Sanoj Mishra
-
మోనాలిసా బాలీవుడ్ ఎంట్రీ.. ఇంటికెళ్లి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్
యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్ స్క్రీన్పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఇవాళ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.ఊహించని విధంగా ఫేమ్..మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్కు పంపించేశారు.దర్శకుడు సనోజ్ మిశ్రా మాటాడుతూ..' తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారు. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశా. ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం నాకు తెలుసు. అదే నేను సవాల్గా తీసుకున్నా. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా. ఆ తర్వాత ఏప్రిల్లో సినిమా ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా' అని అన్నారు.సనోజ్ మిశ్రా ఎవరు?లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు 15 సినిమాలు తీశారు. 2023లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు. -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ వార్త బాలీవుడ్ను కుదిపేసింది. ఊహించని షాక్లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్ను విడుదల చేశారు. -
రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం!
పాట్నా: తనకు కావలసిన సమాచారం అందించాలని కోరుతూ ఓ వ్యక్తి బిహార్ అధికారికి పోస్ట్ ద్వారా లంచాన్ని పంపించాడు. ఆ పోస్ట్ బిహార్ సమాచార కమిషన్ ఆఫీసులో కలకలం రేపింది. ఖగారియా జిల్లాకు చెందిన సనోజ్ మిశ్రా ఇటీవల ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఓ పిటీషన్ దాఖలుచేశాడు. అయితే ఈ పిటీషన్ వివరాలు తనకు త్వరగా తెలియజేయాలని కోరుతూ ఇన్ఫర్మేషన్ లో పనిచేసే ఓ ఉద్యోగికి రిజిస్ట్రర్ పోస్ట్ లో రూ.500 పంపించాడు. అందులో అతను సొంతంగా రాసిన ఓ లేఖ.. తాను పంపిన డబ్బులను ఉద్యోగి పిల్లలకు స్వీట్లు కొనిపించాలని కోరాడు. ఆఫీస్ అడ్రస్ రాసి రిజిస్టర్ పోస్ట్ పై బడా-బాబు అని రాశాడని ఓ అధికారి వెల్లడించారు. పాట్నాలోని సచివాలయ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులను ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎవ్వరూ నోరువిప్పేందుకు సముఖత చూపలేదని సమాచారం.