Sadavarti
-
బ్రేవ్ గర్ల్.. ఇంకో అవార్డు ఇవ్వాల్సిందే
ఈ ఏడాది జనవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ‘నేషనల్ బ్రేవరీ అవార్డ్’ అందుకుంది జెన్ సదావర్తి. 2018 ఆగస్టులో ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ముందే హెచ్చరించడం ద్వారా పదిమంది ప్రాణాలను కాపాడగలిగింది సదావర్తి. అందుకు వచ్చిన అవార్డే అది. పన్నెండేళ్ల ఈ చిన్నారి ముంబైలోని ఒక స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. షేక్స్పియర్ పుస్తకాల సెట్ మొత్తాన్ని ఇప్పటికే చదివేసింది! ఈ చదవడం తనకు సంబంధించినది. సమాజం కోసం కూడా చాలా చేస్తోంది. ఈమధ్యే.. నిరసన ప్రదర్శనల్లోకి పిల్లల్ని వెంటపెట్టుకుని వెళ్లకూడదనే ఆదేశాలను జారీ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్కూళ్లలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరింది. పెద్దయ్యాక లాయర్ అవ్వాలని లక్ష్యం. ఇంగ్లిష్, హిందీ చక్కగా మాట్లాడుతుంది. ఈ రెండు భాషలు చాలు.. సమాజం కోసం ఫైట్ చెయ్యడానికి. అయితే అవి అసలు భాషలే కాదని శివసేన కార్యకర్తలు ఆ అమ్మాయిని మహిళా దినోత్సవ ప్రసంగం నుంచి పక్కకు నెట్టేశారు. ‘‘హిందీలో, ఇంగ్లిష్లో కాదు.. అచ్చమైన మరాఠీలో మాట్లాడు’’ అన్నారు. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నువ్వీ రాష్ట్రంలో ఉండాలంటే మరాఠీ నేర్చుకోవలసిందే’’ అని బెదిరించారు. బ్రేవరీ అవార్డు తీసుకున్న అమ్మాయి ఆ బెదిరింపులకు భయపడుతుందా! ప్రసంగాన్ని పూర్తి చేసి గానీ వేదిక దిగలేదు. -
‘సదావర్తి’లో మళ్లీ హైడ్రామా!
-
‘సదావర్తి’లో మళ్లీ హైడ్రామా!
భూములు దక్కించుకున్న టీడీపీ నేత గడువులోగా డబ్బులు చెల్లించని వైనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83.11 ఎకరాల అత్యంత విలువైన భూములను కారు చౌకగా కొట్టేయడానికి సర్కారు పెద్దలు సాగిస్తున్న యత్నంలో మళ్లీ హైడ్రామా చోటుచేసుకుంది. రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్గా నిలిచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించక పోవడం చర్చనీయాంశమైంది. సుమారు రూ.వెయ్యి కోట్ల విలువ చేసే ఈ భూములను మళ్లీ టీడీపీ నేతలే తక్కువ ధరకు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది సోమవారం చెన్నైలో రెండోసారి నిర్వహించిన వేలంలో టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి అత్యధికంగా రూ.60.30 కోట్లకు పాడారు. బహిరంగ వేలం ముగిసిన 48 గంటల్లోగా వేలం పాడిన మొత్తం ధరలో 50 శాతం మేర అంటే రూ.30.15 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించాలనేది నిబంధన. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటతో ఆ గడువు ముగిసినా డబ్బులు చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో బహిరంగ వేలంలో రెండో అత్యధిక ధరకు పాడిన హైదరాబాద్కు చెందిన చదలవాడ లక్ష్మణ్కు అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈయన రూ.60.25 కోట్లకు పాడారు. ఇతను కూడా భూముల కొనుగోలుకు ముందుకొచ్చినందున అతను పాడిన మొత్తంలో సగం డబ్బు చెల్లించాలని లేఖ రాసే విషయమై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ భూములు తనకే దక్కాలన్న ఆత్రంతో వేలంలో పాల్గొన్న శ్రీనివాసులురెడ్డి డబ్బు చెల్లించడానికి ముందుకు రాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఒక రకంగా, ఆ శాఖ అధికారులు మరో రకంగా మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం వేలం ముగిశాక ‘ఈ భూములు మంచి విలువైనవి. సర్వే కూడా చేశాం. అన్ని విషయాలు తెలుసుకునే వేలం పాడాం’ అని మీడియా ఎదుట చెప్పిన శ్రీనివాసులురెడ్డి.. ఇపుడు ముఖం చాటేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వేలంలో తొలి బిడ్డర్గా నిలిచిన వ్యక్తి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకుండా వైదొలిగారని, అతని చేతనే డబ్బులు కట్టించాలని కోర్టును కోరతామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు వేలం ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి డబ్బులు కట్టకపోతే రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వలేమన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఏమి చేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు. -
ఆ అమ్మకాలను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను, మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రూ.22.44 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేసిన మందల సంజీవరెడ్డి, సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, సూర్యకిరణ్ మౌళి, డి.పవన్కుమార్, ఆర్.శివరామకృష్ణారెడ్డిలపై ఆదాయపు పన్ను శాఖ విచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక సీజే విచారించనున్నారు.