breaking news
Vijay
-
ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)'ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సర్తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. 'జన నాయగన్' విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది' అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది.ఆనంది.. స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుం కాలంగళ్', 'కల్లికట్టు పళ్లికూడం' తదితర సీరియల్స్లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. 'డాన్స్ జోడీ డాన్స్ 3.0', 'జోడి నెం.1' సీజన్ 6, 7, 'మానాడా మయిలాడా' సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య 'కరుప్పు', గట్టకుస్తీ 2 చితాల్లో కనిపించింది.ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలావరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హెచ్.వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 'జన నాయగన్' మూవీకి తొలిరోజు రూ.78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఈ చిత్రం రీమేక్ ఇది.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Actress #Anandhi, who was in tears after watching #Vijay's #JanaNayagan in theatres yesterday, has openly expressed her sadness over the editing of her scenes in the film directed by #HVinoth. pic.twitter.com/RJcEnVfrQX— Chennai Times (@ChennaiTimesTOI) July 24, 2026 -
'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?
స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన చివరి సినిమా 'జన నాయగన్'. లెక్క ప్రకారం సీఎం కాకముందే అంటే ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు నిన్న(జూలై 23) థియేటర్లలో రిలీజైంది. తమిళంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు గానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసిన 'జన నాయగన్' చిత్రానికి తొలిరోజు రూ.78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.41 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. గ్రాస్ రూ.48.27 కోట్లుగా తేలింది. ఓవర్సీస్ నుంచి రూ.30 కోట్లు వచ్చాయి. ఇలా ఓవరాల్గా రూ.78.27 కోట్ల గ్రాస్ అని టాక్. ఇందులో హిందీ నుంచి రూ.1.75 కోట్లు తెలుగు నుంచి రూ.2.75 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మిగతాది అంతా తమిళ ప్రేక్షకుల నుంచే వచ్చింది.అయితే విజయ్ చివరి సినిమా అని హడావుడి చేసినప్పటికీ గతంలో వచ్చిన 'గోట్' తొలిరోజు కలెక్షన్స్ని 'జన నాయగన్' అధిగమించలేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న నంబర్స్ మాత్రమే. నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే వసూళ్లపై క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్)'జన నాయగన్' విషయానికొస్తే.. దళపతి వెట్రి కొండాన్ (విజయ్) జైలులో ఉంటాడు. తనతో పాటు ఖైదీగా ఉన్న ఓ వ్యాపారవేత్తని కాపాడి జైలర్ (గౌతమ్ మేనన్) దృష్టిలో పడతాడు. ఆ అధికారి సాయంతోనే క్షమాభిక్ష కింద వెట్రి బయటకొస్తాడు. అంతలోనే ఆ అధికారి ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయన కూతురు విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తీసుకుంటాడు. చిన్నప్పుడు తల్లి దారుణ హత్యని కళ్లారా చూసిన విజ్జి ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా మార్చి, సైన్యంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం శిక్షణ కూడా ఇప్పిస్తుంటాడు.మరోవైపు జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని లక్ష్యంగా చేసుకుని ఆమెని చంపాలని తన ముఠాని పంపుతాడు. అసలు విజ్జిని జాన్ హిమ్లర్ లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేంటి? ఆఫ్రికా దేశాల్ని వణికించిన జాన్ హిమ్లర్ ఎవరు? అతడిని వెట్రి కొండాన్ ఎలా ఎదిరించాడు? విజ్జిలోని భయాన్ని పోగొట్టి ఆమెని ధైర్యవంతురాలిగా మార్చాడా?లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'చాలా బాధగా ఉంది'.. జన నాయగన్పై త్రిష మదర్ రివ్యూ
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని థియేటర్లలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీని హీరోయిన్ త్రిష కూడా వీక్షించారు. చెన్నైలోని రోహిణి థియేటర్కు వెళ్లిన ఆమె జన నాయగన్ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతేకాకుండా ఈ మూవీని త్రిష మదర్ కూడా జన నాయగన్ చూశారు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.విజయ్ జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించామని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ అన్నారు. ఈ మూవీని ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఇది ఆయన చివరి చిత్రం కావడం నాకు బాధగా ఉందన్నారు. మేము ఆయనను చాలా మిస్ అవుతామని ఉమా కృష్ణన్ నిరాశ వ్యక్తం చేశారు. -
జన నాయగన్.. విజయ్ పారితోషికం అన్ని కోట్లా?
రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జన నాయకుడు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమా రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాకు దళపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్కు ఏకంగా రూ. 220 కోట్ల నుంచి రూ. 275 కోట్ల వరకు చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓ ఇండియన్ హీరోకు దక్కిన అత్యధిక పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశముంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు.మరోవైపు ఓ నివేదిక ప్రకారం దర్శకుడు హెచ్ వినోద్కు ఈ సినిమా కోసం రూ. 25 కోట్లు అందుకున్నారని టాక్. ఇదే నిజమైతే ఆయన కెరీర్లోనే అతిపెద్ద పారితోషికం కానుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఏకంగా రూ. 13 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డేకు రూ. 6 కోట్ల వరకు ముట్టజెప్పారని సమాచారం. విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్కు రూ. 5 నుంచి 10 కోట్ల మధ్య అందుకున్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ మూవీతో ప్రకాష్ రాజ్ రూ. 5 కోట్లు సంపాదించగా.. ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్లకు చెరో రూ. 3 కోట్లు చెల్లించారని టాక్. ఈ మూవీ కోసం నరైన్ రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు. మమితా బైజు రెమ్యునరేషన్ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికాలపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
విజయ్ జన నాయగన్.. త్రిష ఏ థియేటర్లో చూశారంటే?
దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.జన నాయగన్ రిలీజ్ కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టైమ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన త్రిష కృష్ణన్ గురించి చర్చ మొదలెట్టారు. ఈ మూవీని చూసేందుకు ఆమె చెన్నైలోని రోహిణి థియేటర్కు విచ్చేశారు. ఈ సందర్భంగా జన నాయగన్ మూవీ ఆమె వీక్షించారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్లో త్రిష పేరు మార్మోగిపోయింది. గతంలో త్రిష, విజయ్ పలుమార్లు కలిసి తెరపై జంటగా కనిపించారు. వీరిద్దరు తొలిసారిగా 2004లో 'గిల్లి' చిత్రంలో నటించారు. ఆ తర్వాత 'తిరుపాచి', 'ఆతి', 'కురువి' చిత్రాల్లో మెప్పించారు. 2023లో విడుదలైన 'లియో' చిత్రంలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి కనిపించారు. విజయ్ నటించిన 'గోట్' చిత్రంలో త్రిష అతిథి పాత్రలో కూడా కనిపించింది. Actress #Trisha watched Chief Minister Joseph Vijay film #Jananayagan at Rohini Theatre in Chennai... pic.twitter.com/Ql9KOKIuIH— Gv (@gowtham0725) July 23, 2026 -
‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : జన నాయకన్(జన నాయకుడు)నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులునిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)దర్శకత్వం: హెచ్. వినోద్సంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్విడుదల తేది: జులై 23, 2026జన నాయకన్.. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ చివరి చిత్రం అని చెప్పడంతో అప్పటికే ‘జన నాయకన్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో సెన్సార్ అడ్డంకులు ఏర్పడి, సినిమా రిలీజ్ కాకపోవడం.. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు పెట్టడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలాంటి అడ్డకుంలు లేకుండా నేడు (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి విజయ్ చివరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దళపతి వెట్రి కొండన్(విజయ్) పోలీసు ఆఫీసర్. ఓ నేరం కింద ఆయన మధురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు.కొత్తగా వచ్చిన జైలు వార్డెన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్),దళపతి మంచి తనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదలయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలో జైలు జైలర్ కూతురు విజ్జి(మమితా బైజు)తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదంలో జైలర్ చనిపోవడంతో విజ్జికి అన్ని తానై చూసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే విజ్జికి ఫియర్ ఫోబియా ఉండడంతో..ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఓ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. దీని వెనుక గ్యాంగ్స్టర్ హిమ్లర్(బాబీ డియోల్) ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు. అసలు హిమ్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతని మనుషులు విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆఫ్రికాలో అల్లకల్లోలం సృష్టించిన హిమ్లర్..ఇండియాకు ఎందుకు వచ్చాడు? భారత్పై ఆయన చేసిన కుట్ర ఏంటి? దాన్ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో జర్నలిస్ట్ కాయల్(పూజా హెగ్డే)..దళపతికి ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా కథని బేస్గా తీసుకొని, దానికి రాజకీయఅంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘జన నాయకన్’. హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఆయనకు ఉపయోగపడేలా పొలిటికల్ సీన్లను పేర్చి.. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తీర్చి దిద్దారు.అయితే ఆయా సీన్లు విజయ్ ఫ్యాన్స్ని అలరిస్తాయేమో కానీ.. జనరల్ ఆడియన్స్ని మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. ఇక తెలుగు ప్రేక్షకుల్లో అల్రేడీ భగవంత్ కేసరి చూసినవారైతే..ఓపికతో ఈ సినిమా చూడాల్సిందే.విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కేవలం అభిమానుల కోసమే అన్నట్లుగా చాలా చోట్ల హీరోకి ఎలివేషన్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న..గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్..ఎలివేషన్స్.. భారీ యాక్షన్ సీన్స్..అన్ని ఈ సినిమాలో ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా కొత్తగా అనిపించవు. పైగా క్లైమాక్స్లో రోబోలతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే సహనానికి పరీక్షగా మారుతుంది. హీరో పరిచయ సన్నివేశం నుంచి మొదలు ఫస్టాఫ్ మొత్తం దాదాపు ‘భగవంత్ కేసరి’ చూసినట్లుగానే అనిపిస్తుంది. అయినా కూడా కొంతమేర ఎంటర్టైన్ కావొచ్చు. కానీ సెకండాఫ్ మాత్రం మరీ హింసాత్మకంగా మారుతుంది. లాజిక్ లేని సీన్లు ఒకవైపు.. అనవసరమైన పొలిటికల్ డైలాగులు మరోవైపు.. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా పెడతాయి. ఇదంతా ఏం వద్దు..ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంచుకున్నాడు. దళపతి పాత్రకు తగిన న్యాయం చేశాడు. యాక్షన్తో పాటు ఓ పాటలో డ్యాన్స్ కూడా ఇరగ దీశాడు. బాబీ డియోల్ విలనిజం బాగానే పండింది. ఆయన పాత్రకు కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయి. విజ్జు పాత్రకి మమితా బైజు న్యాయం చేసింది. అయితే శ్రీలీలతో పోలిస్తే మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పాలి. పూజా హెగ్డే తెరపై అందంగా కనిపించింది కానీ.. నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర బాగుంది. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం దారుణంగా ఉంది. నాజర్, ప్రియమణి, రేవతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.టెక్నికల్ విషయాలకొస్తే..అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ తగ్గలేదు. -
విజయ్ జన నాయగన్.. అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్..!
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న తొలి సినిమా జన నాయగన్. రాజకీయాల్లో ఎంట్రీకి ముందు ఇదే చివరి సినిమా అని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఇప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో జన నాయగన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే మూడు భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్తో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టికెట్ బుకింగ్ ప్రీ-సేల్స్లో అత్యధిక వాటా తమిళ వెర్షన్ కావడం విశేషం. ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది, అడ్వాన్స్ బుకింగ్లలో రూ. 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో రూ. 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగరాల విషయానికొస్తే బెంగళూరు రూ. 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై (పరిమిత ఓపెనింగ్స్తో) రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరు రూ. 90 లక్షలతో మూడవ స్థానంలో ఉండగా,.. హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తరువాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోట్ సినిమాలతో పోలిస్తే.. జన నాయగన్ కాస్తా వెనకంజలోనే ఉంది.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న విడుదల కానుంది. -
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. -
జననాయకన్ రిలీజ్ ముందు పూజా హెగ్డేకు షాక్!
పూజా హెగ్డే కెరీర్పై మళ్లీ అనుకోని మబ్బులు కమ్ముకున్నాయి. వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ, తన ఆశలన్నీ జననాయకన్ సినిమాపైనే పెట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి. అయితే పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండవని దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టంగా ప్రకటించారు. జర్నలిస్టు పాత్రలో కనిపించే పూజా కోసం తొలుత అనేక సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, నిడివి కారణంగా చాలావాటిని షూట్ చేయలేకపోయారు. షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పూజాకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రీమేక్ అంశంపై కూడా దర్శకుడు స్పందించారు. జననాయకన్ సినిమా, తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని అంగీకరించిన ఆయన, కథలో భారీ మార్పులు చేసి కొత్తగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సినిమా జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. -
'జన నాయగన్' 50 శాతమే రీమేక్.. వేరే కథ విజయ్కి చెబితే
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఇది తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. ఇది అదే అని అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఏది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా దర్శకుడు హెచ్. వినోత్ రీమేక్ వార్తలపై స్పష్టత ఇచ్చేశాడు. సగం మాత్రమే రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి 10 జాతీయ అవార్డులు)''జన నాయగన్'..భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే పూర్తిగా చేయలేదు. 'భగవంత్ కేసరి'లో 50% మాత్రమే ఉంటుంది. ఫస్టాఫ్లో 60%, సెకండాఫ్లో 20% ఉంటుంది. విజయ్ సార్ చివరి మూవీ కోసం నేను మొదట వేరే కథ వినిపించా. కానీ ఆ కథ చాలా హెవీగా ఉందన్నారు. 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయమని నన్ను అడిగారు. బాలయ్య యూనివర్స్ విజయ్ శైలికి భిన్నంగా ఉంటుంది. 'నేర్కొండ పార్వై' తర్వాత మళ్లీ రీమేక్ చేయాలా అనే సందేహాలు నాకు చాలానే ఉండేవి. ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి, ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు''అయితే మనం ఎందుకు రీమేక్ సినిమా చేయాలని నేను విజయ్ని అడిగాను. 'భగవంత్ కేసరి' ఎందుకు నచ్చిందో ఆయన నాకు సీన్ బై సీన్ వివరించారు. విజయ్కి మహిళా సాధికారత పట్ల ఆసక్తి ఉంది. ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే భవిష్యత్తులో సీఎం విజయ్ సర్గా మారిన తర్వాత వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు. ఇది కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. విజయ్ని హీరోయిక్గా చూపించడానికే తీసిన సినిమా కాదు. సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది''జన నాయగన్' విషయంలో నేను రెండుసార్లు ఏడ్చాను. సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండగకు సినిమా విడుదల కానప్పుడు, సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పుడు, పైరసీని ఎవరూ ఆపలేకపోయినప్పుడు బాధపడ్డాను. అప్పుడు విజయ్ సార్ నాకు అండగా నిలిచారు. 'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. ఒకవేళ మనసు బాగోలేకపోతే నాకు ఫోన్ చేయండి' అని నాకు ధైర్యం చెప్పారు' అని డైరెక్టర్ వినోత్ అన్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్గా నటించాడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Dir #HVinoth Recent- #JanaNayagan is not a complete remake of #BhagavanthKesari. Around 50% is inspired by BK, while the remaining 50% is an entirely new story.- The core idea has been reworked, with the hero villain conflict significantly expanded and made much bigger than in…— Movie Tamil (@_MovieTamil) July 20, 2026 -
జన నాయగన్.. కోలీవుడ్లో తగ్గిన క్రేజ్.. అక్కడ మాత్రం రికార్డ్!
విజయ్ హీరోగా వస్తోన్న చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.ఇప్పటికే జన నాయగన్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో జన నాయగన్ దూసుకెళ్తోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 95 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు.కేవలం ఒక్క తమిళనాడులోనే ఒక్క రోజే 12 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. కేరళలో ఏకంగా 83 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. కేరళలో కేవలం 17 నిమిషాల్లో పదివేల టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో కోలీవుడ్ కంటే మలయాళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండడం మరో విశేషం. ఈ డిమాండ్ చూస్తుంటే జన నాయగన్ పట్ల ఉన్న భారీ క్రేజ్ అర్థమవుతోంది. ఇవాల్టి నుంచి మరిన్ని రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవనున్నాయి. GAME ON — 🫰🔥#JanaNayagan sold 12,000+ Tickets at Tamilnadu Box-office from it's very limited shows ( 71** ) ✊💥Real-time Pre-sales 22.43 Lakhs & Counting*** 📈💥More shows will open in coming hours, Stay tuned for Real-time updates 📌#ThalapathyVijay𓃵… pic.twitter.com/kwxzaSgyeM— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 83000+ Tickets sold for #JanaNayagan at Kerala Box-office within just 18 Hours after bookings opened ✊💥Real-time Pre-sales touched 1.40 CRORES Mark as more shows will open in coming days 📈Total Ww opening day advances gone past 13.25 Crores 🙏🔥Just 4 More days to go 🔜… pic.twitter.com/rzClqQv5Oh— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 -
'మాకు సీఎం కేక్ కావాలి'.. విజయ్ బర్త్ డేకు జాక్పాట్
దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారే సీఎం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే విజయ్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు పండుగలా జరుపుకున్నారు. హీరోయిన్ త్రిష సైతం విజయ్ బర్త్ డే రోజు కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే విజయ్ పుట్టినరోజు ఓ బేకర్ యజమానికి అనూహ్యంగా కలిసొచ్చింది. జూన్ 22న నటి త్రిష పంచుకున్న పుట్టినరోజు ఫోటోలో తమ కేక్ కనిపించిందని యజమాని తన్వి బొకారియా తెలిపారు. ఆ రోజు నుంచే ఆ ఫోటోలోని మామిడి వెనీలా కేక్ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు వారాల్లో అదే కేక్ కోసం సుమారు 300 నుంచి 400 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.బేకర్ యజమాని మాట్లాడుతూ.. "మాకు రాత్రికి రాత్రే గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ కేక్ ఏ సందర్భం కోసమో మాకు అస్సలు తెలియదు. అది చాలా ప్రత్యేకమైనది.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రెండు వారాలుగా అమ్మకాలతో చాలా బిజీగా ఉన్నాం. అందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. నా బృందం సీఎం జోసెఫ్ విజయ్ వీరాభిమానులు" అని అన్నారు. ప్రస్తుతం మామిడి కేక్ బదులు సీఎం కేక్ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారని బొకారియా అన్నారు. కాగా.. విజయ్ సీఎం అయ్యాక త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. రాజకీయాలకు ముందు ఆయన నటించిన చివరి చిత్రమిదే. ఈ మూవీనే తన ఆఖరి సినిమా అని కూడా విజయ్ విజయ్ ప్రకటించారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.తాజాగా జన నాయగన్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు మేకర్స్. జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. Tested by fire.Forged by time.Built for history.The tougher the battle,The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM— KVN Productions (@KvnProductions) July 15, 2026 -
విజయ్ చివరి సినిమా.. కొడుకు ఊహించని నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చిట్టచివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ పూర్తయినట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు తగ్గట్లే వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో మూవీని రిలీజ్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దాదాపు ఈ తేదీ కన్ఫర్మ్ అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో కొడుకు జేసన్, తండ్రి నుంచి దూరంగా తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే జేసన్.. తండ్రిలా హీరో అవుతాడని అంతా అనుకున్నారు కానీ దర్శకుడిగా మారి 'సిగ్మా' అనే మూవీ తీశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. దీన్ని జూలై 31న రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ 'జన నాయగన్'.. ఆ తేదీకి సరిగ్గా వారం ముందే వస్తున్న నేపథ్యంలో రిలీజ్ వాయిదా వేయాలని 'సిగ్మా' టీమ్ అనుకుంటోందట.ప్రస్తుతం 'సిగ్మా' వాయిదా రూమర్స్ కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి విజయ్ కోసం కొడుకు జేసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు అవుతుంది. ఇకపోతే 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన 'జన నాయగన్'లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు.(ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?) -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. -
తమిళ రాజకీయాల్లో భూకంపం.. తలుపులు మూసేసిన డీఎంకే
చెన్నై: తమిళనాడులో ఇండియా కూటమిలో పెరుగుతున్న విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన విజ్ఞప్తిని డీఎంకే గట్టిగా తిరస్కరించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కలిసి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’లో చేరి బీజేపీని ఎదుర్కోవాలని వీసీకే కోరింది.తాజా వివాదానికి కారణం వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ చేసిన ప్రతిపాదన. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, డీఎంకే ఈ సూచనను తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి ద్రోహం చేసిందని ఆరోపించింది.డీఎంకేకు వెన్నుపోటు! డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు దక్కించుకోవడానికే టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇండియా కూటమి విస్తృత ప్రయోజనాల కోణంలో కాంగ్రెస్ పరిస్థితిని చూడలేదని, ఇప్పుడు డీఎంకేను ఒప్పించేందుకు వీసీకేను "దూత"గా ఉపయోగిస్తోందని చెప్పారు. "వీసీకే ప్రతిపాదనను డీఎంకే నాయకత్వం అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ మోడల్ తమిళనాడులో పని చేయదు" అని ఆయన అన్నారు. టీవీకే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రంలో ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయని వివరించారు. తమిళనాడులో మాత్రం అధికారంలో ఉన్న కొత్త రాజకీయ శక్తి రంగంలోకి వచ్చిందని తెలిపారు.పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపై కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతైన ఆలోచన అవసరమని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ప్రయత్నం చేస్తుండడంతో బీజేపీనే డీఎంకేకు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు. -
'జన నాయగణ్' అప్డేట్ ఇచ్చిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం కాకముందు ఈయన తన చివరి సినిమా చేశారు. అదే 'జన నాయగణ్'. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజైపోవాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఈనెలలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వినిపిస్తున్న క్రమంలో విజయ్.. అధికారికంగా ఓ అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ కొత్తగా ఇంకేం తీస్తాడబ్బా?)తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన జన నాయగణ్ చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ పూర్తయింది. ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని సీఎం విజయ్.. తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పంచుకున్నారు. ఇకపోతే ఈ నెల 24న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు ఇదే తేదీ ఫైనల్ అని కూడా అంటున్నారు.ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది: నాగార్జున)pic.twitter.com/cV9UHXjjsR— Vijay (@actorvijay) July 11, 2026 -
ఆ టైంలో పోలీసుల్ని నమ్మాను.. కానీ, నన్నే నిందించారు
కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తనపై, తన పార్టీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన.. గత ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరును తప్పబట్టారు. ఈ క్రమంలో ఈ విషాదం తనను జీవితాంతం వెంటాడుతుందని భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం కరూర్లో పర్యటించిన విజయ్.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘కరూర్ తొక్కిసలాట ఎంతో బాధను మిగిల్చింది. మన సోదరీమణుల పిల్లలను కోల్పోయాం. ఎన్ని విజయాలు వచ్చినా.. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేం’’ అని విజయ్ అన్నారు.41 మంది మృతి.. వంద మందికి పైగా గాయాలుగత ఏడాది సెప్టెంబర్లో కరూర్లోని వేలుసామిపురంలో టీవీకే నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.‘‘పోలీసులను నమ్మాను.. కానీ నన్నే నిందించారు’’తొక్కిసలాటకు టీవీకే కారణమన్న ఆరోపణలను విజయ్ తోసిపుచ్చారు. ర్యాలీలో భద్రత, జన నియంత్రణ బాధ్యతలు పోలీసులవేనని అన్నారు. “జనాన్ని నియంత్రిస్తారని పోలీసు శాఖను నమ్మాను. ఆ రోజు వారికి ధన్యవాదాలు కూడా చెప్పాను. కానీ జరిగిన మరణాలకు నన్నే బాధ్యుడిని చేశారు” అని విజయ్ వ్యాఖ్యానించారు. కరూర్ పోలీసులు పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ముందుగానే తమకు తెలియజేసి ఉంటే ప్రమాదాన్ని నివారించగలిగేవారని ఆయన అన్నారు.“పెరంబలూరు పోలీసులు చేసినట్టుగా కరూర్ పోలీసులు మమ్మల్ని ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు? పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లింది కూడా పోలీసులే. ఇదంతా ఓ డ్రామాలా అనిపిస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారు?” అని విజయ్ ప్రశ్నించారు.విజయ్కు కరూర్ ప్రజల బ్రహ్మరథంకరూర్ పర్యటన సందర్భంగా విజయ్ ప్రయాణించిన మార్గం మొత్తం అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. టీవీకే కేడర్తో పాటు ముఖ్యమంత్రిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కొందరు సీఎం కాన్వాయ్కు దిష్టి తీశారు. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ దశలో భారీగా దూసుకొచ్చిన జనసందోహం కారణంగా కొందరు పోలీసులు కూడా అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో విజయ్ భద్రతా సిబ్బంది స్పందించి కిందపడిన పోలీసులను పైకి లేపి సహాయం చేశారు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.கரூர் நோக்கிய பயணத்தில் முதலமைச்சர் விஜயை பார்க்க வழிநெடுகிலும் கூடியிருந்த கூட்டம்.. முதலமைச்சரை பார்க்க முண்டியடித்த கூட்டத்தால், தடுமாறி கீழே விழுந்த போலீஸ்.. கைகொடுத்து தூக்கி விட்ட முதலமைச்சர் விஜயின் பாதுகாவலர்கள்#Karur | #CMVijay | #Vijay | #CMVijayKarurVisit |… pic.twitter.com/2Qh9cm2Ltd— Polimer News (@polimernews) July 10, 2026డీఎంకే ప్రభుత్వంపైనా విమర్శలుకరూర్ ఘటనపై గత డీఎంకే ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా విజయ్ ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణలో లోపాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పోలీసులు చేసిన ఆరోపణలను టీవీకే ఇప్పటికే ఖండించింది. విజయ్ ఆలస్యంగా రావడం వల్లే భారీగా జనం చేరారని పోలీసులు పేర్కొన్న వాదనలను ఆ పార్టీ తోసిపుచ్చింది.బాధితుల జ్ఞాపకార్థం స్మారకంకరూర్ విషాదంలో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున స్మారకాన్ని నిర్మిస్తామని విజయ్ ప్రకటించారు. “కరూర్ నా హృదయం నుంచి ఎప్పటికీ దూరం కాదు. బాధితుల జ్ఞాపకార్థం ఇక్కడ స్మారకం నిర్మిస్తాం” అని ఆయన తెలిపారు.నల్ల దుస్తులతో విజయ్..సీఎం అయ్యాక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులోనే విజయ్ కనిపిస్తూ వస్తున్నారు. అయితే.. కరూర్కు సీఎంగా తొలిసారి వెళ్లిన విజయ్ తన వేషధారణతోనూ ఓ సందేశం ఇచ్చారు. సాధారణంగా ధరించే నలుపు-తెలుపు దుస్తులకు భిన్నంగా పూర్తిగా నల్ల దుస్తుల్లో ఆయన కనిపించారు. విషాదానికి, సంతాపానికి ప్రతీకగా భావించే నలుపు రంగును ఎంచుకోవడం ద్వారా బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరూర్ పర్యటనను వేడుకగా కాకుండా.. విషాద ఘటనను గుర్తు చేసుకునే సందర్భంగా చూపించేందుకు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.విజయ్ వైఖరి ఇలా..కరూర్ ఘటన తర్వాత విజయ్ వైఖరిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన తర్వాత ఆయన అక్కడికి వెళ్లకుండా తప్పించుకున్నారని డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను టీవీకే వర్గాలు ఖండించాయి. ఘటన జరిగిన మరుసటి రోజే విజయ్ వీడియో సందేశం విడుదల చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.అనంతరం కరూర్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించాలని విజయ్ ప్రయత్నించారు. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం, పోలీసులు భద్రతా కారణాలను చూపుతూ ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని టీవీకే ఆరోపించింది. దీంతో విజయ్ కరూర్ బాధిత కుటుంబాలను మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు పిలిపించి వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి కరూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శించడంతో పాటు, ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సీఎం హోదాలో విజయ్ చేసిన తొలి కరూర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొక్కిసలాట ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై లేవనెత్తిన ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ఆల్ క్లియర్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి చిత్రమిదే. విజయ్ సీఎం అయినా కూడా ఇంకా విడుదల కాలేదు.తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్టైమ్ 183 నిమిషాలుగా నిర్ణయించింది. గతంలో సెన్సార్ సమస్యల వల్లే ఆ మూవీ రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఆ సమస్య క్లియర్ కావడంతో ఈ నెల 24న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.కాగా.. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. OFFICIAL: #JanaNayagan Censored "🅰️"DURATION : 3 Hours 3 Minutes 11 Seconds📌LINK: https://t.co/M7W87PlkKV pic.twitter.com/ar4JpmMQQ8— Actor Vijay Team (@ActorVijayTeam) July 9, 2026 -
జన నాయగన్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం జన నాయగన్. సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. జన నాయగన్ రిలీజ్ డేట్పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ జన నాయగన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో జన నాయగన్ రిలీజ్ చేస్తున్నట్లు యార్క్ సినిమాస్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేసింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాతనైనా జన నాయగన్ థియేటర్లలో సందడి చేయనుంది.పాలిటిక్స్లో ఎంట్రీకి ముందు ఇదే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటించారు. 🔥 Finally! Our Own Thalapathy Vijay is ready to set the big screen on fire with #JanaNayagan💥🇨🇦 Canada Release by York Cinemas🎬 Igniting screens from July 24.Get ready for the ultimate theatrical celebration. Stay tuned for tickets 🎫#thalapathyvijay #yorkcinemas pic.twitter.com/CcyiZAZqUp— York Cinemas (@yorkcinemas) July 8, 2026 -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. ఎంట్రీ ఫిక్స్..!
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. కమల్ హాసన్ లాంటి స్టార్స్కు సాధ్యం కానీ ఫీట్ సాధించారు.ఇక విజయ్ గెలుపుతో ద్రవిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సినీ స్టార్స్ వరుసగా రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుశ్ సైతం ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన అభిమాన సంఘం ఓ కార్యక్రమంలో అధికారిక జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం ధనుశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.దళపతి విజయ్ లాగే ధనుశ్ సైతం రాజకీయాల్లో అడుగు పెడతారనే చర్చ కోలీవుడ్లో ఊపందుకుంది. వచ్చే ఎన్నికల కల్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్కో ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల వేళ.. ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. -
విజయ్ సర్కార్ను కూల్చేందుకు రూ.180 కోట్ల డీల్..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారీ డీల్ కుదిరినట్లు వెల్లడైంది. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ఏకంగా రూ.180 కోట్ల మేర డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన 8 మంది నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు రావచ్చని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, వాటిని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి సమర్థించడం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్ర బయటపడింది. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఫోన్ చేసిన కొందరు అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా తీసుకువచ్చే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఆశ చూపారు. దీనికి నిరాకరించిన ఎమ్మెల్యే.. తనను, తన కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీస్ కమిషనర్ అమల్రాజ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర బయటకు వెల్లడైంది. దీనిపై ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి, పొలిటికల్ సర్వే సంస్థ నిర్వహిస్తున్న తిరునావుక్కరసు, త్యాగరాజన్, నరేష్, రమేష్, కార్తీ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సెంథిల్ సోదరులకు సమన్లు ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ పరారీలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అశోక్కుమార్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కుట్ర కేసులో విచారణ కోసం వీరిద్దరినీ చెన్నై పోలీస్ స్టేషన్కు పిలిపించేందుకు పోలీసులు కరూర్ రామేశ్వరపట్టిలోని సెంథిల్ బాలాజీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. సెంథిల్ కుమార్, అశోక్కుమార్ ఈ నెల 20న ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. వాటిని వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కేసులో డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన మరికొందరు కీలక రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇది తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీయవచ్చని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. నిందితుల వాంగ్మూలంలో షాకింగ్ విషయాలువిశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విచారణలో నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ సూచనల మేరకే తాము ఈ ఆపరేషన్కు ఒడిగట్టినట్లు నిందితులు వెల్లడించారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదట అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్లాన్ చేశారు. దీనికి 10 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో, ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ ద్వారా ఈ ఆపరేషన్ కోసం రూ.180 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిందితులు తెలిపారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే తమకు కూడా భారీగా ముట్టజెబుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్కు చర్చలు రహస్యంగా జరగాయి. ఇందుకోసం నిందితులు గిండిలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేశారు. ప్రలోభ పెట్టాల్సిన టీవీకే ఎమ్మెల్యేల జాబితాను తమకు ఇచ్చారని, దాని ప్రకారం కొందరితో మాట్లాడామని నిందితులు తెలిపారు. అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా డబ్బు ఆశకు లొంగలేదని, అందరూ తిరస్కరించారని వారు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. -
విజయ్ చుట్టూ రహస్య వలయం.. బయటపడిన షాకింగ్ నిజాలు
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ చుట్టూ రాజకీయ సలహాదారులు, సినీ మేనేజర్లు, ప్రొడక్షన్ కంట్రోలర్లు, ఎన్నికల వ్యూహకర్తలు, పాత్రికేయులు, వ్యాపార భాగస్వాములు, ఎన్నాళ్లుగానో ఆయనతో ఉన్న నమ్మకస్తులు కలిసి ఉన్నారని ‘‘ఇండియన్ ఎక్స్ప్రెస్’’ పేర్కొంది.వారిలో చాలామంది పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, విజయ్ వ్యక్తిగత వర్గం మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దీనితో పాలనకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య ఉన్న హద్దులు మసకబారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తున్న వ్యక్తులను తరచూ సోషల్ మీడియా పోస్టులు లేదా ప్రతిపక్ష ఆరోపణల ద్వారానే గుర్తిస్తున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. జూన్ 30న డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్.ఎస్.భారతి పోలీసు డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. మంత్రి మండలి సమావేశాలు, అధికారిక సమీక్షలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఇతర గోప్య సమావేశాల్లో జాన్ అరోకియాసామి, విష్ణు రెడ్డి పాల్గొన్నారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.ఆ ఫిర్యాదులో అధికార రహస్యాల చట్టం సహా ఇతర చట్టాల ఉల్లంఘన జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. గోప్యంగా నిర్వహించే ప్రభుత్వ సమావేశాల వివరాలను రహస్యంగా ఉంచాలన్న ప్రమాణాన్ని ముఖ్యమంత్రి పాటించాల్సిన బాధ్యత ఉందని అందులో పేర్కొన్నారు.విష్ణు రెడ్డి విజయ్కు అత్యంత సన్నిహితుడిగా, జాన్ అరోకియాసామి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎదుగుదలలో ఇద్దరూ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.డీఎంకే ఎంపీ పి.విల్సన్ కూడా ఇటీవల ఈ ఇద్దరు ఉన్నతస్థాయి ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనడంపై ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు కాకపోతే మరి వారు గోప్యంగా ఉంచిన పత్రాలపై చర్చ జరిగే సమావేశాలకు వారు ఏ హోదాలో హాజరయ్యారని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో ఈ ఇద్దరికీ ప్రత్యేక గదులు కేటాయించారని కూడా విల్సన్ ఆరోపించారు. దీంతో ప్రభుత్వంలో వారి పాత్ర, వారికి ఉన్న ప్రాప్యతపై సందేహాలు మరింత పెరిగాయి.టీవీకే ఏమంటోంది?ఈ ఆరోపణలు సరైనవి కావని టీవీకే వర్గాలు తెలిపాయి. కీలక సమావేశాల్లో జాన్ అరోకియాసామి, విష్ణు రెడ్డి పాల్గొనేందుకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నాయి.అయితే, ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఈ వ్యవహారం ఇద్దరితో మాత్రమే పరిమితం కాలేదు. విజయ్కు ఎన్నాళ్లుగానో మేనేజర్గా ఉన్న జగదీశ్ పళనిస్వామి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియమితుడైనట్టు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రభుత్వ నియామకాన్ని వెల్లడించారు. ఈ నియామకం దాదాపు నాలుగు రోజుల ముందే ఖరారైందని ఓ సీనియర్ టీవీకే నేత తెలిపారు. విష్ణు రెడ్డి, జాన్ అరోకియాసామిలా కాకుండా, ముఖ్యమంత్రితో తన సన్నిహిత సంబంధాన్ని ఉపయోగించి జగదీశ్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారని చెప్పారు.మరిన్ని నియామకాలు బెంగళూరుకు చెందిన కేవీఎన్ గ్రూప్ ఛైర్మన్, విజయ్ సినిమా జన నాయగన్ నిర్మాత కె.వెంకట నారాయణను తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో నియమించారు. ఈ పదవికి మంత్రి హోదా ఉంటుంది. సాధారణంగా ఫోర్ట్ సెయింట్ జార్జ్, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను సమన్వయం చేసే బాధ్యత ఈ పదవిదే.వేరుగా, విజయ్ నటించిన పలు సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అధినేతగా నియమించారు.విజయ్ శిబిరంలో ప్రస్తుతం ఐదుగురు కీలక అనధికార సలహాదారులుగా పనిచేస్తున్నారు. వారు సలహాలు, సమాచారం, రాజకీయ అంచనాలు అందిస్తూ ముఖ్యమంత్రి సలహా వ్యవస్థలో భాగంగా ఉన్నారని చెబుతున్నారు.వారిలో ఒకరు గతంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు విజయ్ అంతర్గత వర్గంలో ఉన్నారు. ఆయన విష్ణు రెడ్డికి బంధువు కూడా. ఈ బృందంలో అధికారికంగా పార్టీ లేదా ప్రభుత్వంలో హోదా లేని ఇద్దరు పాత్రికేయులు కూడా ఉన్నారని సమాచారం. వారిలో ఒకరు తమిళ పత్రిక మాజీ సంపాదకుడు కాగా, మరొకరు సీనియర్ మీడియా ప్రతినిధి. బదిలీలు, సమన్వయ ప్రక్రియల వంటి పరిపాలనా అంశాలపై వారు సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు.ఇంకా ఇద్దరు సినీ, రాజకీయ రంగాలకు చెందినవారని సమాచారం. వారిలో విజయ్ నమ్మకస్తుడైన మాజీ ప్రొడక్షన్ కంట్రోలర్, ప్రజా సంబంధాల అధికారి ఒకరు కాగా, మరొకరు డీఎంకే కూటమి తరఫున 2 సార్లు ఎంపీగా ఎన్నికైన వామపక్ష ఎంపీ అని సోర్సెస్ తెలిపాయి. -
రాఘవ లారెన్స్ ప్రకటన.. మరోసారి తెరపైకి త్రిష..!
తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అక్కడి ప్రజలు వ్యవస్థ కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తారని మొన్న ఎన్నికల్లోనూ స్పష్టమైంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన దళపతి విజయ్ ఏకంగా సీఎం పీఠం ఎక్కేశారు. ఎంతలా ఓ వ్యక్తిని ద్రవిడ ప్రజలు అభిమానిస్తారో ఈ ఫలితాలే నిదర్శనం. ఇక విజయ్ సీఎం అయ్యాక చాలామంది సినీ స్టార్స్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ధనుశ్, రాఘవ లారెన్స్, విశాల్ ఇలా చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.ఇటీవలే ఎంట్రీ ఇస్తారని ఆశించిన రాఘవ లారెన్స్ సైతం తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా వచ్చే అవకాశముందని హింట్ ఇచ్చారు. మరోవైపు లారెన్స్.. విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహగానాలొచ్చాయి. ఇవాల్టి ప్రకటనతో ఆయన ఎంట్రీ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. మరి తిరుచ్చి స్థానంలో ఎవరు నిలబడతారనే విషయంపై మరోసార చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో అందరి చూపులు ఆమెవైపే చూస్తున్నాయి. తాను మరెవరో కాదు.. విజయ్ గెలిచాక ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా మారిన త్రిష. విజయ్ సీఎం అయ్యాక.. త్రిష ఏకంగా హోం మినిస్టర్ కానుందని కథనాలొచ్చాయి. త్రిష బర్త్ డే రోజే ఎన్నికల ఫలితాలు రావడంతో మరింత హైలెట్గా నిలిచింది. తాజాగా రాఘవ లారెన్స్ తిరుచ్చిలో పోటీ చేయనంటూ ప్రకటించిన నేపథ్యంలోనే మరోసారి త్రిష పేరు వినిపిస్తోంది. ఆమె కోసమే రాఘవ లారెన్స్ పోటీ నుంచి తప్పుకున్నారా? అనే చర్చ కోలీవుడ్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఓదార్పు యాత్రలో సీఎం విజయ్.. ఏం హామీ ఇచ్చారు?
-
విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే
టాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల సినిమాలు చెప్పిన టైంకి రిలీజ్ కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇలా జరగడానికి హీరోలు కారణమా? దర్శకులు లేదా పరిస్థితులు కారణమా అనే సంగతి పక్కనబెడితే ఆలస్యం మాత్రం జరుగుతోంది. ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ వర్కింగ్ స్టైల్ ఫాలో అయితే గనక తెలుగు హీరోలు ఈ వాయిదాల్ని కచ్చితంగా అధిగమించొచ్చు. నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.(ఇదీ చదవండి: నేనే మీకు నిజం చెబుతాను.. కమెడియన్ షాకింగ్ వీడియో)'విజయ్ ఓ సినిమా కోసం 100 రోజుల కాల్ షీట్ కేటాయిస్తారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 20 తేదీ వరకు మాత్రమే షూటింగ్లో పాల్గొంటారు. అలా వరసగా ఐదు నెలల్లో మూవీ పూర్తి చేస్తారు. నెలలో మిగిలిన రోజులు విశ్రాంతి తీసుకోవడం, స్టోరీ డిస్కషన్స్, డబ్బింగ్, ప్రమోషన్స్ లాంటి వాటి కోసం వినియోగిస్తారు. ఇలా కచ్చితమైన షెడ్యూల్స్ వల్ల మూవీ టీమ్కి చాలా ప్లస్ అవుతుంది. విజయ్ కాల్ షీట్స్ ముందే ఫిక్స్ అయిపోతాయి కాబట్టి షూటింగ్ లొకేషన్స్, మిగతా నటీనటులు కాల్ షీట్స్, టెక్నికల్ అంశాల సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే విజయ్ వర్కింగ్ స్టైల్.. ఇండస్ట్రీలోనే ఆదర్శం. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఇలానే చేసేవారు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.స్వతహాగా తెలుగు నిర్మాత అయిన దిల్ రాజు.. వారిసు(తెలుగులో 'వారసుడు')తో తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. రూ.200-250 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా) -
సీఎం విజయ్ కాదు.. రియల్ లైఫ్ హీరో..!
తమిళనాడు సీఎం విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకున్నారు. సీఎంగా విజయ్ మానవత్వం చాటుకున్నారు. ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తాను కూడా ఒక మనిషేనని నిరూపించారు.విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రం కోసం ఒక గర్భిణీ స్త్రీ కూడా హాజరైంది. అయితే ఆమెను వేదికపైకి పిలవకుండా విజయ్ స్వయంగా వెళ్లి ఆమెకు అందించారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ మానవత్వాన్ని మరువలేదని నిరూపించారు. ఒక గర్భిణీ పట్ల విజయ్ చూపిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. పూర్తి మెజారిటీ రాకపోయినా కొన్ని పార్టీల మద్దతుతో సీఎం అయ్యారు. BREAKING: A Heartwarming Gesture by Tamil Nadu Chief Minister Joseph Vijay. Instead of asking her to come up to the stage, he stepped down from the stage and personally handed the very first appointment order to a pregnant woman. A small gesture that spoke volumes. pic.twitter.com/GTZgd20MYW— Actor Vijay Team (@ActorVijayTeam) June 24, 2026 -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
హీరోయిన్ త్రిష సర్ప్రైజ్.. సీఎం విజయ్కు విషెస్..!
హీరోయిన్ త్రిష అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ రోజే దళపతి విజయ్ను అన్ఫాలో చేసిన ముద్దుగుమ్మ.. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవన్నీ విలువైనవిగా చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కానీ ఈనెల 22న సీఎం విజయ్ బర్త్ డే కాగా.. ఒక రోజు ఆలస్యంగా విష్ చేయడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. తాజాగా ఇవాళ విజయ్కు పుట్టినరోజు విషెస్ చెప్పడం మరోసారి హాట్టాపిక్గా మారింది.త్రిష పేరు వైరల్..హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరలైంది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారనే రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
సీఎం విజయ్ని అన్ ఫాలో చేసిన త్రిష
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరల్ అయిపోయింది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారన రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన ఈ జంట.. ఊహించని విధంగా ఇప్పుడు చర్చకు కారణమయ్యారు.(ఇదీ చదవండి: సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్)సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. పైపెచ్చు విజయ్ని త్రిష.. ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.ఇన్నాళ్ల పాటు సాగిన బంధానికి పుల్స్టాప్ పడిపోయిందా? మరి త్రిష ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై త్రిష స్పందించి క్లారిటీ ఇస్తే తప్పితే ఈ చర్చ ఆగదు. ప్రస్తుతం త్రిష తెలుగులో 'విశ్వంభర' చేసింది. ఈ మధ్యే సూర్య 'వీరభద్రుడు' మూవీతో హిట్ అందుకుంది. కెరీర్ పరంగా అయితే పీక్ స్టేజీలో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్) -
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 21, 22 (ఆదివారం, సోమవారం) తేదీల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన జంతుప్రదర్శనశాలల్లో ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.అటవీ శాఖ మంత్రి ఆర్.వి.రంజిత్కుమార్ మాట్లాడుతూ.. వండలూరులోని అరిజ్ఞర్ అన్నా జంతుప్రదర్శనశాల, వెల్లూరు జిల్లాలోని అమిర్థి జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురుంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.ఉచిత ప్రవేశం పొందాలంటే సందర్శకులు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్లు తీసుకోవాలి. "ఉచిత ప్రవేశం వల్ల శాఖకు ఆర్థిక నష్టం ఉండదు. ఈ రెండు రోజుల టికెట్ వ్యయం సుమారు రూ.కోటి అవుతుంది. ఆ మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.భారీ రద్దీ?వన్యప్రాణి ప్రేమికులు, జంతుప్రదర్శనశాల అధికారులు వండలూరు జంతుప్రదర్శనశాలకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి గరిష్ఠంగా 15,000 మంది మాత్రమే ఈ జంతుప్రదర్శనశాలకు వెళ్లే వీలు ఉంటుంది. అయితే ఉచిత ప్రవేశం వల్ల సందర్శకుల సంఖ్య లక్ష దాటితే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఈ ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ముందు జాగ్రత్తగా వండలూరు జంతుప్రదర్శనశాలకు రోజుకు గరిష్ఠంగా 50,000 ఆన్లైన్ టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే లోపల ఉన్న సందర్శకుల సంఖ్య ఆధారంగా కౌంటర్ల వద్ద టికెట్ల పంపిణీని నియంత్రిస్తామని చెప్పారు.గిండి చిల్డ్రన్స్ పార్కుకు మినహాయింపు లేదుచెన్నైలోని గిండి చిల్డ్రన్స్ పార్కును స్థలాభావం, అధిక రద్దీ కారణంగా ఉచిత ప్రవేశ పథకం నుంచి మినహాయించారు. వండలూరు జంతుప్రదర్శనశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించేందుకు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేశ్ కుమార్ దోగ్రా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జూన్ 22న కాంచీపురం జిల్లావ్యాప్తంగా 52,000 మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుందని మంత్రి తెలిపారు. -
సీఎంగా విజయ్.. 12 ఏళ్ల తర్వాత త్రిషకు కలిసిరానుందా?
ఏదైనా కొత్త సినిమాలు ఏడాదికో, రెండేళ్లలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే అది కాస్తా మూడు నుంచి నాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ది భారీ బడ్జెట్ మూవీస్ సైతం అనుకున్న టైమ్లోనే విడుదలైన సందర్భాలే ఎక్కువ. కానీ షూటింగ్ పూర్తై ఐదు నుంచి పదేళ్లయినా కూడా రిలీజ్ కానీ చిత్రాలు రిలీజ్కు నోచుకోలేదంటే చాలా కారణాలే ఉండొచ్చు. ఈ జాబితాలో విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం దాదాపు 8 ఏళ్లవుతున్న విడుదల కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవలే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్కు మరో నెల రోజుల సమయం కోరాడు.మరి ఒక సినిమా విడుదలకు ఇదే చాలా లాంగ్ గ్యాప్ అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ అంతకు మించి రిలీజ్ కాకుండా ఆగిపోయిన మూవీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నటించిన చిత్రం కావడం మరో విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇటీవల రాజకీయ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే గతంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శతురంగ వట్టై-2 ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2014లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్థిక సమస్యల వివాదంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరవింద్స్వామి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ నిర్మల్కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్ వినోద్ కథ అందించారు.అయితే తాజాగా ఈ మూవీ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట ఉన్న క్రేజ్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సీఎం అయ్యాక ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆమెకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో చిత్రీకరణ పూర్తయిన తర్వాత పుష్కర కాలానికి త్రిష మూవీ రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.ఈ కేసును విచారించిన చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం. -
సీఎంగా తొలి బర్త్ డే.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్లిమిటెడ్గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 22న ‘వెట్రి న్యూస్’ అనే న్యూస్ చానెల్ సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అర్థం. విజయ్ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్ఫ్లున్సెయర్, పొలిటికల్ అనలిస్ట్గా పేరుగాంచిన మణికందన్ భాస్కరన్ తన bbtrackermanix ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్ జోష్లో ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్ టీవీ గ్రూప్ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్ గ్రూప్కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్కాంత్ పార్టీ కోసం కెప్టెన్ అనే ఓ చానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్కు అనుకూలంగా జయా న్యూస్, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. వెట్రి న్యూస్ చానెల్ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్షిప్ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్ను టేకప్ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ ఆ చానెల్ను హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. -
మహిళలను కించపరిచిన వ్యక్తికి రాజ్యసభ సీటు..!
-
విజయ్ చివరి సినిమా.. రిలీజ్ కానట్లేనా?
విజయ్ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి చిత్రం జననాయకన్. పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమిత బైజు కీలక పాత్రను పోషించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీ ఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం జననాయకన్. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల కాలేదు. కారణాలేమైనా ఆ చిత్రం చిక్కు ముడి వీడలేదు. విజయ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో జననాయకన్ చిత్రానికి మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. చిత్ర నిర్మాత కూడా జననాయకన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు సరికదా, చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ చిత్ర ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సమస్య మరింత జటిలమైంది. మరోపక్క జననాయకన్ చిత్రం వ్యవహారంలో ముఖ్యమంత్రి విజయ్ని మౌనం పాటించాల్సిదిగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో నిర్లిప్తత నెల కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిందని, ఆయన డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకున్న అడ్వాన్న్స్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరుస్తుందా ? ఇక జననాయకన్ను తెరపై చూసే అవకా శం లేదా ? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జననాయకన్ చిత్రానికి దారేది అనే ప్రశ్న ఎదురవుతోంది. -
‘‘సీఎం విజయ్ను ఎంజీఆర్తో పోల్చడమేంటీ?’’
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది. అభిమాన సంఘాల నెట్వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్లా చాలా సంవత్సరాలు విజయ్ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్తో విజయ్ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కే కృష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్ను చూడొద్దు. నేను విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.సినిమాలు చూసి ప్రభావితమయ్యారు.. ‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృష్ణస్వామి అన్నారు.విజయకాంత్, శరత్కుమార్, భాగ్యరాజ్ వచ్చారు.. ‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి. ఇప్పటి కాలం మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు. -
సీఎం విజయ్తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సినీ హీరో విజయ్ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు. ‘కరుప్పు’ కథను మొదట విజయ్కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది. -
త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!
విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్ను పరామర్శించారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్షాట్లు, ఆమె పెంపుడు కుక్క చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. -
విజయ్ ర్యాలీకి పోటెత్తిన జనం
-
నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్కు ఎంత కష్టమొచ్చింది? -
అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..!
కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తలో అజిత్ అభిమానులు, కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుబాయ్లో ఉన్న అజిత్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ఆమె కడచూపు కోసం అభిమానులు పెద్దఎత్తున అజిత్ ఇంటికి వచ్చారు.తమిళనాడు సీఎం విజయ్ కూడా అజిత్ తల్లి మోహిని పార్ధివదేహానికి నివాళులర్పించారు. దండ చేతిలో పట్టుకుని నేరుగా అజిత్ ఇంటికి వెళ్లిన విజయ్.. అక్కడే ఉన్న అజిత్ను ఓదార్చారు. సీఎంతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు. సీఎం విజయ్తో పాటే త్రిష కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. AK receives CM Vijay & Trisha! pic.twitter.com/AM9UExLtCe— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2026 -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్కు వలస వెళ్లి లండన్లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్లోనే చదువుకున్నారు. విజయ్కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఐఎండీబీ టాప్లో ఊహించని పేరు.. విజయ్, ఎన్టీఆర్, షారూక్ కూడా అతని వెనకే..!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ వారంలో టాప్లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ఈ లిస్ట్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్వన్ ప్లేస్ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు.బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్ను ఒక బాలనటుడిగా గుర్తించారు. కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. Catch who is trending on IMDb’s Popular Indian Celebrities list of the week! 🌟 See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿This list is powered by ‘Popular Indian Celebrities’: a weekly IMDb feature that showcases the Indian stars trending… pic.twitter.com/DHQRD5dVed— IMDb India (@IMDb_in) May 27, 2026 -
పవన్పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
ప్రధాని మోదీతో సీఎం విజయ్ భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విజయ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంగీకారం లేకుండా అనుమతి ఇవ్వొద్దని విజయ్ కోరారు. దీనిపై తమిళనాడు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్ కలవనున్నారు.తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాలపై విజయ్ చర్చిస్తారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఇతర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారు. -
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
సీఎం విజయ్కు స్టార్ హీరో విజ్ఞప్తి.. అదేంటంటే?
కోలీవుడ్ హీరో విజయ్ సీఎం అయ్యాక సినీ పరిశ్రమ ఆయనపై గంపెడాశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి సీఎంకు విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రారంభించాలని విజయ్ను కోరారు. ఓటీటీ ప్లాట్ఫారాన్ని ప్రారంభిస్తే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.విజయ్ సీఎం అయ్యాక విశాల్ సైతం ఇండస్ట్రీ ఇబ్బందులను వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడాన్ని తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితేనే న్యాయం చేయగలడని అన్నారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్ సినీతారలు సంబురాలు చేసుకున్నారు. -
ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా విజయ్, నేను చనిపోయేవాళ్లం!
సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.కేరళలో ఫైట్ సీన్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు. కదిలే రైలుపై..ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.గుండె ఆగిపోయినంత పని!70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం. ఆయన భయం లేకుండా..కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్ -
సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?
స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి చాలారోజులు అయింది. కానీ ఈయన చివరి సినిమాకు మాత్రం మోక్షం దొరకట్లేదు. స్వయంగా నిర్మాతే రీసెంట్గా ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని చెబుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? 'జన నాయగణ్' విడుదల ఎప్పుడు?(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)తమిళ స్టార్ హీరో అయిన విజయ్.. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోతే తిరిగి మూవీస్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో ఇక సినిమాలు చేయడం కష్టమే. అందుకే 'జన నాయగణ్' ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.అయితే సెన్సార్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో 'జన నాయగణ్' అసలు ఎప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్న టైంలో జూన్ 19న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుందని టాక్ బయటకొచ్చింది. డిస్ట్రిక్ట్ టికెట్ బుకింగ్ సైట్లో ఈ తేదీనే ఉండటంతో ఇదే ఫైనల్ అని అనుకుంటున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు రిలీజ్ అయితే తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం థియేటర్ల దగ్గర సందడి వాతావరణం గ్యారంటీ. మరి ఇదెంత వరకు నిజమవుతుందనేది చూడాలి?విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో చేసిన 'జన నాయగణ్'.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. తొలుత ఇది నిజమా కాదా అని అంతా అనుకున్నారు గానీ తమిళనాడు ఎన్నికల రిలీజ్ టైంలో మూవీ పైరసీ ప్రింట్ లీక్ కావడంతో రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆస్కార్లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ) -
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్కుమార్కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026 -
సీఎం విజయ్కు సరికొత్త తలపోటు
తమిళనాడు సీఎం విజయ్ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సీఎం విజయ్ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందివిజయ్ నివాళులు.. కాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది. ఇది కేవలం ప్రభాకరన్కు మాత్రమే నివాళి కాదుఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.విజయ్కు సరికొత్త తలపోటుసీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్తో అందులోనూ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ, తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026 -
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.అందుకే స్టాలిన్ కామెంట్లు!తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్ మీడియాలోనూ డీఎంకే వీక్గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ పేరు మరోసారి హాటాపిక్.. TVK విజయంపై రజినీ..
-
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
సీఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అభ్యంతరం..!
విజయ్ సీఎం అయ్యాక అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సీఎంవోలో ఓ జ్యోతిష్యుడిని నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అతన్ని తొలగించారు. తాజాగా విజయ్ మరో నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్మోహన్కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయ్కు సూచించారు.సీఎం విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను తీవ్రంగా నిరాశపర్చిందని విశాల్ అన్నారు. సినిమాతో విజయ్కు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా.. ఈ శాఖకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మీరేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని.. సినీరంగ అభివృద్ధికి తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.చిత్ర పరిశ్రమ, సంఘాలు, నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి అవసరమని విశాల్ అన్నారు. ఈ విషయంలో తాను రాజ్మోహన్ను అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సినిమా రంగంలో విజయ్కు ఉన్న అనుభవమే సరైన ఎంపిక అవుతుందని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సమస్యలు పరిష్కరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.విజయ్ ముందు డిమాండ్లు..విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సినిమా టికెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇది ప్రేక్షకులపై భారాన్ని తగ్గించి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను అనే సూత్రం ఉన్నప్పటికీ ద్వంద్వ పన్ను విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమేనని.. స్థానిక సంస్థల పన్నును తొలగించాలని కూడా ఆయన కోరారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలను పెంచాలని విశాల్ అభ్యర్థించారు. Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…— Vishal (@VishalKOfficial) May 17, 2026 -
'అందుకే స్టాలిన్ను కలిశా.. విజయ్పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి అసూయ లేదన్నారు. కమల్హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
విజయ్ కి నేను చెప్తాలే.. ఫ్యాన్ కోరిక తీర్చిన త్రిష
-
బ్రిటీష్కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్ను ముగించాలంటూ విజయ్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కు చేసిన రిక్వెస్ట్తో ఆమె వార్తల్లో నిలిచింది. -
కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే?
తమిళనాడు సీఎం విజయ్కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
'విజయ్ని అడిగామని చెప్పండి..' త్రిష రియాక్షన్ చూశారా?
కోలీవుడ్ హీరోయిన్ త్రిష తాజాగా కరుప్పు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా త్రిష చెన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. మూవీ వీక్షించిన అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడే ఫ్యాన్స్.. ఆమె కారును చుట్టుముట్టారు. దీంతో ఒకరు విజయ్ని అడిగామని చెప్పండని త్రిషను అడిగారు. ఇది విన్న త్రిష చిరు నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. "Thalapathy ah kettenu sollunga"Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn— Deepu (@deepu_drops) May 15, 2026 -
సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు. ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు. గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
తడబడని తొలి అడుగులు
తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి అంచనాలకూ దొరకని రీతిలో ప్రారంభమై రెండేళ్ల పాటు దాన్నే కొనసాగించి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన టీవీకే ఏలుబడి మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 22 మంది, అయిదుగురు తటస్థంగా ఉండి పోయారు. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీలు వాకౌట్ చేశాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని సమావేశం పొడవునా విజయ్ వ్యవహరించిన తీరు, విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబిస్తూ చేసిన ప్రసంగం విమర్శలకు తావీయకుండా ముగియటం గమనించదగ్గది. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పటం మద్దతుగా నిలిచిన వామపక్షాలకూ, వీసీకేకూ ఊరటనిచ్చివుంటుంది. విజయ్ అణుకువతో, ఆవేశానికి తావీయని రీతిలో ఉంటూనే చేయదల్చుకున్నది చేస్తారని ఈ సమావేశం రుజువుచేసింది. వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను ఓఎస్డీగా నియమించటాన్ని మిత్రపక్షం వీసీకే విశ్వాస తీర్మానం సమయంలో నిలదీసి నప్పుడు విజయ్ భేషజానికి పోకుండా వెంటనే ఆ నియామకాన్ని పునస్సమీక్షిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దాన్ని రద్దుచేసినట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు వగైరాలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండొచ్చన్న నిబంధనను 500 మీటర్లకు సవరించటం, అది వెంటనే అమల్లో కొచ్చి పదులకొద్దీ దుకాణాలు మూతబడటం కూడా జనం మెచ్చే చర్య.విజయ్ రాక ఇప్పటికే ప్రధాన కూటములు, పార్టీల్లో ఊహించని ప్రకంపనలకు దారి తీసింది. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రగల ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు జనం ఆదరణ కరవై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఎన్నో సంక్షోభాల్ని తట్టుకుని నిలబడ్డ డీఎంకే–కాంగ్రెస్ కూటమి చెల్లాచెదురైంది. అందలం కోసం ఆత్రపడి కాంగ్రెస్ డీఎంకే చెలిమిని వదులుకు పోయిందిగానీ సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు అదే కూటమిలో కొనసాగుతూనే విజయ్కి మద్దతివ్వక తప్పని స్థితికి చేరుకున్నాయి. అన్నాడీఎంకే చీలి ఆ పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు, మాజీ సీఎం పళనిస్వామికి షాకిచ్చారు. దాంతో టీవీకేకు చిన్న పార్టీల అవసరం నిజానికి ఇప్పటికే తీరిపోయింది. ఎవరిది అసలైన అన్నాడీఎంకే అనే అంశం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా టీవీకే లేదా వ్యక్తిగతంగా విజయ్ ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండానే, గట్టి హామీలు ఇవ్వకుండానే అన్నాడీఎంకే చీలిపోయిందంటే ఎవరూ నమ్మరు. కానీ అదెక్కడా ప్రచారంలోకి రాకపోవటం విజయ్ వ్యూహచతురతకు నిదర్శనం. ద్రవిడ పార్టీలను ఎలాగైనా బలహీనపరచాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్, బీజేపీలతో అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటూనే వాటిని జనానికి చేరువ కానీయకుండా చేయటంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఇన్నాళ్లూ విజయం సాధించాయి. కానీ పార్టీకి ద్రవిడ నామం లేకుండా వచ్చిన విజయ్ సునాయాసంగా ఆ రెండు పక్షాలనూ మట్టికరిపించారు. అలాగని పెరియార్ రామస్వామి వంటివారిని ఉపేక్షించ కుండా నివాళులర్పించారు. ఆయన ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడోపక్షానికి అవకాశం ఉన్నదని నిరూపించారు. విజయ్ సినిమా ఇతివృత్తాలు కథానాయకుడు తనకెదురయ్యే అవరోధాలను ఎదుర్కొనటం అనే అంశం చుట్టూ తిరుగుతాయి. చివరగా హీరో విజయం సాధించటంతో అవి ముగుస్తాయి. గత వారం రోజుల పరిణామాలు సైతం అదే ఒరవడిలో వెళ్లాయి. నాటకీయత లేకుండా సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, చేయదల్చుకున్నది తక్షణం చేయటం ఆయనలో కనబడే ప్రత్యేక లక్షణం. దీన్నే కొనసాగిస్తే, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడిన జనాకర్షణ కాస్తా త్వరలోనే దృఢమైన పునాదిగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. -
అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
నా పార్టీ నేతలు తప్పు చేసినా సరే.. అసెంబ్లీ విజయ్ విశ్వరూపం
-
విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ
-
సీఎం కార్యాలయంలో రాథన్ పండిట్ కు కీలక హోదా
-
విజయ్ అన్న థాంక్స్..! మద్యం బంద్ పై విశాల్ రియాక్షన్
-
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
విజయ్ సీఎం.. జన నాయగన్కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. -
విజయ్ చూపగల తేడా ఏమిటి?
సుమారు ఆరు దశాబ్దాల పాటు అవిచ్ఛి న్నంగా సాగిన ద్రవిడ పార్టీల రాజకీయ పరంపరను భంగపరచటం వరకు విజయ్ ప్రతిభ, ప్రభావం కనిపిస్తున్నవే. భవిష్యత్తు వైపు చూసినపుడు ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. తమిళనాడులో సమ సమాజ భావనలు, సంక్షేమ రాజ్య భావనలు దేశ స్వాతంత్య్రానికన్నా ముప్పయి సంవత్సరాల ముందు నుంచే వ్యవస్థీకృత రూపంలో ఏర్పడ్డాయి. అవి కొనసాగుతూనే బలమైన తమిళ జాతీయవాదం కూడా ఇంచుమించు అప్పటినుంచే రూపు తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారం స్వీకరించిన విజయ్– సమ సమాజం, సంక్షేమం, తమిళ జాతీయవాదం అనే మూడు అంశాలలో చూపగల తేడా ఏమైనా ఉండవచ్చునా?సారాంశంలో ద్రవిడవాదమే!ఇందుకు సమాధానం విజయ్ నాయకత్వాన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పాలనలో మాత్రమే లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. తమిళ సమాజంలో ఈ భావనలు విడదీయలేని అంశాలు. క్రీస్తు పూర్వం నుంచి గల తమ భాషా సాహిత్యాలు, మధ్య యుగాల నాటి వైభవోపేత రాజ్యాలు, వాటి పాలనలు అందుకు తోడై తమిళ జాతి, సంస్కృతులను తీర్చిదిద్దాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయ క్రమంలో ద్రవిడ పదం వాడుకలోకి వచ్చి, ఉత్తరాది అనే ఒక ‘ప్రత్యర్థి’ని సృష్టించి ధిక్కారంగా నిలిచింది. ఇపుడు విజయ్ పార్టీ పేరును, చెదురుమదురు వ్యాఖ్యలను, పార్టీ మేనిఫెస్టోను, 10వ తేదీన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దానిని బట్టి, గతంకన్న తేడాలు ఏమైనా ఉన్నాయనిపిస్తున్నదా? డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ‘ద్రవిడ’ పార్టీలు ఓడినందున, ద్రవిడ వాదం ఇక ముగిసిపోయిందని, విజయ్ ఆ వాదనకు ముగింపు పలికారనే వ్యాఖ్యలు వెంటనే మొదలయ్యాయి. అవి తొందరపాటు మాటలనాలి. విజయ్ పార్టీ పేరులో ద్రవిడ అనే పదం లేకున్నా తమిళ అనే పదం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రపంచంలో ద్రవిడ–తమిళ పర్యాయ భావనలు. ఒకటి లేక రెండవ దాని మనుగడ లేదు.ద్రవిడ వాదానికి ప్రాణప్రదమైన అంశాలు వేటినీ విజయ్ వదలలేదు. తన ఆరాధ్యులలో పెరియార్ రామస్వామిని చేర్చారు. ద్రవిడ భావజాలంలో సమసమాజం, సంక్షేమం మొదటి నుంచి ఉన్నవి గనుక, అందుకు స్వాతంత్య్రానంతర కాలంలో ప్రధాన ప్రతి నిధి అయిన అంబేడ్కర్ను స్వీకరించారు. తమ చరిత్రలో సమాజం కోసం పాటుపడిన ఇద్దరు మహిళలు వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్లను ప్రముఖంగా నిలిపారు. దీనంతటి అర్థమేమిటో వేరే చెప్పనక్కర లేదు. పైగా, సంక్షేమ సంబంధమైన పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఆయన, ఆ విషయాలలో ‘ఎంత మాత్రం రాజీ పడబో’మని ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రకటించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలిదప్పుల బాధ తెలుసునని ముక్తాయించారు. సారాంశంలో ఇదంతా ద్రవిడవాదమే.సుపరిపాలన అందేనా?ఇది చాలదనుకుంటే, పెరియార్ రాజకీయ వైఖరిని, ద్రవిడ వాద రాజకీయ సంప్రదాయాన్ని విజయ్ స్పష్టంగానే కొనసాగిస్తు న్నారనుకోవాలి. నిజానికి డీఎంకే లోగడ (1999–2003) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి కాగా, అన్నాడీఎంకే గురించి చెప్ప నక్కర లేదు. విజయ్ రాగల కాలంలో ఏమి చేసేదీ చెప్పలేముగానీ, ప్రచార సమయంలో మాత్రం బీజేపీ తన ‘సైద్ధాంతిక ప్రత్యర్థి’ అని ప్రకటించారు. సెక్యులరిజ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇదంతా ఆధునిక పరిస్థితులకు వర్తించే పెరియారిజమే అవుతుంది. తన ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నందుకు మాత్రమే విజయ్ ఇట్లా మాట్లాడుతున్నారనలేము. ఆయన మౌలిక విధానమే అదయినట్లు ఎన్నికల ప్రచారంలోనేగాక, రెండేళ్ల ముందు పార్టీని స్థాపించినప్పటినుంచే అర్థమైంది.పరిపాలనకు సంబంధించి విజయ్ చేసిన సూత్రీకరణలురెండున్నాయి. ఒకటి సమర్థమైన సుపరిపాలన, రెండు అన్ని వర్గాలకు మేలు కలిగే సంక్షేమం. ఈ రెండూ ద్రవిడ పార్టీల విధానాలలో ఉన్నవే. ఆచరణకు వచ్చే సరికి సుపరిపాలన క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అవినీతి పెచ్చు పెరిగింది. డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా. అన్ని వర్గాల మేలన్నది దళితులకు అంతగా వర్తించలేదన్న విమర్శ చాలా కాలం నుంచే ఉంది. విడుదలై చిరుతగళ్ కచ్చి (వీసీకే) కొంత కాలంగా డీఎంకే కూటమిలో ఉన్నా, ఇపుడు విజ య్కు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ మూలాలు ఈ విమర్శలోనే ఉన్నాయి. అటువంటి వివక్ష తమ పాలనలో ఉండబోదన్నది కొత్త ముఖ్యమంత్రి ఇస్తున్న హామీ. ఈ వివక్షల మూలాలు తమిళ గ్రామీణ వ్యవసాయిక వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నందున, ఈ సమస్యను గ్రామీణ నిర్మాణాలలో గానీ, పట్టణాలు కేంద్రంగా నడిచే ఆధునిక ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో గానీ విజయ్ ఏ విధంగా సరిదిద్దవచ్చునన్నది ఆయన శ్రద్ధపై, చతురతపై ఆధార పడుతుంది.అసలు సవాళ్లు హామీలే!సుపరిపాలనకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ను (1954–63) విజయ్ చూపటంలో ధైర్యం ఉంది. ప్రశంసించదగ్గదే గానీ, ద్రవిడ ఉద్యమం అట్లుండగా సంక్షేమ విధానాలకు పేరుబడిన అణ్ణాదురైను ముందుకు తేకపోవటం ఆశ్చర్యకరం. పార్టీ ఏదైనా కామరాజ్ వలెనే అణ్ణాదురై తమిళనాడు చరిత్రలో మార్గదర్శ కుడయ్యారు. అక్కడ ఫెడరలిజాన్ని స్థిరపరచి దీర్ఘకాలికం చేసింది కూడా ఆయనే. ప్రగతిశీలం కాదనుకున్న అంశాలపై తన గురువు పెరియార్తో విభేదించి సాగారు. తర్వాత డీఎంకే చీలి అన్నాడీఎంకే ఏర్పడినా రెండు పార్టీలకూ ఆరాధ్యుడయ్యారన్నది విజయ్కు తెలియదనుకోలేము.మౌలిక సూత్రాలపై, సిద్ధాంతాలపై ఎంతమాత్రం రాజీపడబోనని, రాజకీయాల మౌలిక బలమే అదని ఆలోచింపజేసే విధంగా ప్రకటించిన తమిళ జెన్–జీ తార విజయ్కు పెద్ద పరీక్ష మాత్రం మేనిఫెస్టోలోని ఆర్థిక సంబంధమైన హామీల అమలులో ఎదురు కానున్నది. ఆ హామీలలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన పోటాపోటీ పాప్యులిజం తక్కువ లేదు. వాటి అమలుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని గ్రహించినందువల్ల మొదటి రోజునే గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారమంటూ మాట్లాడి, హామీలు క్రమక్రమంగా తప్పక అమలు చేయగలమనీ, తనను నమ్మాలనీ ప్రజలను కోరారు. అదే విషయమై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక హెచ్చరిక బాణాన్ని కూడా వెంటనే వదిలారు మరి.ఈ నిర్వచనాలు, సాధకబాధకాలు ఎట్లున్నా, ద్రవిడ వాదాన్ని లేదా తమిళవాదాన్ని వర్తమాన కాలానికి అవసరమనుకున్న రీతిలో మెరుగులు దిద్ది గత పరిపాలనలకు తన పాలనకు గల తేడా ఏమిటో విజయ్ నిరూపించగలరని ఆశించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు. కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత?
సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
విజయ్ విజయానికి పనిచేసిన సీక్రెట్ టీమ్
-
ఐయామ్ హ్యాపీ.. నా మద్దతు ఎప్పటికీ విజయ్ కే
-
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది.విజయ్తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
సీఎంగా విజయ్.. రజనీకాంత్-కమల్ సినిమా ఆగిపోతుందా?
ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు. వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం. అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సీఎంగా విజయ్.. సందడి మొత్తం త్రిషదే
ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్ అట్రాక్షన్గా మాత్రం త్రిష నిలిచింది.పద్దతిగా చీరలో.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.ಗ್ಯಾಂಡ್ ಲುಕ್ ನಲ್ಲಿ @actorvijay ಅವರ ಪ್ರಮಾಣವಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನಟಿ ತ್ರಿಷಾ#Trisha #Oath #Vijay #tamilnaduelectionresults2026 pic.twitter.com/jySoXvqb3d— Anand Hunashal (@ana_hunashal) May 10, 2026త్వరలోనే పెళ్లి?విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది. సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్ భావిస్తున్నాడట. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/VmvDUqIjIq— ANI (@ANI) May 10, 2026 -
ఎట్టకేలకు 'విజిల్' మోత
సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్ విజిల్ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో విజయ్ పార్టీకి గవర్నర్ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు. మద్దతుతో ముందుకు... తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్కు మేజిక్ ఫిగర్ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్ లోక్భవన్కు బయల్దేరగా అపాయింట్మెంట్ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర చీఫ్ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్కు విజయ్ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్కు గవర్నర్ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం. వీసీకేతో మారిన పరిణామాలు సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్ తిరుమావళవన్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్ ఫిగర్ను దాటింది. తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్ చెప్పడం, గవర్నర్ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. ప్రమాణస్వీకారానికి రాహుల్గాంధీ రాక నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్కు రాష్ట్ర కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య నేతలకు మంత్రి పదవులు! టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మునిసిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దినకరన్ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. -
విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
-
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్లో టేక్లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
కేవలం 2 సీట్ల కోసం విజయ్ ను.. రంగంలోకి దిగిన KA PAUL
-
తమిళనాడులో హై డ్రామా VCK చీఫ్ తో విజయ్ కీలక భేటీ
-
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్గానే బయటపడింది. ఆపై..విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
టీవీకేకు VCK కండిషన్స్.. విజయ్ ప్రమాణంపై నేడు క్లారిటీ
-
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్కు అందజేసిన విజయ్ విజయ్తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్భవన్కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్భవన్లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్భవన్కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
గవర్నర్తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్తో పాటు తమిళనాడు గవర్నర్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)#ThalapathyVijay's Latest video with Governor and He stakes claim to form Government in TN..🔥🤩 All is Well..🤝pic.twitter.com/kbYBy4TVMZ— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2026 -
అప్పుడేమో త్రిషపై వివాదాస్పద కామెంట్స్.. ఇప్పుడేమో ఇలా..!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నోటిదూలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మన్సూర్ ఎక్కువగా రేప్ సీన్స్లో నటించానని తెలిపారు. విడయ్ హీరోగా వచ్చిన లియో మూవీలో త్రిషతోను అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. చిరంజీవి, ఖుష్బూతో సహా పలువురు సినీతారలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ వివాదంపై మన్సూర్ కోర్టుకు వెళ్లారు. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. అక్కడి అతనికే కోర్టు షాకిచ్చింది. లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ పిటిషన్ కొట్టవేసింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఎలక్షన్ టైమ్లో విజయ్కు మద్దతుగా మన్సూర్ నిలిచారు. తొక్కిసలాట టైమ్లో విజయ్ను వెనకొసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ గెలిచాక మన్సూర్ స్పందించారు. వెంటనే విజయ్ను ఆహ్వానించి సీఎం చేయాలని గవర్నర్ను కోరారు. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయవద్దని విజయ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించకండి.. రాష్ట్రంలో ఏదీ సక్రమంగా పనిచేయడం లేదు. వెంటనే విజయ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అప్పుడు త్రిషపై వ్యాఖ్యలతో వివాదానికి కారణమైన మన్సూర్.. ఇప్పుడు విజయ్కు మద్దతుగా నిలవడం విశేషం. Don’t create unrest in the state. Nothing is functioning properly in the state. Quickly invite @TVKVijayHQ and make him sit in the CM’s chair! 🙏— Actor Mansoor Ali Khan pic.twitter.com/oM5aRntwkB— Arun Vijay (@AVinthehousee) May 8, 2026 -
ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ నటించారు. విజయ్తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.అన్నాదురైద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.కరుణానిధినాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.ఎంజీఆర్నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.జయలలితజయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారుస్టాలిన్తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.ఎన్టీఆర్తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.విజయ్(ఇంకా సీఎం కాలేదు)తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.1937 మే 26న మన్నార్గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది. -
విజయ్ ని సీఎంగా చూడడానికి సింగపూర్ నుంచి వచ్చాం
-
కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో TVK విజయ్ భేటీ
-
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్కు అందజేత లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్భవన్కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని ఓ పత్రికకు గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు.విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్.ఆర్ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు. కాగా విజయ్కు జెడ్ప్లస్ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.విజయ్- త్రిష పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు. ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. -
'విజయ్కు అడ్డంకులు.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్'
తమిళ హీరో, దళపతి విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచాడు. పాలిటిక్స్లో అడుగుపెట్టి తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. సీఎం కావడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ద్రవిడ రాజకీయాలను షేక్ చేశాడు. అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. అయితే అధికారం చేపట్టేందుకు మాత్రం ఇంకా సీట్లు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లిస్ట్ అందజేశారు. ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం కావడంతో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.తమ హీరో, నాయకుడు అత్యధిక సీట్లు గెలిచినా కూడా సీఎం కావడానికి మరింత సమయం పట్టడంపై ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని విజయ్ ఇంటి బయట పూజలు చేస్తూ కనిపించారు. తమ నాయకుడికి అడ్డంకులు రావడంతో అభిమాని ఆవేదనకు గురయ్యారు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. எவ்வளவு கஷ்டம் வந்தாலும் என் தலைவர் முதலமைச்சர் ஆகனும்.. சாமி நீ தான் காப்பாதனும். 🥺🥺🙏pic.twitter.com/7KBbMzgwXN— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) May 7, 2026 -
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్
-
'తమిళనాట' సస్పెన్స్ థ్రిల్లర్
సాక్షి, చెన్నై: వందకు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజనుమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకూ ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించనట్లుగా బద్ధ వ్యతిరేక డీఎంకే, అన్నాడీఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతాయన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరోటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేవు. అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డీఎంకే, అన్నాడీఎంకేలు ‘లేదు’అనే సమాధానిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తతస్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లుచేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్కు పిలిపించి, సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి పదిన్నరగంటలదాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ పార్టీల మధ్య కుదరని సయోధ్య! విజయ్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు రహస్య చర్చలు జరిపాయని మీడియాలో వార్తలొచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రతినిధుల బృందాలు లోతైన చర్చలు జరిపాయని తెలుస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అన్నాడీఎంకే ఆఫర్ చేయగా అందుకు డీఎంకే సమ్మతి తెలిపిందని, కానీ బయటి నుంచి మద్దతు ఇస్తామని డీఎంకే వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలో చేరితే ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నాడీఎంకే ఆఫర్చేసినట్లు తెలుస్తోంది. అందుకే ససేమిరా ఒప్పుకోబోమని, తప్పదనుకుంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డీఎంకే తెగేసి చెప్పడంతో అర్ధంతరంగా చర్చలు ముగిశాయని వార్తలొచ్చాయి. 118 మంది మద్దతుతో వస్తే చూస్తాం: గవర్నర్ అంతకుముందు బుధవారం ఉదయం నుంచి తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మంగళవారం రాత్రే మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జతచేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్ తదితరలు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్లజాబితాను గవర్నర్కు విజయ్ సమరి్పంచి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. దీంతో నిరాశతో విజయ్ వెనుతిరిగారు. మొదలైన మలుపుల పర్వం ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలీగానే అప్పటిదాకా ప్రమాణస్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్కుతోడుగా అన్నాడీఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ‘‘ఇది పూర్తిగా అబద్ధం. ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు’’అని పార్టీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టంచేశారు. తాము సైతం డీఎంకే కూటమికే మద్దతు ఇస్తామని సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టంచేశారు. అంతకుముందు సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే మిత్రపక్షమైన విదుథలై ఛిరుథైగల్ కట్చి(వీసీకే) చీఫ్ థోల్ తిరుమవాలన్ ప్రకటించారు. ‘‘మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను’’అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. మద్దతిస్తూ ముందుకొచ్చిన కాంగ్రెస్ బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గిరీశ్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్లింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కు కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది. నాన్చుడి ధోరణి మానుకోవాలి.. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ నాన్చడమేంటని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మండిపడ్డారు. ‘‘బలనిరూపణ అనేది శాసనసభలో చేస్తారు. లోక్భవన్లో కాదు. లోక్భవన్లోనే 118 సంఖ్య చూపించాల్సిన అవసరం లేదు. ఇకనైనా గవర్నర్ మాటున బీజేపీ రాజకీయాలుచేయడం మానుకోవాలి. తక్షణం గవర్నర్ విజయ్ను మళ్లీ పిలిచి వెంటనే బలనిరూపణకు అవకాశమివ్వాలి’’అని జ్యోతిమణి డిమాండ్చేశారు. ఏం జరగొచ్చు!! టీవీకే, కాంగ్రెస్ కలిస్తే? కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురు కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సీపీఐ, సీపీఎంలోని తలో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆరుగురు వీళ్లకు జతకలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. టీవీకే, అన్నాడీఎంకే కలిస్తే? అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జతకూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. ద్రవిడ పార్టీలు దగ్గరైతే? డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డీఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరుపార్టీల మిత్రపక్షాలు తోడు వస్తే ఇది సాధ్యం. పీఎంకే(4), ఐయూఎంఎల్(2), సీపీఐ(2), సీపీఎం(2), ఏఎంఎంకే(1),డీఎండీకే(1) ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. మొదలైన రిసార్ట్ రాజకీయాలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పాతిక మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్కు బుధవారం రాత్రి 11.30 గంటలకు తరలించారు. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్ట్కు వెళ్లారు. సీ వీషణ్ముగం ఉదయం టీవీకేతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామిన అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడం గమనార్హం. డీఎంకే ఎమ్మెల్యేలూ పుదుచ్చేరి సమీప రిసార్ట్కు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. విజయ్కు భద్రత మాయం! విజయ్కు మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్భవన్కు వెళ్లివచ్చారు. అయితే బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరై ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
నిర్మాత ఆర్బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అధినేత ఆర్బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.కాగా... ఆర్బీ చౌదరితో విజయ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. தயாரிப்பாளர் ஆர். பி. சௌத்ரி உடலுக்கு தலைவர் விஜய் நேரில் அஞ்சலி! pic.twitter.com/GmhMrE5ByT— Tamilaga Vettri Kazhagam (@TVKFor_TN) May 6, 2026 -
విజయ్ జన నాయగన్.. తొలి హీరోగా రికార్డ్
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్ అభినందిస్తూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ టైటిల్ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్.. అంటూ జననాయగన్ టైటిల్ కార్డు వేసింది. పోలీసు డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్న విజయ్ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. India's first time CM title card for actor !pic.twitter.com/7xrz4QgbmO— ʲᵈᴀʟᴇxᴀɴᴅᴇʀᵗʷᵉᵉᵗˢ (@JDALEXtweets) May 6, 2026 -
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్తో పాలిటిక్స్లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్టాపిక్గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో జేసన్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు. ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్ను అన్ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై జూన్లో విచారణ జరగనుంది. -
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
విజయ్, సువేందు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో దళపతి విజయ్ (టీవీకే), పశ్చిమ బెంగాల్లో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి.. ఇద్దరూ చెరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 14 రోజుల్లో వీరు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో, ఏ సీటును అంటిపెట్టుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వీరి భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.సువేందు సంచలనం.. సీఎం రేసులో..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ తేడాతో ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నందిగ్రామ్లోనూ 9,665 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే, ఆయన భవానీపూర్ను వదులుకుని, తన సొంత జిల్లా తూర్పు మేదినీపూర్లోని నందిగ్రామ్ స్థానాన్నే అంటిపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమతను రెండుసార్లు ఓడించిన ఘనత దక్కించుకోవడంతో ఆయన తదుపరి సీఎం రేసులో ముందున్నారు. మే 9న జరగనున్న ప్రమాణస్వీకారానికి పరిశీలకునిగా అమిత్ షా వ్యవహరించనున్నారు.చెన్నైకే విజయ్ ఓటు.. పెరంబూర్ ఫిక్స్తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్పై పెరంబూర్లో 53,715 ఓట్ల మెజారిటీతో నెగ్గగా, తిరుచిరాపల్లిలో 27,416 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయ్ తన సొంత ప్రాంతమైన చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అంటిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బైపోల్స్ కోసం దళపతి మాస్టర్ స్ట్రోక్మధ్య, దక్షిణ తమిళనాడులో పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహంతోనే విజయ్ తొలుత తిరుచిరాపల్లి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుండటంతో, త్వరలో జరిగే ఉపఎన్నికలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి యు సహాయంను బరిలోకి దించే అవకాశాన్ని టీవీకే అధిష్టానం పరిశీలిస్తోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో పరిపాలనా అనుభవం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం విజయ్దేనని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్భవన్లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్భవన్కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్భవన్కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్తో గవర్నర్ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్భవన్కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
విజయ్ గెలుపు వెనక.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర..!
ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్ కూడా విజయ్పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.ఈ విజయంలో ముఖ్యంగా విజయ్కు ఉన్న క్రేజ్ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్లో బీజీఎం కింగ్ పేరున్న తమన్యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం
ఏది జరిగినా మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్’ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.ఆలస్యమే ఆమృతం..ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్ అయితే.. కొంతవరకు పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ అవుతుందని విజయ్ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. ఓటీటీ బిజినెస్ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్ రిలీజ్ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత జననాయగన్ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్, క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది.బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే..టాక్ని బట్టి కలెక్షన్స్ ఉండేవి. హిట్ టాక్ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
తమిళనాడు సీఎంగా విజయ్.. రెండేళ్ల క్రితమే చెప్పేశాడుగా..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్ పర్సన్గా చరిత్ర సృష్టించాడు. సింగిల్గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.విజయ్ కూడా ముందే హింట్..టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు. TVK formed in Feb 2024The Greatest of All Time release Sep 2024Look at the Car number.TN 07 CM 2026 ❤️❤️❤️The Election Results came out First in Theatre Screens 🔔Peak Detailing by @vp_offl Venkat Prabhu in Thalapathy Vijay movie GOAT 🔥🔥🔥#FI pic.twitter.com/Uv5M7RZR5A— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) May 4, 2026 -
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
గవర్నర్కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్భవన్కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
TVK ఘన విజయం విజయ్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
-
అందరి నోర్లు మూయించిన విజయ్
-
BIG QUESTION: బెంగాలీ గడ్డపై కాషాయ జెండా పెద్దోళ్ళకు షాకిచ్చిన విజయ్
-
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఐదు ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకేఅందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్మోదీ ట్వీట్కు దన్యవాదాలు తెలిపిన విజయ్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
విజయ్ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్’ రిలీజ్?
నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి. Maanbumigu Thamizhaga Mudhalvar Dr. C. Joseph Vijay Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026 -
‘దళపతి’ దండయాత్ర.. అధికారానికి అడుగు దూరంలో..
సాక్షి, చెన్నై: అంచనాలకు ఏమాత్రం అందని విజయం..! ఒంటరి పోరులో ‘దళపతి’ విజయ విహారం..! పెరంబూర్, తిరుచిరాపల్లి (ట్రిచీ) ఈస్ట్ రెండు చోట్లా ‘విజిల్’మోత! చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్గా విజయ్.. రెండేళ్లలోనే బలమైన రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించారు.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించారు.. తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.. అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అధికార పీఠానికి మరొక్క అడుగు దూరంలో నిలిచింది. టీవీకే 107 స్థానాలలో విజయం వైపుగా దూసుకెళ్లి ద్రవిడ పార్టీల శకానికి ముగింపు పలికింది. రెండు చోట్లా గెలిచిన ‘దళపతి’ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. డీఎంకే అధికారాన్ని కోల్పోగా ఈ కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలను దక్కించుకుంది. తమిళనాడు ఎన్నికలలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేయగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓటింగ్ నమోదైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు డీఎంకే వైపు మొగ్గుచూపగా మరికొన్ని అన్నాడీఎంకేకు అనుకూలంగా వచ్చాయి. యాక్సిస్ మై ఇండియా మాత్రం అధికారం విజయ్దే అని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా సోమవారం ఉదయం కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠ పోరులో.. తమిళనాడులోని 234 అసెంబ్లీ సీట్లకు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపులో డీఎంకే తొలుత ఆధిపత్యాన్ని ప్రదర్శించినా క్రమంగా టీవీకే పుంజుకోవడ ం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు టీవీకే ఖాతాలో పడ్డాయి. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతి స్వల్ప మెజారిటీతో డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ నెలకొంది. రెండు ద్రవిడ పార్టీ లను వెనక్కి నెట్టి ఈవీకే క్రమంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యాహ్నం సమయానికి డీఎంకే మూడో స్థానంలో నిలవగా అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంది. అనంతరం 1,000 నుంచి 2 వేల ఓట్ల ఆధిక్యంతో టీవీకే, డీఎంకే మధ్య నువ్వా..నేనా అన్నట్లుగా కౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. వంద నియోజక వర్గాలు దాటిన తదుపరి టీవీకే తన ఆధిపత్యం చాటుకుంది. మధ్యాహ్నం సమయానికి పలు నియోజకవర్గాలలో తుది ఫలితం వెలువడాల్సి ఉండగా కొద్దిగా జాప్యమైంది. సాయంత్రం మదురై దక్షిణం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గోపీషన్ తొలుత విజయకేతనం ఎగుర వేశారు. అనంతరం అదే పార్టీకి చెందిన సీనియర్ నేత సెంగోట్టయన్ గోబి చెట్టి పాళయంలో విజయం సాధించారు. క్రమంగా టీవీకే అభ్యర్థుల విజయ పర్వం కొనసాగడం మొదలైంది. గెలిచిన వారిలో అత్యధిక శాతం మంది రెండు వేలు, ఐదు వేలు, పది వేలలోపు మెజారిటీకే పరిమితమయ్యారు. అధికారానికి అడుగు దూరంలో..తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టేందుకు 118 స్థానాలు అవసరం. ఇప్పటివరకు ద్రవిడ పార్టీలు సంపూర్ణ మెజారిటీతో సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. తాజాగా టీవీకే సునామీ సృష్టించినా అధికారానికి స్పల్ప దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేనా? అనే చర్చ సాగుతోంది. ఫలితాలలో టీవీకేకు నగర ఓటర్లు అండగా నిలిచారు. నగరాలలో 69 నియోజకవర్గాలు ఉండగా 60 స్థానాలను టీవీకే కైవసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో 165 స్థానాలు ఉండగా, టీవీకే 47 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందిన చాలా చోట్ల టీవీకే అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నైలో 16 నియోజకవర్గాలు ఉండగా కేవలం రెండు చోట్లే ఆ పార్టీ గెలిచింది. మిగిలినవన్నీ టీవీకే ఖాతాలో చేరాయి. సంకీర్ణం దిశగా.. ⇒ విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదు ర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవ కాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. ⇒ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న కాంగ్రెస్ 28 చోట్ల, దివంగత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే 10 చోట్ల, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే 8 చోట్ల, సీపీఎం, సీపీఐ చెరో ఐదు చోట్ల, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు స్థానాల్లో పోటీ చేశాయి. 58 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా మిగిలిన 176 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంతో అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో డీఎంకే అభ్యర్థులు 164 మంది బరిలో నిలవగా 12 మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులున్నారు. ⇒ అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఉన్న బీజేపీ 27 చోట్ల, పీఎంకే 18 చోట్ల, ఏఎంఎంకే 11 చోట్ల, టీఎంసీ 5 చోట్ల, ఏజేకే 2 చోట్ల, టీఎంఎంకే, పురట్చి భారతం, పుదియ నిధి కట్చిలు తలా ఒకచోట పోటీ చేశాయి. ఇందులో టీఎంసీ బీజేపీ కమలం చిహ్నంతో పోటీ చేసింది. అన్నాడీఎంకే 168 చోట్ల బరిలో నిలిచింది. ⇒ ఎన్నికలలో మార్పు నినాదంతో తొలిసారిగా, ఒంటరిగా బరిలో దిగిన సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ 233 స్థానాలలో పోటీ చేసింది. (సేలం ఎడప్పాడిలో పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది). మరో నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి 234 స్థానాలలో పోటీ చేసింది. ఇందులో 50 శాతం మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. విజయ్.. విన్నింగ్ షాట్సాక్షి, అమరావతి: 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు... పోలింగ్ రోజు విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తొలిసారిగా సంకేతం ఇచ్చారు.. ఐదేళ్ల తర్వాత ఆయన రాజకీయ తొలి ఇన్నింగ్స్లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ ఊహించలేదు.. 50 ఏళ్లుగా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వేళ్లను పెకలిస్తారని దిగ్గజ విశ్లేషకులు కూడా అంచనా వేయలేదు.. అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి ఇన్నింగ్స్లోనే విన్నింగ్ షాట్ కొట్టిన సరికొత్త రాజకీయ సూపర్స్టార్గా విజయ్ నిలిచారు. తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం..విజయ్ రాత్రి 7 గంటలకు చెన్నై అడయార్లోని నివాసంలో తల్లిదండ్రులను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నుంగంబాకంలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఎన్నికల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికిన అభిమానులకు విజయ్ అభివాదం చేశారు. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
విప్లవాల నేల మీద వినూత్న తీర్పు
నాలుగు రాష్ట్రాలు (కేరళం, తమిళ నాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన వేసవి ఎన్నికల్లో తమిళ శాసనసభ ఫలితాలు చాలావరకు అనూహ్యంగా వచ్చాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధారణ మెజారిటీకి సమీపంలోకి రావడం నిజంగా రాజకీయ పండితుల అంచనాలకు అందని విషయం. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పదిహేనేళ్లుగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ను కేంద్రంలో పాలకపక్షం బీజేపీ ఓడించి 200కు పైగా సీట్లు సాధించి తొలిసారి అధికారంలోకి రావడం కూడా అత్యధిక ఎన్నికల విశ్లేషకుల లెక్కలకు చిక్కని వాస్తవం. 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే (ఏఐడీఎంకే)లు ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత జీవించి ఉండగా జరిగిన 2016 ఎన్నికల్లో మాత్రం ఈ సాంప్రదాయం మారింది. 2011 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఆమె పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఊహించని సంచలనానికి దారితీశాయి. ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం లేని మూడో పెద్ద రాజకీయ పక్షం టీవీకే 107 సీట్లు గెలుచుకుని తమిళ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. పార్టీ నిర్మాణం, తెలివైన రాజకీయ వ్యూహం, రాజకీయ అనుభవం లేకుండానే విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించడం తమిళ ప్రజల కొత్త ఆలోచనా ధోరణికి అద్దం పడు తోంది. జనాకర్షక పథకాలు, ప్రజలు ఉపయోగించే అనేక వస్తువు లను ఉచితంగా ఇవ్వడం, ఇంకా చాలా సౌకర్యాలు, పథకాల పేరిట సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తామనే హామీలు గుప్పించే తమిళ ఎన్నికల్లో ఇలాంటివి ఏవీ లేకుండా టీవీకే విజయం సాధించడం అంత తేలికగా బయటివారికి అర్థంకాని అంశమే.ద్రవిడ సిద్ధాంత పునాది లేకుండా గెలుపెలా?తమిళనాడులో (పాత పేరు మద్రాస్) 1952 ముందు నుంచీ సాగిన కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికాయి 1967 శాసనసభ ఎన్నికలు. దశాబ్దాలుగా తమిళ నేలలో ప్రజలను ఆకట్టుకుని వేళ్లూ నిన ద్రవిడ సిద్ధాంతం పునాదిగా (బ్రాహ్మణేత వర్గాల సంక్షేమం, తమిళ భాషకు గౌరవం) ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఈ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ప్రాంతీయపక్షంగా రికార్డు నమోదు చేసుకుంది. సీఎం అణ్ణాదురై నాయకత్వంలో ఎం.కరుణానిధి వంటి పలువురు హేమాహేమీలైన నేతల ఉమ్మడి కృషితో నాడు డీఎంకే విజయం కాంగ్రెస్పై సాధ్యమైంది. అలాగే, డీఎంకే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సినీ నటుల జనాకర్షక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్ పార్టీ అన్నాడీఎంకే విజయానికి ఆయన ఆకర్షణేగాక, ద్రవిడ సిద్ధాంత బలం ఉన్న డీఎంకేతో ఆయన దశా బ్దాల అనుబంధం కూడా ఉపయోగపడింది. అయితే, విజయ్ పార్టీ టీవీకేకు ఎంజీఆర్ పార్టీకి ఉన్న నేపథ్యం లేదు. యువతలో విపరీ తమైన ‘క్రేజ్’ ఆయనకు ఉందిగానీ ఎంజీఆర్లా విస్తృత రాజకీయ అనుభవం లేదు. సిద్ధాంతాలు అసలు లేకపోలేదు...2024 అక్టోబర్లో విక్రవండిలో జరిగిన టీవీకే తొలి రాజకీయ మహాసభలో ‘‘బీజేపీ మితవాద పోకడల కారణంగా ఇది టీవీకేకు ‘సైద్ధాంతిక ప్రత్యర్ధి’; డీఎంకే అనుసరించే అవినీతి, వారసత్వ రాజకీయాల వల్ల అది మాకు ‘రాజకీయ శత్రువు’ అని విజయ్ తేల్చి చెప్పారు. ఈ లెక్కన మతతత్వ వ్యతిరేక ధోరణి, లౌకిక విశ్వాసాల కారణంగా బీజేపీని తన రాజకీయ శత్రువుగా ప్రకటించడం టీవీకే మౌలిక సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వడమే అవుతుంది. అందుకే, ఫలితాలు ప్రకటించిన రోజున డీఎంకే నేతృత్వంలోని తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కాంగ్రెస్తో కొత్తగా కూటమి కట్టడానికి విజయ్ పార్టీ సిద్ధమని ప్రకటించింది. పూర్వ పాలకపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే బదులు కేవలం ఐదారు సీట్లు ఉన్న కాంగ్రెస్తో దోస్తీ తన పార్టీకి క్షేమమేగాక, సైద్ధాంతిక అనుకూల అంశమని విజయ్ గుర్తించినట్టు కనిపిస్తోంది. అత్యధిక సర్వేలకు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా టీవీకే గెలుపునకు కారణాలు ఏమిటనే విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 1977లో ఎంజీఆర్ మొదటిసారి సీఎం అయి నప్పటి నుంచీ తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజకీయ పెత్తనం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఈ రెండు పార్టీల వ్యవస్థ తమిళులకు విసుగు పుట్టించినట్టు కనిపిస్తోంది. పార్టీ పెట్టే ఆలోచన విరమించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్, సొంత పార్టీ పెట్టి బోల్తాపడిన మరో స్టార్ హీరో కమల్హాసన్ అనుభవాలు గమ నించిన తమిళ ప్రజానీకం కొత్త తరం హీరో 51 ఏళ్ల విజయ్ పార్టీ టీవీకేను ఈసారి ఆదరించాలని నిర్ణయించుకున్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న యువత, దళితులు పార్టీ పెట్టినప్పటి నుంచీ విజయ్కు అనుకూలంగా మారారు. యువతరంలో విజయ్పై ఉన్న మోజు గట్టి పునాదులు లేని ఆయన పార్టీకి ఏకంగా దాదాపు 110 సీట్లు వచ్చేలా చూడటం రాజకీయ విప్లవం కింద పరిగణించాలి. టీవీకే పుట్టినప్పటి నుంచీ దానికి జనంలో పెరిగిన ఆదరణ చూసిన కాంగ్రెస్ ఎన్నికలకు కొన్ని మాసాల ముందు దానితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఒంటరి పోరుకే సిద్ధం కావడంతో ‘దళపతి’తో ఎన్నికల స్నేహానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత టీవీకేకు కొద్దిలో మెజారిటీ మార్క్ (మొత్తం 234 సీట్లకుగాను 118) దక్కకపోవడం, ‘సెక్యులరిజం’ అనే సిద్ధాంతం టీవీకేతో చేతులు కలిపే అవకాశం కాంగ్రెస్కు లభించింది. తమిళ ఓటర్లు టీవీకేను ఆదరించడం ద్వారా రెండు పాత ద్రవిడ పార్టీలు మాత్రమే పాలక పక్షాలుగా దిక్కయిన పరిస్థితి నుంచి బయట పడ్డారు.విజయ్ క్రైస్తవ కుటుంబంలో జన్మించడం (తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ పుట్టుకతో క్రిస్టియన్, తల్లి హిందువు) టీవీకేకు అనుకూల లేదా ప్రతికూల అంశం కాలేదు. రాష్టంలో కులం ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తన కులం తమిళ్ అని ప్రకటించుకోవడం తమిళ జనానికి బాగా నచ్చినట్టుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం పుట్టిన విజయ్ పార్టీకి దాని కొత్తదనం, నాయకుడికి రాజకీయ నేపథ్యం లేకపోవడం సానుకూల అంశా లుగా మారాయి. దాదాపు 8 లక్షల మంది అభిమానులతో టీవీకే మొదటి రాజకీయ మహాసభ జరిగిందంటే జనంలో విజయ్పై ఉన్న తీవ్ర అభిమానం, మోజు మీడియాకు, ఎన్నికల విశ్లేషకులకు అర్థం కాలేదని అనుకోవాలి. నేటి తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు ఉన్న పరిమితులను చెబుతున్నాయి. ఏమైనా విజయ్కు తమిళనాడు ‘దళపతి’ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా తమిళ సోదరులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సామాజిక విప్లవాల వరకూ ఆధునిక భారతంలో ముందుండి నడిచిన బెంగాలీలు, తమిళులు ఎట్టకేలకు తమ పాలకపక్షాలను, పాలకులను మార్చేలా తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు.కమ్యూనిస్టులకు 34, తృణమూల్కు 15 ఏళ్లు అవకాశం!పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అధికారం వస్తుందని ఎక్కువ సర్వేలు సూచించలేదు. 200కు పైగా సీట్లను కైవసం చేసుకుని బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారి గద్దెనెక్కే అవకాశం దక్కించుకోవడం కూడా అత్యధిక మీడియా, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని వాస్తవం. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెల్చుకున్న బీజేపీ 2021లో తన బలాన్ని వంగ శాసనసభలో 77 స్థానాలు పెంచుకోవడం కొత్త రికార్డు. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి మెజారిటీ సీట్లు (294 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 148 అవసరం) వస్తాయని కొందరు ఎన్నికల పండితులు వేసిన అంచనాలు నిజం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ‘దీదీ’ మమతా బెనర్జీ వరుసగా మూడోసారి తన పార్టీని విజయపథంలో నడిపించారు. బెంగాల్ బెబ్బులిగా పొగడ్తలు అందుకున్నారు. గత 15 ఏళ్లుగా అవాంఛనీయ పోకడలనే తృణమూల్ అప్రకటిత పాలనా విధానంగా ఎంచుకోవడం ‘దీదీ’ పతనానికి దారితీసింది. సీపీఎం, సీపీఐ నాయకత్వంలోని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన (లెఫ్ట్ ఫ్రంట్) సర్కారు 34 సంవత్సరాల పాలనలో బెంగాల్ ప్రజల జీవితాలను పాలక కూటమికి విధే యులైన అసాంఘిక శక్తులే ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం తెలిసిన విషయమే. ‘పార్టీ సొసైటీ’గా పిలిచే అవాంఛనీయ ధోర ణిని దశాబ్దపున్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అను సరించింది. అంతేగాక, బెంగాల్లో 30 శాతం వరకూ ఉన్న మైనారిటీలకు మమత పెద్ద పీట వేస్తున్నారనీ, మెజారిటీ మతస్తుల బాగోగులు ఆమెకు పట్ట వనే ప్రచారం బూటకం కాదు, నిజమనీ అత్యధిక బెంగాలీలు నమ్మారు. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని రేప్, హత్య వంటి కొన్ని ఘటనలు మహిళా సీఎం పాలనలో స్త్రీలకు అసలు రక్షణ లేదనే బీజేపీ ప్రచారానికి బలం ఇచ్చాయి. ‘మార్క్సిస్టుల అరాచక పాలనకు స్వస్తి పలికి సుపరిపాలన అందిస్తాన’ని సీఎం పీఠమెక్కిన మమత ఏలుబడిలో పాలన బాగా దిగజారడం, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవడానికి దోహదం చేశాయి. 2000 నవంబర్ నుంచి 2026 మే వరకూ పాతిక సంవ త్సరాలకు పైగా ఇద్దరే ఇద్దరు సీఎంలు మార్క్సిస్టు బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీలను చూసిన బెంగాలీ జనం పలు కారణాల వల్ల కొత్త ముఖం కావాలని కోరుకున్నారు. వారి ఈ ఆకాంక్ష సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని మెజారిటీ ఈ ఎన్నికల్లో సాధించడానికి ఒక ప్రధాన కారణమైంది. నాంచారయ్య మెరుగుమాలవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దళపతి విజయ్కు రజనీ, కమల్ అభినందనలు
సాక్షి,చెన్నై: విజయ్ను అభినందిస్తూ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్,నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్కి,ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు అంటూ రజనీకాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.நடந்து முடிந்த தமிழக சட்டமன்றத் தேர்தலில் பெரும் வெற்றி பெற்ற தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு விஜய் அவர்களுக்கும், அவர் கட்சியினருக்கும் என்னுடைய வாழ்த்துகள். @TVKVijayHQ— Rajinikanth (@rajinikanth) May 4, 2026తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ కి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి 118 సీట్లు అవసరం. విజయ్ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీహీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే పార్టీ తమిళనాట వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ కింగ్ మేకర్గా నిలిచారు. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ తమిళనాట విజయ్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చక్కర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్’ (అప్పటి ట్విటర్) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్’ అని పోస్టు పెట్టాడు. నిజానికి ఆర్చర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్కి సంబంధించినవి మాత్రమే. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్ను తమ హీరో విజయ్ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఆర్చర్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్తో విభేదాల సమయంలో క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా ఇలాంటి ట్వీట్ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.pic.twitter.com/hoSIATmltw— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026 చదవండి: పాక్ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్మనీనా! -
విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!
విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్లాగే సింగిల్గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.


