secret visit
-
మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటన.. అంతా సస్పెన్స్..?
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లిన లోకేష్.. అక్కడి నుంచి ఎక్కడి వెళ్లారో సస్పెన్స్ నెలకొంది. రెండు వారాల్లోనే రెండోసారి మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.కాగా, నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.. విమానాశ్రయం నుంచి నేరుగా జన్పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్న లోకేష్.. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చిది. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది. -
చైనాలో కిమ్ రహస్య పర్యటన..!
బీజింగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనాలో పర్యటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం కిమ్ రహస్యంగా చైనాలో పర్యటించడానేది ఆ వార్తల సారంశం. కిమ్ పర్యటనపై ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ ఎవరితో బేటీ కానున్నాడు, ఏయే అంశాలపై చర్చించనున్నాడనేది ఆసక్తిగా మారింది. దీనిపై అటూ చైనా నుంచి గానీ, ఉత్తర కొరియా నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ కిమ్ చైనా పర్యటన వాస్తవమైన పక్షంలో 2011లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుంది. చైనా, నార్త్ కొరియా బార్డర్లో బలగాలను మోహరించడం, బీజింగ్లోని ప్రముఖ హోటల్ వద్ధ భద్రత ఏర్పాట్లు చేపట్టడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. చాలా కాలంగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య న్యూక్లియర్ క్షిపణుల అంశంలో వివాదం పరిష్కారం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కిమ్ చైనా పర్యటనపై వార్తలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. చాలా కాలం నుంచి ఉత్తర కొరియా, చైనాకు మిత్ర దేశంగా ఉంది. కిమ్ తండ్రి చనిపోక ముందు చాలా సార్లు రహస్యంగా చైనా పర్యటన చేపట్టారు. -
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
-
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం రహస్యంగా పర్యటిస్తోంది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది. శనివారం సింగపూర్ సభ్యులు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఆర్డీవో భాస్కరనాయుడు దగ్గరుండి సింగపూర్ బృందాన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. కాగా ఏపీ రాజధాని పరిధిలోని భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల ప్రజలు.... సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటారని వారిని ఏపీ సర్కార్ రహస్యంగా తిప్పుతోంది.