salaries pending
-
పైసలు లేక పస్తులు
సాక్షి, నెక్కొండ(వరంగల్) : వారంతా ప్రతి దినం విధులకు హాజరుకావాల్సిందే. చేసేది చిన్న ఉద్యోగం.. కాని ఒకటి కాదు నాలుగునెలలైనా జీతం అందలేదు. ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలా.. నాలుగునెలలైనా వేతనం అందక దిగులుపడాలా తెలియని పరిస్థితిలో కొత్త పంచాయతీ కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. విధుల్లో చేరి దాదాపు నాలుగు మాసాలు గడుస్తున్నా ఇంతవరకూ మొదటి వేతనం ఎట్లుంటదో చూద్దమన్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఇక కొందరికైతే సొంత ఊళ్లు కాకుండా వేరే చోట డ్యూటీ కేటాయించడంతో రోజువారిగా రాకపోకల ఖర్చులతో పాటు కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జిల్లాలోని కొత్తగా విధుల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వ్యథ వర్ణనాతీతం. 276 మంది .. పంచాయతీల్లో కీలక పాత్ర పోషించే కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పంచాయతీ పాలన గాడితప్పింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయితే గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అక్టోబర్లో రాత పరీక్ష నిర్వహించింది. డిసెంబర్ 19న ఫలితాలు ప్రకటించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా ఫలితాలపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 12న జిల్లాలో మొత్తం 276 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు కార్యదర్శులు విధుల్లో చేరలేదని సమాచారం. మొత్తం 270 మంది జూనియర్ కార్యదర్శులు అప్పటినుంచి విధుల్లో చేరి పని చేస్తుండగా ఇప్పటివరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. కార్యదర్శులకు మూలవేతనం రూ.15 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్గా పరిగణించిన అనంతరం పని తీరు ఆధారంగా శాశ్వత కార్యదర్శులుగా గుర్తించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో.. నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో పలువురు కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు కార్యదర్శులకు సొంత మండలాల పరిధిలో కాకుండా ఇతర మండలాల్లోని పంచాయతీల్లో కార్యదర్శులుగా నియమించారు. సొంత నివాసం నుంచి విధులు నిర్వహించాల్సిన గ్రామానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ప్రధానంగా మహిళ కార్యదర్శులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు ఎంప్లాయ్ ఐడీ కార్డులు జారీ చేయలేదు. జీతాలు చెల్లించేందుకు ఉద్యోగుల ఐడీకార్డు అవసరముంటుంది. ఉద్యోగి వివరాలు డీపీఓ కార్యాలయం, ట్రెజరీకి పంపినట్లయితే జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో విధులకు.. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో విధులకు హాజరవుతున్నాం. మొదటి జీతమైనా తీసుకోకపోవడం దురదృష్టకరం. రోజువారీ ఖర్చులకే పడరాని పాట్లు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం మా ఇబ్బందుల్ని గుర్తించాలె. నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. – ఆనంద్, నెక్కొండ, తండా జీపీ జూనియర్ కార్యదర్శి జీతాలిచ్చి ఆదుకోవాలే... జీతాలు లేక నాలుగు నెలలయితానయ్. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం స్వాగతిస్తున్నాం. మా గురించి ప్రభుత్వం ఆలో చించి ఆదుకోవాలి. కనీసం ఇంటి అవసరాలు సైతం తీర్చలేక పోతున్నామన్న బాధే వేధిస్తోంది. అప్పుల పాలవుతున్నాం. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి. – సురేష్, పిట్టకాలుబోడు తండా జీపీ కార్యదర్శి -
నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె
ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. ‘మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ)లోని మొత్తం 1,100 పైలట్లు సోమవారం ఉదయం 10.గంటల నుంచి విమానాలు నడపబోరు‘ అని ఎన్ఏజీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే నిలిపివేయాలని ముందుగా భావించినప్పటికీ .. కొత్త యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏప్రిల్ 15 దాకా వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ బాధ్యతలను ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ విమానాల రద్దు...: ఆగ్నేయాసియా ప్రాంతాలు, సార్క్ దేశాలకు నడిపే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అటు టొరంటో, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, లండన్ హీత్రో వంటి ఇతర విదేశీ రూట్లలో సర్వీసుల నిలిపివేతను ఏప్రిల్ 16 దాకా (మంగళవారం) పొడిగించినట్లు జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. -
‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’
ముంబై : మేం కూడా సాధరణ మనుషులమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. కానీ ఒక్కసారి కాక్పిట్లో ప్రవేశించామంటే.. అన్ని సమస్యలను పక్కన పెట్టేస్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన వారిగా మిగిలిపోవాల్సి వస్తుందంటున్నారు జెట్ ఎయిర్వేస్ సీనియర్ కమాండర్ ఒకరు. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఈ విషయం గురించి గత 20 ఏళ్లుగా జెట్ ఎయిర్వేస్ సంస్థలో బోయింగ్ 7777 కమాండర్గా పనిచేస్తున్న కరణ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేం కూడా అందరి లాంటి వాళ్లమే. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడం కోసం మా అమ్మ నగలను కుదవపెట్టాను. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒత్తిడిని మేం కాక్పిట్ బయటే వదిలేసి వెళ్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన వారిగా మిగులుతాం’ అని తెలిపారు. అంతేకాక మిగితా ఉద్యోగాలతో పోలిస్తే.. దీనికి చాలా ఏకాగ్రత, ప్రశాంతమైన మనసు అవసరం అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1 లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోయినా.. జీతాలు ఇవ్వకపోయిన నిరవధిక సమ్మెకు దిగుతాం అని తెలిపారు. మరో సీనియర్ కమాండర్ మాట్లాడుతూ.. ‘ఒక వేళ జెట్ ఎయిర్వేస్ ఈ సంక్షభం నుంచి బయటపడకపోతే.. దాదాపు 1500 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్లో ఇన్ని ఖాళీలు కూడా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతూ వస్తోంది. చాలా వరకు విమానాలను నడపకుండా నిలిపివేసింది. వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్వేస్ కూడా జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పుకోవాలని చూస్తోంది. -
