samajika nyaya bheri bus yatra
-
ఇసుకలో నొక్కేశారు..అందుకే కేసు: బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ ఎంతో మానవత్వం ప్రదర్శించారని చెప్పారు బొత్స. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దండుకున్నారన్నారు. ఇసుకలో అవినీతి జరిగినందునే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని బొత్స తెలిపారు. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!
మే 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులందరం సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర చేపట్టాం. అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మేలు, సామాజిక న్యాయంలో బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన తీరు వివరించడానికి యాత్రగా మేం బయలుదేరాం. యాత్రలో నేను చూసిన, అనుభవంలోకి వచ్చిన అంశాలను ఇక్కడ పంచుకుంటున్నాను. ‘సహాయం పొందినవారు కృతజ్ఞత చూపించరని జనంలో నానుడి ఉంది. కానీ అది నిజం కాదని సామాజిక న్యాయభేరి యాత్రలో మాకు స్పష్టంగా కనిపించింది. మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు... సమాజంలోని అట్టడుగు వర్గాల వ్యక్తులను ఆర్థికంగా, సామాజింగా, రాజకీయంగా స్థితిమంతులను చేయడానికి దోహదం చేశాయి. ఇది ప్రజల్లో కనపడుతుందా? ఈ విషయం తెలుసుకోవాలన్న ఆతురత... యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభ సమయంలో నాలో కలిగింది. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో యాత్రకు ఎదురేగి స్వాగతం పలికి మాతో అడుగు కలిపారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయనే విషయం వారు స్పందించిన తీరులో ప్రస్ఫుటమయింది. లబ్ధిదారులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశంతో ఆయన బొమ్మ పెట్టుకొని 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులం బస్సు యాత్రగా వస్తేనే ప్రజల్లో ఇంతటి ఆదరణ లభిం చిందంటే... స్వయంగా వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే మరెంతటి ఆదరణ లభిస్తుందో, ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. విజయనగరానికి యాత్ర చేరినప్పుడు భారీ వర్షం స్వాగతం పలికింది. వర్షం కారణంగా బహిరంగ సభ నిర్వహించే పరిస్థితి లేక రద్దు చేయాల్సి వచ్చింది. అంతటి వర్షంలోనూ ప్రజలు తడుస్తూనే యాత్రకు స్వాగతం పలకడం నన్ను కదిలించింది. సీఎం జగన్ విధానాలనూ, సంక్షేమ పాలననూ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారనే నమ్మకం నాలో రెట్టింపయింది. విశాఖలో దారి పొడవునా జనం పోటెత్తారు. ఇదే తీరు అనంతపురం వరకు ప్రజా స్పందన మాకు అడుగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ గుర్తింపునకు నోచు కోని కులాలను వెతికి మరీ పదవులు, పథకాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆయా కులాల వారు మాకు యాత్ర పొడవునా తారసపడ్డారు. జగన్ పనితీరుకు అన్ని సభలకు పోటెత్తిన జనం, రాత్రి 11 గంటలకూ రోడ్లమీద నిలబడి యాత్ర కోసం ఎదురు చూసిన సందర్భాలు నిదర్శనంగా నిలిచాయి. కరోనా వల్ల కష్టాలు ముంచు కొచ్చినా, గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిల బరువును దించుకుంటూనే... దళిత, గిరిజన, బహుజనులే కాకుండా సర్వజన సంక్షేమాన్ని నెత్తి కెత్తుకున్న సీఎం జగన్ పనితీరు ప్రజలకు నచ్చింది. భావి తరాల భవిష్యత్తును భుజానికి ఎత్తుకున్న జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణే... సామాజిక న్యాయభేరి యాత్రకు జనం నీరాజనం పట్టడానికి కారణం. ప్రతిపక్షం చెబుతున్న మాటలనూ, దుష్ట చతుష్టయంలో భాగమైన పత్రికలూ, టీవీల... రాతలూ, తీతలనూ ప్రజలు పట్టించుకోలేదని యాత్రలో ఉన్న అందరికీ స్పష్టమయింది. ముఖ్యమంత్రితో చర్చించి, మరింత బలమైన కార్యక్రమాలను తీసుకొంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కార్య క్రమాలు, పథకాలను ప్రతి గుండెకు చేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ప్రతి హృదయాన్నీ తట్టిలేపి ఈ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనలను వివరిస్తాం. - ప్రొఫెసర్ మేరుగు నాగార్జున ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
Samajika Nyaya Bheri Bus Yatra: సామాజిక న్యాయం 'దశ దిశలా'..
సాక్షి ప్రతినిధి, అనంతపురం/నంద్యాల/కర్నూలు (రాజ్విహార్): ‘రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చెప్పడంకాదు.. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఎన్నికల వేళ ఓట్లు అభ్యర్థించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మర్చిపోయే వారికి మనం ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు, కులాలకు రాజ్యాధికారం వచ్చింది. దీన్ని కాపాడుకోవాలంటే ముప్పై ఏళ్లు మనం జగన్ను కాపాడుకుని సీఎంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది’.. అని రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సభ ఆదివారం అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించారు. కిక్కిరిసిన జనాల మధ్య జరిగిన ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభలో మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే ఏమిటో జగన్ చేసి చూపించారన్నారు. ‘గతంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం జరిగిన దాఖలాలు చూశామా? ఆంధ్రప్రదేశ్లో మినహా ఇలాంటి విప్లవాత్మక మార్పులు ఎక్కడైనా చూశామా? బీసీ, ఎస్సీ వర్గాలు ముఖ్యమంత్రులుగా పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం ఇలా సామాజిక న్యాయం అమలుకావట్లేద’ని మంత్రులు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏనాడైనా ఇంతమంది వెనుకబడిన వర్గాలు, కులాలకు మంత్రి పదవులు వచ్చాయా అని వారు ప్రశ్నించారు. సామాజిక న్యాయం దశ దిశలా ఆచరణలో ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు ఉండేలా కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రులు ఆకాంక్షించారు. సభలో పాల్గొన్న మంత్రులు ఏమన్నారంటే.. అనంతపురంలో బస్సు యాత్ర సందర్భంగా వేదికపై మంత్రులు తరతరాలుగా ఎందుకు చేయలేకపోయారు? : ధర్మాన పేదల ఖాతాల్లోకి డబ్బు వెళ్తోందని కొంతమంది బాధపడుతున్నారు. అవసరాలు తీర్చడంవల్లే కదా వారి పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇలాంటివి తీర్చలేక పోవడంవల్లే కదా కులాల మధ్య అసమానతలు పెరిగి వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు సీఎం రాష్ట్రమంతా తిరిగి, పాదయాత్ర చేసి, పరిస్థితులను అధ్యయనం చేసి వారి ఆకలి బాధలను గుర్తించి ఖాతాల్లో నగదు వేస్తున్నారు. గతంలో వెనుకబడిన వర్గాల సంఖ్యకు తగ్గ అధికారం ఎప్పుడైనా ఉండేదా? రాజ్యాధికారం వస్తేనే కదా ఆయా కులాల, వర్గాల అవసరాలు తీరేది. పథకాలు ఇవ్వడమే కాదు.. వాటిని గౌరవంగా ఇచ్చారా, లేదా అనేది ముఖ్యం. ఆ గౌరవం ఇక్కడ సామాజికవర్గాలకు దక్కింది. ఈ వర్గాలన్నీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరముంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు లేకుండా చేయడంవల్లే రాష్ట్రంలో తీవ్రవాదం తగ్గింది. అప్పట్లో పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి : చెల్లుబోయిన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి జరిగేది. ఇప్పుడు కులం, మతం, వర్గం, పార్టీల రహితంగా పథకాలు అందుతున్నాయి. బాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే.. జగన్ రాజ్యాధికారం ఇచ్చారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్వల్లే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద చదువులు చదువుకోగలిగారు. వెనుకబడిన కులాలు, వర్గాల వారిని ఇక్కడలా ఎక్కువ సంఖ్యలో మంత్రులుగా తీసుకున్నది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన తలరాతలు మార్చింది జగనన్నే : గుమ్మనూరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులిచ్చి వారి తలరాతలు మార్చడమే కాదు.. సంక్షేమ పథకాల ద్వారా మనందరి తలరాతలు మార్చింది ఒక్క జగనన్నే. ఏ కుటుంబంలోనైనా తండ్రి ఆస్తి ఇస్తానని చెప్పి మాట తప్పి ఉండొచ్చుగానీ, జగన్ ఎక్కడా మాట తప్పలేదు. ప్రతి అర్హుడికి సెంటున్నర స్థలం ఇచ్చారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు మనం బలి కాకూడదు. మహానాడులో బాలకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మన బీసీ సోదరులంతా హిందూపురంలో బాలకృష్ణనూ ఓడించాలి. భవిష్యత్తులో జగన్పై నోరుజారొద్దని బాలకృష్ణను హెచ్చరిస్తున్నా. ప్రతి ఇంట్లో సంక్షేమ క్యాలెండర్ : అంజాద్ బాషా సాధారణంగా ఇంట్లో క్యాలెండర్ను తేదీలను చూసుకోవడానికే వాడతారు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ క్యాలెండర్ ఉంది. ఎప్పుడు ఏ పథకానికి సంబంధించిన డబ్బు వస్తుందో చూస్తున్నారు. నవరత్నాల ద్వారా రూ.1.48 లక్షల కోట్లు పేదలకు పంచిన ఘనత జగన్మోహన్రెడ్డిదే. ఇలాంటి క్యాలెండర్ ఏ రాష్ట్రంలోనూ లేదు. జగన్ పాలనను చూసి చంద్రబాబుకు కడుపు మండుతోంది. వెనుకబడిన వర్గాలకు ఈ పాలన పండుగలా ఉంది. జగన్కు ప్రజలే మీడియా : ఉషశ్రీ చరణ్ అంబేడ్కర్, ఒక జ్యోతిబాపూలేకు పర్యాయ పదం ఎవరున్నారూ అంటే మన జగనన్నే. దేశచరిత్రలో 70 శాతానికి పైగా మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చింది ఆయనే. టీడీపీ మహానాడులో మహిళా నేతలు తొడలు కొట్టారు. వారికి విచక్షణలేదు. నేను బీసీని.. కురుబ కుటుంబంలో పుట్టినా నాకు మంత్రి పదవి వచ్చింది. ఒక ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇదంతా కేవలం జగన్వల్లే సాధ్యమైంది. చంద్రబాబు వద్దు.. జగనన్న ముద్దు అనేదే మన నినాదం కావాలి. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. కానీ జగన్కు ప్రజలే మీడియా. జగన్కు అండగా నిలుద్దాం : నారాయణస్వామి దశాబ్దాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అన్ని విధాలా అణగదొక్కారు. తొలిసారిగా సీఎం జగన్ వారికి మంత్రి పదవులే కాదు, రాజకీయంగా అన్ని రకాల పదవులూ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాల వారికే ఎక్కువగా ఇచ్చారు. చివరకు విజయవాడ మేయర్ పదవి జనరల్కు రిజర్వ్ అయినా బీసీకిచ్చి ఆ వర్గాల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు. అందుకే మనమంతా ఆయనకు రుణపడి ఉండాలి. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం వాళ్లు ఏపీలో కలవాలనుకుంటున్నారు : ఆర్. కృష్ణయ్య నేను ఈమధ్య కర్ణాటక వెళ్లా. అక్కడి వారు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనను మెచ్చి.. వారిని ఈ రాష్ట్రంలో కలపాలని కోరారు. వారూ మన పథకాలు కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర సరిహద్దుల్లోని తమిళనాడు వాసులూ ఇదే చెబుతున్నారు. టీడీపీ బీసీల పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ, ఆయన ఏనాడూ వారి కోసం పనిచేయలేదు. ఎప్పుడూ ప్రజలను ఓట్ల కోణంలోనే చూస్తారు. కానీ, జగన్ అలా కాదు. బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు ధైర్యం కావాలి. అందుకే జగన్కు అందరం ఎప్పుడూ అండగా నిలవాలి. నీకా ధైర్యం ఉందా బాబూ? : జోగి చంద్రబాబూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులు ఇస్తానని చెప్పే దమ్ముందా నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు, ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? సీఎం జగన్ ఈ మూడేళ్లలోనే సంక్షేమం కింద రూ.1.42 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. వీరిలో 80 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల వారున్నారు. అందుకే మన సీఎంను చూసి, ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి. -
ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు
-
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్ కృష్ణయ్య
-
బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్
-
పదవులు ఇస్తామని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి జోగి రమేష్
-
సామాజిక న్యాయ భేరి నాల్గోరోజు (ఫొటోలు)
-
నీ సభ వీడియో చూసి.. మా సభ గురించి మాట్లాడు బాబు: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-
టీడీపీది..నయవంచక మహానాడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
చంద్రబాబు కుట్రలను మీరే తిప్పి కొట్టాలి: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
-
బాలకృష్ణకు మంత్రి గుమ్మనూరు జయరాం వార్నింగ్
-
అనంతపురం భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి శంకర్ నారాయణ
-
చంద్రబాబు పై రెచ్చిపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్
-
గుంపులు గుంపులుగా జనం.. ఓ రేంజ్ లో పబ్లిక్ రియాక్షన్
-
టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్.. అనంతపురం బహిరంగ సభలో మంత్రులు
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్ జగన్ పాలనలో కులాలు, పార్టీ లకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ‘‘సీఎం జగన్ను ఎందుకు క్విట్ చేయాలి?. అమ్మ ఒడి ఇస్తున్నందుకా?. రైతు భరోసా ఇస్తున్నందుకా?. వైఎస్సార్ చేయూత ఇస్తున్నందుకా?’’ అని మంత్రి ప్రశ్నించారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి: అంజాద్ బాషా అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కేబినెట్లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. ‘‘పేదలకు పూర్తిస్థాయి న్యాయం చేయగలిగిన నాయకుడు సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని’ అంజాద్ బాషా అన్నారు. టీడీపీది.. నయవంచక మహానాడు: నారాయణ స్వామి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని మంత్రి నారాయణస్వామి అన్నారు. ‘‘టీడీపీది మహానాడు కాదు.. వెన్నుపోటు నాడు, దగా నాడు. టీడీపీది జరిపింది నయవంచక మహానాడు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నారాయణ స్వామి అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. చరిత్రలో లేని విధంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్ కృష్ణయ్య సీఎం జగన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోందని బీసీ నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ. చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారు. బీసీలపై ప్రేమను సీఎం జగన్ చేతల్లో చూపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిందని.. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు ప్రజల్లోకి వచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వడమే కాదు. కీలకమైన పోర్టు పోలియోలు అప్పగించారన్నారు. అధికారంలోకి రాక ముందు వైఎస్ జగన్ రాష్ట్రమంతా పర్యటించారు. రాష్ట్ర స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. స్థితిగతులు పరిశీలించాక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా బడులు రూపు రేఖలు మార్చారని మంత్రి ధర్మాన అన్నారు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎం జగన్తోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మరో 30 ఏళ్లు పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉండాల్సిన అవసరముందన్నారు. బస్సు యాత్రపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
‘చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు’
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం.. కర్నూల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల కోసం బీసీ, ఎస్సీ ఎస్టీల వర్గాలను చంద్రబాబు వాడుకొని వదిలేశారని, కానీ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. టీడీపీ పనైపోయింది: మంత్రి బొత్స మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులుగా పనిచేసినవాళ్లను అంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, టీడీపీ పనైపోయిందని, ఆ విషయం మహానాడుతో స్పష్టమైందని తెలిపారు. ‘మా అవినీతిని బయటపెట్టడానికి మూడేళ్లు పట్టిందా, అవినీతిపై చర్చకు సిద్ధం.. వాళ్ల అవినీతి చిట్టా అంతా విప్పుతామంటూ’ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. -
YSRCP బస్సు యాత్ర: కర్నూలు జిల్లాలో సామాజిక భారీ బహిరంగ సభ
-
నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభం
-
సామాజిక న్యాయభేరీ: నాల్గో రోజు బస్సు యాత్ర
Updates.. నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. అనంతపురానికి చేరుకుంది. మంత్రులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అనంతపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. సభలో పలువురు మంత్రులు మాట్లాడారు. 01:05PM నంద్యాలలో ప్రారంభమైన ఆదివారం నాటి సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర.. మధ్యాహ్నానికి కర్నూలుకు చేరుకుంది. పాణ్యం మీదుగా కర్నూలు సి క్యాంప్కు బస్సు యాత్ర చేరుకుంది. కర్నూలులో బస్సుయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, కర్నూల్ మేయర్ బివై రామయ్య, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బాల నాగిరెడ్డి తదితరులు బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎన్నికల కోసం మాత్రమే బాబు వాడుకుని వదిలేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. మహనీయుల ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ర్డె కొనసాగిస్తున్నారని, బడుగుల అభివృద్ధి కోసం సీఎం జగస్ సముచిత స్థానం కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బడుగుల అభివృద్ధి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్లాగా సీఎం జగన్ వచ్చారన్నారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ పని అయిపోయింది.. ఇక చంద్రబాబు, టీడీపీ పని అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బస్సుయాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. మహానాడులో అసభ్యంగా, చెండాలంగా మాట్లాడరని, మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడరన్నారు బొత్స. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారన్నారు. అలాగే బాలకృష్టను ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 10.30 AM వైఎస్సారీసీ సామాజిక న్యాయభేరీలో భాగంగా నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. నాలుగో రోజు యాత్ర బస్సు యాత్ర ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైన సీఎం జగన్ మాత్రమే. టీడీపీ హయాంలో ఒక్క మైనార్టీకి కూడా కేటినెట్లో చోటు కల్పించలేదు’’ అని విమర్శించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. అణగారిక వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్దే. కేబినెట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. మనమంతా కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్దిచెప్పాలి’ అని పేర్కన్నారు. ఇది కూడా చదవండి: మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్ -
కాసేపట్లో నంద్యాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం
-
Samajika Nyaya Bheri: సమసమాజం సాకారం
నరసరావుపేట నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాడేపల్లిగూడెం: సమసమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో మంత్రులు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, 70 శాతం మంత్రి పదవులను ఆయా వర్గాలకే ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ మహానాడు దూషణలే లక్ష్యంగా ఏడుపునాడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ‘జగన్ ముద్దు–బాబు వద్దు’ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బృందం చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర మూడో రోజైన శనివారం తాడేపల్లిగూడెం జిల్లా నుంచి ఏలూరు, గన్నవరం, విజయవాడ, గుంటూరు మీదుగా నరసరావుపేట వరకు సాగింది. మంత్రులు పలుచోట్ల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. నరసరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 44 డిగ్రీల మండుటెండలోనూ జనం పోటెత్తారు. యాత్ర పొడవునా ప్రజలు మంత్రులకు స్వాగతం పలికారు. నరసరావుపేటలో వేదికపై మంత్రులు బడుగు వర్గాలను పాతాళానికి తొక్కిన చంద్రబాబు: మంత్రి విడదల రజని చంద్రబాబు పాలనలో బడుగు వర్గాలను పాతాళానికి తొక్కాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని విమర్శించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క రాజ్యసభ సభ్యత్వమూ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ మూడేళ్ల పాలనలో 8 రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే కేటాయించి సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారన్నారు. జగన్ ముద్దు.. చంద్రబాబు వద్దు: మంత్రి వేణు సామాజిక న్యాయభేరితో కర్ణభేరీ మోగిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. బడుగు వర్గాలు ఉద్యమాలు చేయకుండానే ముఖ్యమంత్రి జగన్ వారికి ఉన్నత స్థితి కల్పించారన్నారు. శాసన మండలికి ఎస్సీని చైర్మన్ చేశారని చెప్పారు. చంద్రబాబు మహానాడు ఏడుపునాడుగా సాగుతోందన్నారు చంద్రబాబు నిర్వహించింది నారా మహానాడు: మంత్రి కారుమూరి చంద్రబాబు నిర్వహించింది ఎన్టీఆర్ మహానాడు కాదని, నారా మహానాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ లేకపోవటం సిగ్గుచేటన్నారు. మంత్రివర్గంలో అణగారిన కులాలకు అవకాశం కల్పించిన సీఎం జగన్కే వారిని ఓట్లు అడిగే హక్కుందన్నారు. చంద్రబాబు ఎవరిని పోయి ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బస్సుయాత్రకు తరలివచ్చిన జనసందోహం అణగారిన వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. బలహీన వర్గాల పరిపుష్టికి నవరత్నాలు అమలు చేశారన్నారు. డ్వాక్రా చెల్లెమ్మలకు చంద్రబాబు మోసం చేస్తే వైఎస్సార్ ఆసరాతో జగన్ ఆదుకున్నారని తెలిపారు. 2024లోనూ జగన్ సీఎం కావటం ఖాయమన్నారు. అది ఏడుపునాడు: మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో సామాజిక న్యాయం సాగుతోందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అధికారం లేదని చంద్రబాబు, లోకేష్ ఏడుపుతో నిర్వహిస్తున్న మహానాడు ఏడుపునాడని ఎద్దేవా చేశారు. మహిళలతో బూతులు తిట్టించిన మహానాడు బూతులనాడని, ఆ బూతులను మహాభారతంలా విన్నట్లుగా విన్న చంద్రబాబు దిగుజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. ఒక్కడే ఎన్నికలకు పోలేక అందరూ కలిసి రావాలని అన్ని పార్టీలను బ్రతిమలాడుకుంటున్నారని తెలిపారు. వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుది: మంత్రి జోగి రమేష్ బలహీన వర్గాలను వాడుకొని వదిలేసే చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అంతు చూస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని హితవు పలికారు. ఐక్యత కొనసాగాలి: మంత్రి పీడిక రాజన్నదొర బడుగు బలహీన వర్గాల ఐక్యత కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతోందని, అందులో ఎక్కువ లబ్ధి పొందుతున్నది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని తెలిపారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు మహానాడులో మహిళలతో అసభ్యంగా మాట్లాడిస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. అపూర్వ స్పందన: మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి బయల్దేరిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గత పాలకులు మేనిఫెస్టోలను పక్కన పెట్టారని, సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి హామీలను పూర్తిగా అమలు పరుస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు హద్దు మీరి మాట్లాడితే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందన్నారు. అంబేడ్కర్ కోనసీమ పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలి: మంత్రి సురేష్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుపై టీడీపీ అభిప్రాయం చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం ఒక్క జగన్కే