Sweet festival
-
కైట్ మజా... స్వీట్ భళా
-
తియ్యని వేడుక
-
స్వీట్ ఫెస్టివల్లో వెయ్యి వెరైటీలు
సాక్షి, హైదరాబాద్: స్వీట్ ఫెస్టివల్లో వెయ్యి రకాల మిఠాయిలు ప్రదర్శించనున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం పర్యాటక భవన్లో స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని తెలిపారు. స్థానికులతో పాటు, 20 దేశాల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. గతేడాది ఉత్సవాలకు 8 లక్షల మంది హాజరయ్యారన్నారు. విశేష స్పందన రావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిథమ్ డైరెక్టర్ డా.చిన్నమ్ రెడ్డి, తెలంగాణలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మూడ్రోజులు రసగుల్లా ఫెస్ట్
కోల్కతా: మూడ్రోజుల పాటు రసగుల్లా ఫెస్ట్ను నిర్వహిస్తూ కోల్కతా ఈ ఏడాదికి తీయని వేడు కతో ముగింపు పలకనుంది. రసగుల్లా స్వీట్ను కనుగొన్న నోబిన్ చంద్ర దాస్కు నివాళిగా ఈ వేడుకను నిర్వహించనుంది. బెంగాల్ రసగుల్లాకు గతేడాది భౌగోళిక గు ర్తింపు లభించింది. రసగుల్లాను కనుగొని 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 28 నుంచి మూడ్రోజులు ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రస గుల్లాను కనుగొన్న దాస్ కు నివాళిగా తొలిసారిగా బాగ్బజార్–ఒ–రసగుల్లా ఉత్సవ్ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ బాగ్బజార్ చరిత్ర, సంస్కృతిని కూడా చాటి చెప్తుందని మంత్రి శశి పంజా పేర్కొన్నారు. స్వీట్ వ్యాపారులు తమ వంటకాలను రుచి చూపించడానికి ఈ ఫెస్ట్ మంచి అవకాశమని వెల్లడించారు. -
స్వీటెత్తిన జనం..
సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భాగ్య నగరవాసులకు మధురానుభూతిని పంచాలని భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం అధికారులు ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. పరేడ్ మైదానం మూడురోజుల పాటు మిఠాయిలతో ఘుమఘుమలాడింది. వెరసి సిటీజనులు ఎంతో ఎంజాయ్ చేశారు. అధికారులు ఊహించిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా జనం తరలిరావటం విశేషం. దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. నోరూరించిన బెంగాలీ రసగుల్ల.. స్వీట్ ఫెస్టివల్లో తొలిరోజు 800 రకాలు ప్రదర్శించా రు. గంటన్నరలోనే 70 శాతం అమ్ముడు పోయా యి. రెండోరోజు 1000 రకాలు ఉంచారు. రాత్రి 9 గంటలకే అన్ని అమ్ముడు పోయాయి. చివరిరోజైన 15వ తేదీన 1200 రకాలు స్వీట్లు ఉంచారు. సాయంత్రం జనం ఒక్కసారిగా ఎగబడడంతో అవి కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ప్రధానంగా జాతీయ స్థాయి మిఠాయిల్లో కొంకణి స్వీట్లు, బీహార్ స్వీట్లు బాగా అమ్ముడు పోయా యి. బీహార్కి తెలంగాణ స్వీట్లకు దగ్గరి పోలిక ఉండటంతో నగరవాసులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రదర్శనలో ఉంచిన 74 రకాల పాయసాలు క్షణాల్లో అమ్ముపోయాయి. బెంగాలీ రసగుల్లలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇక అంతర్జాతీయంగా టర్కీ, కొరియా దేశాల స్వీట్లు అందరి మనస్సులను దొ చుకొన్నాయి. బూడిద గు మ్మడితో చేసిన స్వీట్ ప్ర జల ఫెవరేట్ కావటం విశేషం. దక్కన్ స్వీట్ల కోసం జనం క్యూ కట్టారు. హైదరాబాద్లో ఉ న్న బీహరీ, తమిళనాడు, మల యాళం, కర్ణాటక, కొంకణి సమాజా లు ఫెస్టివల్ విజయవంతంలో కీలకభూమిక పోషించాయి. 15వ తేదీ రాత్రి అంతర్జాతీయ పతంగుల పండగలో పాల్గొన్న కైట్ ప్లేయర్స్కి ప్లాజా హోట ల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఊహించని రీతిలో సందర్శకుల రాక.. 13 నుంచి 15 వరకు జరిగే స్పీట్ ఫెస్టివల్కు మూడు రోజులకు కలిపి లక్ష మంది జనం వస్తారని టూరిజం – సాంస్కృతిక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసు అధికారులు మందస్తుగా అడిగితే అదే సమాచారం అందించారు. కానీ పరిస్థితి మొదటి రోజే మారిపోయింది. ఊహించిరీతిలో తొలిరోజు ఇటు స్వీట్– కైట్ ఫెస్టివల్కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. రెండోరోజైన 14వ తేదీన ఏకంగా 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో సాయంత్రంలోగా పరేడ్ మైదానం జనస ం ద్రంగా మారింది. మూడోరోజు 2.50 లక్షల మంది హాజరవటంతో అధికారులు సైతం -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో స్వీట్ ఫెస్టివల్
-
సికింద్రాబాద్లో కైట్,స్వీట్ ఫెస్టివల్