vardaa
-
పంట వర్షార్పణం
- వర్దా తుపాన్తో తడిసిన పంటలు ఉయ్యాలవాడ: గడివేముల: వర్దా తుపాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నష్టం మిగిల్చింది. ఉయ్యాలవాడ, గడివేముల మండలాల్లో రైతులు పంటలు వర్షార్పణం అయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంట కళ్లముందే తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ రెండు మండలాల్లో ఎక్కువగా వరి, శెనగ, మిరప, మినుము, కంది సాగు చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్మాహ్నం వరకు చిరు జల్లులతో కూడిన వర్షం పడటంతో రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలోనే అత్యధికంగా ఉయ్యాలవాడ మండలంలో 14,800 హెక్టార్లలో శనగ సాగైంది. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటే వర్షం రావడంతో పూత, కాయ రాలిపోయి పంట నాశనమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరి, మిరప పంటలు కోసి, దిగుబడులను కళ్లాల్లో ఆరబెడుతున్న సందర్భంలో ఈ వాన కొంప ముంచిందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. -
తుపాన్ సమయంలో అప్రమత్తం
కర్నూలు(రాజ్విహార్): వర్దా తుఫాను విపత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్జైన్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో వర్దా తుఫాను బీభత్సం సృష్టిస్తోందన్నారు. తుఫాను కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, వినియోగదారుల సేవల్లో లోపం లేకుండా చూడాలని, సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ భార్గవ రాముడు, డీఈ పీవీ రమేష్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, విజయసారధి, నవీన్బాబు పాల్గొన్నారు.