Sarveswara Rao
-
వీఐపీ రిపోర్టర్ : అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు
-
అప్పుడు ఎన్నికల్లో హామీలు గుప్పించి...
హైదరాబాద్ : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీలు గుప్పించి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సర్వేశ్వరరావు, రాజన్నదొర మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని... వారిని రెగ్యులర్ చేయకపోవడం చాలా దారుణమన్నారు. అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని వారిని క్రమబద్దీకరించకపోవటం దుర్మార్గం అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని ఎమ్మెల్యేలు తెలిపారు. అంగన్వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
అప్పుడు ఎన్నికల్లో హామీలు గుప్పించి...
-
అరకు ప్రాంతంపై ప్రభుత్వానికి రహస్య అజెండా ?
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంపై టీడీపీ ప్రభుత్వానికి రహస్య అజెండా ఉన్నట్లుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఆ ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తారేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సర్వేశ్వర్రావు, గిద్ది ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ... ఇప్పటికీ గిరిజన సలహామండలి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని వారు గుర్తు చేశారు. గిరిజన సంబంధిత అంశాల్లో ప్రభుత్వం... ఎస్టీ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతం అరకును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వకపోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన అంశాలు సభలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.