సాధ్యమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూసి చంద్రబాబుకు గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం: ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చిన మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకూ సంతృప్తికర న్యాయం చేశారన్నారు. మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసి గౌరవించారని తెలిపారు. అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కింది: శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు జగన్ పాలనలో అణగారిన వర్గాలకు గుర్తింపు దక్కిందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు చెప్పారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తమకు జగన్ రాకతో మేలు జరిగిందన్నారు. ఎక్కడా గుర్తింపు లేకుండా ఉన్న 56 కులాలకు కార్పొరేషన్ పదవులు కేటాయించి జగన్ సామాజిక న్యాయం చేశారని చెప్పారు. జగన్ పాలన పది కాలాల పాటు ఉండాలని కోరుకుందామన్నారు. యాత్రలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం, ఉషాశ్రీచరణ్, తానేటి వనిత, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తఫా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నంద్యాల నుంచి మొదలయ్యే యాత్ర అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. బడుగువర్గాలకు గౌరవం కల్పించిన సీఎం జగన్: మంత్రి ధర్మాన వైఎస్సార్సీపీ వచ్చేంత వరకు రాష్ట్రంలో బడుగు వర్గాలు సరైన గౌరవాన్ని నోచుకోలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సమసమాజ స్థాపన చేయాలనే దృక్పధంతో వైఎస్ జగన్ 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతున్నారని చంద్రబాబు తన పార్టీ వారి చేత ప్రచారం చేయిస్తున్నాడని, సంపద సృష్టించేందుకు కారణమైన వారికే పంచిపెడుతున్నారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలు లాంటి బ్రోకర్లతో పనిలేకుండా పేదలందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ఇప్పటివరకు రూ.1.47 లక్షల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. బాబు 14 ఏళ్ల పాలనలో దోపిడీనే తప్ప ఇటువంటి మంచి చేయలేకపోయారని అన్నారు. టీడీపీ పాలనలో పసుపు చొక్కా వేసుకొని ఇంటిపై జెండా పెడితేనే పింఛను వచ్చేదన్నారు. పేదవారికి సాయం చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే బాబులాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారని హెచ్చరించారు. సామాజిక న్యాయ విప్లవం : మంత్రి మేరుగ ఏపీలో సామాజిక న్యాయం మహా విప్లవంలా ప్రారంభమైందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ నేత చేయలేని న్యాయాన్ని సీఎం జగన్ అందించారని తెలిపారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, బీసీ, కాపు, ఈబీసీ మహిళలకు మేలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల రాజ్యాంగ హక్కులను హరించారని విమర్శించారు. అమలాపురం అలజడులు చంద్రబాబు, పవన్ అడిన నాటకంలో భాగమేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు జగన్కు అండగా ఉండి సంక్షేమ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఆదిమూలపు
-
బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు
-
సామాజిక న్యాయం ఘనత సీఎం జగన్దే: రాజన్నదొర
-
సామాజిక న్యాయ భేరి మూడోరోజు (ఫొటోలు)
-
వారిని వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది: జోగి రమేష్
-
సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యం: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
-
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమం కోరుకునే నాయకుడు సీఎం జగన్: విడదల రజిని
-
లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు: మంత్రి ధర్మాన
-
జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
సింగిల్గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తాం: అంజాద్ బాషా
-
చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దు: మంత్రి మేరుగ
-
మూడో రోజు వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం
-
సామాజిక న్యాయభేరి: మూడో రోజు బస్సు యాత్ర
సాక్షి, తాడేపల్లిగూడెం: వైఎస్సార్సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం జరుగుతోంది. కేబినెట్లో 17 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. మేమంతా సీఎం జగన్ తయారు చేసిన సైనికులం’’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరూ సామాజిక న్యాయం పాటించలేదు. సీఎం జగన్ ఒక్కరే సామాజిక న్యాయం పాటించారు’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే.. -
గోదారి కెరటంలా ఉప్పొంగిన ‘యాత్ర’
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: సామాజిక మహా విప్లవానికి నాంది పలికి రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెన్నంటి నిలిచి కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో అన్ని వర్గాలకూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు చేకూరుస్తుండటంతో విపక్షాల వెన్నులో వణుకుపుడుతోందని చెప్పారు. ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర’ రెండో రోజు శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి చేరుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్లో మొదలైన మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. తరతరాల ఆవేదనను తీర్చారు: ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి సామాజిక ఉద్యమం ఈ నాటిది కాదు. బ్రిటిష్ పాలన కంటే ముందు, వారి పాలనలోనూ, ఆ తర్వాత కూడా ఉంది. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నాడు బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రారంభించిన సామాజిక సంక్షేమ రథాన్ని సీఎం జగన్ పరుగులు తీయిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఆయా వర్గాలకు 70 శాతం పదవులను సీఎం జగన్ కేటాయించారు. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. వివిధ పథకాల ద్వారా నేరుగా బదిలీతో రూ.1.30 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాగా అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల వారు దాదాపు 82 శాతం ఉన్నారు. ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా, దళారుల ప్రమేయం లేకుండా, అర్హతే కొలమానంగా సంతృప్త స్థాయిలో పథకాలను అందచేస్తున్నారు. మహానాడులో బాబు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు హయాంలో సర్వం జన్మభూమి కమిటీలకే అప్పగించడంతో అంతులేని అవినీతి, వివక్ష చోటు చేసుకుంది. నాడు ఏదైనా పథకం కావాలంటే ఇంటిమీద పచ్చ జెండా, ఒంటిపై పచ్చచొక్కా ధరించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులుండేవి. చివరకు కలెక్టర్లు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. అన్నీ మరిచిపోయిన చంద్రబాబు ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు మహానాడులో క్షమాపణ చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలకు అన్నీ ఇస్తామంటూ మళ్లీ దోచుకుంటామని చెప్పకనే చెబుతున్నారు. చంద్రబాబు రాష్టమంతా పర్యటించినా జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క తప్పును కూడా చూపలేకపోయారు. కరోనా మహమ్మారితో ప్రపంచమే అల్లకల్లోలమైనా ఏపీలో ఏ ఒక్క పథకమూ ఆగకుండా నిరుపేదలకు సాయం అందిందంటే సీఎం మానవత్వమే కారణం. నాడు అమృతం దొరికితే దేవతలు, రాక్షసులు పంచుకున్నారు. అదే తల్లితండ్రులకు దొరికితే పిల్లలకు ఇస్తారు. చంద్రబాబుకు దొరికితే మాత్రం ఆయన కుటుంబానికి, ఆయన వర్గానికే పంచిపెడతారు. అదే జగన్కు దొరికితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి వారికి మేలు చేస్తారు. అందుకే మనమంతా జగన్నుŒ, పార్టీని రక్షించుకోవాలి. ఇది స్వర్ణయుగం: తానేటి వనిత, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి అణగారిన వర్గాలంటే ఎంతో ఆప్యాయత ఉండటం వల్లే వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన హోంశాఖను సీఎం జగన్ అప్పగించారు. రెండుసార్లు మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. రాజకీయ సాధికారత దిశగా ధృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. వాటిలో 50 శాతం మహిళలకు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇది స్వర్ణయుగం. జనసేనకు సోషల్ మీడియా, ఎల్లోమీడియా తోడుంటే సీఎం జగన్కు ప్రజాబలం అండగా ఉంది. అంబేడ్కర్ ఆశయాలు సాకారం: మంత్రి పినిపే విశ్వరూప్ స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో సంక్షేమ పాలన కొనసాగుతోంది. సామాజిక న్యాయానికి వైఎస్ జగన్ మూడేళ్ల పాలన నిలువుటద్దం లాంటిదైతే చంద్రబాబు హయాం నీటిమూట లాంటింది. ఎస్సీ, మైనారిటీ వర్గాలకు బాబు మంత్రివర్గంలో కనీసం చోటు కల్పించలేదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న అంబేడ్కర్ ఆశయాన్ని చేతల్లో చూపుతు¯న్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెనతోపాటు విద్యాకానుక, వసతిదీవెన, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటి పథకాలతో విద్యా వ్యవస్థలో డాక్టర్ అంబేడ్కర్ కోరుకున్నవన్నీ సాకారం చేశారు. ఇప్పటివరకు పార్లమెంటు మెట్లు ఎక్కని శెట్టిబలిజ, మత్స్యకారులకు జగన్ ఆ అవకాశం కల్పించారు. కేవలం ఓటర్లుగానే మిగిలిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. మహానాడు కాదు.. మాయనాడు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుగ్రామమైన అడవిపాలెంలో జన్మించిన నన్ను మంత్రి స్థాయికి తెచ్చిన ఘనత సీఎం జగన్దే. జగనన్న అంటే భరోసా. అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. చంద్రబాబు మహానాడు ఒక మాయనాడుగా మారింది. ఇన్ని వర్గాలు ఒకే వేదికపై నిలవడం సామాజిక విప్లవానికి నాందిగా నిలుస్తోంది. చరిత్ర సృష్టించారు: ఎంపీ మార్గాని భరత్రామ్ బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్ అని నిరూపించి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు. అత్యుత్తమ పాలన: చింతా అనురాధ, అమలాపురం ఎంపీ సీఎం జగన్ అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాలకు సముచిత స్థానం కల్పించిన తొలి సీఎం వైఎస్ జగన్. ఇవాళ దేశమంతా మన రాష్ట్రం వైపే చూస్తోంది. ‘తూర్పు’న సామాజిక సంబరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన సామాజిక న్యాయాన్ని వివరించేందుకు మంత్రుల బృందం చేపట్టిన బస్సు యాత్ర అపూర్వ ఆదరణతో కొనసాగుతోంది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో దారి పొడవునా ఉప్పొంగే గోదారిలా ప్రజలు తరలివచ్చి ఆశీర్వదిస్తున్నారు. తుని నుంచి రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్ వరకు అడుగడుగునా యాత్రపై పూల వర్షం కురిపించారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రకు ఘన స్వాగతం లభించింది. మండుటెండలోనూ.. శుక్రవారం మధ్యాహ్నం 2.37 గంటలకు కాకినాడ జిల్లా తునిలో తాండవ వంతెనకు చేరుకున్న యాత్ర అన్నవరం, కత్తిపూడి, చెందుర్తి,« ధర్మవరం, యర్రవరం, సోమవరం, కృష్ణవరం టోల్గేట్, బూరుగుపూడి, రామవరం, తాళ్లూరు, మల్లేపల్లి, గండేల్లి, మురారి, తూర్పుగొనగూడెం, దివాన్చెరువు మీదుగా రాజమహేంద్రవరం వరకు 110 కిలోమీటర్లు మేర సాగింది. జాతీయ రహదారి వెంట ఎండను సైతం లెక్కచేయకుండా బస్సుయాత్రను స్వాగతించారు. తుని నుంచి రాజమహేంద్రవరం వరకు చెన్నై–కోల్కత్తా జాతీయ రహదారి జనసంద్రమైంది. పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు యాత్రలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజాద్బాషా, నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, «విడదల రజని, గుమ్మనూరి జయరాం, ఉషశ్రీచరణ్, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, గొడ్డేటి మాధవి, సంజయ్కుమార్, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, నాగులాపల్లి ధనలక్ష్మి, జి.శ్రీనివాసనాయుడు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాసరావు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు, శ్రేణులకు పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా నేడు (శనివారం) నరసరావుపేటలో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి నంద్యాలలో బస. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ఘనతే.. రాజమండ్రి బహిరంగ సభలో మంత్రులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం: పినిపే విశ్వరూప్ సభలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశ్వరూప్ అన్నారు. మూడేళ్లలో చారిత్రాత్మక నిర్ణయాలు: తానేటి వనిత మూడేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి తానేటి వనిత అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించారన్నారు. సమ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని తానేటి వనిత అన్నారు. పాలనలో బలహీనవర్గాలకు అవకాశం: ధర్మాన ప్రసాదరావు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పరిపాలనలో బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది సీఎం జగన్ మాత్రమేనన్నారు. కేబినెట్లో 74 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతోందన్నారు. మూడేళ్లలో రూ.లక్ష 20 వేల కోట్లకు పైగా లబ్ధిదారులకు అందజేశాం. పాలనలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని మంత్రి ధర్మాన దుయ్యబట్టారు. -
సామాజిక న్యాయ భేరి రెండోరోజు (ఫొటోలు)
-
తండోపతండాలుగా జనం ఎంత మంది వచ్చినా నలిగిపోవాల్సిందే.. బాబు పీకేలకు సవాల్
-
YSRCP Bus Yatra: సామాజిక న్యాయభేరి.. రెండో రోజు బస్సు యాత్ర
సాక్షి, విశాఖపట్నం: రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాత గాజువాక వైఎస్సార్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు గాజువాకలో ఏర్పాటు చేసిన సభా వేదికపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న తప్ప గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరు’’ అని అన్నారు. అంతకుముందు మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైంది. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్ చేశాము. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. నేను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పాను. బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకం. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారు’’ అని తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోంది. మళ్లీ సీఎం జగన్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. మహానాడు కాదు.. అది వల్లకాడు. మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’’ అని అన్నారు. ‘సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని ప్రతి పక్ష పార్టీ లు అల్లర్లు సృష్టిస్తున్నారు. దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం సమర్థిస్తున్నారా లేదా ప్రతి పక్షాలు సమాధానం ఇవ్వాలి. జగనన్న పాలనలో నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది..రాజకీయ దళారీలు లేరు. మూడేళ్లుగా మేలు జరుగుతుంటే జన్మ భూమి కమిటీలు భరించలేక పోతున్నాయి. మాట ప్రకారం పీడిత వర్గాలకు సమన్యాయం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. గడప గడపకి వెళ్తుంటే ప్రజలు జగన్ వెంట ఉంటామని అంటున్నారు’ అని తమ్మినేని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హోరెత్తిన సామాజిక భేరి -
ముందు బీసీని..తర్వాతే స్పీకర్ను
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తాను ముందు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని అని, ఆ తర్వాతనే స్పీకర్నని తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా.. ఓ బీసీ నాయకుడిగా యాత్రకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద మంత్రులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు తెలిపారు. ప్రజలు తనను ఎన్నుకోవడం వల్లనే ఇవాళ శాసనసభ స్పీకర్ని కాగలిగానని, బీసీని అయిన తనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్ స్థానంలో ఉంచారని చెప్పారు. -
