Vinayaka celebrations
-
ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
కూకట్పల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జీఎల్ఎన్ రెడ్డి, కోటిరెడ్డి, చెన్నారెడ్డి, శివ, మాధవరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిత్యం పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. కాలనీలో జగన్మోహన్రెడ్డి లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.Hyderabad KPHB Colony....😍 @ysjagan pic.twitter.com/XyRLr7CRA4— rebelstar Trends ™ (@fanofysjagann) September 15, 2024KPHB, HYD 💥🔥🔥 @ysjagan @YSJaganTrends @YSRCParty @JaganannaCNCTS pic.twitter.com/qI8xkP3Bom— Bangalore YSRCP Forum (@YSRCPFORUM_BLR) September 16, 2024 -
అనంతపురంలో వినాయక నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
-
తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!
మన తెలుగునాట ఎన్నో ప్రసిద్ధి గాంచిన గణిపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమ అంతా ఇంతా కాదు. కోరిన కోరికలు తీర్చే మహా వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్వితమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..!బిక్కవోలు గణపతి ఆలయంతూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో నెలకొని ఉన్న గణపతి ఆలయం క్రీస్తుశకం 848 – 891 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు మూడవ విజయాదిత్యుడు బిక్కవోలును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఇతనికి గణుగ మహారాజు, త్రిపురమర్త్య, మహేశ్వర, వల్లభ అనే బిరుదులతో పాటు బిరుదాకరామభీమ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు ఆధారంగానే ఈ గ్రామానికి బిరుదాంకరాయపురం అని పేరు వచ్చింది. కాలక్రమంలో బిరుదాంకనవోలుగా మారి ప్రస్తుతం బిక్కవోలుగా వ్యవహారంలో స్థిరపడింది.చారిత్రక ఆధారాలను బట్టి తూర్పుచాళుక్య రాజులలో రెండవ విజాదిత్యుడు జైనులైన రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేశాడు. ఇతడు నరేంద్ర మృగరాజుగా పేరు పొందాడు. యుద్ధాలు చేసినందుకు పాప పరిహారంగా ఒకొక్క యుద్ధభూమిలో ఒక్కొక్కటిగా మొత్తం 108 శివాలయాలను నిర్మించాడు. మూడవ విజయాదిత్యుడు కూడా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి, విఘ్నేశ్వరాలయాలను కట్టించాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధ బిక్కవోలు గణపతి ఆలయం. చాళుక్యుల తరువాత వివిధ రాజవంశీయులతో పాటు పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయం కోసం అనేక దానధర్మాలు చేశారు. బిక్కవోలు గణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రంచిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. పూర్వం దీనిని విహారపురిగా వ్యవహరించేవారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1336లో విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ సింహద్వారం వద్ద చోళరాజ శిలాప్రతిమ ఉంది. ఆలయానికి ఎదురుగా కోనేరు, మండపం ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్యంలో మరకతాంబికా సమేతుడైన మణికంఠేశ్వరాలయం ఉంది. ఒకసారి బహుదా నదికి వరదలు రావటం వల్ల ఆ వరదల్లో ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరాలయలోని వినాయకుడు జరిగి దగ్గరలో ఉన్న బావిలో పడిపోయాడు. ఆ వినాయకుడే మరల తన ఉనికి వరసిద్ధి వినాయకునిగా పూర్వం గుడ్డి, చెవిటి, మూగ అయిన ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని బావిని లోతు చేయటం కోసం తవ్వుతుండగా స్వామివారు స్వయంభువుగా ప్రకటితమయ్యారు. ప్రతియేటా వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు ఈక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలలో కాణిపాకం గ్రామస్థులే కాకుండా, చుట్టుప్రక్కల గ్రామస్థులు రోజుకొక వాహనసేవలో పాల్గొనటం విశేషం.కొలనుపాక గణపతి ఆలయంయాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక వీరశైవ మతానికి సంబంధించి గొప్ప చారిత్రక ప్రదేశం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం చాళుక్యుల వశం అయ్యింది. ఇక్కడ సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ మతానికి చెందిన రేణుకాచార్య ఈ ప్రాంతంలోనే జన్మించినట్లు వివిధ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాగణంలోనే వినాయక, కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకళా చాతుర్యంతో కూడుకుని ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలమైన పదకొండవ శతాబ్దంలో చెక్కబడిన సర్వాభరణ భూషితుడైన వినాయకుడు చతుర్భుజాలతో పీఠంపై ఆసీనుడైనట్లుగా ఉంటాడు. రెండు చేతులలో అంకుశం ధరించి ఉంటాడు. ఎడమచేతిలో మోదకం ఉంటే, కుడిచేయి మోకాలుపై ఆధారంగా ఉంటుంది. ఈ వినాయకుడి ఉదరానికి ఉన్న సర్పబంధం అద్భుతంగా కనపడుతుంది. తొండం ఎడమవైపు వంగి ఉంటుది. ఇక్కడి గణపతికి ముడుపులు కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంకోనసీమజిల్లా అమలాపురానికి చేరువలోని అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైనది. పవిత్ర గోదావరి నదీపాయ ఒడ్డున ఉన్న ఈ వినాయక ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థలపురాణం. వ్యాసమహర్షి దక్షిణ యాత్ర ప్రారంభించటానికి ముందు ఈ వినాయకుని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అయినవిల్లి ఆలయాన్ని పెద్దాపురం సంస్థానాధీశులు పునర్నిర్మించి, పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయినవిల్లి వినాయకునికి శైవాగమం ప్రకారం విశేషార్చనలు, నారికేళఫలోదకాలతో అభిషేకాలు చేస్తారు. భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో వినాయక చవితితోపాటు, ప్రతినెలా ఉభయ చవితి తిథులలో పూజ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దశమి, ఏకాదశి రోజుల్లోనూ విశేష పూజలు చేస్తారు.చోడవరం స్వయంభూ వినాయక ఆలయంఅనకాపల్లి జిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులుగా అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చోడవరం గ్రామానికి తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశ రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఆ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప చిహ్నాల వల్ల ఇక్కడి స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటారు. శ్రీ గౌరీశ్వరుడు మత్స్యవంశ రాజుకు కలలో కనిపించి చోడవరం కోట తూర్పు దిక్కున తాను వెలుస్తున్నానని ఆ ప్రదేశం చెమ్మగా ఉంటుందని చెప్పటంతో ఆలయం ఉన్నచోట తవ్వకాలు జరపగా, చుట్టూ నీటితో కూడిన శివలింగం బయల్పడటంతో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.తురుష్కుల దాడిలో ఆలయంలోని గౌరీశ్వరస్వామి లింగాకృతి ఛిన్నాభిన్నమైంది. అప్పటి నుంచి ఆ ఆలయంలో గౌరీశ్వరుడు పుట్ట ఆకృతిలో దర్శనమిస్తున్నాడు. చోళవంశ రాజులు ధ్వంసమైపోయిన శివలింగం స్థానంలో కాశీ నుంచి కొత్త లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించదలచారు. కాని, స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహానికి మాత్రమే పూజలు జరిపించాలని స్వామి కలలో కనిపించి చెప్పటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చోడవరం స్వయంభూ వినాయకుడు చిన్నపాటి నీట ఊటలో నల్లని రాతివిగ్రహం మూడు అడుగులకు పైగా పొడవు, వెడల్పులతో ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండటం విశేషం. తొండం చివరి భాగం కూడా కనిపించదు.శ్రీశైల సాక్షిగణపతిప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షిగణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా అనాదిగా పూజలందుకుంటోంది. శ్రీశైల మల్లికార్జునుని దర్శించటానికి వచ్చిన భక్తుల వివరాలను గణపతి ఇక్కడ నమోదు చేస్తాడని ప్రతీతి. అందుకే ఈ గణపతిని సాక్షిగణపతి అని పేరు. సాక్షిగణపతి విగ్రహం వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి విగ్రహం ఎడమచేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడిచేతిలో ఘంటంతో భక్తుల పేర్లు రాస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించి వెనక్కు వెళ్ళే భక్తులు మార్గమధ్యంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి స్వామివారికి గోత్రనామాలు విధిగా చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు.రాయదుర్గం దశభుజ శ్రీమహాగణపతిఅనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో రాయదుర్గం కొండపైకి వెళ్ళే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీథిలో దశభుజ గణపతి ఆలయం ప్రముఖమైనది. నాలుగు మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం ఎంతో ఆకర్షిస్తుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తుగల వినాయకుని రూపం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భారీశిలపై పదిచేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పుగా మలచినట్లు కనిపిస్తుంది. ఈ విగ్రహంలో వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న ఈ వినాయక విగ్రహం ఎడమ తొడపై ఒక స్త్రీరూపు చెక్కబడి ఉంది. విజయనగర సామ్రాజ్యకాలంలో విజయనగర రాజుల ఏలుబడిలో దశభుజ గణపతి ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.