uday kiran wife Vishita
-
ఉదయ్ని అనవసరంగా పెళ్ళి చేసుకున్నా:విషిత
-
ఉదయ్.. హీరో చట్రంలో బందీ అయ్యారు!
హైదరాబాద్, న్యూస్లైన్: ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో ఉదయ్ కిరణ్ బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమయ్యేవాడని ఆయన భార్య విషిత పోలీసులకు చెప్పారు. సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం.. ఇవన్నీ ఉదయ్పై ప్రభావం చూపాయని వివరించారు. పలుచోట్ల విలువైన స్థలాలున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఉదంతంపై మరింత సమాచారం సేకరించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గురువారం మరోమారు విషిత, ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నాలను వేర్వేరుగా ప్రశ్నించారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ వచ్చేనెల 18న భార్య విషితతో కలిసి చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకున్నాడు. 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. చెన్నై వెళ్లి తమిళ సినిమావకాశాల కోసం ప్రయత్నించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపారు. విచారణలో తాను ఉదయ్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని పలుమార్లు నెత్తి బాదుకున్నారు. కూతురి జీవితం సర్వనాశనమైందంటూ ఆమె తండ్రి కూడా పోలీసుల ముందు వాపోయారు. కాగా, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా నిర్మిస్తున్న మున్నా... సినిమా ఖర్చులకు ఉదయ్ పేరు చెప్పి చాలా మంది వద్ధ అప్పు వసూలు చేసినట్లు తేలింది. సుమారు 12 చోట్ల అప్పులు చేయడంతో వారంతా గత మూడు నాలుగు నెలలుగా ఉదయ్కిరణ్ ఇంటి చుట్టూ తిరిగారు. లిఫ్ట్కు వాడే తాడుతో ఉరి: ఉదయ్ కిరణ్ ఉరేసుకోవడానికి వాడిన తాడు ఎక్కడ్నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. లిఫ్ట్ పాడైనప్పుడు లేదా ఆగినప్పుడు పైకి లాగేందుకు ఆ తాడును అపార్ట్మెంట్వాసులు వినియోగిస్తున్నట్లు తేలింది. అవసరం లేని సమయంలో ఆ తాడును టైపై ఓ మూలన పడేస్తారు. ఉదయ్ తాను ఉరేసుకోవడానికి ముందు తాడును ఇంట్లోకి తెచ్చుకొని ఉంటాడని పోలీసులు తెలిపారు. తాడు పొడవుగా ఉండడంతో ఉరికి సరిపోయేంత మేర కత్తిరించి, మిగతా తాడును మళ్లీ టైపై వేసి వచ్చినట్లు భావిస్తున్నారు. తొలుత భార్య విషిత చున్నీతో ఉరేసుకోవాలని భావించి, బీరువాలో ఉన్న రెండు చున్నీలను బయటకు తీశాడు. కానీ ఆ రెండు ఫ్యాన్ కొక్కానికి అందకపోవడంతో తాడును వినియోగించినట్లు తెలుస్తోంది. ఉరేసుకునే ముందు ఎలా చనిపోవాలన్న దానిపై కిరణ్ చాలాసేపు తర్జనభర్జన పడ్డట్లు అక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ముందుగా చేతి మణికట్టు వద్ద కోసుకొని చనిపోవాలని భావించాడు. కత్తితో మణికట్టు తెంచుకునేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
కుటుంబ కలహాలు లేవు: విషిత తండ్రి
హైదరాబాద్ : తమ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేవని విషిత తండ్రి, ఉదయ్ కిరణ్ మామ గోవింద రాజన్ తెలిపారు. ఆయన తన అల్లుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, అయితే చిత్ర పరిశ్రమలో తాను ఒంటరి అనే బాధపడుతు ఉండేవన్నారు. కెరీర్ విషయంలో ఉదయ్ కిరణ్ చాలారోజులుగా నిరాశా నిస్పృహలతో ఉన్నాడని తెలిపారు. భార్యా భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న వివాదలు సాధారణమని, అవి గొడవలు అనలేమని గోవింద రాజన్ అన్నారు. ఉదయ్ కిరణ్-విషిత మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలిస్తే తాము అతన్ని ఒంటరిగా వదిలి వెళ్లేవాళ్లమే కాదని ఆయన తెలిపారు. అప్పటివరకూ అందరం కలిసే సినిమా చూశామని, ఆతర్వాత బర్త్డే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఉదయ్ కిరణ్కు గతంలో అతని తండ్రితో ఏవో గొడవలు ఉండేవని గోవింద రాజన్ తెలిపారు. కాగా ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి .... రెండో పెళ్లి చేసుకోవటంతో గత ఆరేళ్ల నుంచి వారి మధ్య సంబంధాలు లేవు. మరోవైపు ఉదయ్ కిరణ్ మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదని సమాచారం. -
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
-
బతకాలని లేదంటూ.... పలుమార్లు!
హైదరాబాద్ : తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషితతో పలుమార్లు అన్నట్లు సమాచారం. రెండు వారాల క్రితం నుంచి అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ మూడ్ మార్చేందుకు విషిత ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో విషిత ఈ విషయాన్ని వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని విషిత పోలీసులు తెలియచేసింది. ఉదయ్ కిరణ్ 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడాడు. ఏది ఏమైనప్పటికి టాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ ఇకలేడు. అందరినీ దుఃఖ సాగరంలో ముంచి కన్నుమూశాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతను ఇప్పటివరకు మొత్తం 19 సినిమాల్లో నటించాడు. అందులో 16 తెలుగు, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. ఉదయ్ కిరణ్ చివరి చిత్రం జై శ్రీరాం.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఉదయ్కిరణ్ దిల్ కబడ్డీ అనే తెలుగు, వంబు సదాయి అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. -
ఉదయ్ లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం యావత్ సిని పరిశ్రమను, అభిమానులను విషాదంలో నింపింది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లవర్బాయ్ ఇక లేడన్న వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో, అందరితో కలివిడిగా ఉండే ఉదయ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతికి గురిచేస్తోందని పలువురు సిని ప్రముఖులు అంటున్నారు. ఉదయ్ కిరణ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసిన అతను చిన్నవయసులోనే ప్రాణాలు తీసుకోవటం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. తన జీవితానికి సంబంధించి ఎదురుదెబ్బలను తట్టుకోగలిగాడన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైనవారిని విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు ఉదయ్ కిరణ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.