AP: హోరెత్తిన సామాజిక భేరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/పీఎన్కాలనీ/రణస్థలం /జి.సిగడాం/శ్రీకాకుళం రూరల్/నెలిమర్ల/డెంకాడ: సామాజిక సంక్షేమ కెరటాలతో ఉత్తరాంధ్ర ఉప్పొంగింది. రాజ్యాధికారంలో భాగస్వాములైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను తిలకించి నాగావళి మురిసిపోయింది. ఆయా వర్గాలకు సామాజిక న్యాయాన్ని చేకూరుస్తూ రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్న ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. సామాజిక మహా విప్లవంతో దేశంలో పెను మార్పులకు సీఎం జగన్ ఆద్యుడిగా నిలిచారని, విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాల వల్ల రాజ్యాధికార బదిలీ జరిగి అన్ని స్థాయిల్లోనూ సామాజిక న్యాయం అమలు జరుగుతోందని పేర్కొంటున్నారు. ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభం ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’కు జనవాహిని పోటెత్తడంతో సిక్కోలు జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను గురువారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించింది. దారి పొడవునా ప్రజల దీవెనలతో పలు ప్రాంతాల మీదుగా మండుటెండలోనూ తొలిరోజు యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది. అప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు. అశేష జనవాహిని మధ్య సాగుతున్న బస్సుయాత్ర కిక్కిరిసిన రహదారులు మంత్రులు తొలుత శ్రీకాకుళంలో స్థానిక హోటల్లో మీడియాతో సమావేశం అనంతరం ఏడు రోడ్ల కూడలిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడి బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభ స్థలం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్రావ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్సు యాత్ర సందర్భంగా శ్రీకాకుళం ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. సామాజిక న్యాయభేరి రథానికి ముందు వేలాది మోటార్ బైక్ల ర్యాలీ కొనసాగింది. దీంతో కిలోమీటర్ల మేర కోలాహలం నెలకొంది. ప్రజలను కలుసుకుంటూ.. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్, చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. దారిపొడవునా మంత్రులు ప్రజల్ని కలుసుకుని పలుచోట్ల మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసింది? రాజ్యాధికారంలో ఎలా భాగస్వాములను చేసిందో వివరించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి పల్లె కదలి రావడంతో చిలకపాలెం, రణస్థలం జనసంద్రమైంది. విజయనగరం జిల్లాలో కందివలస, అగ్రహారం, కుమిలి, ముంగినాపల్లి, గుణుపూరుపేట, జమ్ము మీదుగా విజయనగరంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు అణగదొక్కిన బాబు.. టీడీపీ రథ చక్రాలు ఇప్పటికే కూలిపోయాయని, రానున్న రోజుల్లో ఆనవాలు కూడా ఉండదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కారన్నారు. భావితరాలు గర్వించే విధంగా సీఎం జగన్ దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ మూడేళ్లలో చేకూర్చిన సంక్షేమం, కేబినెట్, స్థానిక సంస్థలు కార్పొరేషన్లలో ఎన్ని అవకాశాలు కల్పించారో తెలియజేసేందుకే యాత్ర చేపట్టామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అయితే సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైఎస్ జగన్ అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హోంమంత్రి తానేటి వనిత శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే అందించిన ఘనత జగనన్న ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ చెప్పారు. సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకే దక్కాయని మంత్రి విడదల రజిని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో బస్సు యాత్ర సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి ఉద్యమాలు అవసరం లేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ సామాజిక న్యాయం వైపు నడిపిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చివరకు రాజ్యసభ పదవుల్లో సైతం సామాజిక న్యాయం చేకూరిందన్నారు. ఈ మేలును ఓ వర్గం మీడియా ప్రజలకు చెప్పడం లేదని, బస్సు యాత్ర ద్వారా వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, అంజాద్ బాషా, కె.నారాయణస్వామి, మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, ఎంవీ ఉషశ్రీచరణ్లు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రులు ఇన్నాళ్లకు సాకారం – మంత్రి ధర్మాన పాలనలో బడుగులను భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోందని, ఇన్నేళ్లకు సీఎం జగన్ సాకారం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. బస్సుయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని రుజువు చేయగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన: మంత్రి బొత్స డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సామాజికంగా నూతన ఒరవడి రావాలంటే బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు చంద్రబాబు ఆటలు సాగవు –మంత్రి సీదిరి అప్పలరాజు వెనుకబడిన కులాలకు ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారం కల్పించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మంత్రులు బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.స్వాతంత్య్రం వచ్చిన తరువాత చరిత్రలో తొలిసారిగా ఓ మత్స్యకార నేతను రాజ్యసభకు సీఎం పంపించారన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు ప్రతిపాదిస్తే చంద్రబాబు అండ్ కో అల్లర్లు సృష్టిస్తున్నారని, వారి ఆటలు సాగవని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. -
సామాజిక న్యాయ భేరి తొలిరోజు (ఫొటోలు)
-
YSR Bus Yatra: శ్రీకాకుళం నుంచి ఏపీ మంత్రుల బస్సుయాత్ర
సాక్షి, శ్రీకాకుళం: పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ‘‘దేశానికి ఇండిపెండెన్స్ రాక ముందు నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయి. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ ఒక్కరే చేయగలిగారు. ఇలా చేయమని సీఎం జగన్కు ఎవరూ అడగలేదు.. ఆయనే స్వతహాగా అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. వాళ్ళకి పంచి పెడితే దానిని కొందరు హేళన చూస్తున్నారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే. గతంలో నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పనిలేదు. సీఎం జగన్ వాళ్ళ ఇంటికే పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగాడు. కానీ, మేము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా?. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ వర్గాల వారిని సీఎం జగన్ సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేశారు. దానికి సజీవ సాక్ష్యంగా నిలబడాలి అనే బస్సు యాత్ర చేస్తున్నాం. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం.. అవన్నీ ప్రజలకు చెప్తాము. ఈరోజు దేశానికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని పంపారు’’ అని తెలిపారు. అనంతరం, పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్. ఆ వర్గాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశమంతా చూస్తోంది. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నాము’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు -
బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు
అనంతపురం (సప్తగిరి సర్కిల్): సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను అడ్డుకుంటామని టీడీపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్కుమార్ యాదవ్, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో హరీష్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా అండగా నిలిచి ఆదుకుంటుంటే టీడీపీ నాయకులు ఓర్వలేక బురద జల్లుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా చంద్రబాబు కోటలు బీటలు వారేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 2024 ఎన్నికల్లోనూ టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీసీ లోకానికి ఊపిరి పోశారు రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న మాట్లాడుతూ.. బీసీ లోకానికి ఊపిరి పోసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అన్నారు. రాజ్యసభ సీట్లను తన కులం వారికి ఇచ్చుకోవడంతో పాటు వాటిని రూ.వందల కోట్లకు అమ్ముకున్న నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను గుర్తించి.. వాటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మహనీయుడు జగనన్న అని కొనియాడారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ అల్లీపీరా, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మంత్రి పదవులు ఆయా వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్రాజును ఛైర్మన్గా, మైనార్టీ మహిళ జకియా ఖానంకు డిప్యూటీ ఛైర్ పర్సన్గా అవకాశం కల్పించారు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా నాలుగు సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని చాటుకున్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులుండగా 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో సింహభాగం.. స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. జడ్పీ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ దక్కించుకోగా తొమ్మిది జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను సాధించగా 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకే కేటాయించారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్ సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. చట్టం చేసి మరీ పదవులు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రిజర్వేషన్ చేస్తూ సీఎం జగన్ చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39% బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60% పదవులిచ్చారు. 8వివిధ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులిచ్చారు. బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులిచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఓ ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. బీసీలకు బాబు వెన్నుపోటు.. బీసీలే తమ పార్టీకి వెన్నెముకని తరచూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అధికారంలో ఉండగా 42 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం తొమ్మిది (21 శాతం) పదవులను మాత్రమే బీసీలకు ఇచ్చారు. విభజన తర్వాత 2014–19 మధ్య 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కేవలం ఎనిమిది (32 శాతం) పదవులను మాత్రమే బీసీలకు కేటాయించి ఆ వర్గాల వెన్నెముకను విరిచారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఏకంగా బీసీలకు పది పదవులు (40%) ఇవ్వడం గమనార్హం. 2014 నుంచి 2019 వరకూ ఎన్నికలు జరిగిన రాజ్యసభ స్థానాల్లో ఒక్క సీటును కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు కేటాయించలేదు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాలకుగానూ నాలుగు సీట్లను బీసీలకే ముఖ్యమంత్రి జగన్ కేటాయించడం గమనార్హం. ► నాడు బెదిరింపులు.. హేళన ► ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దళితులను చంద్రబాబు అవహేళన చేయటాన్ని కళ్లారా చూశాం. ► ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ఎస్టీల హక్కులను కాలరాసిన చంద్రబాబు నిర్వాకాలను మరచిపోగలమా? ► న్యాయం చేయమని విన్నవించిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని.. సమస్యలు పరిష్కరించాలని అడిగిన మత్స్యకారుల తోలు తీస్తానంటూ బెదిరించడం.. న్యాయమూర్తులుగా పనికిరారంటూ బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీయడాన్ని విస్మరించగలమా? ► హక్కులను పరిరక్షించాలని వేడుకున్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి కటకటాలపాలు చేసిన చంద్రబాబు దాష్టీకం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. రాష్ట్రంలో 2019 మే 29కి ముందున్న పరిస్థితి ఇదీ..! ► నేడు సమున్నత గౌరవం.. ► రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. సంక్షేమ ఫలాలను అగ్రభాగం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం జగన్ సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు.. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి పాలనాధికారం కల్పించారు. రాజ్యసభ, శాసనమండలి సభ్యుల నుంచి స్థానిక సంస్థల వరకూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవుల్లో ఆ వర్గాలకే 50 శాతం రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ సగౌరవంగా పదవులు ఇచ్చారు. ► మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1.41 లక్షల కోట్లలో 80 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. తద్వారా ఆయా వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ► నాడు చంద్రబాబు చేసిన సామాజిక అన్యాయాన్ని.. నేడు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు గురువారం నుంచి ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజలకు చాటిచెప్పడానికే గురువారం శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్రను ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటారు. 29న అనంతపురంలో యాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. తొలిరోజు బస్సు యాత్ర ఇలా.. గురువారం ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం సెవెన్ రోడ్స్ జంక్షన్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభించనున్న మంత్రులు. -
చంద్రబాబును, ఆయన కొడుకుని ప్రజలు బాదేశారు: మంత్రి అంబటి
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన పార్టీని ప్రజలు బాదుడే బాదుడుని అనేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు, ఆయన కొడుకుని ప్రజలు బాధేశారన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. 'నర్సారావుపేటలో మే 28న సామాజిక న్యాయభేరి బహిరంగ సభ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు జరుగుతాయి. ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ తప్ప మరొకటి లేదు. ఇది పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవచ్చు. సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఓట్లు మావి పదవులు మీవి అని బీసీ కులాలు వారు అనేవాళ్లు. ఇప్పుడు ఓట్లు మీవే.. సీట్లు మీవే.. మంత్రి పదవులు మీవే అని సీఎం జగన్ చెప్పారు. శ్రీ కృష్ణుడు వేషం వేశాడని ఎన్టీఆర్కు బీసీలు అండగా ఉన్నారు. చంద్రబాబు ముందే ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. రెండేళ్ల తర్వాతే ఎన్నికలు వస్తాయి. మహానాడును చిన్నప్పటి నుండి చూస్తున్నాం. అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అసహనంలో చంద్రబాబు భాష కూడా మారిపోయిందని' మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చదవండి: (రఘురామ లాంటి వారిని ఉపేక్షించొద్దు: ఎంపీ భరత్) సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మే 28న పల్నాడు జిల్లా చేరుకోనున్నట్లు మంత్రి విడుదల రజినీ తెలిపారు. ఈ మేరకు చిలకలూరిపేటలో మంత్రి రజినీ మీడియాతో మాట్లాడుతూ.. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అని గురజాడ అన్నారు. చంద్రబాబులా జగన్ వట్టి మాటలు చెప్పలేదు. ఎన్నికలు ముందు ఏం చెప్పామో అది చేశాం. వట్టి మాటలు కాకుండా బీసీలకు గట్టి మేలు తలపెట్టారు. కేబినెట్లో 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల్లో పది మంది బీసీలే ఉన్నారు. బీసీగా నాకు టికెట్ ఇవ్వడమే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారని మంత్రి విడదల రజినీ అన్నారు. -
YSRCP Bus Yatra: జయహో జగనిజం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతూ పర్యటిస్తున్నారని.. వైఎస్సార్ సీపీ మాత్రం నిజాలు చెప్పేందుకే బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. బహుజనులకు చేకూరిన ప్రయోజనాన్ని ప్రజలందరికీ చాటిచెప్పేందుకు సామాజిక న్యాయభేరి–జయహో జగనన్న నినాదంతో ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టామని, దీనిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కార్యాలయంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్నాయుడు అధ్యక్షతన సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్సుయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలోనే సామాజిక విప్లవం సృష్టించారని, ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. బాబూజగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి, జ్యోతీరావుపూలే, అబుల్ కలాం ఆజాద్, కొమరం భీమ్ వంటి మహామహుల ఆలోచనలను సీఎం ఆచరించి చూపుతున్నారని కొనియాడారు. దీనిని సహించలేక ప్రతిపక్షం ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తోందని మేరుగ మండిపడ్డారు. ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నంలో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతోందన్నారు. బస్సు యాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు జరుగుతాయని వివరించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మేయర్ కావటి మనోహర్నాయుడు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ సీఎం జగన్ ఒక అభినవ పూలే, ఒక అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, పలు కార్పొరేషన్ల చైర్మన్లు చిల్లపల్లి మోహనరావు, షేక్ ఆసిఫ్, కాకుమాను రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా మూడేళ్ళు నిండుతుందని, ఈ మూడేళ్లలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఆయన చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ బస్సుయాత్ర ద్వారా సామాజిక భేరీ మోగిస్తున్నట్లు తెలిపారు. 26న శ్రీకాకుళంలో మొదలయ్యే ఈ బస్సుయాత్ర 28వ తేదీ మధ్యాహ్నానికి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వివరించారు. -
సామాజిక న్యాయభేరీ నాదం..ప్రతిధ్వనించేలా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతం చేసే దిశగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. బడుగు, బలహీనవర్గాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టాలని పార్టీ సంకల్పించింది. ఈ నెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగుస్తుంది. కాకినాడ జిల్లాకు 27న చేరుకునే ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా మీదుగా సాగనుంది. యాత్రను 17 మంది మంత్రులు అనుసరించన్నారు. ఈ రెండు జిల్లాల్లో యాత్రను విజయవంతం చేసే లక్ష్యంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ ఖాదర్బాషా తదితరులు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ యాత్రను విజయవంతం చేసే దిశగా ఉదయం పూట రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్.. రాత్రి అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాలులో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఈ బస్సు యాత్ర మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. ఉమ్మడి ‘తూర్పు’న యాత్ర సాగనుందిలా.. సామాజిక న్యాయభేరి యాత్ర 27వ తేదీన తుని వద్ద కాకినాడ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఈ యాత్రకు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఏ–1 కన్వెన్షన్ వద్ద భారీ స్వాగతం పలకాలని నిర్ణయించారు. కత్తిపూడి సెంటర్లో యాత్ర కొద్దిసేపు ఆగుతుంది. అక్కడికి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించేలా టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి వేదిక, ఇతర ఏర్పాట్లు చేసే బాధ్యతను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్కు అప్పగించారు. జగ్గంపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంలో అక్కడి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆ బాధ్యతలు చూడాలని సమీక్షలో సుబ్బారెడ్డి నిర్ణయించారు. జగ్గంపేట నుంచి జాతీయ రహదారి మీదుగా ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించనుంది. సభా వేదికపై నిర్ణయం రాజమహేంద్రవరంలో నిర్వహించే బహిరంగ సభకు పక్కా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభ ఏర్పాటుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్, మున్సిపల్ స్టేడియాలను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తున్న ప్రాధాన్యం అందరికీ తెలిసేలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సత్తా చాటాలని నేతలు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే దిశగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో సమన్వయం చేసుకునే బాధ్యతను రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. రాజమహేంద్రవరం సభ విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. విజయవంతానికి సుబ్బారెడ్డి పిలుపు ముఖ్యమంత్రి జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తున్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా నాయకులందరూ కలసికట్టుగా గళం వినిపించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఒకే మాట మీదకు వచ్చి సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి వేణు, వైఎస్సార్ సీపీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (కాకినాడ), పొన్నాడ వెంకట సతీష్ కుమార్(అమలాపురం), జక్కంపూడి రాజా (తూర్పు గోదావరి), ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, గెడ్డం శ్రీనివాస నాయుడు, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దవులూరి దొరబాబు, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కర్రి వెంకట ముకుందరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర దృశ్యకళల కార్పొరేషన్ చైర్పర్సన్ కుడుపూడి సత్యశైలజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గుబ్బల తులసీకుమార్, గిరజాల బాబు, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, సిరిపురపు శ్రీనివాస్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కేపీఆర్ సత్తిబాబు, కొవ్వూరి త్రినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర.. సామాజిక విజయభేరి
చిలకలూరిపేట: రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. సామాజిక న్యాయభేరి పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలను అందలమెక్కించారని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం బలహీనవర్గాలకే అందుతున్నాయంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా పరితపిస్తోందో అర్థమవుతోందన్నారు. 25 మంది సభ్యులున్న రాష్ట్ర కేబినెట్లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే ఉన్నారంటే జగనన్న ఎంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం అమలు చేస్తున్నారో తెలుస్తోందన్నారు. బీసీల ఉనికి చాటేలా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోందన్నారు. ఈ అంశాలను వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే గుంటూరు బృందావన్ గార్డెన్స్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బాపట్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బీసీ నేతలతో కలిసి శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి బస్సు యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.