Shiv Menon
-
సునంద తనయుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రమేయంపై ఆమె తనయుడు శివ్ మీనన్ను పోలీసులు గురువారం ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న మీనన్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. సునంద మరణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు సునంద మృతి కేసులో 15మందిని విచారించారు. కాంగ్రెస్ ఎంపీ, ఆమె భర్త శశి థరూర్, ఆయన సిబ్బంది, సన్నిహితులు, సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్సింగ్, సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్లతో పాటు పలువురిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే శివ్ మీనన్కు సమన్లు జారీ చేశారు. -
మీడియా ఒత్తిడే ఆత్మహత్యకు కారణమైంది: శివ్ మీనన్
మీడియా ఒత్తిడి, వ్యక్తిగత టెన్షన్లు, వివిధ రకాల వైద్య చికిత్సలు తన తల్లి సునంద పుష్కర్ ఆత్మహత్యకు దారి తీశాయని ఆమె తనయుడు శివ్ మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తల్లి మరణంపై వస్తున్న రకరకాల ఊహాగానాలను శివ్ మీనన్ కొట్టిపడేశారు. తన తల్లి, శశి థరూర్ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. అయితే సందర్భానుసారంగా తలెత్తే విబేధాలు జీవితంలో సర్వసాధారణమే అని ఆయన అన్నారు. తన తల్లికి భౌతికంగా హాని తలపెట్టేలాంటి వ్యక్తి శశి థారూర్ కాదన్నారు. తన తల్లి మరణంపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలేనని శివ్ అన్నారు. తన తల్లి శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి కారణం కాదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తన నివేదిక వెల్లడించిన విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు.