Shriya Bhupal
-
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు. -
ఫ్యాషన్ షో : షో టాపర్గా సింధు అదరహో
-
షో టాపర్గా సింధు అదరహో
సాక్షి, హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పండుగలు, వివాహ వేడుకలతో బిజీగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ‘శాంక్చురి’ పేరుతో కొత్త కలెక్షన్ను పరిచయం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో ఫ్యాషన్ షో నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు షో టాపర్గా వ్యవహరించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించిన తర్వాత స్వస్థలంలో సింధు పాల్గొన్న తొలి బహిరంగ కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ వేడుకలో సింధు పింక్ కలర్ హాఫ్ షోల్డర్ జాకెట్, అదే కలర్ స్కర్ట్తో పూబాలగా కనువిందు చేశారు. సింధు, శ్రియా భూపాల్ ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఈ పరిచయం మేరకు సింధు షోటాపర్గా వ్యవహరించారు. ఇక తన నూతన కలెక్షన్ గురించి శ్రియా భూపాల్ మాట్లాడుతూ.. ‘పెళ్లి, పండుగలు వంటి వేడుకల సందర్భంగా ధరించడానికి వీలుగా సంప్రదాయ, సమాకాలీన శైలులకు సంబంధించిన దుస్తులను రూపొందించాను. ఈ పండుగల సీజన్ కోసం తేలికపాటి, మృదువైన, ఆహ్లాదకరమైన వస్త్రశ్రేణిని పరిచయం చేస్తున్నాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి నమ్రతా శిరోద్కర్, సానియా మీర్జా కూడా హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక
-
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక, స్టార్ల హంగామా
అక్కినేని వారింట చిన్న కోడలుగా అడుగపెట్టబోయే చివరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి అయింది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరి వివాహానికి రామ్ చరణ్ నుంచి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వరకు టాలీవుడ్ స్టార్లందరూ హాజరయ్యారు. శ్రియా, అనిన్దిత్ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు శ్రియా భూపాల్, అద్భుతమైన వజ్రాల నెక్లెస్తో తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన చీరలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్దిత్, క్లాసిక్ శెర్వానీతో సింపుల్ లుక్లో కనిపించాడు. ఉపాసనకు అనిన్దిత్ కజిన్ కాగ, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్కు క్లోజ్ ఫ్రెండ్. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయ్యారు. సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్, లావణ్యలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కాగ, శ్రియా భూపాల్కు అంతకముందు నాగార్జున చిన్న కొడుకు అఖిల్తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ ఇరువురి వివాహం ఆఖరి నిమిషాల్లో ఆగిపోయింది. అఖిల్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఇరు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా.. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్టాఫిక్ కూడా మారింది. శ్రీయా భూపాల్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అఖిల్ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. -
శ్రియా భూపాల్ పెళ్లిలో మెగా కపుల్
మెగా కపుల్ చెర్రీ ఉపాసన ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కోసం అక్కడికి వెళ్లలేదు. ఓ పెళ్లి వేడుకుకు హాజరయ్యారు. జీవీకే, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఈపాటికే ఈ పెళ్లి ఎవరిదనే విషయం అర్థమైపోయిందనుకుంటా. ఈ పెళ్లి మరెవరిదో కాదు శ్రియా భూపాల్ది. శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది అందరికి. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పెళ్లి క్యాన్సిల్పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ఈ సంఘటన తరువాత శ్రియా భూపాల్ వివాహం హీరో రాం చరణ్ భార్య ఉపాసన కజిన్తో నిశ్చయించారు. తాజాగా ఈ పెళ్లి ప్యారిస్ సమీపంలోని ఓ సిటీలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి రాంచరణ్, ఉపాసన హాజరు అయ్యారు. వీరిద్దరు అక్కడ దిగిన ఫోటోను ఉపాసన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీరిద్దరు కొత్త జంటలా కనిపిస్తున్నారంటూ అభిమానుల కామెంట్స్తో ఆ ఫోటో వైరల్గా మారింది. ❤️ #familywedding #ramcharan pic.twitter.com/pA5juGLv1a — Upasana Kamineni (@upasanakonidela) May 27, 2018 -
శ్రియా భూపాల్ నిశ్చితార్థం
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయింది. ప్యాషన్ డిజైనర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా.. అక్కినేని అఖిల్తో నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్పై దృష్టి పెట్టి పెట్టాడు. ఈ బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్..అనిందిత్తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనిందిత్ గురించి: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్కు సోదరుడు అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి వివాహం పారిస్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Lovely evening! Best wishes to #shriyaanindith. #shriyabhupal #shriyasom #happytime #goodtimes #instagood #pinkyreddy #friends #family A post shared by Pinky Reddy (@pinkyreddyofficial) on Apr 21, 2018 at 9:21pm PDT -
ఉపాసన కజిన్తో శ్రియా భూపాల్ పెళ్లి?
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దు అయింది. అప్పట్లో ఆ వార్త హాట్టాపిక్గా నిలిచింది. పెళ్లి క్యాన్సిల్పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం శ్రియా భూపాల్ పెళ్లి వార్తలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే శ్రియా భూపాల్ పెళ్లి చేసుకోబోతుందని, రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్తో ఆమె పెళ్లి నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలపై శ్రియా భూపాల్, ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. అఖిల్తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత, ఈ సమస్య పూర్తిగా సమసిపోవాలంటే శ్రియా భూపాల్కు త్వరగా పెళ్లిచేయడమే కరెక్ట్ అని వారి పెద్దలు భావించినట్టు తెలిసింది. కానీ అఖిల్ పెళ్లి మాత్రం ఇప్పుడు ఉండదని, హీరోగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించినట్టు టాక్. -
అఖిల్ పెళ్లికి బ్రేక్..?
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లి పై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గత డిసెంబర్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే మనవరాలితో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ సమ్మర్ లో ఈ ఇద్దరి వివాహాన్ని ఇటలీలో అత్యంత సన్నిహితుల నడుమ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ పెళ్లికి బ్రేక్ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కారణాలేంటో తెలియకపోయినా.. ఇటలీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్న వారికి ఇరు కుటుంబాల నుంచి టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా సమాచారం అందించారట. టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖలతో పాటు పలువురు ఇండస్ట్రియలిస్ట్ లతో కలిపి దాదాపు 700 మంది ఈ పెళ్లికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి కి బ్రేక్ పడిందన్న వార్త ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. -
ఇది మా కుటుంబం
కుటుంబం.. ఇది మా కుటుంబం... అంటున్నారు సమంత. అనడం మాత్రమే కాదు.. తన కొత్త కుటుంబంతో సరదాగా షికార్లకు వెళుతున్నారు. కాబోయే మరిది, తోడికోడలు అక్కినేని అఖిల్, శ్రీయా భూపాల్తో కలసి తన కాబోయే భర్త నాగచైతన్యతో సరదాగా ఓ ఫొటో దిగారు సమంత. నలుగురూ ఒకే ఫ్రేములోకి వచ్చిన ఫొటోను బయటపెట్టేశారు. అన్నదమ్ములతో పాటు తోడికోడళ్లు కూడా భలే కలసిపోయారని అభిమానులు ఈ ఫొటో చూసి మురిసిపోతున్నారు. అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న, పెళ్లి వచ్చే ఏడాది జరగనున్నాయి. చైతూ, సమంతల జోడీ కూడా వచ్చే ఏడాది పెళ్లిపీటలు ఎక్కనుంది. -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి!
హైదరాబాద్: అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్- అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9వ తేదీన జరగనుందని సమాచారం. నిశ్చితార్థం అనంతరం అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించేందుకు ఇరుకుటుంబాలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు నాగాచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే అఖిల్-శ్రీయా ప్రేమకథ కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు ఒకేసారి చేసేందుకు నాగార్జున సిద్ధమయ్యారని కథనాలు వచ్చాయి. అయితే, పెళ్లి విషయంలో నాగాచైతన్య-సమంత ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడంతో ముందుగా అఖిల్-శ్రీయా భూపాల్ వివాహానికి నాగార్జున ఓకే చెప్పారు. ఫ్యాషన్ రంగంలో పేరొందిన శ్రీయా భూపాల్ తో గత కొన్నాళ్లుగా అఖిల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ భామలు శ్రీయ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్సింగ్లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. తదితరులకు శ్రీయా భూపాల్ దుస్తులు డిజైన్ చేశారు. అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్ కుటుంబానికి స్నేహం కూడా ఉందని సమాచారం. అఖిల్ వివాహం అనంతరం నాగాచైతన్య, సమంత కూడా పెళ్లి పీటలు ఎక్కవచ్చునని అంటున్నారు. -
