teamindia selector
-
World Cup 2022: టీమిండియా స్టార్ బ్యాటర్ తలకు గాయం.. బీసీసీఐ అప్డేట్
మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్లో షబ్నీమ్ ఇస్మాయిల్ విసిరిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన హెల్మెట్కు బలంగా తాకింది. దీంతో మంధాన రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరి, ఆ తర్వాత ఫీల్డింగ్కు కూడా రాలేదు. దీంతో మంధాన తలకు పెద్ద గాయమైందేమోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కీలక టోర్నీకి ముందు మంధాన జట్టుకు దూరమైతే టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. 🚨 UPDATE 🚨: Smriti Mandhana stable after being struck on the head in #CWC22 warm-up game. #TeamIndia Details 🔽— BCCI Women (@BCCIWomen) February 28, 2022 అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు ఇవాళ వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్తో, మార్చి 12న వెస్టిండీస్తో, మార్చి 16న ఇంగ్లండ్తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్తో బరిలోకి దిగవచ్చు..! -
WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..
న్యూఢిల్లీ: భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అత్యుత్తమ స్వింగ్ బౌలరైన భువీని ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఫైనల్కు ముందు టీమిండియా ప్రకటించిన 15 మంది జాబితాలో శార్ధూల్ ఠాకూర్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్పై అతిగా ఆధారపడటాన్ని ఆయన తప్పుపట్టాడు. గత కొంత కాలంగా హార్ధిక్ బౌలింగ్ చేయకపోవడాన్ని ఉదహరించాడు. ఈ క్రమంలో శార్ధూల్, విజయ్శంకర్, శివమ్ దూబేలలో ఒకరిని ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. ప్రస్తుత జట్టులో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, రాబోయే ఇంగ్లండ్ సిరీస్లో అతనికి వీలైనన్ని ఎక్కవ అవకాశాలు కల్పించాలని ఈ మాజీ సెలెక్టర్ సూచించారు. ఇంగ్లండ్తో సిరీస్లో టీమిండియా రొటేషన్ పద్ధతి పాటించి, ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయడ్డాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్ను కూడా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా బ్యాటింగ్లో లోపాలను కూడా ఎత్తి చూపాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడని, అతను అతిగా ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. పుజారా, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నారని, వారు పరిస్థితులకు తగ్గట్టు మారాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా బాగానే ఆడుతున్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: పాస్ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు.. -
'మంచి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం'
-
'మంచి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం'
తిరుమల: టీమిండియా సెలెక్టర్ గా ఎంపిక చాలా ఆనందంగా ఉందని మాజీ వికెట్ కీపర్ మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్ అన్నారు. భారత జట్టుకు మంచి ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తన అనుభవాన్ని వినియోగిస్తానని చెప్పారు. తనకు సీనియర్ సెలక్షన్ కమిటీలో చోటు దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాబోయే 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్నారు. భారత ఆటగాళ్లు అన్ని పిచ్ లపై ఆడేవిధంగా ఆటతీరు మలుచుకోవాలని సూచించాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో 30 ఫస్ట్ క్లాస్ జట్లు ఉన్నాయని వెల్లడించారు.