Textiles union
-
వస్త్ర రంగం అభివృద్ధికి ‘జీటీటీఈఎస్ 2025’లో చర్చలు
భారతదేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తూ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులపై ఇటీవల చర్చ జరిగింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 2025 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన గ్లోబల్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (జీటీటీఈఎస్ 2025) వస్త్ర పరిశ్రమకు కీలకంగా మారింది. ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మెషినరీ ఎగ్జిబిషన్స్ సొసైటీ (ఐటీఎంఈ సొసైటీ) నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమంలో టెక్స్టైల్ టెక్నాలజీలో పురోగతిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ వర్గాలు, ఆవిష్కర్తలు, వాటాదారులు ఒకచోట చేరారు.జీటీటీఈఎస్ 2025 ముఖ్యాంశాలుభారత టెక్స్టైల్ కమిషనర్ రూప్రాశి మహాపాత్ర, దక్షిణాఫ్రికా, బెలారస్, బుర్కినా ఫాసో వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో రోజున సెషన్ను ప్రారంభించిన అనంతరం ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్, స్టీరింగ్ కమిటీ మెంబర్ కేతన్ సంఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్గఢ్ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-2030ను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఈ వేదిక కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్తోపాటు వ్యూహాత్మక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగం పురోగతికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.ఛతీస్గఢ్ రాష్ట్ర పారిశామిక కార్పొరేషన్ అభివృద్ధి సభ్యులు, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ శుక్లా మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 24 ఏళ్లల్లో ఎగుమతులు 35.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.97 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 2.3 శాతానికి సమానమని తెలిపారు. జాతీయ ఎగుమతులకు ఈ పరిశ్రమ 10.5 శాతం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాంగీర్చంపాలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమతో భవిష్యత్తులో ఛతీస్గఢ్ వస్త్ర కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25,000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు, 1,400 కంటే ఎక్కువ నమోదిత సార్టప్లతో రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా మాటాడుతూ..‘మేము ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు దైపాక్షిక వాణిజ్యం, దిగుమతి-ఎగుమతులు పెంచడంలో, పెట్టుబడుల పరంగా రెండు వైపులా ఉన్న కంపెనీలకు సాయం అందించడంలో విజయం సాధించాం. వస్త్ర రంగంలో పనిచేయడంతోపాటు ప్రపంచ పర్యటనలో భాగంగా ఏ ప్రాంతాన్ని సందర్శించినా హాస్పిటాలిటీ రంగం రంగం మా అజెండాలో భాగంగా ఉంటుంది. ఆయా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐడీస్ పర్సనల్ కన్సలెంట్ పురోహిత్, గురత్ భాటియా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్ తదితరులు ఉన్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్కు రోడ్ మ్యాప్జీటీటీఈఎస్ 2025లో 39 దేశాలకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, వ్యాపార సహకారాలకు కేంద్రంగా పనిచేసింది. స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజిటల్ ప్రింటింగ్, టెక్స్టైల్ రీసైక్లింగ్లో పురోగతితో సహా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ టెక్స్ టైల్ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులను ఈ కార్యక్రమంలో హైలైట్ చేశారు. ఎక్స్క్లూజివ్ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వాటాదారుల జాయింట్ వెంచర్లు, వాణిజ్య సహకారాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ప్రపంచ టెక్స్టైల్ మెషినరీ మార్కెట్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో చర్చలు జరిగాయి. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
అంతర్జాతీయ మార్కెట్కు ఆర్గానిక్ చేనేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్ఈసీపీ అధికారులకు వివరించారు. విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ.. హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రుణమాఫీ లెక్క కుదిరింది..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇద్దరు మంత్రులు రాజీపడ్డారు. పర్సంటేజీల లెక్క కుదిరింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే ఈ పంచాయితీ చేశారు. బోగస్ చే‘నేత’ సంఘాలకు రూ. 40.83 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2002 నుంచి 2004 మధ్య ఉరవకొండ, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, గుంతకల్లు, హిందూపురం, సోమందేపల్లి, నార్పల ప్రాంతాల్లోని కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై బోగస్ చేనేత సంఘాలను ఏర్పాటు చేశారు. కనీసం మగ్గంపై అవగాహన లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించి.. ఆర్టీజన్ కార్డులు కూడా ఇప్పించేశారు. జౌళిశాఖ అధికారులతో కుమ్మక్కై 2003-2008 మధ్య దీన్దయాళ్ హర్గత్ యోజన(డీడీహెచ్వై) కింద కేంద్రం ఇచ్చే రాయితీలను మింగేయడానికి పథక రచన చేశారు. ముడి సరుకులు కొనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించారు. మార్కెట్ ధరకన్నా అధిక ధరకు కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులు సృష్టించి.. రూ. 32.54 కోట్లను డీడీహెచ్వై పథకం కింద రాయితీ రూపంలో మింగేశారు. 127 బోగస్ చేనేత సంఘాలు రూ. 32.54 కోట్ల డీడీహెచ్వై నిధులను కాజేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విచారణలో బహిర్గతమైంది. ఆ విభాగం ఇచ్చిన నివేదికపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య బోగస్ సంఘాలకు రుణమాఫీ నిధులు విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితుడైన ఆప్కో సభ్యుడు ఒకరు రుణమాఫీ నిధులను విడుదల చేయిస్తానని బోగస్ చే‘నేత’లకు ప్రతిపాదించారు. అందుకు కనీసం రూ. 5 కోట్లను మంత్రికి ముడుపుల రూపంలో ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి.. ఆ మేరకు నిధులు వసూలు చేశారు. ఆ నిధులను మంత్రికి అప్పగించేశారు. ప్రభుత్వ పెద్ద వద్ద తన పలుకుబడిని ఉపయోగించి రుణమాఫీ నిధులు విడుదల చేయించేందుకు సదరు మంత్రి ప్రయత్నించారు. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయాల్సిన దశలో తెలంగాణకు చెందిన కీలక మంత్రికి పర్సంటేజీల వ్యవహారం తెలిసింది. వసూలు చేసిన పర్సంటేజీల్లో తన వాటా ఇస్తేనే రుణమాఫీ ఫైలుకు ఆమోదం లభిస్తుందని సదరు మంత్రి తెగేసి చెప్పారు. దాంతో పంచాయితీ ప్రభుత్వ పెద్దకు వెళ్లింది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ పెద్ద ఇద్దరు మంత్రుల మధ్య రాజీ చేసినట్లు సమాచారం. బోగస్ చే‘నేత’ల నుంచి వసూలు చేసిన కూ. 5 కోట్ల పర్సంటేజీల్లో చెరి సగం పంచుకనేలా ఇద్దరు మంత్రుల మధ్య ప్రభుత్వ పెద్ద రాజీ చేసినట్లు జౌళి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు సరి కొత్త ప్రతిపాదనలు పంపాలని జౌళి శాఖ అధికారులను సదరు మంత్రి ఆదేశించడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు సరికొత్త ప్రతిపాదనలు తయారుచేసిన జౌళి శాఖ అధికారులు ఆ ఫైలును సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ ఫైలుపై రెండు రోజుల్లోగా తెలంగాణ మంత్రి సంతకం చేయడం ఖాయమని.. ఆ వెంటనే రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తధ్యమనే అభిప్రాయం ఆ శాఖ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.