Wiaan Mulder
-
IPL 2025: సన్రైజర్స్ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్రౌండర్
సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులోకి కొత్త క్రికెటర్ వచ్చాడు. సౌతాఫ్రికాకు చెందిన వియాన్ ముల్దర్(Wiaan Muldar)కు రైజర్స్ స్వాగతం పలికింది. ఈ ప్రొటిస్ ఆల్రౌండర్ను తమ జట్టులోకి చేర్చుకున్నట్లు హైదరాబాద్ ఫ్రాంఛైజీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా దూరమైన బ్రైడన్ కార్సే స్థానాన్ని ముల్దర్తో భర్తీ చేసినట్లు వెల్లడించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలానికి ముందు సన్రైజర్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి(రూ. 6 కోట్లు ), ఆసీస్ హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)లను రైజర్స్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది.ఈ క్రమంలో రూ. 45 కోట్ల పర్సు వాల్యూతో ఐపీఎల్-2025 మెగా వేలం బరిలో దిగిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, రాహుల్ చహర్ వంటి భారత స్టార్లతో పాటు ఆడం జంపా, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ రూపంలో విదేశీ క్రికెటర్లను కూడా కొనుగోలు చేసింది.బొటనవేలికి గాయం.. సీజన్ మొత్తానికి దూరంఅయితే, ఇంగ్లండ్ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో రెహాన్ అహ్మద్ను తీసుకువచ్చింది.ఇక ఐపీఎల్ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్రైజర్స్ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్ ముల్దర్ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్రౌండర్ సన్రైజర్స్తో చేరనున్నాడు. ఆఖరిగా సెమీస్లోకాగా 27 ఏళ్ల వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. కుడిచేతం వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ మీడియం పేసర్. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన ఈ ప్రొటిస్ ప్లేయర్ చివరగా న్యూజిలాండ్తో సెమీస్లో మాత్రం నిరాశపరిచాడు. కేన్ విలియమ్సన్(102) రూపంలో కీలక వికెట్ తీసినా.. బ్యాటింగ్లో మాత్రం నిరాశపరిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ముల్దర్ కేవలం ఎనిమిది పరుగులే చేసి.. మైకైల్ బ్రాస్వెల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ముల్దర్ ఇప్పటి వరకు 18 టెస్టులు, 24 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 589, 268, 105 పరుగులు చేయడంతో పాటు... 30, 21, 8 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ గతేడాది కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది.. కానీ కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ను చేజార్చుకుంది.ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుహెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా., సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ టైడే.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం.. మరోసారి: సాంట్నర్ వార్నింగ్ Welcome onboard 🧡The all-rounder from 🇿🇦 is now a RISER 🔥#PlayWithFire pic.twitter.com/we4AfNuExc— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025 -
CT 2025: అఫ్గనిస్తాన్ ఆశలు ఆవిరి! సెమీస్కు సౌతాఫ్రికా
ICC Champions Trophy 2025: ఇంగ్లండ్తో మ్యాచ్లో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆది నుంచే బట్లర్ బృందానికి చుక్కలు చూపించి... స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. 38.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కట్టించి 179 పరుగులకే ఆలౌట్ చేశారు.తద్వారా అఫ్గనిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రొటిస్ బౌలర్లు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్(Semi Final) బెర్తును అనధికారికంగా ఖరారు చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ దశ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కరాచీలో శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. పేసర్ మార్కో యాన్సెన్(Marco Jancen) టాపార్డర్ను కుప్పకూల్చాడు.ఆకాశమే హద్దుగాఓపెనర్లు ఫిల్ సాల్ట్(8), బెన్ డకెట్(24), వన్డౌన్ బ్యాటర్ జేమీ స్మిత్(0)ల వికెట్లను యాన్సెన్ తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో పేస్ బౌలర్ వియాన్ ముల్దర్ ప్రమాదకర బ్యాటర్ జో రూట్(44 బంతుల్లో 37)ను అద్బుత రీతిలో బౌల్డ్ చేయడంతో పాటు.. టెయిలెండర్లు జోఫ్ ఆర్చర్(31 బంతుల్లో 25), ఆదిల్ రషీద్(2)లను పెవిలియన్కు పంపాడు.ఇక స్పిన్నర్ కేశవ్ మహరాజ్ హ్యారీ బ్రూక్(19), కెప్టెన్ జోస్ బట్లర్(21)ల రూపంలో రెండు కీలక వికెట్లు దక్కించుకోగా.. పేసర్ కగిసో రబడ జేమీ ఓవర్టన్(11) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 38.2 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే, రెండో బెర్తును సౌతాఫ్రికా దాదాపు ఖాయం చేసుకున్నా.. టెక్నికల్గా అఫ్గనిస్తాన్ కూడా.. ఈ మ్యాచ్కు ముందు రేసులో ఉంది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేయడం సహా.. ప్రొటిస్ను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాలి. హష్మతుల్లా బృందానికి నిరాశేఅప్పుడే అఫ్గనిస్తాన్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు హష్మతుల్లా బృందం ఆశలను ఇలా అడియాసలు చేశారు. కాగా గ్రూప్-‘బి’లో భాగంగా సౌతాఫ్రికా తొలుత అఫ్గనిస్తాన్తో తలపడి ఏకంగా 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా భారీ నెట్ రన్రేటు(+2.140) సాధించింది. ఈ క్రమంలో తమ తర్వాతి ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మ్యాచ్ వర్షం రద్దైనా ప్రొటిస్ జట్టు పటిష్ట స్థితిలోనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య శుక్రవారం నాటి మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సెమీస్ చేరే అవకాశం ఉండగా.. వరుణుడి వల్ల ఈ మ్యాచ్ కూడా అర్ధంతరంగా ముగిసింది.ఈ క్రమంలో అప్పటికే రెండు పాయింట్లు(ఇంగ్లండ్పై గెలుపొంది) కలిగి ఉన్న ఆసీస్.. నిన్నటి మ్యాచ్ రద్దైన కారణంగా మరో పాయింట్ సాధించింది. తద్వారా గ్రూప్-బి నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. గ్రూప్- ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లను చిత్తు చేసి సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక ఇంగ్లండ్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంతో సంబంధం లేకుండా సౌతాఫ్రికా కూడా టాప్-4కు చేరుకుంది.సౌతాఫ్రికా- ఇంగ్లండ్ మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయానికి గ్రూప్-బి పాయింట్ల పట్టిక1. ఆస్ట్రేలియా- పూర్తైనవి మూడు- ఒక గెలుపు- రెండు రద్దు- పాయింట్లు 4- నెట్ రన్రేటు (+0.475)2. సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్రేటు (+2.140)3. అఫ్గనిస్తాన్- ఆడింది మూడు- గెలిచింది ఒకటి- ఓడింది ఒకటి- ఒకటి రద్దు - పాయింట్లు 3- నెట్ రన్రేటు (-0.990)4. ఇంగ్లండ్- ఆడింది రెండు- ఓడింది రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు (-0.305)చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025 -
పాక్తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్లో అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కార్బిన్ బాష్కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్టౌన్ వేదికలు. పాకిస్తాన్తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
లంకతో టెస్ట్ సిరీస్.. సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కమాండింగ్ పొజిషన్లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (70) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్ (7/13) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.కీలక ఆల్రౌండర్కు గాయంఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్ ముల్దర్ బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్ మిగతా సెషన్స్తో పాటు రెండో టెస్ట్కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్లో ముల్దర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్ చేయడం విశేషం. -
ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ను భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు వియాన్ ముల్డర్ (105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి. తొలి రోజే ఓపెనర్ టోని డి జోర్జి, వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ శతకాలు బాదారు. ఓవర్నైట్ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.ఓవర్నైట్ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్లు), బెడింగ్హామ్ (59; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్హామ్ను తైజుల్ బౌల్డ్ చేశాడు. 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లుజోర్జి తన శతకాన్ని డబుల్ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్ బౌలింగ్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.తన మరుసటి ఓవర్లో కైల్ వెరియెన్ (0)ను తైజుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్లో రికెల్టన్ (12) నహీద్ రాణా బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఆరో వికెట్కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్ ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.టాప్–3 బ్యాటర్లు షాద్మన్ (0), హసన్ (10), జాకీర్ హసన్ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడ 2 వికెట్లు తీయగా, నైట్వాచ్మన్ హసన్ (3)ను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. మోమినుల్ హక్ (6 బ్యాటింగ్), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.‘బాక్సింగ్ డే’ టెస్టులోచివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డుఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్ సెంచరీలు సాధించారు. 1948లో భారత్తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్ క్రిస్టియాని, క్లేడ్ వాల్కట్ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు. చదవండి: India vs New Zealand: జయమా... పరాభవమా!