TRS Councilor
-
మెజారిటీ రాదు.. ఒట్టు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ చాలెంజ్
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు చైర్మన్ జితేందర్గౌడ్తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
నిజామాబాద్ : ఆర్మూర్ బిల్దియాలో కలకలం సృష్టించిన కౌన్సిలర్ శంకర్ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. విశాఖలో నిన్న కౌన్సిలర్తో పాటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బట్టు శంకర్, వందన లక్ష్మినారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ను కాంగ్రెస్కు చెందిన నాయకులు ఆయుధాలతో బెదిరించి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్కు గురైన కౌన్సిలర్ భార్య స్వప్న ఫిర్యాదు మేరకు ఆరుగురు కాంగ్రెస్ నాయకులు, మాజీ మావోయిస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కిడ్నాప్కు గురైన కౌన్సిలర్తో పాటు కాంగ్రెస్ నాయకులను వైజాగ్లో గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సెల్ఫోన్ నెట్వర్క్, సిగ్నల్స్ ఆధారంగా శంకర్ను ఎక్కడకి తీసుకెళ్లారనేది గుర్తించారు. వారిని పోలీసులు నిజామాబాద్ తరలించారు.