trees not good
-
ఒక్క‘ట్రీ’ బతకలేదు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఆటంకంగా మారిన ఏళ్లనాటి వృక్షాలను తొలగించిన అధికారులు.. వాటిని శాస్త్రీయ పద్ధతిన సంరక్షించేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. 2017 జూన్లో ఆర్ అండ్ బీ, అటవీశాఖ అధికారులు తొలగించిన చెట్లకు ప్రాణం పోసేందుకు చేసిన కృషి మట్టిపాలైంది. ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా నాటిన 55 చెట్లు బతకలేదు. మొత్తం 300 వృక్షాలకు పునరుజ్జీవం పోసేందుకు రూ.36 లక్షలు కేటాయించగా.. 55 చెట్లను క్రేన్ల సాయంతో మట్టితో సహా పెకిలించి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో నాటారు. సంరక్షణ చర్యలు విస్మరించడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఏళ్లనాటి చెట్లు ఎండిపోయాయి.. పట్టణంలో 20 – 30ఏళ్ల క్రితం చెట్లు రోడ్డు విస్తరణలో తొలగించాల్సి వచ్చింది. ఫారెస్ట్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు హైదరాబాద్కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలు తొలగించి, వేర్లతో సహా పెలించారు. అయితే, మట్టి వాటి వేర్లకు అంటుకుని ఉండకపోవడంతో చెట్లు వాడిపోయాయి. వాటిని నాటిన ప్రాంత భూసారం, అవి పెరిగిన ప్రాంత భూసారానికి తేడా ఉండడంతో వృక్షాలు జీవం పోసులేకపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు అప్పట్లో చెట్లను రక్షించేందుకు చేపట్టిన చర్యలు అభినందనీయం కాగా.. ఆ చెట్లు ఒక్కటీ దక్కకపోవడం బాధాకరం. కొన్ని నాటి ఆపేశాం జిల్లాకేంద్రంలో 300 చెట్లను తరలించాలని భావించాం. కానీ కొన్ని చెట్లను తరలించిన తర్వాత అవి బతికే అవకాశం లేదని తెలిసింది. వేర్లకు మట్టి అంటుకుని ఉండలేదు. ఇది గుర్తించి మిగితా వాటిని నాటకుండానే వదిలేశాం. కొత్త విధానంలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. – విఘ్నేశ్వర్రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ -
‘కొండె’క్కిన పండుగ
– మొక్కలు నాటి సంరక్షణ విస్మరించారు – దేవరకొండలో ఎండిపోయిన మొక్కలు - మిగతా కొండ గుట్టల్లోనూ ఇదే పరిస్థితి అనంతపురం అర్బన్ : మొక్కల పెంపకం పెద్ద ఎత్తున్న చేపట్టి జిల్లాను హరితవనంగా మారుస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. అందులో భాగంగా గత ఏడాది జూలైలో చేపట్టిన కొండ పండుగ కార్యక్రమం కొండెక్కింది. ఆరంభంలో దాదాపు రెండు నెలల పాటు కొండ పండుగపై ఆర్భాటం చేశారు. బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండ వద్ద మొక్కలు నాటారు. అనంతరం సంరక్షణ మరిచారు. ఫలితంగా నీరులేక అవి ఎండిపోయాయి. జిల్లాలో 63 కొండ గుట్లల్లో మొక్కలు పెంచే బాధ్యతను గాలిమరల కంపెనీలకు అప్పగించగా వారు గాలికొదిలేశాయి. 1.11 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యం జిల్లాను ‘హరిత అనంత’ తీర్చిదిద్దే లక్ష్యంతో గత ఏడాదిలోగా 1.13 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా కలెక్టర్ ప్రకటించారు. రోడ్లకు ఇరువైపులా, పొలం గట్ల వెంబడి మొక్కలు నాటడంతో పాటు ప్రత్యేకంగా కొండగుట్టల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్ చెప్పారు. గుట్టల్లో నాటి మొక్కలను నీటి వసతిని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ముఖ్యంగా జిల్లాలోని కొండ గుట్టల్లో మొక్కలు నాటి పచ్చదనం సంతరించుకునేలా చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమానికి సంబం«ధించి పక్కా ప్రణాళికను వారంలోగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా జిల్లాలో గాలిమరల కంపెనీలు ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి స్వీకరించాలన్నారు. జిల్లాలో 615 గ్రామల సమీపంలో మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న బోడి కొండలను, పవన్ విద్యుత్ టవర్లు ఉన్న 63 కొండలను గుర్తించినట్లు అప్పట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. కానీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారు.