SRH vs RR
-
బాధపడుతూ కూర్చోలేదు.. తప్పులు రిపీట్ చేయను: ఇషాన్
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. రెండున్నరేళ్లుకాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో సిరీస్లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రసెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్తో నివారం జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు! -
నన్నే అంటావా?.. అందుకే చితక్కొట్టా: వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా వైభవ్.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.బ్యాట్తోనే సమాధానంతద్వారా ఐపీఎల్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. గతేడాది గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే వైభవ్ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్రైజర్స్పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగేకు వైభవ్ కౌంటర్ వేశాడు.నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదుసన్రైజర్స్తో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తమ మేనేజర్ రోమీ భిందర్తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్కు దిగాను. గత మ్యాచ్లో నన్ను అతడు అవుట్ చేశాడు.ఆరోజు నేను నా ఫోన్ చెక్ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్ ఈ మేరకు స్పందించాడు.గత మ్యాచ్లో తొలి బంతికేకాగా సన్రైజర్స్తో ఆడిన గత మ్యాచ్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో తొలి బంతికే అవుటైన వైభవ్ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్... కమిన్స్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్ కొట్టాడు.మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా అవుట్ కాగా... వైభవ్ ఇచ్చిన క్యాచ్ను రైజర్స్ ఫీల్డర్ అనికేత్ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వైభవ్పై హింగే కామెంట్స్సకీబ్ ఓవర్లో వరుసగా 6, 4, 6తో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్ సెంచరీ వృథా అయింది.కాగా హైదరాబాద్లో వైభవ్ను అవుట్ చేసిన తర్వాత ప్రఫుల్ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్) బౌన్సర్ వేసి అవుట్ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా జైపూర్లో వైభవ్ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాంA first-ball duck a few days ago to the fastest century by an Indian last night. Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026 -
ఇలాంటి స్కోర్లను మా బ్యాటర్లు ఊదేస్తారు.. కమిన్స్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషన్ (74), నితీశ్ కుమార్ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్ఆర్హెచ్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.ఈ గెలుపుపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇలా స్పందించాడు. సీజన్లో తొలి మ్యాచ్ (ఈ సీజన్లో కమిన్స్కు ఇదే తొలి మ్యాచ్) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్ కిషన్ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్ప్లేలోనే మ్యాచ్పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, కమిన్స్ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. -
అదే మా కొంపముంచింది.. సన్రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. వైభవ్ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్రైజర్స్ ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ రాయల్స్ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇలా స్పందించాడు.భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్లు వదిలేశాం. అభిషేక్ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.ఆర్చర్ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ మ్యాచ్లో రాయల్స్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యాలు, క్యాచ్లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్ రివర్స్ అయ్యింది. ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్లో రియాన్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. పిచ్ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతో తలో ఓవర్ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. -
SRHకు అదిరిపోయే శుభవార్త
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్ బౌలర్ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా కెప్టెన్గా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్ (Pat Cummins).. ఫిట్నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.కమిన్స్ లేని లోటు సుస్పష్టంమరోవైపు.. సన్రైజర్స్ జట్టులో సైతం కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్, ప్రధాన పేసర్గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2026లో కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మాత్రమే గెలిచింది.గెలుపు బాట తొలుత కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచిన ఇషాన్ కిషన్ బృందం.. తాజాగా రాజస్తాన్ రాయల్స్పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్కు సంబంధించిన అప్డేట్ అందడం ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఆరోజే హైదరాబాద్కుక్రిక్బజ్ కథనం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్ 17 నాటికి అతడు హైదరాబాద్కు చేరుకుంటాడు. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్ స్థానంలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ సన్రైజర్స్ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?BCCI: సూర్యకుమార్ యాదవ్పై వేటు! -
కావ్యా మారన్ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ నుంచి సన్రైజర్స్కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, అనూహ్య రీతిలో సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్ విధ్వంసకరవీరుడు వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపడంలో ఎస్ఆర్హెచ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఆ సమయంలో సన్రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రఫుల్ ఊహించని రీతిలో బ్రేక్ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026ఇక వైభవ్తో పాటు రాజస్తాన్ కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను కూడా ప్రఫుల్ హింగే వచ్చీ రాగానే పెవిలియన్కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.సన్రైజర్స్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి.It's all Orange in Hyderabad 🧡A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️They end #RR's unbeaten streak this season 👏Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026 -
షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్లో మొబైల్ ఫోన్ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.వైభవ్ సూర్యవంశీ కూడా...కాగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోమీ భిందర్ మొబైల్ ఫోన్ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. వీరిద్దరు మొబైల్లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా ఐపీఎల్ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్కు మొబైల్ ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.తొలి ఓటమిఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా సన్రైజర్స్ బ్యాటింగ్కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్రైజర్స్. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సన్రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాయల్స్ నాలుగు గెలిచింది. చదవండి: సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
నిరాశలో హింగే.. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?
‘ఈ మ్యాచ్తో ప్రఫుల్ హింగే ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్ కింగ్స్తో గత మ్యాచ్ టాస్ సమయంలో సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పిన మాట ఇది. రైజర్స్ బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ సబ్గా హింగే రావాల్సింది. నిరాశకు లోనైన హింగేదురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్ ఉనాద్కట్ను రైజర్స్ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ చాన్స్ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్ రాయల్స్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్ 2024–25 సీజన్తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 27 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్కు ఐపీఎల్కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్ యాదవ్ను అభిమానించే ప్రఫుల్ అభిమాన బౌలర్ ప్యాట్ కమిన్స్. నాగ్పూర్కు చెందిన ప్రఫుల్ ఒక్కసారిగా సీన్లోకి రాలేదు. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్లో జరిగిన పేస్ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు. విదర్భ టి20 లీగ్లో నెకో మాస్టర్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్రైజర్స్ ట్రయల్స్లో జట్టు బౌలింగ్ కోచ్ ప్రఫుల్ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్రైజర్స్ తీసుకుంది. మరోవైపు.. బిహార్కు చెందిన పేసర్ సాకిబ్ హుస్సేన్ కూడా ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్కతా టీమ్లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్ రూ. 30 లక్షలకు ఎంచుకుంది. చదవండి: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ -
సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి రాయల్స్కు ఈ సీజన్లో మొదటిది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి, తాజా ఓటమి తర్వాత కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ ఓటమి తర్వాత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్లో తొలి ఓటమి కావడంతో అతనిలో పెద్దగా సీరియస్నెస్ కనిపించలేదు. తప్పిదాలను ఒప్పుకుంటూనే ఓటమిని లైట్గా తీసుకున్నట్లు మాట్లాడాడు. సింగిల్ డిజిట్ స్కోర్కే సగం వికెట్లు కోల్పోయినా, బ్యాటింగ్ డెప్త్ అంటూ గొప్పలు పోయాడు. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని, పిచ్ను అంచనా వేయలేకపోవడాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. సన్రైజర్స్ అరంగేట్రం సీమర్లను ప్రశంసించాడు.అతని మాటల్లో.. వికెట్లు త్వరగా కోల్పోవడం మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. వారు బాగా బౌలింగ్ చేశారు. కొన్ని లెక్కలు తప్పాయి. దీన్ని ఒక చిన్న మినహాయింపుగా తీసుకుంటాం. ఎక్కువగా ఆలోచించం. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా 159 పరుగులు చేయడం మా బ్యాటింగ్ లోతుకు నిదర్శనం.పిచ్ పరిస్థితులు కొత్త బంతి కాస్త స్టికిగా అనిపించింది. షైనింగ్ తగ్గాక స్లో అయ్యింది. ఓ రకంగా ఆలోచిస్తే, మొదట బ్యాటింగ్ చేయడం మంచిదై ఉండేది. ఏదిఏమైనా మేమే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కొత్త సీమర్లపై ప్రశంస సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన సీమర్లు ఫ్రఫుల్ హింజ్, సకిబ్ హుస్సేన్కు నా అభినందనలు. వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రేక్షకుల ఒత్తిడి ఉన్నప్పటికీ, మొదటి నాలుగు–ఐదు ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేశారు. నేను వారిని ఎక్కువగా చూడలేదు. కానీ ఈ ప్రదర్శన అద్భుతం. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడం అప్పటికి ఇషాన్ బాగా ఆడుతున్నాడు. జడ్డూ భాయ్కి బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు లేవు. బిష్ణోయిని నమ్మాను. వారు మేము అనుకున్న దానికంటే 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలిపెట్టి, తదుపరి మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతాం. మొత్తంగా రియాన్ మాటలను బట్టి చూస్తే.. ఈ ఓటమిని లైట్గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. -
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
-
SRH vs RR: మ్యాచ్కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో సన్రైజర్స్ ఒకటి మాత్రమే గెలిచింది.ఆసక్తికర పోరుమరోవైపు.. రాజస్తాన్ నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్రైజర్స్ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్ ఫామ్ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఇటు సన్రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్రూమ్ అందుబాటులో ఉండదని తెలిపింది.స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే👉కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు👉బ్లూటూత్ హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, ఎయిర్పాడ్స్👉సిగరెట్లు, లైటర్, అగ్గిపెట్టె👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్, కూల్డ్రింక్స్👉పెంపుడు జంతువులు👉తినుబండారాలు👉బ్యాక్పాక్స్, హ్యాండ్బ్యాగ్స్👉ల్యాప్టాప్స్, సెల్ఫీ స్టిక్కులు👉హెల్మెట్స్, బైనాక్యులర్స్👉పేలుడు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్👉డ్రగ్స్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
SRH తుదిజట్టులో ఊహించని బౌలర్.. 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!
వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా సోమవారం రాజస్తాన్ రాయల్స్తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడి సన్రైజర్స్ వెనుకబడగా.. నాలుగింటికి నాలుగూ గెలిచి రాజస్తాన్ జోరు మీదుంది.కమిన్స్ లేనిలోటు తెలుస్తోందికాబట్టి టేబుల్ టాపర్ రాజస్తాన్తో మ్యాచ్లో గెలవాలంటే సన్రైజర్స్ తీవ్రంగా శ్రమించకతప్పదు. ఈ క్రమంలో సన్రైజర్స్ తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై మంచి స్కోరు సాధించినా రైజర్స్ నిలబెట్టుకోలేకపోయింది. రెగ్యులర్ కెప్టెన్, ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్ లేనిలోటు మరోసారి స్పష్టంగా కనిపించింది.బౌలర్ల ముల్లన్పూర్లో సన్రైజర్స్ 219 పరుగులు చేయగా.. పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లు జయదేవ్ ఉనాద్కట్ (3 ఓవర్లలో 40), ఇషాన్ మలింగ (3 ఓవర్లలో 46), నితీశ్ రెడ్డి (2 ఓవర్లలో 20 పరుగులు) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.దారుణ ప్రదర్శనశివాంగ్ కుమార్ (3 ఓవర్లలో 33) మెరుగ్గా రాణించి మూడు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే (4 ఓవర్లలో 38) ఒక వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్తో మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు కూర్పులో.. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఆర్హెచ్ పేసర్లు గత మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఉనాద్కట్ 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చుకోగా.. నితీశ్ రెడ్డి ఇంచుమించు అదే స్థాయిలో బౌలింగ్ చేశాడు. అయితే, బ్యాటర్గా మాత్రం ఈ ఆల్రౌండర్ ప్రదర్శన బాగుంది. దీంతో నితీశ్ రెడ్డి తుదిజట్టులో పదిలంగా ఉండటం ఖాయం.నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ?అయితే, ఉనాద్కట్ను రాజస్తాన్తో మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేసి.. ఆటను మెరుగుపరుచుకునేలా సమయం ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అతడికి బదులు టీమిండియాకు ఆడిన శివం మావిని రంగంలోకి దించితే.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కడా తీయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే బిహార్ ఫాస్ట్ బౌలర్ సకీబ్ హుసేన్ను ఆడించినా బాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన శివం మావి.. ఇప్పటికి 32 మ్యాచ్లు ఆడి 30 వికెట్లు తీయగలిగాడు. ఈ యూపీ పేసర్ చివరగా 2022లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో సన్రైజర్స్ శివం మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. మరి రాజస్తాన్తో మ్యాచ్లో అతడికి రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుందేమో చూడాలి!రాజస్తాన్తో మ్యాచ్కు సన్రైజర్స్ తుదిజట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్/శివం మావి.చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!You don’t hear it, you feel it 🔥🤌 pic.twitter.com/oynhxm0jCs— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026 -
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్రైజర్స్ కొనసాగుతోంది.గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడ్డ సన్రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది. అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!రికార్డుల రారాజుకే సాధ్యమైందిరన్మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.అత్యధిక వరుస విజయాలుఐపీఎల్ చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.పార్ట్నర్స్ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.హ్యాట్రిక్ వీరుడుఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్లు నమోదు చేసిన బౌలర్గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై.. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.అరంగేట్రంలోనే అదరగొట్టివెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.డివిలియర్స్ పేరిటే..ఒక సీజన్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో అతడు మొత్తంగా 19 క్యాచ్లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు.. -
#IPL2025 : ఉప్పల్ స్టేడియంలో వాళ్ళ సందడి వేరే లెవెల్...(ఫొటోలు)
-
జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్కు ఇంతకంటే ఏం కావాలి?
గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొన్ని కీలక మార్పులు చేసింది. అందులో మొదటిది ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమిన్స్ (Pat Cummins)కి నాయకత్వ బాధ్యతలను అప్పగించడం.. రెండోది ఆస్ట్రేలియాకే చెందిన ఓపెనర్, టీమిండియాకు ‘తలనొప్పి’ తెప్పించే ట్రావిస్ హెడ్ (Travis Head)ని అభిషేక్ శర్మకి జతగా ఓపెనింగ్కి పంపాలని నిర్ణయించడం. ఈ రెండు నిర్ణయాలు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్వరూపాన్నే మార్చేశాయి.పవర్ ప్లే అంటే ప్రత్యర్థికి దడేఅంతవరకూ ఎప్పుడూ విజయం కోసం ఎదురు చూసిన జట్టు.. ఇప్పుడు ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరిపోయింది. మ్యాచ్ తొలి ఓవర్లలో, ముఖ్యంగా పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ద్వయం ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్ తో వారి రిథమ్ని దెబ్బతీశారు. ఫలితంగా పరుగుల వెల్లువ ప్రవహించింది. వీరిద్దరూ ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డులను తిరగరాశారు. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేసింది. గత సంవత్సరం ఫైనల్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్కు చేరువగా రావడంలో బ్యాటర్లదే కీలక పాత్ర.సన్రైజర్స్ ఫార్ములాకి అప్గ్రేడ్ కిషన్ఇంత అద్భుత ఫలితాల్నిచ్చిన ఫార్ములాను సన్రైజర్స్ హైదరాబాద్ వదులుకుఉంటుందా? అందుకే అదే ఫార్ములాను అప్గ్రేడ్ చేసింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఇషాన్ కిషన్ ని మునుపటి నంబర్ 3 బ్యాటర్ రాహుల్ త్రిపాఠి స్థానం లో తీసుకొచ్చింది. ఈ నేపధ్యం లో సొంతగడ్డ పై సన్రైజర్స్ హైదరాబాద్ తన సత్తా మరోసారి ప్రదర్శించింది.ఇందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా సన్రైజర్స్ కి తన వంతు సహకారం అందించింది. ఎందుకంటే అలాంటి ఊపు మీదున్న సన్రైజర్స్ బ్యాట్స్మన్ కి టాస్ గెలిచినప్పటికీ ముందుగా బ్యాటింగ్ కి ఆహ్వానించడం రాయల్స్ చేసిన పెద్ద తప్పిదనం. ఇందుకు భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది.రాయల్స్ కొంపముంచిన టాస్రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సన్రైజర్స్ బ్యాటర్లు ఆ జట్టు బౌలర్ల పై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంతో స్కోర్ రాకెట్ వేగంతో ముందుకు పోయింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అదే ఊపును కొనసాగించాడు.గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ 47 బంతుల్లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లుతో అజేయంగా నిలిచి 106 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ లో ఇది మొదటి సెంచరీ. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసి మరోసారి సత్తా చాటింది. గత సంవత్సరం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల నష్టానికి 287 పరుగుల ఐపీఎల్ స్కోర్ ని ఒక్క పరుగుతో వెనుక పడింది.చివరి వరకూ పోరాడిన రాయల్స్ఇంత అత్యధిక లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే నిజానికి రాయల్స్ చివరి వరకూ పోరాడింది. ప్రారంభంలోనే భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ రియాన్ పరాగ్ల వికెట్లను కోల్పోయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్సమన్ సంజు సామ్సన్, మరియు ధ్రువ్ జురెల్ రాయల్స్ను జట్టుకి ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో ఆడారు.నాల్గవ వికెట్కు వారిద్దరు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సామ్సన్ 66 పరుగులు చేయగా, జురెల్ 70 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్మైర్, శుభం దూబే వచ్చి స్కోర్ ని పరుగు పెట్టించినప్పటికీ ఫలితం లేకపోయింది. హెట్మైర్ 44 పరుగులు సాధించగా దూబే 32 పరుగులు చేయడంతో రాయల్స్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 242 కి చేరింది. కావ్యా మారన్ కళ్లలో ఆనందంఈ మ్యాచ్ లో చివరికి రాయల్స్ 44 పరుగుల తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ ముందు జరిగే మ్యాచ్ లకు కొండంత ఆత్మ విశ్వాసాన్నిచిదనడంలో సందేహంలేదు. ఇక క్లాసెన్, ఇషాన్ కిషన్ ప్ర్యతర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతుంటే.. రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ పలికించిన హావభావాలు, భావోద్వేగానికి గురైన తీరు జట్టు ప్రదర్శన పట్ల ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు.చదవండి: మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
సన్రైజర్స్ VS రాజస్తాన్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్ సందడి (ఫొటోలు)
-
మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా ఎడిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అద్భుత విజయంతో ఆరంభించింది. గత సీజన్ తాలుకు విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగిస్తూ ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది.‘పాకెట్ డైనమైట్’ సెంచరీస్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (31 బంతుల్లో 67) తనదైన శైలిలో చెలరేగగా.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan kishan) ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఈ పాకెట్ డైనమైట్ రాజస్తాన్ బౌలింగ్ను చితకొట్టి.. అజేయ అద్భుత శతకం సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు.𝙄.𝘾.𝙔.𝙈.𝙄 🔥Ishan Kishan dealt in sixes on his way to a magnificent maiden #TATAIPL 💯 😮 👊Updates ▶ https://t.co/ltVZAvHPP8#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/9PjtQK231J— IndianPremierLeague (@IPL) March 23, 2025 ఇక హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా ధనాధన్ ఇన్నింగ్స్ (14 బంతుల్లో 34)తో దుమ్ములేపాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో రైజర్స్ 286 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ 242 పరుగులకే పరిమితం కావడంతో జయకేతనం ఎగురువేసింది.మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయనుఈ నేపథ్యంలో విజయానంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటర్లకు పొరపాటున కూడా బౌలింగ్ చేయబోనంటూ సహచర ఆటగాళ్ల దూకుడును ప్రశంసించాడు. ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ‘‘నమ్మశక్యం కాని బ్యాటింగ్ ఇది. నేను మా వాళ్లకు అస్సలు బౌలింగ్ చేయను.బాబోయ్.. భయపెట్టేశారుప్రత్యర్థి జట్టు బౌలర్లను భయపెట్టేశారు. ఇలాంటి బ్యాటర్లు ఉంటే బౌలర్లకు చుక్కలే. వికెట్ తీయడం గురించి కాకుండా.. పరుగులను ఎలా నియంత్రించాలన్న అంశం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మేము గత వైభవాన్ని కొనసాగించాలని ఫిక్సయ్యాం. అసాధారణ ఇన్నింగ్స్ గతంలో ఆడిన ఒకరిద్దరు ప్లేయర్ల సేవలను ఈసారి మేము కోల్పోయాం. అయితే, వారి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని.. ఆటను పూర్తిగా ఆస్వాదించాలని అతడు భావించాడు. మైదానంలో ఆ పని చేసి చూపించాడు.ప్రాక్టీస్లో మా బాయ్స్ కష్టపడ్డారు. అద్భుత రీతిలో మ్యాచ్కు సన్నద్ధమయ్యారు. ఇక మా కోచ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వారంతా అద్భుతం. గత మూడు- నాలుగు వారాలుగా మాతో పాటు ఉన్నారు. ఏదేమైనా మా వాళ్లు తమ భీకర బ్యాటింగ్తో సీజన్కు బ్లూప్రింట్లాంటిది తయారు చేశారు. మా బ్యాటర్లను ఎంత ప్రశంసించినా తక్కువే’’ అని కమిన్స్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2025: సన్రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్👉టాస్: రాజస్తాన్ రాయల్స్.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 286/6 (20)👉రాజస్తాన్ స్కోరు: 242/6 (20)👉ఫలితం: 44 పరుగుల తేడాతో రాజస్తాన్పై సన్రైజర్స్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇషాన్ కిషన్చదవండి: IPL 2025 RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు -
ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ.. రాజస్తాన్పై సన్రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేయగలిగింది. ధ్రువ్ జురేల్(70), సంజు శాంసన్(66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికి ఈ భారీ టార్గెట్ను రాజస్తాన్ అందుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు.ఇషాన్ సూపర్ సెంచరీ..తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. హెడ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రెండో వికెట్ కు 39 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కిషన్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కిషన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. సెంచరీ హీరో ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్లో మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ వదిలేసింది.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ -
SRH Vs RR: ట్రావిస్ హెడ్ ఊచకోత.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
ఐపీఎల్-2025ను సన్రైజర్స్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తనదైన స్టైల్లో ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో హెడ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను హెడ్ ఊచకోత కోశాడు. ఉప్పల్ మైదానంలో ఈ ఆసీస్ ఓపెనర్ బౌండరీల వర్షం కురిపించాడు. రాజస్తాన్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్ను అయితే హెడ్ ఓ ఆట ఆడేసికున్నాడు. 5వ ఓవర్ వేసిన అర్చర్ బౌలింగ్లో హెడ్ ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 31 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 3 సిక్స్లతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆనందంలో కావ్యపాప..కాగా ఈ మ్యాచ్లో హెడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదగా 105 మీటర్ల సిక్స్ను హెడ్ కొట్టాడు. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చప్పట్లు కొడుతూ హెడ్ను అభినందించింది. ఆ షాట్ చూసి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా షాకయ్యాడు.Hurricane Head graces #TATAIPL 2025 🤩Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S— IndianPremierLeague (@IPL) March 23, 2025 -
SRH Vs RR: సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. ఎవరిది పైచేయి..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్లో గెలిచి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్పై సన్రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ల్లో సన్రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.జట్లను పరిశీలిస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్లో మాత్రం సన్రైజర్స్దే పైచేయిగా తెలుస్తుంది. సన్రైజర్స్లో సమర్దవంతమైన పేసర్లతో (కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్) పాటు నాణ్యమైన స్పిన్నర్లు (రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, కమిందు మెండిస్, అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్) ఉన్నారు. రాయల్స్లో అది లోపించింది. పేసర్లలో సందీప్ శర్మ, జోప్రా ఆర్చర్.. స్పిన్నర్లలో హసరంగ, తీక్షణ మాత్రమే ఆ జట్టు తరఫున అనుభవజ్ఞులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. సన్రైజర్స్లో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఉండగా.. రాయల్స్లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. ఇరు జట్ల బ్యాటర్లు సీజన్ ప్రారంభానికి ముందు ఆడిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ల్లో బీభత్సమైన ఫామ్ కనబర్చారు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (ఆర్సీబీపై 287) నమోదు చేయడంతో పాటు మూడు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.సన్రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మైర్, రియాన్ పరాగ్, యుద్ద్వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
IPL 2025: తొలి మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ.. స్టార్ స్పిన్నర్కు నో ప్లేస్..!
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 23) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. ఎస్ఆర్హెచ్, రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్లో జరుగనుండగా.. సీఎస్కే, ఎంఐ మ్యాచ్కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది.రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్రైజర్స్ ఈ సీజన్లో ఎలాగైనా చేజారిన టైటిల్ను చేజిక్కించుకోవాలన్న కసితో బరిలోకి దిగుతుంది. గత సీజన్లో తమ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాలామంది ఆటగాళ్లను సన్రైజర్స్ ఈ సీజన్లోనూ కొనసాగించింది. ఈ సీజన్లో కొత్తగా షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.రాజస్థాన్తో మ్యాచ్లో సన్రైజర్స్కు తుది జట్టు కూర్పు సవాలుగా మారనుంది. బ్యాటర్ల విషయంలో ఆ జట్టుకు ఓ ఐడియా ఉన్నా బౌలర్ల ఎంపికలో మాత్రం తలనొప్పులు ఉన్నాయి. పేసర్లుగా కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ స్థానాలు ఖరారైనా.. స్పిన్నర్లలో స్వదేశీ రాహుల్ చాహర్కు అవకాశం ఇవ్వాలా లేక విదేశీ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు చోటు ఇవ్వాలా అన్న సందిగ్దత నెలకొంది. రాహుల్కు అవకాశం ఇస్తే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ లేదా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ జంపానే కావాలనుకుంటే ఓ విదేశీ ఆల్రౌండర్ను త్యాగం చేయాల్సి వస్తుంది. అదనంగా బ్యాటర్లు సచిన్ బేబి, అనికేత్ వర్మలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు.బ్యాటింగ్ కూర్పు విషయానికొస్తే.. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. ఇషాన్ కిషన్ వన్డౌన్లో బ్యాటింగ్ చేయడం ఖాయం. మిడిలార్డర్లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ బరిలోకి దిగవచ్చు.రాజస్థాన్తో మ్యాచ్లో సన్రైజర్స్ తుది జట్టు (అంచనా)ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, వియాన్ ముల్దర్/కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్2025 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్