రాయదుర్గం దశభుజ వినాయకరూపం షోడశగణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీమహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. కుడివైపు తిరిగిన తొండంతో ఎడమచేతితో తొడపై కూర్చున్న అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది. పదిబాహువులతో కుడిచేత చక్రం, ఓషధి, కలువపువ్వు, నిధి« ధరించి ఉంటాడు. ఎడమచేత పాశం, చెరకుగడ, పద్మం, గద ధరించి ఉంటాడు. కిరీటంపై అర్ధచంద్రుడి అలంకారం అలరారుతుంటుంది.యానాం సిద్ధిగణపతి (పిళ్ళైయార్) ఆలయంపుదుచ్చెరిలోని పూర్తి తెలుగు ప్రాంతమైన యానాంలో వెలసి పరమ భక్తుల సేవతో విరాజిల్లుతున్న సిద్ధిగణపతి పిళ్ళైయార్ స్వామి నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. పురాణరీత్యా గోహత్యా పాపవిమోచన కోసం గంగానది సహా ఇతర తీర్థాలలో స్నామాచరిస్తూ గౌతమ మహర్షి గోదావరి నదిని గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) వరకు తీసుకురాగా సప్తమహర్షులు ఆ నదిని ఏడుపాయలుగా విభజించి సాగరాన సంగమం గావించారు. సప్తఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి గోదావరి శాఖను యానాంకు కొద్దిదూరంలో ఉన్న చొల్లంగి వద్ద సముద్రంలో సంగమింప చేశాడు.ఈ ప్రదేశం కోరంగికి సమీపంలో ఉంది. కురంగి సంచరించిన ప్రదేశం కాలక్రమంలో కోరంగిగా మారింది. కురంగం అంటే కృష్ణ్ణజింక అని అర్థం. ఆ యానాం పావని వృద్ధగౌతమీనదీ తీరం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అప్పటి విగ్రహ శిల్పకళా సౌందర్యం దీనికి తార్కాణం. గజరాజుల మధ్య లక్ష్మీదేవిని ద్వారంపై చెక్కి ఉండటం చాళుక్యుల దేవాలయ నిర్మాణ చిహ్నం. ఈ సిద్ధి గణపతిని ఆనాడు విజయ గణపతిగా కొలిచేవారు. తీరప్రాంతం అవటంతో ఉప్పెనలు, వరదలు, తుపానుల కారణంగా, భౌగోళిక మార్పుల వల్ల ఈ స్వామి పుట్టలతో కప్పివేయబడ్డాడు.1723 నాటికి మోటుపల్లి యానం ఫ్రెంచివారి పాలనలోకి చేరింది. కోరంగి కాలువ ద్వారా వారు వ్యాపారాలు నిర్వహించేవారు. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం, చంద్రనాగూరు ఫ్రెంచివారి అధీనంలో ఉండేవి. ఈ ప్రాంతాలకు 13 జూన్ 1954న స్వాతంత్రం లభించింది. సరిగా ఆ సమయలోనే తమిళుడైన రెడ్డియార్ పట్టిస్వామి అనే వైద్యుడు యానాం చేరాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలోని రావిచెట్టు కింద వైద్యం చేసేవాడు. ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో కనిపించి రావిచెట్టు వద్ద ఉన్న పుట్టలో తానున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారి ఉనికి తిరిగి బహిర్గతమైంది. లభించిన పురాతన ప్రాకారాలతో, స్తంభాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయటం, 108 టెంకాయలు కొట్టడం, స్వామివారి ఎదుట భక్తులు గుంజిళ్లు తీయడం ఆచారంగా ఉంది.రుద్రారం సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయంసంగారెడ్డిజిల్లా పటాన్చెరువుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ళనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. రుద్రారం గణపతిని శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రేరణతో నిర్మితమైంది. ఈయన రుద్రారం ప్రాంతం నుంచి రేజింతల వరకు గల ప్రాంతంలో ఐదు వినాయక ఆలయాలను నిర్మించారు. అవి చింతలగిరి, చీకుర్తి, మల్కల్–పాడు, మల్కల్–గుట్ట (రేజింతల్) కాగా, చివరిది ఈ రుద్రారం గణపతి ఆలయం.రుద్రారం గణపతి చతుర్భుజాలతో ఉంటారు. ఉదరానికి నాగబంధం ఉంటుంది. ఈ వినాయకునిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండటంచేత ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవటానికి స్వామివారికి ప్రతిరోజూ సింధూర లేపనం పూస్తారు. ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పంచ వినాయక ఆలయాలలో స్వామివారికి సింధూర లేపనం పూస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కావటంతో విద్యార్థులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, దర్శనం చేసుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థినాడు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.రేజింతల సిద్ధివినాయక ఆలయంసంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు పదమూడు కిలోమీటర్ల దూరంలోని రేజింతల గ్రామంలో నెలకొని ఉన్న స్వయంభూ సిద్ధివినాయక స్వామి రెండువందల సంవత్సరాలకు పైగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి చేరువలో ఉంది. జహీరాబాద్కు ఉన్న పూర్వనామం పెద్దమొక్కహెల్లి. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉండటంతో తెలుగు ప్రజలే కాకుండా, కన్నడ ప్రజలూ అధికసంఖ్యలో వచ్చి ఈíసిద్ధివినాయక స్వామివారిని దర్శించుకుంటారు.శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు తన శిష్యగణంతో తిరుమలకు ప్రయాణమవుతూ రేజింతల గ్రామంలో ఆగారు. ఆయనకు రేజింతల కొండ వద్ద వినాయకుని రూపంలో ఒక శిల కనబడింది. అదే ఈ స్వయంభూ వినాయక విగ్రహం. కోరిన కోర్కెలు తీర్చడం వల్ల సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.సికింద్రాబాద్ గణపతి ఆలయంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు అతి చేరువలో ఉన్న ఈ గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం ఈ ప్రాంతం సైనిక నివాస ప్రాంతంగా ఉండేది. 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా ఈ వినాయక విగ్రహం బయట పడింది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. 1932లో ఈ ఆలయ ప్రాంగణంలోనే వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మన్యస్వామి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ ఆలయం నర్మించారు. 1960లో ఆలయ ప్రాంగణంలోని బావి పూడ్చి ఆలయానికి నూతన రూపం కల్పించారు. ఈ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.విశాఖ సంపత్వినాయగర్ ఆలయంవిశాఖ నగరంలో శ్రీసబంధన్ అండ్ కంపెనీవారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం మాత్రమే పూజలు చేస్తుండేది. ఆ తరువాతి కాలంలో భక్తజనానికి దర్శనం అనుమతించారు. ఈ ఆలయాన్ని 1967లో సందర్శించిన కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి ఇక్కడ గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు.1971లో పాకిస్తాన్తో మనదేశానికి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి తూర్పు నౌకాదళాధిపతి కృష్ణన్ ఈ వినాయక స్వామిని దర్శించుకురు. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ సముద్రం మార్గంలో విశాఖ నగరాన్ని ముట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఘాజీ అనే జలాంతర్గామిని పంపింది. ఈ జలాంతర్గామిని మన దేశ నౌకాదళాలు ముంచేశాయి. ఆ వెంటనే మన నౌకాదళాధిపతి కృష్ణన్ ఈస్వామివారిని దర్శించుకుని, 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. విశాఖ సంపత్వినాయగర్ ఆలయాన్ని ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి వినాయకునికి ప్రతిరోజూ పంచామృతాభిషేకం చేస్తారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.కాజీపేట శ్వేతర్కమూల గణపతి ఆలయంహనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేప్రాగణంలో శ్వేతార్కమూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయకమూర్తి తెల్ల జిల్లేడువేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహన్ని చెక్కడంగాని, మలచటంగాని చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనము, తల్పము, ఎలుక అన్నీ స్పష్టంగా కనపడతాయి.నారద పురాణంలో తెల్ల జిల్లేడు చెట్టు వందేళ్ళు పెరిగితే ఆ చెట్టుమూలంలో గణపతి రూపం తయారవు తుందని చెప్పారు. వినాయకుడు ప్రకృతి స్వరూపుడు అని పురాణాలు చెబుతున్నాయి. శ్వేతార్కమూలాన్ని వెలికితీసి, మట్టిని కడిగివేసి, నీళ్ళల్లో నానబెట్టి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ వేరు మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు.1999లో నల్లగొండ ప్రాంతంలోని మాడా ప్రభాకరశర్మ ఇంటి పరిసరాల్లో ఈ శ్వేతార్క గణపతిని అయినవోలు అనంత మల్లయ్యశర్మ గుర్తించారు. ఈ శ్వేతార్కమూల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, పూజలు మొదలు పెట్టారు. 2002లో దేవాలయాన్ని నిర్మించారు. 2008లో ఆలయాన్ని విస్తరించారు. ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.- కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!) -
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం
-
బెంగళూరు ఈద్గాలో గణేష్ ఉత్సవాలకు బ్రేక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు: బెంగళూరులోని ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్టు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. గణేష్ ఉత్సవాలకు బ్రేకులు వేసింది ధర్మాసనం. స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం.. ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదు. విచారణ సందర్భంగా వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే. తమ హక్కులు అణచివేతకు గురవుతున్నాయనే భావన మతపరమైన మైనారిటీలకు కలుగకుండా చూడాలని కోరారు. ఈ మైదానంలో 200 ఏళ్లుగా ఇతర మతాల కార్యక్రమాలు నిర్వహించటం లేదని, చట్ట ప్రకారం ఇది వక్ఫ్ బోర్డు ఆస్తిగా తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు.. ఇది ప్రభుత్వం పేరుతో ఉందని, చాలా ఏళ్లుగా పిల్లలు ఆడుకునే ఆట స్థలంగానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్ని అంతకు ముందు కర్ణాటక హైకోర్టు సైతం ఏకీభవించింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కర్ణాటక వక్ఫ్బోర్డు. తాజాగా స్టేటస్ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
Hyderabad: వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు.. ఈ నియమాలు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు, పూజలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాల్లో జాగ్రత్తలు పాటిస్తే నవరాత్రులు విజయవంతమైనట్లే, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లభించినట్లే. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో పాటించాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. రాకపోకలకు భంగం కలిగించొద్దు... వినాయక మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. రహదారి మధ్యలో మండపాలు నిర్మిస్తే వాహనాల రాకపోకలు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖాళీ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహాల పరిమాణం.. విగ్రహాల పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగలు తాకే ప్రమాదముంది. తరలించే సమయం, మండపాల స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న విగ్రహాలను ప్రతిష్టించాలి. చదవండి: తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1 పర్యవరణాన్ని కాపాడాలి.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికరమైన వాటితో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. మట్టి, పీచు, సహజ సిద్ధమైన రంగులతో తయారైన విగ్రహాలను పూజించాలి. డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలి.. పూజా సమయంలో మాత్రమే మైకులు ఉపయోగించాలి. అనవసర సమయంలో బంద్ చేయాలి. భక్తి గీతాలు మాత్రమే వినిపింంచాలి. డీజేలు, భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. వ్యయం తగ్గించాలి... మండపాల నిర్వాహకులు చందాలు డిమాండ్ చేయకుండా భక్తులు ఇచ్చింది తీసుకోవాలి. మండపాల అలంకరణ, నిమజ్జనం రోజు భారీగా ఖర్చు చేయడం కంటే అన్నదానం, పిల్లలకు వినోద, విజ్ఞానం వచ్చే అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. సాఫీగా నిమజ్జనం చేయాలి... నిమజ్జనం రోజున మద్యం సేవించి డ్యాన్స్లు చేస్తూ సమస్యలు సృష్టించవద్దు. చెరువుల వద్ద అధికారుల సూచనలు పాటించాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. పోలీసులకు సహకరించాలి.. పండుగ మూలాలు తెలుసుకొని బాథ్యతగా వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇతరులతో పోటీ పడకుండా సాంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. శాంతిభద్రతల విషయమై పోలీసులకు సహకరించాలి. – చంద్రబాబు, సీఐ ఘట్కేసర్ -
ప్రగతిభవన్లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు
-
కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు
-
భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు భారీగా అభిమానగణం ఉంది. వరుసగా సూపర్హిట్స్ ఇస్తున్న ఈ కండలవీరుడికి వివాదాలు కూడా కొత్త కాదు. ఏదైనా వివాదంలో సల్మాన్ చిక్కుకుంటే.. ఆయనను సమర్థించడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ, తాజాగా వినాయక చవితి వేడుకల సందర్భంగా సల్మాన్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించడం ఆయన ఫ్యాన్స్కే నచ్చలేదు. ఈ విషయంలో సల్మాన్ తీరును తప్పుబడుతూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సల్మాన్ స్మోకింగ్ చేస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. తన సోదరి అర్పితా ఇటీవల వినాయక చవితి వేడుకలు నిర్వహించిన సందర్భంగా సల్మాన్ ఇలా సిగరేట్ తాగుతూ కనిపించారని పలు వెబ్సైట్లు ప్రచురించాయి. ఈ వీడియోపై సల్మాన్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు’ అని కామెంట్ చేస్తున్నారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా సల్మాన్, ఆయన సోదరుడు అర్భాజ్ ఖాన్ వినాయకుడికి హారతి ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముస్లిం అయి ఉండి గణేషుడికి హారతి ఇస్తావా? అని కొందరు తప్పుబట్టగా.. మరికొందరు సల్మాన్ తీరును ప్రశంసించారు. -
భాయ్ ఇలా చేయడం సిగ్గుచేటు!
-
మిట్టపల్లికి.. హరీశ్రావు సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, సిద్దిపేట: గ్రామంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత ఉండేలా సామూహికంగా ఒకే ఒక మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని కొలుచుకోవాలని ఇచ్చిన పిలుపుతో ముందుకు వచ్చి ఏకదంతున్ని ప్రతిష్ఠించి మిగతా గ్రామాలకు మిట్టపల్లి స్ఫూర్తిగా నిలిచిందని, ఈ స్ఫూర్తిని రానున్న రోజుల్లో కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు గ్రామ ప్రజలను కోరారు. హరీశ్రావు, త్రిదండి దేవనాథ జీయర్ స్వామితో కలిసి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒకే వినాయకుని సామూహిక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. తొలి రోజు పూజ శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణలో పూజ జరగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 40 గ్రామాలలో ఒకే వినాయకుని కోసం తీర్మానం చేశారన్నారు. ఈ స్ఫూర్తితో సిద్దిపేటలోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్ ప్రాంతాల్లోనూ ఒకే వినాయకుడు నినాదం మారు మోగిందని తెలిపారు. తొలి రోజు పూజలో పాల్గొనడంతో పాటు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం మిట్టపల్లి గ్రామ యువత కోసం వాలీబాల్ కిట్ను హరీశ్రావు అందించారు. గ్రామంలోని పురాతన చెన్నకేశవ ఆలయాన్ని పునరుద్ధరణ పనులను దేవనాథ జీయర్ స్వామి వారితో కలిసి సందర్శించారు. ఈ ఆలయ నిర్మాణం కోసం రూ. 30 లక్షలు మంజూరు చేశామని, పనులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా రోజుకో కార్యక్రమం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారని, చిందు కళాకారుల కార్యక్రమం, జబర్ధస్త్ టీంతో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, సినీ నటుడు సంపూర్ణేష్బాబు, గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మి, సిద్దిపేట అర్బన్ ఎంపీపీ వంగ సవితాప్రవీణ్రెడ్డి, మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్రెడ్డి, ఉప సర్పంచ్ సంపత్యాదవ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
ఋషి
అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు. ‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది. ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్రూమ్ కట్టారు.గ్రీన్రూమ్ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు. కర్టెన్ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్రూమ్లో ఉన్న మేకప్ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు. మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది. వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు. డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్ ఉండాలి.టికెట్ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు. మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది. అల్తి మోహనరావు -
ఈసారి ముందుగా ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం!
హైదరాబాద్: నగరంలోని ఇతర వినాయక విగ్రహాల నిమజ్జనం కంటే ముందుగానే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగనుంది. బుధవారం హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలో వినాయక ఉత్సవాలపై సమావేశం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం ముందుగానే చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇంతకముందు నగర పరిసర ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలన్నీంటిని నిమజ్జనం చేసిన తరువాత ఎప్పటికోగానీ ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా ఖైరతాబాద్ గణనాథుడిని వచ్చే నెల 15న మధ్యాహ్నం 2 గంటల లోపే నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, ముగ్గురు పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దని సూచించారు. -
గణేశుని ఉత్సవాల్లో అపశ్రుతి, బాలుడి మృతి
ప్రకాశం: గణపతి ఉత్సవాల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తూ కరెంట్ షాక్తో బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గణేశుని ఉత్సవాల్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆలకరించిన మండపం వద్ద సాయి లోకేశ్వరరెడ్డి (10) కరెంట్ షాక్ తగిలింది. దాంతో బాలుడు అక్కడిక్కడికే కుప్పకూలిపోయాడు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్ గణపతి ఆలయంలో రద్దీ