ఇది దుర్మార్గ పాలన: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం : మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణాలకు టీఆర్ఎస్ సర్కార్ పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పథకాలేవీ నడవనీయకుండా చేసి కృత్రిమంగా నీటి ఎద్దడి పరిస్థితులను సృష్టిస్తున్నాయని భట్టి నిప్పులు చెరిగారు. సీపీడబ్ల్యూడీ పథకాలను నిర్వీర్యం చేసి మిషన్ భగీరథ లేకపోతే.. రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేదనే పరిస్థితులను తయారు చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా.. ఈ సీపీడబ్ల్యూడీ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపేసిందని భట్టి తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టి.. ఎవరినీ పనిచేయనీకుండా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేస్తూ.. వీటికి మాత్రం రూపాయి విడుదల చేయడం లేదని భట్టి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలొనే ఇటువంటి పథకాల్లో 340 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 9 నెలలుగా జీతాలు లేవని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకుని.. దానిమీద 56 వేల కోట్ల రూపాయల్లో, కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని భట్టి తెలిపారు. నేను అసెంబ్లీకే పోటీ చేస్తా..! లోక్ సభకు పోటీచేస్తారని వస్తున్న వార్తలపై భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని ప్రకటించారు. తన కుటుంబం నుంచి మరెవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరని తెలిపారు. -
‘ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోండి’
-
‘ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోండి’
విజయవాడ: కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కార్మికశాఖ కమిషనర్ను కలిశారు. జీతాలు చెల్లించమని అడిగితే తమపై దాడి చేశారని వారు ఈ సందర్భంగా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి, ఎంపీ కేశినేని నానిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెప్పాపెట్టకుండా ట్రావెల్స్ను మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారన్నారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యామని, ఇంకా తమకు అన్యాయం చేయొద్దంటూ కేశినేని ట్రావెల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. గతవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. అప్పటి నుంచి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కార్మికశాఖ కమిషనర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. -
మాకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తారా?
-
మా కష్టాన్ని దోచుకోవద్దు
ఎంపీ కేశినేని ట్రావెల్స్ కార్యాలయం వద్ద 500 మంది కార్మికుల ధర్నా సాక్షి, అమరావతి బ్యూరో: ‘మీరు టీడీపీ ఎంపీ... రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంత మాత్రాన అంతా మీ ఇష్టమా? పేదల కష్టాన్ని దోచుకుంటారా? మాకు జీతాలు ఇవ్వకుండా వేధి స్తారా? చెప్పాపెట్టకుండా ట్రావెల్స్ను మూసివేసి మా జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారు. బ్యాంకులను మోసం చేసేందుకే ఇలా చేశారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యాం. ఇంకా మాకు అన్యాయం చేయొద్దు’ అంటూ కేశినేని ట్రావె ల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటా నికి దిగారు. బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చారు. జీతాలు అందక తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చిన కార్మికులను ఎంపీ కేశినేని కార్యాలయంలోకి అనుమతించ లేదు. ఆ సమయంలో కేశినేని నాని తన కార్యాలయంలో లేరు. ఆయన ప్రతినిధులు అప్పటికే పోలీసులను పిలిపించారు. డ్రైవర్లు, సిబ్బందిని ఎంపీ కార్యాలయానికి వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. -
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
ఆర్టీసీ ‘సవరణ’బకాయిల చెల్లింపునకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇటీవల జరిగిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల తొలి విడత చెల్లింపునకు మార్గం సుగమమైంది. ఇందుకు అవసరమైన రూ.250 కోట్ల మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది. సవరించిన వేతనాలను 2013 నుంచి అమలు చేయనున్నట్టు ఫిట్మెంట్ ప్రకటన సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రూ.1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం, మిగతా మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో దసరాకు మొదటి విడత చెల్లించాల్సి ఉంది. కాని ప్రస్తుతం ఆర్టీసీ వద్ద చిల్లిగవ్వ లేకపోవటంతో అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించేం దుకు ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది.