stage protest
-
సార్.. మా బడికి మాస్టార్ని పంపించండి!
పాడేరు: ‘అయ్యా.. కలెక్టర్గారు, పీఓ గారు.. మాకు చదువుకోవాలని ఉంది. దయచేసి మా బడికి మాస్టార్ని పంపించండి’.. అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండేఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో 28 మంది బడిఈడు పిల్లలున్నారు. కానీ, ఇక్కడ పాఠశాల లేదు. దీంతో ఎన్ఆర్ఎస్టీసీ పాఠశాలను అధికారులు ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాలలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబరు 17న విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ, నేటికి 20 రోజులు కావస్తున్నా ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరుకావడంలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరుకు తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చుర్రుమనే ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు. తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని, 20 రోజులుగా బడికిరాని ఉపాధ్యాయుడు సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం.. ఐటీడీఏ పీఓ అభిషేక్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. -
అమరావతిలో భూములు అమ్మారు..
ఆదిలాబాద్ టౌన్: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆదిలాబాద్లోని రాణిసతీజి కాలనీలో ఉన్న పత్తి వ్యాపారి సచిన్ ఇంటి ఎదుట సోమవారం ఉదయం నుంచి బైఠాయించారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేసి గేటు ఎదుట పడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన 32మంది రైతులు అమరావతి రాజధానిగా ఏర్పడిన సమయంలో తమ భూములను విక్రయించారు. వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేశారు. బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుండటంతో స్థానిక వ్యాపారి లిల్లి మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్కు చెందిన సచిన్కు రెండున్నర రూపాయల వడ్డీతో రూ.6కోట్లు అప్పు ఇచ్చారు. ఈ మేరకు రూ.2కోట్ల నగదు చేతికివ్వగా రూ.4కోట్లు బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేశారు. రెండు నెలల్లోనే అప్పు తీర్చేస్తానని సచిన్ హామీ ఇచ్చి దాదాపు ఏడాదిన్నరవుతున్నా స్పందించడం లేదు. 2021 ఆగస్టులో డబ్బులు ఇచ్చామని, పలుమార్లు కలువగా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరయ్యారు. అందుబాటులో లేని వ్యాపారి.. కాగా సదరు వ్యాపారి అందుబాటులో లేరని కుటుంబీకులు తెలిపారు. ఓ న్యాయవాదితో మధ్యవర్తిత్వం చేయించినట్లు రైతులు చెబుతున్నారు. 45 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేలా చూస్తానని న్యాయవాది వారికి చెప్పగా.. చెక్కులు, నోట్లు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తామని తెలిపారు. అందుకు న్యాయవాది ఒప్పుకోలేదని అంటున్నారు. రైతులకు సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వ్యాపారి డబ్బులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతోపాటు ఇక్కడే బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక సమ్మె
-
సమ్మె బాట పట్టిన మున్సిపల్ కార్మికులు
-
రాష్ట్ర ప్రయోజనాలను వంచించి...ఇప్పుడు దీక్షలు చేస్తారా ?
-
చంద్రబాబులా నీచపు రాజకీయాలు వైఎస్సార్సీపీ చేయదు
-
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలి
-
విశాఖలో 'వంచన వ్యతిరేక దీక్ష' ప్రారంభం
-
నేడే వైఎస్సార్సీపీ వంచన వ్యతిరేక దీక్ష
-
వినూత్న రీతిలో సీపీఎం నిరసన
-
'ఆగ్రి' బాధితుల ఆవేదన
-
అగ్రిగోల్డ్ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన
-
బెంగుళూరులో ఏబీవీపీ ఆందోళన
-
బిల్లుల కోసం రైతుల ఆందోళన
గుంటూరు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటే.. ప్రభుత్వాలు వారికి బిల్లులు సకాలంలో అందించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు నెలల కింద గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లలో తాము పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకున్నారు. అయితే, ఇప్పటి వరకు రైతులకు మొక్కజొన్న పంటకు సంబంధించిన బిల్లులు చేతికి అందలేదు. ఒక వైపు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.