను, వారి వివరాలను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉంటేనే రుణం మంజూరు చేయాలి. అయితే ఇక్కడ అవేమీ పాటించకుండానే కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూపులకు రూ.లక్షల్లో రుణాలు ఇచ్చారు. ఏళ్లు గడవడంతో బ్యాంకు అధికారులు సైతం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. రుణాలు మంజూరు చేసి ఇంతకాలం అయినా తిరిగి చెల్లించకపోవడంతో కొత్తగా వచ్చిన బ్యాంకు అధికారులు రికవరీపై ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అసలు ఏం జరిగిందనే దానిపై వారు దృష్టి సారించారు. రుణాలు మంజూరు చేసినప్పుడు ఉన్న రీసోర్స్ పర్సన్ల ద్వారా ఈ వివరాలను సేకరించి ఆయా గ్రూపులకు సంబంధించిన సభ్యులను చూపించాలని అడిగారు. వారు గ్రూపుకు ఒకరిద్దరు సభ్యులను మాత్రమే చూపి.. మిగితా వారు లేరని, ఇతర ప్రాంతాలకు వెళ్లారని సమాధానం చెప్పడంతో బ్యాంకు అధికారులకు అనుమానం కలిగింది. నగరంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇలాంటి గ్రూపులు పది ఉన్నట్లు గుర్తించి వాటిపై విచారణ నిర్వహించాలని మెప్మా అధికారులకు ఆ గ్రూపుల లిస్టును అందించారు. దీంతో మూడురోజులుగా నగరంలో విచారణ చేస్తున్న మెప్మా సిబ్బందికి ఆయా గ్రూపుల వ్యక్తులు అసలు లేరనే విషయం తెలిసింది. దీంతో నగరంలో మరిన్ని బినామీ గ్రూపులు ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నోటీసులు జారీ చేసిన బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చెల్లింపులు చేయని గ్రూపుల సభ్యులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక గ్రూపులో సభ్యులుగా ఉన్న వారు రుణం పొందిన మేరకు నెలవారీగా చెల్లిస్తున్నారు. అయితే వారిపేరుతోనే మరో లోను ఉందని, దానిని చెల్లించాలనే నోటీసు రావడంతో ఈ బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చింది. నోటీసులు అందుకున్న సభ్యులు బ్యాంకుల వద్దకు వచ్చి తాము తీసుకున్న రుణాన్ని చెల్లిస్తున్నామని, మళ్లీ బకాయిలు ఉండటమేంటని లబోదిబోమంటున్నారు. విచారణ చేయిస్తున్నాం.. వేణుమనోహర్, పీడీ, మెప్మా నగరంలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందిన విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాం. వివరాలు వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
యాంకర్ ఆఫ్ ది డే.
-
రేపటి భారతం-మెరిసే ఇంద్ర ధనస్సులు
-
రేపటి భారతం-కదిలే కాంతులు