Sikh chawni
-
'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'
-
'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'
హైదరాబాద్లోని కిషన్బాగ్ సిక్ ఛావనీ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో దానం నాగేందర్ మాట్లాడుతూ... శుక్రవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దానం ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు జిల్లాలకే పరిమితమైన పార్టీ దానం ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేసీఆర్ బ్లాక్మెయిల్కు సెటిలర్లు, అధికారులు భయపడొద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణలో సెటిలర్లు, అధికారుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని దానం స్పష్టం చేశారు. -
కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం
హైదరాబాద్ : హైదరాబాద్లోని కిషన్బాగ్ సిక్చావ్ని అల్లర్లపై గవర్నర్ నరసింహన్ న్యాయ విచారణకు ఆదేశించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50వేల సహాయాన్ని ప్రకటించారు. ఘర్షణల్లో ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు. పాతబస్తీ ప్రజలందరకూ ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.