అఖిల్ వివాహవేదిక ఖరారైందా..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, తన రెండో సినిమాతో పాటు పెళ్లి వార్తలతోనూ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తొలి సినిమా పరాజయంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తన పెళ్లి వేడుకకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. తన ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రేయా భూపాల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్ త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయడానికి రెడీ అవుతున్నాడు. నాగచైతన్య, సమంతల వివాహం కన్నా ముందే.. అఖిల్ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. అఖిల్ తన రెండో సినిమా పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఖిల్, శ్రేయా వివాహవేదికపై అధికారిక ప్రకటన రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
శ్రీయా'కృతులు'
ఇవిగో శ్రీయాకృతులు... ఆకృతులలో శ్రీయ రాగాలు! మన తెలుగమ్మాయి సృష్టిస్తున్న కళాకృతులు!! శ్రీయా భూపాల్-అఖిల్ అక్కినేని మంచి స్నేహితులని, ఆ స్నేహం పండి ప్రేమ అయ్యిందని వార్తలు బట్టలు చింపుకొని మరీ కేకలు పెడుతున్నాయి. కానీ, అంతకు ముందు.. ఎంతో ముందు బట్టల కట్టుతో శ్రీయాకృతులు అందరినీ ఆ...కట్టుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ డిజైనర్ శ్రీయా భూపాల్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2016లో ‘శ్రీయసోమ్’ లేబుల్ కలెక్షన్ ప్రదర్శనలో భాగంగా మోడల్తో! నా ఔట్ఫిట్స్ వేసుకున్నవారు అచ్చు బార్బీ బొమ్మల్లా కనిపిస్తారు. నా స్కూల్ ఏజ్లో ఐదు బార్బీ డాల్స్ కొన్నాను. వాటికి రకరకాల అందమైన డ్రెస్సులు డిజైన్ చేసి, వేసి మురిసిపోయేదాన్ని. అలా ఈ కళ ఎప్పటికప్పుడు కొత్త సృజనకు తావిస్తూ వచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్లో అనుకోకుండా అడుగుపెట్టాను. ఆ తర్వాత అదే నా ప్యాషన్ అయ్యింది. నా మొట్టమొదటి అధికారిక ఫ్యాషన్ షో ఈ ఏడాది లాక్మె ఫ్యాషన్ వీక్ సమ్మర్లో ప్రదర్శించే అవకాశం దక్కింది. ఈ షో నా జీవితాన్నే మార్చేసింది. జీవితాన్ని పువ్వుల భరితంగా మార్చేసే ఈ దుస్తులు మహిళను ప్రత్యేకంగా చూపుతాయి. ఎప్పటికప్పుడు నా గత డిజైన్స్ నుంచి మరింత మెరుగైన డిజైన్స్ సృష్టించడంపై దృష్టి పెడుతుంటాను. - శ్రీయాభూపాల్, ఫ్యాషన్ డిజైనర్ -
ఎవరీ శ్రీయా భూపాల్?
ఫ్యాషన్ ప్రపంచంలో శ్రీయా భూపాల్ చాలా ఫేమస్. కానీ, బయటి ప్రపంచానికి ఆమె ఎవరో తెలియదు. ఇది నిన్న, మొన్నటి మాట. ఇప్పుడు అఖిల్తో ప్రేమలో ఉన్నది శ్రీయా భూపాల్ అని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో ఔత్సాహికుల్లో ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆరాటం మొదలైంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తల ప్రకారం ఫ్యాషన్ రంగంలో శ్రీయా భూపాల్కి మంచి పట్టు ఉందట. రెండేళ్ల క్రితం ‘శ్రీయా సమ్’ లేబుల్ కలక్షన్ ‘ఎబ్ అండ్ ఫ్లో’ని ప్రారంభించారట. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన తన తండ్రికి భావగీతం (ఓడ్)గా తన లేబుల్ని అంకితం చేశారని సమాచారం. కాగా, రెండు నెలల క్రితం జరిగిన ‘ల్యాక్మి ఫ్యాషన్ వీక్’లో తొలిసారి తన కలక్షన్ని శ్రీయ ప్రదర్శించారని టాక్. తొలి చూపులోనే శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయట. అలా ఫస్ట్ స్టెప్లోనే భేష్ అనిపించుకున్నారని ఫ్యాషన్ ఫీల్డ్ అంటోంది. శ్రీయ గురువు ప్రముఖ హిందీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని అట. శ్రీయా భూపాల్ పలువురు కథానాయికలకు కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారని కూడా ఫిలింనగర్ టాక్. శ్రీయ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్సింగ్లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. ఇలా శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిన తారల జాబితా చాలానే ఉందట. ఎప్పట్నుంచో అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్ కుటుంబానికి స్నేహం ఉందని ఆంగ్ల పత్రిక ప్రచురించిన విషయం విదితమే. సో.. మొదట్లోఅఖిల్, శ్రీయ స్నేహంగానే ఉండి ఉంటారేమో. ఆ తర్వాతే ఇష్టంగా మారి ఉంటుందేమో. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త వినిపిస్తోంది కాబట్టి, అఖిల్-శ్రీయల లవ్స్టోరీకి పెళ్లితో శుభం కార్డు పడుతుందా?