Sakharov Prize
-
జైలులో ఉండగానే అత్యున్నత అవార్డు
ప్యారిస్: జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ సౌదీ అరేబియాకు చెందిన బ్లాగర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అతడిని ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ హక్కుల అవార్డు సఖరోవ్ ప్రైజ్ వరించింది. భావప్రకటన స్వేచ్ఛా హక్కును అతడు కాపాడినందుకు గుర్తుగా ఈ అవార్డును ప్రకటించారు. సాధారణంగా మానవ హక్కులను రక్షించడంలో కృషి చేసిన వారికి ఆండ్రే సఖరోవ్ పేరు మీద ఈ అవార్డు ప్రతి సంవత్సరం అందిస్తారు. దీనిని 1988లో ప్రారంభించారు. రైఫ్ బదావీ అనే ఓ సౌదీ పౌరుడిని ముస్లిం మత పెద్దలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలతో జైలులో వేశారు. అతడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి సౌదీ రియాలను జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు. రైఫ్కు ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు మార్టిన్ షుంజ్ మాట్లాడుతూ 'నేను సౌదీ రాజుకు విన్నవిస్తున్నాను. రైఫ్ను వెంటనే విడిచిపెట్టాలని. అతడికి స్వేచ్ఛను ఇవ్వాలని. అలా చేయడం ద్వారా తాము ఇచ్చే గౌరవ బహుమతిని స్వీకరిస్తాడు' అని అన్నారు. -
మలాలా 'మనసులో మాట'
-
మలాలా 'మనసులో మాట'
పాకిస్థాన్లో బాలికల విద్య కోసం తాలిబాన్ల తుపాకీ గుళ్లకు సైతం ఎదురు నిలిచిన ప్రపంచ వ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ గురువారం తన మనసులోని మాటను బయట పెట్టారు. తనకు పాకిస్థాన్ ప్రధాని పీఠం అధిష్టించాలని ఉందని తెలిపారు. గురువారం న్యూయార్క్లో ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...పాక్ ప్రధాని అయితే దేశాన్ని రక్షించ వచ్చన్నారు. అలాగే విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించ వచ్చని తెలిపారు. దానితోపాటు విదేశీ వ్యవహారాలపై కేంద్రీకరించ వచ్చని చెప్పారు. గతంలో పాకిస్థాన్లోని స్వాత్ ప్రాంతంలో మింగొర్కు చెందిన మలాలాతోపాటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల బస్సుపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మలాలా తలకు తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను ప్రత్యేక వైద్య చికిత్స కోసం బ్రిటన్ తరలించారు. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలా బ్రిటన్లో ఉంటూ పాకిస్థాన్లో తాలిబన్ల అనుసరిస్తున్న వైఖరితోపాటు బాలికల విద్యపై వారి అవలంభిస్తున్న చర్యలను ప్రచారం ద్వారా ఎండగడుతోంది. మనవ హక్కుల కోసం పోరాడే వారికి ఐరోపా యూనియన్ పార్లమెంట్ అందించే షకరోవా ప్రతిష్టాత్మక పురస్కారానికి మలాలా గురువారం ఎంపికైన విషయం తెలిసిందే.