Slot
-
వారంలోనే పాస్పోర్ట్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: పాస్పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత వారం రోజులలోపే స్లాట్ లభించేలా చర్యలు చేపట్టామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి (ఆర్పీఓ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చే సుకొన్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని చెప్పా రు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కోవిడ్ అనంతరం పాస్పోర్ట్ స్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో స్లాట్ కోసం 30 నుంచి 40 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం దీనిని గరిష్టంగా 8 పని దినాలకు తగ్గించాం. 2025లో వారం రోజుల్లోనే స్లాట్ దొరికేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’అని వివరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్పోర్ట్ ఎన్వలప్ కవర్ను ఆమె ఆవిష్కరించారు. ఆదిలాబాద్, కామారెడ్డిలో మరుసటి రోజే స్లాట్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్కే) ఉన్నాయని స్నేహజ తెలిపారు. పీఓపీఎస్కేల్లోనూ వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోందని చెప్పారు. ఆదిలాబాద్, కామారెడ్డి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని వెల్లడించారు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత పోలీసు వెరిఫికేషన్కు పట్టే సమయాన్ని మినహాయించి తత్కాల్ పాస్పోర్టును ఒకటి నుంచి మూడు పని దినాలు, సాధారణ పాస్పోర్టును ఐదు నుంచి ఏడు పనిదినాల్లో జారీ చేస్తున్నాం’అని వివరించారు.సందేహాల నివృత్తికి వాట్సాప్ నంబర్దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించడానికి సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో పబ్లిక్ డేలు నిర్వహిస్తున్నామని స్నేహజ తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా రావచ్చని, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నవాళ్లు సోమ, మంగళ, శుక్రవారాల్లో రావాలని సూచించారు. ఈ రెండు రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎక్స్, వాట్సాప్, ఫోన్కాల్స్ ద్వారానూ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. పాస్పోర్ట్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ‘81214 01532’వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా పాస్పోర్ట్ సేవలు అందిస్తామని తెలిపారు. రెండేళ్లకు మించి శిక్షపడితే పాస్పోర్ట్ ఇవ్వం..పాస్పోర్ట్ పొందడానికి కనిష్ట, గరిష్ట వయో పరిమితులు లేవని స్నేహజ తెలిపారు. పోలీసు వెరిఫికేషన్లో ప్రతికూల అంశాలు తెలిసినా, దరఖాస్తుదారుడికి ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినా పాస్పోర్ట్ జారీ చేయబోమని చెప్పారు. అలాంటివారికి కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్ మైనర్ల విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి అనుమతి చాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.‘పాస్పోర్ట్ పోగొట్టుకున్న వాళ్లు ఆ దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీని జత చేయక్కర్లేదు. మీ–సేవా కేంద్రం నుంచి తీసుకున్న ‘లాస్ట్’ సర్టీఫికెట్ ఇస్తే సరిపోతుంది. వివాహానంతరం ఇంటి పేరు మారిన మహిళలు తాజా అడ్రస్ ప్రూఫ్తో డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మ్యారేజ్ సర్టీఫికెట్ తప్పనిసరి కాదు’అని పేర్కొన్నారు. బ్రాంచ్ సెక్రటేరియేట్ నుంచి గత ఏడాది 1,400 సర్టీఫికెట్ల అటెస్టేషన్ లేదా అపోస్టల్ చేశామని వివరించారు.‘పాస్పోర్టు’ సమస్యలు..సందేహాలా?89777 94588 నంబర్కు వాట్సాప్ చేయండి.. పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ సమాధానాలిస్తారుపాస్పోర్టు కోసమే కాకుండా.. అది వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్కే), వెబ్సైట్ లాంటివి ఉన్నా సామాన్యుడికి ఇప్పటికీ అనేక సందేహాలు, సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలు అర్థంకాక ఇప్పటికీ పలువురు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కేవలం రీజనల్ పాస్పోర్టు కార్యాలయం జారీ చేసే పాస్పోర్టు విషయంలోనే కాదు.. దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియెట్ అందించే అటెస్టేష¯న్ అండ్ అపోస్టల్ సేవల పైనా పలు సందేహాలు ఉంటున్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ముందుకు వచ్చింది ‘మీతో సాక్షి’. మీ వివరాలు, సమస్య, సందేహాన్ని 89777–94588 నంబర్కు టెక్ట్స్, వాయిస్ మెసేజ్ల రూపంలో వాట్సాప్ చేయండి. ‘మీతో సాక్షి’ వీటిని రీజనల్ పాస్పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ దృష్టికి తీసుకెళుతుంది. మీ సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యలు, సందేహాలు వెంటనే తెలియజేయండి. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
పాస్పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
ఓటు వేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి!
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్ల ముందు చాంతాడంత లైన్లు! వరుసలో నిరీక్షించే ఓపిక లేక కొందరు ఆ బారులను చూసే వెనక్కి వెళ్లిపోతుంటారు. అలాగాకుండా ఓటుకు స్లాట్ను బుక్ చేసుకొని మనకు కుదిరిన టైంలో వెళ్లి ఓటేస్తే? ఎన్నికల సంఘం ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇది నిజం కానుంది. ‘ఈ విధానంతో ఓటర్లు బారులను తప్పించుకోవచ్చు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. పోలింగ్ సమయాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ సౌకర్యం కల్పించడంపై యోచిస్తున్నాం’ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా గురువారమిక్కడ తెలిపారు.