shrinking
-
పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది!
దాదాపు వందేళ్లుగా భూమ్మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఇదిలాగే పెరిగితే ఏమవుతుందోనన్న ఆందోళనా పెరుగుతూ వ చ్చింది. కానీ ఆ టెన్షన్ను తగ్గిస్తూ.. కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ పోతోంది. దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ.. పిల్లల శాతం తరుగుతూ వస్తోంది. భూమ్మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు (ఐదేళ్ల వయసు లోపు) ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది (పీక్ చైల్డ్ ఇయర్) అని.. తర్వాతి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ‘ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా అంచనాలు–2022 నివేదిక’ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు, ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోందని యూఎన్ నివేదిక వెల్లడించింది. ► మన దేశానికి వస్తే.. జనాభా నియంత్రణ, ప్రజల్లో అవగాహన క ల్పించే చర్యలతో 2004వ సంవత్సరం నుంచే చిన్న పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2021 నాటికి దేశంలో 11.53 కోట్ల మంది చిన్నారులు ఉన్నారని.. 2100 నాటికి ఇది 6.86 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. ► ఇటీవలిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనాలో అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది 1972లోనే. నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటికి 8.41 కోట్లకు, 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2.38 కోట్లలోపే ఉంటుందని యూఎన్ అంచనా వేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు.. వణికిపోతున్న ప్రజలు
సాక్షి, తిరుపతి: ఎంఆర్ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. నిన్న ఈ ప్రాంతంలోనే ఇంటి వెనుక నీటి సంపు ఒరలు పైకి లేవడం.. దీనికి తోడు రాత్రి నుంచి ఇళ్లు బీటలు తీయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని.. కాగా, తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణా నగర్లో ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్ ట్యాంక్ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణానగర్లోని ఘటనను ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది. అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. అయితే దీని వల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు. -
నేరస్ధుల సంఖ్య తగ్గిపోతోందోచ్!
-
ఆదర్శ సమాజం నిర్మించాలి..
నాందేవ్వాడ,న్యూస్లైన్ :సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవతా విలువలను పెంపొందించేందుకు, ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబా ద్రి కోరారు. సోమవారం రాజీవ్గాంధీ ఆడిటోరియం లో ఎస్ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ‘ సహాయ స్వచ్ఛంద సంస్థ’ కార్యక్రమంలో భా గంగా మదర్థెరిసా జయంతి నిర్వహించారు. ఈ సం దర్భంగా పలువురు పేద, అనాథ పిల్లలకు వివిధ వస్తువులు, దుస్తులను ఉచితంగా అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి మాట్లాడుతూ పేద, అనాథ పిల్లలను ఆదుకునేందుకు కళాశాల విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవ, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మదర్థెరిసా ఆశయాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమాజం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాని కి ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలని అన్నారు. ఇతర విద్యార్థులను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొ నే విధంగా చేయాలన్నారు. అనంతరం ఆర్ఐఓ విజయ్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా బాగుందన్నారు. సమాజంలో విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపడితే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి రోజు విద్యార్థులు దుబారా ఖర్చుపెడతారని, వాటిలో నుంచి ఒక్కరూపాయి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమన్నారు. ఒక్క రూపాయే కదా అని అనుకోవద్దని, వెయ్యిమంది విద్యార్థులు కలిస్తే కొన్ని వేల రూపాయలు అవుతాయని, అవి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతో తోడ్పడుతాయన్నారు. అనంతరం డిచ్పల్లికి చెందిన అనాథ పిల్లలు అవినాష్, విజయ్లక దుస్తులు, నిజామాబాద్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన నర్సయ్యకు కృత్రిమకాలు, నందిపేట మండలానికి చెందిన నిఖితకు దుస్తులు, గాయత్రికి ఫిజియోథెరఫి కిట్, నిఖిత్కు నెక్బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాంబశివరావు, కేర్ డిగ్రీ కళాశాల డెరైక్టర్ నరాల సుధాకర్, రెడ్క్రాస్ కార్యదర్శి రామకృష్ణాబుద్దిస్ట్, లక్ష్మణగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.