sayanna
-
అయ్యో లాస్య..!
కంటోన్మెంట్/రసూల్పురా: 30 ఏళ్లుగా కంటోన్మెంట్తో విడదీయలేని బంధం ఏర్పరుచుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. 2016లో కార్పొరేటర్గా గెలిచిన ఆమె ఐదేళ్ల పాటు సేవలందించారు. నాటి నుంచి కంటోన్మెంట్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు. సోదరి నివేదితతో కలిసి తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయన్న తన తర్వాత లాస్యను ఎమ్మెల్యే చేయాలని తపించేవారు. అయితే, దురదృష్టవశాత్తూ గతేడాది సాయన్న తన పదవీకాలం ముగియక ముందే మరణించారు. సాధారణ ఎన్నికలు ఏడాదిలోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లాస్యకు టికెట్ ఇవ్వడడంతో పోటీ చేసి గెలిచారు. సాయన్న టీమ్తో కలసిమెలసి.. దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. లాస్య ఆయా వర్గాలను కలుస్తూ వారి మద్దతును కూడదీస్తూ గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ప్రజాసంఘాలు, కాలనీలు, బస్తీ సంక్షేమ సంఘాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి సారిస్తూ దశల వారీగా పరిష్కారానికి చర్యలు చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండునెలల్లోనే ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతుండటంతో సాయన్న వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతలోనే లాస్య నందిత మృత్యువాత పడటంతో కార్యకర్తలను కలిచి వేసింది. లాస్య మృతి వార్త వెలువడగానే నియోజకవర్గ వ్యాప్తంగా సాయన్న, లాస్య అభిమానులు కార్ఖానాకు పోటెత్తారు. ఒకే ఒక్క బోర్డు సమావేశానికి హాజరు కంటోన్మెంట్ బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు. లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర నెలల్లో రెండు బోర్డు సమావేశాలు జరిగాయి. గత నెలలో జరిగిన సమావేశానికి మాత్రమే ఆమె హాజరయ్యారు. అమ్ముగూడ రోడ్డుకు తన నియోజకవవర్గ అభివృద్ధి నిధుల్లో రూ.1 కోటి కేటాయిస్థానని హామీ ఇచ్చారు. గత బుధవారం బోర్డు కార్యాలయానికి వచి్చన ఆమె, బోర్వెల్స్ మీటర్లు పెట్టాలన్న బోర్డు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే లాస్య మృతి చెందడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2015లో రాజకీయ అరంగేట్రం.. దివంగత ఎమ్మెల్యే సాయన్న 1994 నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2009లో తొలిసారి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 2015 జనవరిలో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను రాజకీయ ఆరంగేట్రం చేయించారు. అయితే, ఈ ఎన్నికల్లో నళిని కిరణ్ చేతిలో లాస్య ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాది సాయన్న టీఆర్ఎస్లో చేరగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకున్నారు. కాగా, 1986లో సాయన్న తొలిసారిగా కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమిపాలైన అదే ప్రాంతం(కవాడిగూడ) నుంచి 2015లో లాస్య గెలుపొందడం విశేషం. అయితే, 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసి లాస్య ఓటమి పాలయ్యారు. తాజాగా 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. అభివృద్ధి పనులపై దృష్టి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని వార్డుల్లో పవర్ బోర్వెల్స్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయన మరణంతో ఆయా పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. రసూల్పురా, ఇందిరమ్మనగర్, గన్ బజార్, మడ్ ఫోర్ట్, శ్రీరాంనగర్ డబుల్ బెడ్రూం గృహ సముదాయం, బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లో పవర్బోర్లు వేయించారు. అదేవిధంగా బొల్లారంలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కళశాల భవనం స్థానంలో నూతన నిర్మాణానికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పయనీర్ బజార్, ఆదర్శనగర్ బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీ, పవర్ బోర్వెల్స్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే విధంగా మడ్ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్లో తాగునీటి పైపులైను పనులు పూర్తిలా చర్యలు తీసుకున్నారు. మడ్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ జోపిడి సంఘం డబుల్బెడ్ రూం ఇళ్లు త్వరగా పూర్తి అయ్యేలా రెవెన్యూ, గృహనిర్మాణ అధికారులను ఆదేశించారు. మార్చురీ వద్ద విషాదఛాయలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య నందిత.. ఆమె తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే ఒంటిపై 12 తాయిత్తులు.. రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు మూడోసారి రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. కంటోన్మెంట్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ సందర్భంగా లిఫ్ట్లో ఇరుక్కోవడం, ఇటీవల నల్లగొండ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు కిందపడి ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకొని తాయిత్తులు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయిత్తులు ఉన్నట్టు వైద్యులు గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. తలకు గాయం కావడంతో.. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తెలిసింది. ప్రమాదంలో ఎడమకాలు విరిగిపోవడంతో పాటు దంతాలు ఊడిపోయాయి. గాంధీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్సింగ్, ప్రొఫె సర్ లావణ్య కౌషిల్ నేతృత్వంలో ఆరుగురు వైద్యబృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యేల నివాళి గాంధీ మార్చురీలో ఉన్న ఎమ్మెల్యే లాస్య మృతదేహానికి పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.గాంధీ ఆస్పత్రికి చేరుకున్న వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్రెడ్డి, వాకాటి శ్రీపతి, కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్రెడ్డి తదితరులున్నారు. లాస్య అకాల మృతిపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు: మంత్రి కోమటిరెడ్డి బంగారు భవిష్యత్తు ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది అత్యంత బాధకరమైన విషయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీ మార్చురీ వద్ద లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇచి్చన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. -
మావోయిస్టు కీలక నేత రాజిరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి (71) అలియాస్ సాయన్న మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాడపడుతున్న ఆయన ఈ నెల 16న చత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మరణించినట్లు సమాచారం. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేశారు. అయితే రాజిరెడ్డి మరణవార్తను మావోయిస్టులు, ఆయ న కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కొండపల్లి పరిచయంతో అడవిబాట... పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్పాండేగా దళంలో ప్రసిద్ధుడు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్పూర్లో ఓ కేసులో అరెస్టు అయి వరంగల్ జైలుకు వెళ్లారు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడవిబాట పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితోపాటు ఆయన సోదరుడు బీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవభావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరారు. దళ సభ్యురాలితో వివాహం... రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురి ఆలానాపాలనను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించాడు. ఆమె హైదరాబాద్లో ఉన్నతవిద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాశిం. నెట్టింట వీడియో వైరల్... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మృతిపైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రామచంద్రారెడ్డి మృతిచెందారంటూ ఓ మృతదేహం చుట్టూ పలువురు మావోయిస్టులు రోదిస్తున్నట్లున్న ఓ వీడియో గురువారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మల్లా రాజిరెడ్డి మృతి వార్తకు సైతం అదే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం గమనార్హం. ఈ వీడియోను ఫ్యాక్ట్ చేయగా గురువారమే అది అప్లోడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొహెడ మండలం, తీగలకుంటపల్లి గ్రామం. వికల్ప్, విజయ్, రాజుదాదా, జురు, సునీల్, వాసు పేర్లతో ప్రచారంలో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యం సెంట్రల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులు... రాజిరెడ్డిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సిర్పూర్ కాగజ్నగర్లో 1986లో పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఎస్సై, 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య ఉండగా ఏ2గా రాజిరెడ్డి పేరు నమోదైంది. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లిని రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్మలైలో ఎస్ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కుట్ర కేసులో మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి, కరీంనగర్ జైలుకు తరలించారు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్పై బయటికి వచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి రూ.కోటి వరకు ఉంటాయని అధికారిక సమాచారం. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం ఘన చరిత్ర..ఇదే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం కంటోన్మెంట్ని రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఈసారి టిఆర్ఎస్ తరుపున గెలిచారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్దిగా గెలుపొందినా, తదుపరి జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37568 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజేపి తరపున పోటీచేసిన శ్రీ గణేష్కు 15500 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 65752 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 28184 ఓట్లు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నాలుగుసార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పి.శంకరరావు 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలుపొందినా 2014లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కంటోన్మెంట్లో రెండుసార్లు గెలిచిన బి.వి గురుమూర్తి, ఒకసారి ఖైరతాబాద్లో గెలిచారు. 1967లో ఇక్కడ గెలిచిన వి. రామారావు 1957లో షాబాద్లో, 1962లో చేవెళ్ళలో గెలిచారు. ఆయన మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వి.మంకమ్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత మరోసారి కూడా గెలుపొందారు. ఇక్కడ గెలిచిన వారిలో బి.వి గురుమూర్తి, ఎన్.ఎ.కృష్ణ. డి. నర్సింగరావులు, డాక్టర్ శంకరరావు మంత్రి పదవులు నిర్వహించారు. మరో నేత గురుమూర్తి రాజ్యసభ సభ్యనిగా కూడా వున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, జనతా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచాయి. శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన సి.ఎమ్.తో విభేదాలలో ఇరుక్కుని పదవి కోల్పోయారు. అయితే ఈయన రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత జగన్ను సిబిఐ అరెస్టు చేయడంతో అదంతా రాజకీయ వివాదంగా మారింది. రాష్ట్రంలో కీలకమైన పరిణామానికి కారకుడైన శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్ను తీవ్రంగా విమర్శించి మంత్రి పదవిని కోల్పోవడం విశేషం. తదుపరి కాంగ్రెస్ టిక్కెట్ను కూడా పొందలేక పోయారు. సర్వే సత్యనారాయణ ఒకసారి టిడిపి పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ నుంచి సిద్దిపేట, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలలో గెలుపొందారు. మల్కాజిగిరి జనరల్ స్థానం అయినప్పటికి కాంగ్రెస్ ఐ తరపున ఈయన పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశారు. 2018లో కంటోన్మోంట్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
తెలంగాణ రాబిన్హుడ్.. పండుగ సాయన్న
మహబూబ్నగర్: పేదల పాలిట ఆపద్భాందవుడిగా, ఆకలికి అలమటించే నిరుపేదల ఆకాలి తీర్చే సాయన్న ఇక్కడి ప్రాంత ప్రజల ఇష్టమైన నాయకుడు. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన వీరుడి చరిత్ర ఉందంటే అది పండుగ సాయన్నదే. ఈయన కేవలం ధనవంతులపై, భూస్వాములపై దాడులు చేసే వ్యక్తిగానే సమాజానికి పపరిచయం చేసిన పెత్తందార్లు, ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, చరిత్రను కనుమరుగు చేశారు. అసలు సాయన్న తిరుగుబాటుకు కారణాలు, పరిస్థితులు మాత్రం ఎవరూ వివరించలేదు. మొహర్రం రోజు నాడే పండుగ సాయన్న జయంతిని చేయడం ఆనవాయితీగా వస్తుంది. మెరుగోనిపల్లి జన్మస్థలం మండలంలోని కేశవరావుపల్లి పరిధిలో ఉన్న కిలాట్నగర్ (మెరుగోనిపల్లి) గ్రామం ఈయన జన్మ స్థలం. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. దాదాపుగా 1858 నుంచి 1860 మధ్యలో జన్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయనపై భూస్వాములు పెట్టిన కేసులు, జైలు శిక్ష పడిన విషయాలను బట్టి ఆయన జన్మించిన సంవత్సరాలు అంచనా వేశారు. 1860లో రజాకార్ల రాజ్యం కొనసాగుతుండేది. అప్పట్లో రజాకార్లు, భూస్వాములను చెప్పుచేతుల్లో పెట్టుకుని పాలనచేస్తుండే వారు. ఈ తరుణంలో భూస్వాములు పండుగ సాయన్న కుటుంబం భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో తిరగబడ్డ కుటుంబాన్ని వేధించారు. మొదటి సారి సాయన్న భూస్వాములను పొలంలో నాగళ్లు కట్టిన సమయంలో వారిని ఎదురించాడు. సాయన్నను ఏమైనా చేస్తారని కుటుంబ సభ్యులు అతన్ని చౌడూర్ సమీపంలోని మేక గుండు చెంత దాచి పెట్టారు. భూస్వాములు దాడులు చేసి కుటుంబాన్ని మరింత భయానికి గురిచేయాలని సాయన్న చిన్నమ్మపై లైంగిక దాడి చేశారు. అజ్ఞానంతంలో ఉన్న సాయన్న భూస్వాములపై దాడికి పథకాలు చేస్తూ తరుచు దాడులు చేయటం మొదలు పెట్టాడు. దీంతో కొందరు అనుచరులను సైతం సమీకరించుకుని దాడులకు దిగేవాడు. పలుమార్లు నిజాం పోలీసుల బలగాలతో సాయన్న కోసం వేట సాగించారు. సాయన్న నిజాం పోలీసులను అడవులు వెంట తిప్పి వారిని తరిమివేసేవాడు. పండుగ సాయన్నపేరు ఎలా వచ్చిందంటే.. సాయన్న నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తరుణంలో చాలా గ్రామాలు ఆకలితో ఆలమటించేవి. ఇవి చూసి చలించిన సాయన్న గ్రామాలకు తిండి పెట్టాలని ఆలోచించి ఊర్లకు ఊర్లను ఒక చోట చేర్చి వారికి కావాల్సిన ఆహారధాన్యాలు దోపిడి చేసి తీసుకుని వచ్చి వారికి ఇచ్చేవాడు. అలాగే మండల సమీపంలోని మైసమ్మ అడవి ప్రాంతంలో సాయన్న పండుగ చేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు భోజనం పెట్టి ఆకలి తీర్చేవాడు. అప్పట్లో ఆకలి తీరాలంటే సాయన్న ఎక్కడో ఒక చోట దారిదోపిడి చేసి వంటలు వండించి పండుగలు, కందుర్లు చేసేవాడు. అప్పల్లో ప్రజలకు ఇష్టమైన దసర, పీర్లపండగ కలిసి వచ్చిన ఏడాది జన్మించటంతో అతన్ని పండుగ సాయన్నగా ప్రజలు పిలుచుకోవటం మొదలు పెట్టారు. అప్పటి వరకు సాయన్న తెలుగు సాయన్నగా సుపరిచితుడు. -
కంటోన్మెంట్ బీఆర్ఎస్లో గందరగోళం.. ఎమ్మెల్యే రేసులో అరడజను ఆశావహులు!
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే సాయన్న మరణంతో నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించే వారు కరువయ్యారు.ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారే తమ ఉనికి చాటేందుకు ఆరాటపడుతున్నారు. అంతేకాక ఇద్దరు మంత్రులు సైతం నియోజకవర్గంలో పార్టీకి తామే పెద్దదిక్కు అనేలా క్యాడర్ను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో తాము ఎవరి వెంట నడవాలో అర్థం నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. భౌగోళికంగా హైదరాబాద్ జిల్లాలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం పార్లమెంట్ విషయానికొస్తే మల్కాజ్గిరి పరిధిలో ఉంటుంది. ఆది నుంచీ మల్కాజ్గిరి ఎంపీ లేదా ఎంపీ అభ్యర్థులే ఇక్కడ ఆధిపత్యం చేలాయిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి సహజంగానే పార్టీ నేతలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే ధోరణిలో బోర్డు సభ్యులంతా తనవైపే ఉండేలా జాగ్రత్త లు పడుతూ వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సైతం మర్రి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నే బోర్డు ఎన్నికల ప్రకటన వెలువడటంతో సహజంగానే మర్రి తన వర్గంలోని బోర్డు మాజీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో తారుమారు అయ్యాయి. కీలకంగా మారిన మంత్రి.. ఎమ్మెల్యే సాయన్న దశదిన కర్మ ముగిసిన మరుసటి రోజే మంత్రి తలసాని, సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో పాటు బోర్డు మాజీ సభ్యుల్లో జక్కుల మహేశ్వర్ రెడ్డి (జేఎమ్మార్)ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అక్కడికక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోర్డు ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల సర్వసభ్య సమావేశం రెండు సార్లూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మరోసారి ఎమ్మెల్యే కూతుర్లు, జేఎమ్మార్తో పాటు మర్రి వర్గంలోని మరో ముఖ్య నేత బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. తదనంతరం తెలంగాణ భవన్లో తన ఆధ్వర్యంలోనే ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సైతం మర్రిని ఆహ్వానించలేదు. బోర్డు మాజీ సభ్యులు సైతం మర్రి రాజశేఖర్రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే ఈ భేటీలకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్లు మన్నె కృశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్లను కూడా ఈ భేటీకి పిలవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దిద్దుబాటులోనూ.. గత నెల 25 బొల్లారంలో నిర్వహించిన తొలి ఆత్మీయ సమ్మేళనం పార్టీలోని అసమ్మతిని బహిర్గతం చేసింది. మాజీ బోర్డు సభ్యులే వార్డుల అనధికారిక ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తూ ఉండటాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. మన్నె కృశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్లను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న శ్రీగణేశ్ను సైతం పార్టీ నేతలు దూరంగానే పెట్టారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లు తమ అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రి తలసాని మరోసారి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మర్రితో పాటు ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలోనూ ఇన్చార్జ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా ప్రజాక్షేత్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో సాయన్న కుమార్తెల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సాయన్న ప్రధాన అనుచరుల్లో ఒకరైన ముప్పిడి మధుకర్ను కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా మారుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు
-
TS: అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఈ ప్రభుత్వం.. కంటోన్మెంట్ సాయన్న విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శించిందని? మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు చనిపోతే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష? అని కేసీఆర్ సర్కార్ను ప్రశ్నించారు బండి సంజయ్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విషయంలో.. సర్కార్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారాయన. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన వ్యక్తి సాయన్న. ఆయన మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఒక శాసనసభ్యుడికి.. అదీ పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమన్నారు. గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సినీ రాజకీయ ప్రముఖుడు హరికృష్ణ లాంటి వాళ్లకు అధికారిక లాంఛనాలతో కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయమన్నారు. కేసీఆర్ స్పందనేది? సాయన్న అంత్యక్రియల ఉదంతం మరవక ముందే.. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజానీకానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలుకన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తూ.. కేసీఆర్ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. -
ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం: ఈటల
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో దుమారం రేగిన తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించని పరిణామంపై ఆయన అనుచరులు నిన్న(సోమవారం) స్మశానంలో నిరసన వ్యక్తం చేయగా.. మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోక్యంతో అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి. తాజాగా ఈ పరిణామంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం.. కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఈటల పేర్కొన్నారు. ఫ్యూడల్ మనస్తత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ను దేవుడు కూడా కాపాడలేడని, బీజేపీ గెలుపుఖాయమని ఎమ్మెల్యే ఈటల జోస్యం పలికారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసగించారు. ఏడేళ్లుగా దళితులకు ఒక్క ఎకరం భూమిని కూడ ఇవ్వకుండా దళితులను కేసీఆర్ మోసగించాడు.ధరణీ పేదల కొంపముంచింది.. పేదలను బిక్షగాళ్లుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్ ది. 2018 నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగరవేతదారులుగా మారటం కేసీఆర్ పుణ్యమే!. మద్యం విపరీత అమ్మకాలతో ఎంతో మంది మహిళల పుస్తెలతాడులు తెగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల్లో అధికార లాంఛనాలపై గందరగోళం
-
Cantonment MLA: కంటోన్మెంట్పై చెరగని ముద్ర వేసిన సాయన్న..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ఇక్కడ తనదైన ముద్ర వేశారు. అందరికీ తలలో నాలుకలా.. అజాత శత్రువుగా.. వివాద రహితుడిగా ఆయనకు ఎంతో పేరుంది. ఆదివారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారనే వార్తతో నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులు అరి్పంచారు. బ్యాంక్ క్లర్కు ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా సాగిన సాయన్న రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వాల్వాపూర్లో జన్మించిన సాయన్న.. నగరంలోని న్యూసైన్స్ కాలేజీలో బీఎస్సీ, అనంతరం ఎల్ఎల్బీ చేశారు. 1978లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు 1986లోనే రాజకీయాల్లోకి వచి్చన ఆయన.. 1986 బల్దియా ఎన్నికల్లో దోమలగూడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని సిండికేట్ బ్యాంకులో చేరారు. 1994లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి టీడీపీ అభ్యరి్థగా టికెట్ దక్కడంతో చివరి నిమిషంలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునరి్వభజనతో కంటోన్మెంట్ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్, ఓల్డ్ బోయిన్పల్లి వంటి ప్రాంతాలు వేరే నియోజకవర్గాల్లోకి మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్రావు చేతిలో 4,183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, సాయన్న తన విలక్షణ నైజంతో కంటోన్మెంట్ ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులెవరూ తనకు అండగా నిలవకపోయినప్పటికీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన వ్యక్తిత్వం కీలకమైంది. 2018లో టీఆర్ఎస్ అభ్యరి్థగా భారీ మెజారిటీతో గెలిచి అయిదోసారి ఎమ్మెల్యే అయ్యారు. సాయన్నకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. నిరాడంబరుడు.. వివాద రహితుడు.. మొదటిసారిగా 1986లో ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యరి్థగా పోటీ చేసిన సాయన్న ఓడిపోయారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. దోమలగూడ డివిజన్ అనంతరం కవాడిగూడ డివిజన్గా రూపాంతరం చెందింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి కవాడిగూడ కార్పొరేటర్గా సాయన్న కుమార్తె లాస్య నందిత గెలుపొందారు. అయిదు పర్యాయాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న సౌమ్యుడు, నిరాడంబరుడు, వివాదరహితుడు మాత్రమే కాక స్నేహశీలి, హాస్యచతురుడు. అందరితో కలుపుగోలుగా ఉండే సాయన్న మంచి భోజన ప్రియుడు. వెరైటీ వంటకాలంటే ఇష్టం. సినిమాలు, వినోదకార్యక్రమాలపై ఆసక్తి. సినిమాల గురించి చర్చించేవారు. రాజకీయాల్లో ఉన్నా అజాత శత్రువుగా పేరుపొందారు. అన్నా అని వస్తే.. నేనున్నా అనేవారు.. అయిదు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన సాయన్న రాజకీయాల్లోనూ పక్కా లెక్కలతో ఉండేవారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండేవారు. నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో దాదాపు ప్రతిసారీ సాయన్న వ్యతిరేక పారీ్టల అభ్యర్థులే గెలిచే వారు. 1997 బోర్డు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్కరు మాత్రమే గెలిచినప్పటికీ, 1999 ఎన్నికల్లో సాయన్న విజయం సాధించారు. తిరిగి 2004లో సాయన్న ఎమ్మెల్యేగా ఉండగానే 2006, 2008లోనూ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేదు. 2015లోనూ టీడీపీ అభ్యర్థులకు బోర్డులో ప్రాతినిధ్యమే దక్కలేదు. బోర్డు సభ్యులు తాము వేరే పారీ్టల్లో కొనసాగుతున్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే సాయన్న గెలుపు కోసం పనిచేసే వారని తెలుస్తోంది. ప్రత్యర్థి పారీ్టల్లోని నేతలతోనూ సాయన్న సన్నిహితంగా ఉండే వారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్నా అంటూ తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించే వారు. ఇక మిలిటరీ అధికారుల పెత్తనం మితిమీరి ఉండే కంటోన్మెంట్లో కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రతి కాలనీ, బస్తీ పెద్దలతో నిత్యం టచ్లో ఉండేవారు. ఎన్నికల్లో ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ ప్రతినిధులు పారీ్టలకు అతీతంగా సాయన్న గెలుపు కోసం పనిచేసే వారు. ఈ నేపథ్యంలోనే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ముఠా గోపాల్తో ఎంతో అనుబంధం ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయన్న చిరకాల మిత్రులు. ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1986 కార్పొరేటర్ ఎన్నికల్లో అప్పటి జవహర్నగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ముఠా గోపాల్ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం ముఠాగోపాల్ ఆశించిన ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ మిత్రపక్షాలకు కేటాయించేవారు. దీంతో టీడీపీలో ఉన్నంతకాలం గోపాల్కు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్లో చేరాక 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ముషీరాబాద్ నియోజకవర్గంతో సాయన్న, గోపాల్కు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ముఠాగోపాల్ మూడుసార్లు, సాయన్న ఒక పర్యాయం పనిచేశారు. సాయన్న హయాంలోనే ప్రస్తుత జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. హుడా డైరెక్టర్గానూ ఆయన పని చేశారు. చదవండి: ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్కు ఉప ఎన్నిక లేనట్టే! -
ఎమ్యెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
-
ఎమ్యెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్యెల్యే జి సాయన్న కన్నుమూత
-
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
వర్ని మండలం రుద్రూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్కి పెద్ద సాయన్న(66) అనే వృద్ధుడు సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న పది సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
కేయూ వీసీ మనోడే
ఆర్.సాయన్నది కొరట్పల్లి రెగ్యులర్ వైస్చాన్స్లర్గా నియామకం డిచ్పల్లి : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఆయన డిచ్పల్లి మండలం కొరట్పల్లికి చెందినవారు. సోమవారం వీసీగా ఉత్తర్వులు వెలువడగా.. అదే రోజు కేయూలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేయూలో మూడేళ్లపాటు వీసీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జూనియర్ లెక్చరర్ నుంచి.. కోరట్పల్లికి చెందిన ఆర్.సాయన్న 1955 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా, 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 1991 నుంచి 1999 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్గా పనిచేసి కొద్దికాలం క్రితం రిటైరయ్యారు. ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో బోధించారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనాlపత్రాలను సమర్పించారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. పరిపాలనానుభవం.. 1991లో సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్గా పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చూశారు. అకడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000 వరకు వ్యవహరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో జీవితకాల సభ్యుడి, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడు పనిచేశారు. -
సాయన్న టీటీడీ బోర్డు సభ్యత్వం రద్దు
హైదరాబాద్ : టీటీడీ చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు జి. సాయన్న సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తూ సోమవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే సాయన్నను ఏడాది క్రితం టీటీడీ సభ్యునిగా నియమించారు. అయితే ఆయన ఒక్కసారి కూడా తిరుమలలో జరిగే టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశాలకు హాజరుకాలేదు. గైర్హాజరుపై టీటీడీ చైర్మన్కు సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. కాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిని మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
రాజకీయ శత్రువులంతా గులాబీ గూటికే..
సాక్షి, హైదరాబాద్: అంతా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వారే! చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు అనుభవించిన వారు కొందరైతే... టీడీపీలో ఉన్నన్ని రోజులు పదవులను అనుభవించిన వారు మరికొందరు. 2014 ఎన్నికల వరకు వీరందరిదీ పసుపు గూడే! దాదాపు 20 ఏళ్లకు పైగా కలిసి పనిచేసి, పార్టీలో అంతర్గతంగానే శత్రువులుగా మెదిలిన ఆ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ మారడం మొదలుపెట్టారు. 1994లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. సాయన్నలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవిని అనుభవించి స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని 2003లో జైలుపాలైన సి. కృష్ణయాదవ్ సోమవారం టీఆర్ఎస్ జెండా పట్టుకోనున్నారు. అయితే 1994, 1999లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణయాదవ్ల మధ్య మంత్రి పదవి కోసం పోటీ, తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండేవి. హైదరాబాద్ నుంచే ఎన్నికైన ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్ధరిలో ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. ఇదే తలసాని, కృష్ణయాదవ్ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలకు కారణమైంది. కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. చివరికి కృష్ణయాదవ్ టీడీపీలోలో చేరినా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. అప్పటి వరకు హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్లో చేరిన వెంటనే కృష్ణయాదవ్కు ఆ పదవి లభించింది. కృష్ణయాదవ్ టీడీపీ అధ్యక్షుడిగా పనికిరాడంటూ చంద్రబాబుకు విన్నవించి ఆ పదవిని మాగంటి గోపీనాథ్కు కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరందరికన్నా సీనియర్ అయిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా విభేదిస్తారు. వీరేకాకుండా ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ సీబీఐ డెరైక్టర్ కె. విజయ రామారావుతో కూడా మాజీ టీడీపీ నేతలైన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలకు పలు విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. 1999 నుంచి 2004 వరకు మంత్రిగా ఉన్న ఆయన పోలీస్ ఆఫీసర్గానే వ్యవహరిస్తూ మాస్ లీడర్లుగా ఉన్న తలసాని, కృష్ణయాదవ్ల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడం భవిష్యత్లో ఎలాంటి పరిణామాలకు వేదికవుతుందో చూడాలి. -
గులాబీ గూటికి వలసలు..
-
గులాబీ గూటికి వలసలు..
టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్యూ * కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ * అదేబాటలో దానం, మరికొందరు? * షాక్లో టీటీడీపీ.. ఫిరాయింపులు అడ్డుకోలేక సతమతం * రెండు రోజుల్లో కొందరు ముఖ్య నేతలు చేరుతారంటున్న గులాబీ వర్గాలు * జీహెచ్ఎంసీ పీఠమే లక్ష్యంగా కసరత్తు * మరింత మందిని ఆకర్షించే పనిలో సీనియర్ మంత్రులు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పీఠం వలసలకు తెరలేపింది.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. గ్రేటర్ను కైవసం చేసుకునే దిశగా వ్యూహం పన్నిన అధికార టీఆర్ఎస్... మరింత మంది విపక్ష ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరింత మందిని తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్లు గురువారం టీఆర్ఎస్లో చేరారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పేర్లు బయటకు వెల్లడించకపోయినా రెండు రోజుల్లో మరో టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతారని ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. మరింత ముమ్మరం.. గ్రేటర్ పీఠంపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కనీసం వంద డివిజన్లలో విజయం కోసం టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ నెల రెండో వారం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో... ఆలోగానే ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి చేర్చుకోవడంలో నిమగ్నమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, ప్రకాష్గౌడ్లు టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ఇద్దరు రెండు రోజుల్లోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సీనియర్ మంత్రి ఒకరు సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశిస్తున్న దానం నాగేందర్ ఈ విషయాన్ని ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వం చెవిన వేశారు. దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్న ఆయన... సోమవారం తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చర్చలు జరుపుతున్న హరీశ్రావు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్లో చేరితే భవిష్యత్లో వారి రాజకీయ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండదని నేరుగా సీఎం కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఫోన్లో కేసీఆర్తో మాట్లాడాకే వారు పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటున్నారు. టీటీడీ బోర్డు పదవినివదులుకున్న సాయన్నకు ఆ స్థాయి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తామన్న హామీ తరువాతే... ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి టీఆర్ఎస్లో చేరారు. అయితే 'ఇంకో రెండు రోజుల్లో మరికొందరు ప్రముఖులు టీఆర్ఎస్లో చేరుతారు. మీరే చూస్తారుగా.. జంట నగరాల్లో కాంగ్రెస్, టీడీపీ దాదాపు ఖాళీ అవుతాయి..' అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం. షాక్లో టీ టీడీపీ.. వలసలతో తెలంగాణ టీడీపీ సతమతం అవుతోంది. పార్టీని వీడితున్న వారిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక ఆ పార్టీ నాయకత్వం తలపట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కోలేక చేతుత్తేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి నమ్మకమైన నేతగా పేరున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న పార్టీని వీడివెళతారని తాము ఊహించలేదని తెలంగాణ టీడీపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల సమయంలోనే సాయన్న పార్టీ మారతారని ప్రచారం జరిగినా... ఆయన టీడీపీతోనే ఉన్నారు. దీంతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమించారు. అయినా సాయన్న గురువారం టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇదివరకే నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు గులాబీ గూటికి చేరారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా గులాబీ దళంలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ప్రకాశ్గౌడ్ ఖండించారు. -
ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు చావుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. రాజకీయ ప్రముఖుల కుమార్తెలు ఓడిపోయారు. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జీ.సాయన్న,కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెలు ముగ్గురూ ఓడిపోయారు. 4వ వార్డు పికెట్లో పోటీ చేసిన ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితపై 844 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 8 వార్డులకు 114 మంది పోటీ చేశారు. నాలుగు టీఆర్ఎస్, రెండు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. మిగిలిన రెండిటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్పై 616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు మారేడ్పల్లి రామకృష్ణ (ఇండిపెండెంట్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
త్వరలో గులాబీ గూటికి తీగల, సాయన్న!
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు...గులాబీ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉండగా...తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగి... కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా తలసాని సోమవారం ఉదయం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయన దసరా రోజు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇక తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ మారే విషయంలో తన అనుచరులతో పాటు, నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు కూడా తీగల టీఆర్ఎస్లో చేరేందకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. తెలంగాణలోని టీడీపీ నేతలను ...పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. -
పాము చంపేస్తోంది!
నిజామాబాద్అర్బన్ : అసలే వర్షకాలం. అడపాదడపా కురిసిన వర్షానికి పరిసరాలు చిత్తడిగా మారాయి. పచ్చిక పెరిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో విషప్పురుగులు, సర్పాలకు సంచరించడానికి అనువైన వాతావరణం ఉంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తున్నవారిని కాటేస్తున్నాయి. పరిసరాలు చిత్తడిగా ఉండడంతో ఇళ్లలోకీ వస్తున్నాయి. జూలై నెలలోనే జిల్లాలో ఆరుగురిని కాటేసి చంపాయి. సోమవారం రాత్రి రెంజల్ మండల కేంద్రానికి చెందిన తండ్రి, కూతురు పాము కాటుకు గురై మరణించారు. ఇదే నెల తొమ్మిదో తేదీన జలాల్పూర్ గ్రామానికి చెందిన శివలక్ష్మి(5) పాము కాటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. 12వ తేదీన లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సాయన్న(58) అనే మేకల కాపరి పాముకాటుకు గురై మరణించారు. 16వ తేదీన వర్ని మండలం రుద్రూర్ ప్రభుత్వ పాఠశాలలో సాకలి శ్రీను అనే విద్యార్థి పాము కాటుకు గురై మరణించిన విషయం విదితమే. 20న బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన లక్ష్మి(29)తెల్లవారుజామున ఇంటిలో వంట చేస్తుండగా పాముకాటుకు గురై చనిపోయారు. అంతేకాకుండా ఈనెల 11వ తేదీన బోధన్లోని బాలికల సంక్షేమ వసతి గృహంలో, 26న బాల్కొండ మండలం రెంజర్ల ప్రాథమిక పాఠశాలలో పాము ప్రత్యేక్షమైన విషయం తెలిసిందే. విద్యార్థులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. మాక్లూర్ ఎస్సీ కాలనీకి చెందిన నీరడి సవిత, నిజామాబాద్ మండలం మోపాల్ ప్రభుత్వ వసతి గృహంలో ఉండే శివకుమార్, నిజామాబాద్ మండలం తిర్మన్పల్లి, మల్కాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు సైతం పాము కాటుకు గురైనా సకాలంలో వైద్యం అందడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అవగాహన లేక.. పాము కాటుకు గురైన వ్యక్తులు నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే నాటు వైద్యం పనిచేయక పరిస్థితి విషమిస్తుండడంతో ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించి పాము కాటుకు గురైనవారు మరణిస్తున్నారు. నవీపేట మండలంలో గంగారాం అనే నాటు వైద్యుడుండేవాడు. గత నెలలో పాము కరవడంతో నాటు వైద్యం చేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. పాము కాటు వేయగానే ఆస్పత్రులకు తీసుకెళ్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయి. మందులు ఉన్నా.. జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 సబ్సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులున్నాయి. 119 మంది వైద్యులు ఆయా ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు 24 గంటల ఆస్పత్రులు 29 ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఆంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంది. కానీ ఇవి పాము కాటుకు గురైనవారిని కాపాడలేకపోతున్నాయి. పాముకాటు వేసిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్తే సంబంధిత వైద్యుడు అందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రి సిబ్బంది పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వడానికి జంకుతున్నారు. ఆంటీబయోటిక్, టీటీ ఇంజక్షన్లు ఇచ్చి సమీపంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రికో జిల్లా కేంద్ర ఆస్పత్రికో తీసుకెళ్లేసరికి పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. తక్షణమే వైద్యం అందేలా చూడాలి పాముకాటుకు గురైన వ్యక్తికి తక్షణమే వైద్య స హాయం అందేలా చూడాలి. కరిచిన చోట స బ్బుతో శుభ్రంగా కడిగి ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. పాము కరిచిన 35 నిమిషాల్లో చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది. నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. -సురేశ్కుమార్, ఫిజీషియన్, నిజామాబాద్ రెంజల్లో తండ్రీకూతురు మృతి రెంజల్ : పాము రూపంలో వచ్చిన మృత్యువు తండ్రితోపాటు కూతురు ను కూడా బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేరోజు మృత్యువాత పడడంతో రెంజల్లో విషాదం అలుముకుంది. రెంజల్కు చెందిన అన్నం గంగారాం (44) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లా రు. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి కుటుం బ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంత రం భార్య లక్ష్మి, కూతురు సౌందర్య, చిన్న కుమారుడు వినోద్లతో కలిసి నిద్రపోయా రు. పెద్ద కుమారుడు యోగేశ్ స్థానిక పెట్రోల్ బంక్లో పనిచేస్తుండడంతో ఇంట్లో లేడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన పాము గంగారాం మెడపై కాటు వేసింది. నిద్ర మత్తులో ఉన్న ఆయన ఏదో పురుగు అనుకొని చేతిని విది ల్చాడు. అది పక్కనే పడుకున్న కూతురు సౌందర్య చెవిపై పడింది. ఆమె చెవిపై పాము కాటు వేసింది. పాము విషం ప్రభావంతో గంగారాం మేల్కొని వాంతులు చేసుకున్నా డు. దీంతో కుటుంబ సభ్యులు మేల్కొని చుట్టూ గాలించారు. ఏదైనా పురుగు కాటు వేసి ఉంటుందని భావించి తిరిగి నిద్రకు ఉపక్రమిస్తున్న తరుణంలో కూతురు కూడా వాం తులు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగువారిని పిలిచారు. వారు వచ్చి ఇద్ద రూ పాము కాటు కు గురైనట్లు గుర్తిం చి నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే నీటిని తాగిన గంగారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. నాటు వైద్యుడు వారిని పరీక్షించి ఆస్పత్రి కి తీసుకెళ్లాలని సూచించాడు. 108 అంబులెన్స్లో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో సౌందర్య మరణించింది. జిల్లా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత గంగారాం మృత్యువాతపడ్డారు. మృతురాలు సౌందర్య ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దే తల్లికి చేదోడు గా ఉంటుంది. పాము ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరిని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ముగ్గురు రైతులను మింగిన అప్పులు
సారంగాపూర్/భైంసా: అప్పుల బాధలు తాళలేక ముగ్గురు రైతులు ఆదివారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన బట్టి సాయన్న(52) అనే కౌలు రైతుకు దిగుబడి సరిగా రాక రూ.3 లక్షల అప్పుల య్యాయి. అప్పు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు. భైంసా మండలం పేండ్పెల్లికి చెందిన రైతు దేశెట్టి ఆనంద్బాబు(42) బ్యాంకులో రూ.75వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2.25 లక్షల అప్పులు చేశాడు. తీర్చలేక ఉరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తిలో కల్కూరి కిష్టయ్య అనే కౌలు రైతు వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ.4.50లక్షల అప్పు చేశాడు. పంటలు చేతికందక అప్పులు మిగిలాయి. వాటిని తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.