-
మళ్లీ అదే డైరెక్టర్తో తమన్నాకు సినిమా ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు సుందర్.సీ చిత్రాలు కచ్చితంగా కమర్శియల్ అంశాలతో నిండి ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా అని చెప్పవ చ్చు. ఇకపోతే హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈయన చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇటీవల తమన్నా, రాశీ ఖన్నాలతో కలిసి సుందర్.సీ నటించి దర్శకత్వం వహించిన అరణ్మణై – 4 చిత్రం (తెలుగులో బాకు) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. తాజాగా మరోసారి దర్శకుడు సుందర్.సీ- తమన్నా కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్ నటి తమన్నాకు ఒక కథ చెప్పారనీ, అది నచ్చడంతో ఆమె అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఆ చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంస్థ ఆ కథను మాత్రం తీసుకుని సుందర్.సీ దర్శకత్వంలో నిర్మించాలని భావించగా, కథ నచ్చడంతో సుందర్.సీ కూడా దర్శకత్వం వహించడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో సుందర్.సీ, తమన్నాల హిట్ కాంబినేషన్ రీపీట్ కానుందన్నమాట. ఇకపోతే సుందర్.సీ ప్రస్తుతం తాను ఇంతకు ముందు రూపొందించిన కలగలప్పు చిత్రానికి సీక్కెల్ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేన్ని ముందుగా చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
బాహుబలి, రోబోల కన్నా భారీగా..!
భారతీయ వెండితెర మీద వచ్చిన భారీ చిత్రాల్లో అన్నింటికన్నా ముందున్న సినిమా బాహుబలి. ఇప్పటి వరకు ప్రకటించిన లెక్కల ప్రకారం బాహుబలి రెండు భాగాలకు కలిపి 200 కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చు పెడుతున్నారు. ఇక అదే స్థాయిలో తెరకెక్కుతున్న మరో సినిమా రోబో 2. శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 200 కోట్లకు పైగానే ఖర్చవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలను మించే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు, కోలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇటీవల చంద్రకళ సినిమాతో భారీ విజయం సాధించిన కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి, చారిత్రక నేపథ్యంలో ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా 2017 మార్చ్లో ప్రారంభించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించాడు సుందర్.సి. అయితే ఈసినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించనున్నారన్న వార్తలపై మాత్రం ఆయన స్పందించలేదు. సౌత్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ప్రకటించాడు. -
250 కోట్ల బడ్జెట్తో సూర్య సినిమా
సౌత్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తరువాత ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధంగా ఉండే స్టార్ హీరో సూర్య. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అదే సమయంలో ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు సూర్య. తాజాగా 24 సినిమాతో మంచి విజయం సాధించాడు. కాలంలో ప్రయాణించటం అనే వెరైటీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు, తమిళ భాషలతో పాటు ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సింగం సీరిస్లో తెరకెక్కుతున్న సింగం 3 సినిమాలో నటిస్తున్న సూర్య, మరో ప్రతిష్టాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్షన్లో భారీ పౌరాణిక చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తెండ్రల్ ఫిలింస్ తమ వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది.