yellow media
-
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్బిన్లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్మోహన్రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్పై నమ్మకం లేదని చెప్పారు. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
రైతుల కోసమే 'సెకీ' విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు 2023 జూన్లో ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.అవే భవిష్యత్తుకు భరోసా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల (స్టేజ్–5) యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ కొనుగోలుకు ఏపీజెన్కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది. ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ) ప్రమోషన్ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్ట్స్ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతెల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చిచెప్పింది. ఈ పథకానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ అమర్చారు. పథకం అట్టర్ ఫ్లాప్ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్ఏపీఎస్సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది’– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం -
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు.చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి.ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. -
పీక్కు చంద్రబాబు ప్రచార పిచ్చి: పుత్తా శివశంకర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్కు చేరుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెడ్డి సంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా నిత్యం చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది.నిత్యం వైఎస్ జగన్పై బురద చల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు.మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది.వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 6 విమానాశ్రయాలుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి వాటి పేర్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు విమానాశ్రయంకు పెట్టి నాలుగేళ్లు అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. చివరికి తన ప్రచార యావ, వైఎస్ జగన్పై విషప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో మహనీయుల పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైనా జాతికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మహనీయుల విషయంలో స్పందించే సమయంలో వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యమంత్రి హోదాకు ఉన్న గౌరవాన్ని దిగజార్చకూడదని సూచిస్తున్నాం -
‘సెల్’బ్రిటీ కష్టాలు!
సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని మీడియాతో సంబంధం లేని వారు కూడా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పాపింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పాలిట పెను భూతం పాపరాజీ. ఇల్లు దాటి బయటికి వస్తే ఎవరు ఎక్కడ కెమెరాతో క్లిక్ అనిపిస్తారో తెలియదు. బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న నటి ఆయేషా ఖాన్ పాపరాజీపై మండిపడింది. తన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అనవసర కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీడియా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే పాపరాజీ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కారు వరకు నన్ను అనుసరించడం, నన్ను ముందుకు నడవనివ్వక పోవడం...ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చేతిలో మొబైల్ ఉంటే చాలు పాపింగ్ పేరుతో వెంటబడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయేషా విషయానికి వస్తే అభిమానులతో పాటు, నెటిజనులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పాపరాజీ తీరుపై మండిపడుతున్నారు. ‘చౌకబారు మనసున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మీరు గళం విప్పినందుకు సంతోషంగా ఉంది. పాపరాజీ పేరుతో మిమ్మల్ని అసౌక్యరానికి గురి చేసే హక్కు వారికి లేదు’ అని ఒక నెటిజనుడు స్పందించాడు. -
అధికారులను విసిగించేలా ఈనాడు తీరు..
-
Bhumana Karunakar Reddy: పచ్చి అబద్ధాలు రాయడంలో దిట్ట..
-
ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఉంటారు.కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్లో ఇస్తామని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ముఠా.. బాగా దోచుకో పంచుకో..!
-
చంద్రబాబు అబద్ధాలు మోయడమే జాకీ మీడియా పని.. చెల్లుబోయిన సీరియస్ కామెంట్స్
-
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
నాపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది
-
పెద్దిరెడ్డిపై ఎల్లో మీడియా విషపు రాతలు.. భూమన స్ట్రాంగ్ కౌంటర్
-
తనపై ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం
-
పట్టా భూములను అటవీ భూములంటారా?: పెద్దిరెడ్డి
తిరుపతి అర్బన్: ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.1981లోనే అవి ప్రైవేట్ భూములని నిర్ధారించారు..నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం. తాజాగా పులిచర్ల ప్రాంతంలోని 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులకు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో కథనాలను వెలువరించారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీచేశారు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీశాఖ నుంచి 27.6.2022న క్లియరెన్స్ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. రెండుసార్లు విచారణ.. అవి ప్రైవేట్ భూములేఈ భూములపై ఎన్.కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్ భూమేనని నిర్ధారించారు. అదే వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేశాడు. తిరిగి మరోసారి దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించారు. దీనిపై వెంకటరమణారెడ్డి హైకోర్ట్లో కేసు వేయగా డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజిట్ 1968లోనే అది పక్కా ప్రైవేటు భూమి అని చూపించారు.ఆరోపణలకే పవన్ పరిమితం..ఇసుకలో రూ.40 వేల కోట్ల దందా చేశామని, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశామని, నేపాల్లో పట్టుబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాపై నిరాధార ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? మేం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు తేలిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మాపై నెట్టేందుకు యత్నించింది.భూమి పెరిగిందా..? బుర్ర తరిగిందా?ఈనాడు ఆరోపణ: భూమి కూడా పిల్లల్ని కంటుందని మీకు తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి?వాస్తవం: భూమి పెరుగుతూ వచ్చిందనేది శుద్ధ అబద్ధం. సెటిల్మెంట్ నివేదికే దీనికి నిదర్శనం. అవి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విభాగం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ పశు పోషణతోపాటు మామిడి తోటలను సాగు చేస్తోంది. రిజర్వు ఫారెస్టు ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదని 1968 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా స్పష్టమవుతోంది. అక్కడ 75.74 ఎకరాల భూములున్నాయని, 30 అడుగుల దారి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హ యాంలో రెండుసార్లు ఉమ్మడిగా సర్వే నిర్వహించిన రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కూడా అవి ప్రై వేట్ భూములేనని నిర్ధారించారు. దీనిపై దాఖలైన వ్యాజ్యాన్ని సైతం న్యాయస్థానం కొట్టి వేసింది.ఈనాడు ఆరోపణ: ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్లు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారు? అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది?» డాక్యుమెంట్ నంబర్ 2346/2000: విస్తీర్ణం 15 ఎకరాలు» డాక్యుమెంట్ నంబర్ 1/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2345/2000: విస్తీర్ణం 11 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 139/2001: విస్తీర్ణం 18.94 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2347/2000: విస్తీర్ణం 10.80 ఎకరాలు » డాక్యుమెంట్ నంబర్ 2/2001: విస్తీర్ణం 10 ఎకరాలు » మొత్తం విస్తీర్ణం : 75.74 ఎకరాలుఈ రిజిస్ట్రేషన్లు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పూర్తయ్యాయి.ఈనాడు ఆరోపణ: విలాస భవనాలను కట్టుకున్నారు.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు నిర్మించుకున్నారు.వాస్తవం: ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉండటం.. ఎడ్లబండి మాత్రమే వెళ్లేందుకు దారి ఉన్నందున తమకు తారు రోడ్డు కావాలని కోరుతూ రైతులు అటవీశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర అటవీశాఖ ఆమోదంతో రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చారు. అయినా పెదిరెడ్డిది కూడా పొలమే కదా? ఆయన కూడా వ్యవసాయం చేయి స్తున్నారు కదా? అది కూడా అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసుకున్నారు. అసలు రామోజీ కుటుంబానికి మించిన విలాస సౌథాలు ఎవరికి మాత్రం ఉంటాయి? దాదాపు వెయ్యి దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం వాటి కోసం షెడ్లు నిర్మించింది. స్వతహాగా రైతు కావడం, వ్యవసాయంపై మక్కువతో వయసు మళ్లిన వాటిని కూడా పోషిస్తున్నారు. » టీడీపీ కూటమి సర్కారుకు బాకాగా పనిచేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతూ పతాక శీర్షికలతో పేజీలకు పేజీలు తప్పుడు కథనాలను ప్రచురించింది. మార్కెట్ విలువ ఎకరా రూ.3 లక్షలు మాత్రమే ఉన్న పట్టా భూములను అటవీ ప్రాంతంగా చిత్రీకరించేందుకు రూ.కోట్ల విలువైన స్థలాన్ని వృథా చేసేందుకు కూడా ఈనాడు వెనుకాడలేదు. -
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం
-
ఈనాడు, ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు, కుత్రంతాలు ప్రజలకు బాగా తెలుసు అని విమర్శించారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాకు సంబంధించిన భూములపై ఎల్లో మీడియా(Yellow Media) తప్పుడు కథనాలు రాస్తోంది. 2001లోనే మేము భూములు కొనుగోలు చేశాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేశారు. 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం. ఇప్పుడు అది అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూములను సాగు చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తాను.గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. అప్పుడు వారిపై రూ.50కోట్లకి పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. 19.11.1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిని వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు.27.06.2022 లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40 వేల కోట్లు మింగేసాను అని, ఆ తర్వాత నేపాల్లో నాకు సంబంధించిన ఎర్ర చందనం దొరికింది అని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఇన్ని రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు.బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు.ఎన్నికల సందర్బంగా చెప్పిన ప్రకారం.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఏపీలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా, లేకున్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. కరోనాతో ప్రపంచమంతా అల్లకోల్లోలం అయినా కూడా ఎక్కడా పథకాలు ఆపలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దావోస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్
-
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్గా టైమ్పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్లో జగన్కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు దావోస్ పర్యటన..బాహుబలికి మించి ఎల్లో మీడియా ఎలివేషన్స్
-
‘దావోస్లో బాబు.. 2014-19 మధ్య ఒప్పందాల సంగతేంటి?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్కి వెళ్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఓర్వకల్లు దగ్గర గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు.. అంతా బాబు షో
-
అంతా బాబు షో!.. పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రకటిస్తుంటే.. అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ, దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలూదుతోంది. వాస్తవం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ అధికారికంగా కేంద్రం లెటర్ (31026/62/22)ను 2022లోనే పంపింది. అటువంటి బల్క్ డ్రగ్ పార్క్నకు ఇప్పుడు కొత్తగా ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు, రైల్వే జోన్కు భూ కేటాయింపు ఇలా ఒకటేమిటి.. ప్రధాని నేడు శంకుస్థాపన చేయబోయే మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే కావడం గమనార్హం.మెజార్టీ ప్రాజెక్టులదీ అదే తీరు » కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అయితే ఏడాది, రెండేళ్ల క్రితం ప్రకటించి.. భూ కేటాయింపులు, లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహా ప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. » వాస్తవానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు.. ఇందుకు ఏపీఐఐసీతో 1,200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎన్జీఈఎల్) సంతకం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా రూ.1.85 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2020లో ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. » రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు ఈ పార్కులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ అండర్ సెక్రటరీ అధికారికంగా లేఖ (31026/62/2022) పంపారు. మొత్తం రూ.1,876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద రూ.223 కోట్లను మార్చి 2023లో విడుదల చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్కు ప్రధాని చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమైంది. » రైల్వే జోన్కు ముడసర్లోవలో అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే.. అసలు భూమి కేటాయించలేదని, అక్కడ భూమి నిర్మాణాలకు అనువైనది కాదంటూ తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తున్నారు.» ఇవేకాకుండా.. దువ్వాడ–సింహాచలం, విశాఖపట్నం–గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ పనులకు కూడా గతంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్టు జాబితాలో చేర్చారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి–పెండేకల్లు డబ్లింగ్ పనులు.. ఇలా ఒకటేమిటి మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎల్లో మీడియా ఫేక్ ఆరోపణలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..
-
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!
ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
జగన్ ఇంటిపై రాళ్ళ దాడి.. ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్
-
అదంతా అబద్ధం.. ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం: చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్ ఆఫీస్పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్ జగన్ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డిఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్కుమార్రెడ్డి హితవు పలికారు. -
ఎల్లో మీడియాలో బిల్డప్ తప్ప... మంచి చేసింది ఏమీ లేదు
-
‘వైఎస్ జగన్ భద్రతపై ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది. ..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది, ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్ జగన్కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది...చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్ జగన్లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు. -
చంద్రబాబుది 420 విజన్: వైఎస్ జగన్
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్ల మీద స్కామ్లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...జనవరి నుంచి జిల్లాల పర్యటనజనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాంఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుందిప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను. ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళనపట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాంమన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.అసలైన విజన్ అంటే ఇదీచంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.ఉన్నత విద్యలో ఊహకందని మార్పుఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్. రైతును చేయి పట్టుకుని నడిపించాంరైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.ఇంటి వద్దకే సేవలుమన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్ను తీసుకొచ్చిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే. -
పోలవరం సర్వనాశనం.. ఎత్తు తగ్గించేశారు
-
ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
‘‘పాలనలో వేగం పెంచండి’’, ‘‘జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన’’ అధికారుల వల్లే అసంతృప్తి’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలివి. ఎన్నికల హామీ అమలుపై చర్చ కాదు కదా.. కనీస ప్రస్తావన కూడా లేకుండా సాగిన ఈ సమావేశాన్ని గమనిస్తే దీనికో లక్ష్యమంటూ ఉందా? అన్న సందేహం రాకమానదు. నిర్దిష్ట సూచన, సలహాలు లేకుండా కలెక్టర్లదే బాధ్యతంతా అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం ఎవరిని మభ్యపెట్టేందుకు? వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలెక్టర్ల సమావేశం పెడితే ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీ పత్రాలను దగ్గర పెట్టుకుని వాటి అమలుపై సమీక్ష జరిగేది. అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరిగేది. ఇప్పుడు అవేవీ లేవు. చంద్రబాబు తమ సూపర్ సిక్స్ హామీల గురించి కలెక్టర్లతో మాట్లాడే ధైర్యమూ చేయలేకపోతున్నారు. బాబే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో సంబంధం లేని మాటలు నాలుగు మాట్లాడి సమావేశాలను మమ అనిపిస్తున్నారు.ఎస్పీలతో సమావేశాలు కానీ.. కలెక్టర్లతోనైనా కూడా తమ అధికారాన్ని ప్రదర్శించడం తప్ప వీరు చేసిందేమిటన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కదా.. జనం మెచ్చేది.. పాలకులు నచ్చేది? బదులుగా బాధ్యతంతా అధికారులదే అని చేతులు దులిపేసుకుంటే.. వారి వల్లే తాము ప్రజలకు నచ్చడం లేదూ అంటే ఎలా? రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం ఎజెండాలో సూపర్ సిక్స్ లేకపోవడం గమనించాల్సిన విషయం. వీటి అమలుకు నిధులెన్ని కేటాయిస్తున్నారో చెప్పకుండా కలెక్టర్లు బాగా పనిచేయాలని అంటారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాలని కూడా చెబుతున్నారు. ఇవి చేస్తే అది జనం మెచ్చే పాలన ఎలా అవుతుంది? ఈ నేపథ్యంలోనే జనంలో తిరుగుబాటు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే ఈయన ఒకసారి అంతా బాగున్నట్టు.. అప్పుడప్పుడూ ఇలా బాలేనట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రసంగాల్లోని వైరుద్ధ్యాలు ఎంతో ఆసక్తికరం. చంద్రబాబేమో... ప్రజలతో గౌరవంగా ఉండండని అంటారు. అంతవరకూ ఓకే కానీ ఇది ఐఏఎస్లకే కాకుండా ఐపీఎస్లకూ వర్తిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి నేతలు పోలీసులను తమ ఇష్టానురీతిలో వాడుకుంటూ పౌరులపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ వీటిని సమర్థిస్తూ.. ఇంకోపక్క సుభాషితాలు చెబుతూండటం విని కలెక్టర్లు నవ్వుకోవడం మినహా ఏమి చేస్తారు! రాష్ట్రం గాడిలో పడుతోందట..చీకట్లు తొలగిపోతున్నాయట. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందట.. చంద్రబాబు ఇలాంటి మాటలు ఎవరిని మాయ చేయడానికి చెబుతున్నారు? వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హింస, అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అనడం అంటే ఎంత దారుణం! గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అధికారులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.ఇదే కలెక్టర్ ల సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. సీఎంను అడిగి రూ.30 కోట్ల నిధులు తీసుకుని జీతాలు ఇప్పించామని అన్నారు. మున్సిపాల్టీలలో పారిశుద్ద్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. పది లక్షల కోట్ల అప్పులు పేరుకున్నాయని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని శాసనసభలో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, మళ్లీ పాత పాటే పాడుతోంది. కొత్త అప్పులు చేద్దామంటే ఎఫ్ ఆర్ బిఎమ్ అనుమతించడం లేదట. ఇప్పటికి సుమారు డెబ్బై వేల కోట్ల అప్పు చేసి మరీ ఇంకా రుణాలు రావడం లేదని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గతంలో ఎప్పుడూ తాను చూడలేదని పచ్చి అబద్దం చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో 1999 2004లో పనికి ఆహారం బియ్యం పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన ఏభై లక్షల టన్నుల బియ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన విషయం శాసనసభలోనే పెద్ద రగడ జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఉండదు. అది తెలిసినా, వైఎస్సార్సీపీ పై బురద చల్లడం కోసం ఇలాంటి అసత్యాలు చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ రవాణా ఆగడం లేదని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు కదా! మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఎగుమతి చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా? లేవా? అన్నది ఎందుకు తనిఖీ చేయలేదు? రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలలోను ఉందని కేశవ్ అన్న విషయంపై చంద్రబాబు ఏమి చెబుతారు? వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్ లు కబ్జాకు గురయ్యాయట. జగన్ ప్రభుత్వపరంగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని నిలిపి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు.కాకినాడ సెజ్ లో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు చేసిన భూ దందాపై సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా! అధికార యంత్రాంగంలో పాత వాసనలు పోవడం లేదట. ఆయనకు తెలియకుండా వారు పనులు చేస్తున్నారట. కుమారుడు లోకేష్ కనుసన్నలలో అన్నీ జరగుతున్నాయని టీడీపీలో టాక్. కాని తనకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి అనడంలో ఆయన బలహీనత తెలుస్తూనే ఉంది కదా! అమరావతి ప్రారంభ దశలో రూ.ఏభై వేల కోట్ల అవసరం అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు చేయనవసరం లేదని, అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించరు. చంద్రబాబు ఒక్క నిజం చెప్పినట్లుగా ఉంది. ఇంతవరకు కేవలం నలభైవేల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఎల్లో మీడియా ఇప్పటికే లక్షల మంది గ్యాస్ సిలిండర్లు పొందినట్లు ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు పొరపాటున వాస్తవం చెప్పేసినట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలలో జగన్ పాలనలో జీఎస్డీపీ సుమారు 12.5 పెరిగిందని పార్లమెంటులో ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం ఆదాయం తగ్గిందని చెబుతున్నారు.జగన్ టైమ్ లో కరోనా రెండేళ్లు సంక్షోభాన్ని సృష్టించినా, దానిని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఎందుకు తగ్గిందో చెబితే ఒట్టు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,తదితర సమస్యలపై మాత్రం నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారు. వచ్చే సీజన్ లో చూద్దామని చెప్పి వదలి వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా యథాప్రకారం తెలిసి, తెలియనట్లు మాట్లాడారనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు కనుక అక్రమాలను అడ్డుకుంటే మంత్రులు వెళ్లనవసరం లేదట. అదేమిటో అర్థం కాదు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లు చేయాలని ముఖ్యమంత్రి చెబుతారు. ఇంకోవైపు అధికారులు నిస్సహాయంగా ఉండవద్దని అంటారు. వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పాత సినిమా డైలాగులనే ఆయన వల్లిస్తున్నారు.కాకపోతే ఒక్క వాస్తవం చెప్పారు. ప్రజలు ఆశలను నెరవేర్చలేకపోతున్నామని, తిరగబడే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి ఏపీలో ఉందని చెప్పడం మాత్రం విశేషమే. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానిని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, దానివల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని జగన్ అంటున్నారు. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అదే ప్రజలలో కోపంగా మారుతున్నాయని, తమకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకో రకంగా గోబెల్స్ ప్రచారం చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చిత్తశుద్ది ఉంటే, వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికను దగ్గర పెట్టుకుని, ఎన్నికల సమయంలో ఏమి చెప్పాం? ఏమి చేస్తున్నామన్న దానిపై ఎన్నడైనా సమీక్ష చేసుకున్నారా? ఆ పని చేయకుండా కలెక్టర్ల సమావేశాలు పెట్టి డ్రామాల మాదిరి కబుర్లు చెబితే ప్రజలకు అర్థం కాదా? ఐఎఎస్ పాసై వచ్చిన కలెక్టర్లు, సెక్రటరీలకు ఇందులోని మోసం తెలియదా?. ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు డబ్బులు లేవని కథలు చెబుతూ తమను ప్రజలు మెచ్చుకోవాలని ఉపన్యాసాలు ఇస్తే మెచ్చుకోవడానికి ప్రజలు పిచ్చివాళ్లా? కొసమెరుపు ఏమిటంటే ఈ సమావేశంలో కలెక్టర్లు సోది చెబుతున్నారని ఎల్లో మీడియా ఒక స్టోరీ ఇచ్చింది. ప్రభుత్వంలో విషయం లేకపోతే సోది చెప్పక ఏమి చేస్తారు? అందులోను నేతల సోది విన్న తర్వాత వారు మాత్రం అందుకు బిన్నంగా వెళతారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రజాగ్రహం వల్లే 'డైవర్షన్ పాలిటిక్స్': వైఎస్ జగన్
కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ హంగామా చేయడం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాతలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వంలో మనమున్నామా? వాళ్లున్నారా? అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచాయి. అధికారులు, మంత్రులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, పోలీసులు అంతా వాళ్ల అధికారులే. చెక్ పోస్టులు వాళ్లవే. పోర్టులో కస్టమ్స్ అధికారులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు వాళ్ల పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వ మనుషులే. ఇవన్నీ దాటుకుని ఏదైనా మెటీరియల్ పోర్టులోకి పోగలుగుతుందా? పవన్ కళ్యాణ్ వెళ్లి పరిశీలించిన షిప్ పక్కనే ఉన్న మరో షిప్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీనివాసరావుది. పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్ పేరుతో అదే పోర్టు నుంచి శ్రీనివాసరావు ఎగుమతి చేస్తున్నారు. అక్కడికి మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్లడు. ఆ షిప్ను పరిశీలించడు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఎవరు చేస్తున్నారని నాకు ఆశ్చర్యం అనిపించింది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ప్రజలకు అబద్ధాలు చెబితే అది మోసం అవుతుంది. అది ప్రజల్లో కోపం కింద మారుతుంది. ఆ కోపమే చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు ఏమైందని ప్రజలు నిలదీస్తుండటంతో సమాధానం చెప్పలేని టీడీపీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని దెప్పి పొడిచారు. ‘జూన్లో రుషికొండ భవనాలు అని, జూలైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్ అని, ఆగస్టులో ముంబై నటి కాదంబరి జెత్వానీ అని, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి కూలగొట్టాలన్న కుట్ర చేశామని, అక్టోబర్లో నా కుటుంబాన్ని తెచ్చి, నవంబర్లో బడ్జెట్పై దృష్టి మరలించడానికి రూ.14 లక్షల కోట్లు అప్పు అని డైవర్షన్ చేశారు. ఇప్పుడు డిసెంబర్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ నానా హంగామా చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ‘యుద్ధం గతంలోలా లేదు. మనం చంద్రబాబుతోనే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. వీటికి తోడు చెడిపోయిన ఐ–టీడీపీతో యుద్ధం చేస్తున్నాం. వీరంతా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద జల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది’ అని నేతలకు ఉద్బోధించారు. ‘ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఎక్కౌంట్ ఉండాలి. అన్యాయం జరిగితే దాన్ని కచ్చితంగా ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోటో తీసి ప్రశ్నించాలి. ఎందుకు అమ్మఒడి రావడం లేదు? మా విలేజ్ క్లినిక్ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఇలా అన్ని సమస్యలపై ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాలి. తద్వారా ప్రజలకు దగ్గర కావాలి’ అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు దాటింది. ఈ పరిస్థితుల్లో పార్టీని మనం మళ్లీ సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ కలుస్తున్నాం. ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత ఈ స్ధాయిలో ఏ ప్రభుత్వం మీద లేదు. కేవలం చంద్రబాబునాయుడు పాలనలో మాత్రమే ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం’ అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అధికార పార్టీ వ్యవస్థీకృత నేరాలు ⇒ ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల వ్యవస్థీకృత నేరాలు’ అంటూ ఈనాడులో రాశారు. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నది వాళ్లు అయితే, మన మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చూస్తే.. బియ్యం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దశాబ్దాలుగా నెంబర్ వన్గా ఉంది. తెలంగాణా నుంచి కూడా బియ్యం మన దగ్గరకే వస్తాయి. అందులో పట్టాభి ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఎగుమతి చేస్తున్న పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీనివాసరావు ఆంధ్రాలో నెంబర్ వన్. ⇒ మన ప్రభుత్వంలో తొలిసారిగా బియ్యం పంపిణీలో డీలర్ల వ్యవస్థను పక్కన పెట్టి.. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేశాం. ఇందులో భాగంగా ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) ఏర్పాటు చేసి ఇంటి వద్దకే సార్టెక్స్ చేసి వాళ్లు తినగలిగే బియ్యాన్ని ఇచ్చాం. వాళ్లు అమ్ముకునే పరిస్థితి లేకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. ఈ రోజు ప్రభుత్వం పథకం ప్రకారం ఇంటి వద్దకే బియ్యం ఆపేసింది. మనం సార్టెక్స్ చేసి స్వర్ణ వంటి మధ్యస్థ సన్న బియ్యం ఇస్తే.. ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు. వీళ్లు ఇవన్నీ చేస్తుంటే.. వీళ్ల తప్పిదాలతో నాసిరకం బియ్యం సరఫరా కావడం వల్ల మళ్లీ ప్రజల దగ్గర నుంచి వివిధ రూపాల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎగుమతి జరుగుతోంది. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తం ⇒ మన హయాంలో ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర వచ్చేటట్టు చేశాం. రైతు ఏ మిల్లుకు తాను పోవాలన్నది పూర్తిగా పక్కన బెట్టి.. రైతుకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేశాం. ఆర్బీకే దగ్గరే ఎంత ధాన్యం అమ్మావు, ఎంత రేటు వస్తుందనే స్లిప్పులు ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. ⇒ ఇవాళ రైతుల పంట చేతికొచ్చే సరికి ఈ–క్రాప్ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. కొనుగోలు చేసే వారు లేక.. రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరకు వెళితే వాళ్లు కనీస మద్దతు ధర చెల్లించకుండా, రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాలుగా ధాన్యం సేకరణ వ్యవస్థను సర్వనాశనం చేశారు.బుధవారం తాడేపల్లిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పప్పు బెల్లాల్లా బాబు అమ్మకం ⇒ రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకవైపు మనం కడుతున్న మెడికల్ కాలేజీలు, పోర్టులను చంద్రబాబు అమ్ముతానంటున్నాడు. మనం రాక ముందు నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు ఉంటే మనం వచ్చిన తర్వాత నాలుగు పోర్టులు కట్టాం. ఇప్పుడు ఆ పోర్టులన్నీ శనక్కాయలకు, బెల్లాలకు అమ్ముతాడట!⇒ సంపద సృష్టించడమంటే పోర్టులు, మెడికల్ కాలేజీలు వంటివి నిర్మించడం. ఈ పోర్టుల నిర్మాణం పూర్తైతే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈ పోర్టు కట్టడానికి ఇవాళ రూ.4 వేల కోట్లు అవసరం అయితే పదేళ్ల తర్వాత రూ.10 వేల కోట్లు అవసరం అవుతుంది. ఈ పోర్టులన్నింటినీ చంద్రబాబు తన వాళ్లకు అమ్మే కార్యక్రమం పెట్టాడు. వెలిగొండ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు..వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లు పూర్తయ్యాయి. నల్లమల సాగర్ రిజర్వాయర్ కూడా పూర్తయింది. లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగే ప్రధాన కాల్వల నిర్మాణం కూడా పూర్తయింది. కేవలం ఆర్ అండ్ ఆర్ పరిహారం మాత్రమే చెల్లించాలి. అది కూడా రూ.1,200 కోట్లు ఇస్తే నీళ్లు నింపవచ్చు. దాన్ని ఈ ఏడాది చేయాలనుకున్నాం. అలా పూర్తి చేసిన ప్రాజెక్టు ఈ రోజుకూ అలా ఉండిపోయింది. పూర్తైన ప్రాజెక్టుకు కూడా ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజీ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దాన్ని అమ్మడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి వాళ్లని చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. జనవరి నుంచి జిల్లాల పర్యటనపార్టీని మనం మరింత బలోపేతం చేయాలి. దీన్ని వ్యవస్థీకృత విధానం (ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్)లోకి తీసుకురావాలి. ఇందులో భాగంగా పార్టీలో క్రియాశీల మార్పులు తీసుకు వచ్చాం. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బుధ, గురువారాల్లో ఉంటాను. అవసరాన్ని బట్టి శుక్రవారం కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. నా కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు పూర్తి చేయాలి. సంక్రాంతి లోపే అవన్నీ పూర్తి కావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చేద్దాం.పోరు బాట దిశగా అడుగులుమీలో కూడా ఎవరైనా నాయకత్వ దిశగా ఎదగాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎదగడానికి అవకాశం వస్తుంది. ప్రజలకు మనం దగ్గర కావాలి. ప్రజలకు దగ్గరవుతూ పోరాటంలో వాళ్లకు తోడుగా నిలబడగలిగితేనే మనకు సానుకూలంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు మనల్ని త్వరగా రోడ్డు మీదకు వచ్చేలా చేశాడు. ప్రజల తరఫున పోరాటంలో బాగంగా మనం మూడు కార్యక్రమాలు చేపట్టాం. ఈ నెల 13న అన్నదాతలకు అండగా సమస్యలపై కార్యక్రమం పెట్టాం. గతంలో మనం రైతు భరోసాగా రూ.13,500 ఇచ్చాం. ఇందులో ఆరు వేలు కేంద్రమే ఇస్తుందని టీడీపీ వాళ్లు అన్నారు. అంటే కేంద్రం ఇస్తున్నది కాకుండా ఏడాదికి మరో రూ.20 వేలు ప్రతి రైతుకూ ఇస్తామన్నట్టుగా భావన కల్పించారు. కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు. దీనిపై నిలదీసే కార్యక్రమం జరగాలి. ధాన్యం కనీస మద్దతు ధర కోసం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశాడు. వీటన్నింటి మీద ప్రశ్నిస్తూ రైతుల తరఫున కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాం. ఈనెల 27న కరెంటు చార్జీల మీద మరో కార్యక్రమం చేస్తున్నాం. కరెంటు ఛార్జీల విషయంలో కూడా చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో నేనున్నా.. నేను తగ్గిస్తా.. అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15,000 కోట్లు పెంచాడు. దీనిపై ఈనెల 27న కార్యక్రమం పెట్టాం.జనవరి 3నఫీజు రీయింబర్స్మెంట్ కోసం మరో కార్యక్రమం చేస్తున్నాం. క్వార్టర్ అయిపోయిన వెంటనే నాలుగో నెలలో వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల తల్లులకు విద్యాదీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇచ్చే వాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నాలుగు త్రైమాసికాల నుంచి విద్యా దీవెన అందలేదు. వసతి దీవెన డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువులు మానేసి పొలం పనులు చేసుకుంటున్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు. ఆ పిల్లల తరఫున చంద్రబాబును ప్రశ్నిస్తూ జనవరి 3న పోరు సాగిస్తున్నాం. ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి.చంద్రబాబు బాదుడే బాదుడు ⇒ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతం చేయడంతో పాటు, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సన్నద్ధం అయ్యాం. చంద్రబాబు చేస్తున్న పాలన చూసి ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్లకు మేమున్నామనే భరోసా ఇవ్వగలిగినప్పుడే ప్రజలకు మన మీద నమ్మకం కలుగుతుంది. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి.⇒ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నీ నాశనమయ్యాయి. మరోవైపు బాదుడే బాదుడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. రూ.6 వేల కోట్ల బాదుడుతో మొదటి డోసు ఇది. నవంబరు, డిసెంబరు బిల్లులో ఏ ఇంటికి వెళ్లినా రూ.300 కనీసం తేడా కనిపిస్తోంది. రా>నున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల భారం వేస్తున్నారు.⇒ ఊళ్లలో రోడ్డెక్కితే చాలు డబ్బు కట్టాల్సిందేనట. అది జాతీయ రహదారులపై చూశాం కానీ, గ్రామీణ రోడ్లు బాగు చేయడం కోసం వాటిపై టాక్స్ వేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నాడు. ఆయన హయాంలో, మన హయాంలో తేడా చూస్తే.. మన హయాంలో రూ.43 వేల కోట్లు రోడ్లపై ఖర్చు చేస్తే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో అది రూ.27 వేల కోట్లు మాత్రమే. అది కూడా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఇవాళ చంద్రబాబు హయాంలో సంపద సృష్టి అంటే బాదుడే బాదుడు అని అర్థం.మేనిఫెస్టో అమలు చేసిన తొలి ప్రభుత్వం2019–24 మధ్య మన పాలనలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మన ప్రభుత్వం రానంత వరకు మేనిఫెస్టో ప్రాధాన్యత ఏమిటన్నది తెలియదు. ఎన్నికలైపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పాలనను మన కంటే ముందు చూశాం. తొలిసారిగా ఆ చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ.. ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతి మాటను తూచ తప్పకుండా బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటించి.. ఏ నెలలో, ఏ పథకం అమలు చేయబోతున్నామో చెప్పాం. ఆ నెల వచ్చేసరికి బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన పాలన మన ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మనం రానంత వరకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా పథకాలు ఇవ్వడం సాధ్యమేనా? అన్న పరిస్థితి నుంచి ఔను, ఇవన్నీ సాధ్యమే.. కచ్చితంగా చేయగలం.. అని రాష్ట్రానికి, దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా చూపింది వైఎస్సార్సీపీ పాలన మాత్రమే. విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి ⇒ ఎప్పుడూ చూడని విధంగా స్కూళ్లు మారాయి. పేదవాడు పేదరికం నుంచి బయటకు వచ్చి సమాజంతో పోటీ పడేలా చదువులు కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే అందాయి. బడులలో ఎప్పుడూ చూడని మార్పులు తెచ్చాం. ప్రభుత్వ బడుల కన్నా ప్రైవేటు బడులు ముందుంటాయి అన్న పరిస్థితి నుంచి ప్రైవేటు బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితిలోకి తెచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ పరకు ప్రయాణం, నాడు–నేడుతో సమూల మార్పులు, ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్ చేశాం. ఏటా పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. ⇒ వైద్య రంగంలో కూడా ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వ వైద్యుడు గ్రామానికే వచ్చి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేశాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించాం. గతంలో ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు ఉంటే వాటిని 3300కు పెంచాం. దేశమంతా ప్రభుత్వ రంగంలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే, మన వద్ద జీరో వేకెన్సీ పాలసీతో దాన్ని 4 శాతానికి లోపే తీసుకువచ్చాం. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు అందించాం.సాగులో కనీవినీ ఎరగని మార్పులు ⇒ వ్యవసాయంలో కనీవినీ ఎరగని మార్పులు తెచ్చాం. గ్రామంలో రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ గ్రామంలో కనిపిస్తుంది. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ రైతులకు సలహాలు, సూచనలు అందించే పరిస్థితి. తొలిసారిగా పారదర్శకతకు పెట్టపీట వేస్తూ ఈ–క్రాపింగ్, దాని ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. రైతులకు ఏ ఇబ్బంది రాకుండా పంట వేసే సమయానికే పెట్టుబడి సాయం చేశాం. ⇒ రైతుల వద్ద నుంచి దళారీ వ్యవస్థను తీసివేయడం సాధ్యమేనా అన్న వాళ్లకు.. ఇది సాధ్యమేనని చేసి చూపించాం. ధాన్యం కొనుగోళ్లను ఆర్బీకే స్థాయి నుంచే మొదలుపెట్టి ప్రతి ఒక్క రైతుకూ కనీస మద్దతు ధర అందేటట్టు చేయడంతో పాటు, రైతులకు బోనస్గా జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, ట్రాన్స్పోర్టు)గా ఎకరాకు రూ.10 వేలు అందించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేం ⇒ పరిపాలనను ఇంటి గడప వద్దకే తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా అన్నీ చేయగలిగాం. అంత మంచి చేసినా ఎక్కడో పొరపాటు జరిగింది. ‘జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతానన్నాడు. తీరా ఎన్నికలయ్యాక పలావు పోయింది. బిర్యానీ కూడా పోయిందన్న’.. మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. ⇒ ఆరోజు చంద్రబాబు అలా ప్రచారం చేసినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి.. అన్నా నువ్వు ఏం చెప్పనంటున్నావు. చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరు కనిపించినా వదలడం లేదు. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అంటున్నాడు. వాళ్ల అత్తలు, అమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల యువకుడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అంటున్నాడు. అదే ఇంట్లో నుంచి కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని అంటున్నాడు. ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. మనమూ చెప్పాలని అన్నారు. ⇒ ‘ఇది మన రాష్ట్ర బడ్జెట్. మన రాష్ట్ర పరిస్ధితులు ఇవి. కాబట్టి మనం చేయగలిగింది ఇది మాత్రమే. కానీ మనం చెప్పిన దానికన్నా చంద్రబాబు మూడింతలు చెబుతున్నాడు. అవి సాధ్యం కాదు’ అని చెప్పాను. కానీ, మనం ఎంత చెప్పినా.. ప్రజలు అటువైపు ఆలోచన చేశారు. ప్రజలు బాధ పడకుండా ఉండాలని, వారిలో చిరునవ్వు చూడాలన్న తపనతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా భరించాం. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కారణాలు వెతుక్కోకుండా యుద్ధం చేసి మరీ ప్రజలకు మంచి చేశాం. బాబు చెప్పిన అబద్ధాలు ఓ పది శాతం మంది అధికంగా నమ్మి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లారు.విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామరక్ష⇒ నేను ఒక్కటే చెబుతున్నాను. ఈ క్యారెక్టర్, క్రెడిబులిటీ వల్లనే మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. నా దగ్గరకు వచ్చిన మన పార్టీ నేతలు మీలో అతి మంచితనం, అతి నిజాయితీ అనే సమస్యలు ఉన్నాయని చెబుతారు. కానీ ఆ రెండు గుణాలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. ప్రజలకు అబద్ధాలు చెప్పినప్పుడు అది మోసం అవుతుంది. అది ప్రజల్లో కోపం కింద మారుతుంది. ఆ కోపమే చంద్రబాబు పాలనలో ప్రజల్లో ఇప్పుడు విపరీతంగా కనిపిస్తుంది. ప్రజలు నిలదీసే పరిస్థితుల్లోకి వస్తున్నారు.⇒ నా రూ.15 వేలు ఏమయ్యాయని చిన్నపిల్లలు, నా రూ.18 వేలు ఏమయ్యాయని వాళ్ల తల్లులు, నా రూ.48 వేలు ఏమయ్యాయని అమ్మమ్మలు, నా రూ.36 వేలు ఏమయ్యాయని యువకులు, నా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. -
అంతా వాళ్లే చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తోన్న దుష్ఫ్రచారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందన్నారు.‘‘రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు?.. ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు?. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే దాన్ని పక్కనపెట్టాం. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం. సార్టెక్స్ చేసిన మరీ ఇచ్చాం. రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అడ్డుకుంది మనమే.కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడం లేదు. దీని వల్ల మళ్లీ రేషన్ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
High Court: కథనాలు, పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను తీసుకువచ్చిన ‘ఎస్ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
బాబును బాహుబలిగా చూపించేందుకు ఎల్లో మీడియా తాపత్రయం
-
లోక్సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు. -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
Editor Comment: కలి బాబులు కుమ్మక్కె క్యారెక్టర్ పై పుస్తున్న మరకలు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి జగన్ లీగల్ నోటీసులు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
టీడీపీ తీరుతో మోదీకి మకిలి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!ఆంధ్రప్రదేశ్లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.జగన్పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అవినీతి, వెన్నుపోటుకు ఈనాడు, ABN బ్రాండ్ అంబాసిడర్..
-
చంద్రబాబు, ఎలో మీడియాకు తోపుదుర్తి కౌంటర్
-
Big Question: రాష్ట్రానికి మేలు జరిగితే ఎల్లో బ్యాచ్ కు ఏడుపెందుకు ?
-
ఈ ఏడుపు ఎన్నాళ్లు?
-
KSR Live Show: సమాధానం చెప్పే దమ్ముందా..!
-
వైఎస్ జగన్ అల్టిమేటం.. తప్పుడు వార్తలపై పరువు నష్టం దావా
-
ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో శుక్రవారం(నవంబర్ 29) ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. -
ఎల్లో మీడియాపై గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
సాక్షి,విశాఖ : ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లోమీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది..కేబినెట్లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సైకీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు కొన్నారు..ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగింది? ..వైఎస్ జగన్ను అదానీ కలిస్తే తప్పు. అదానీ జగన్ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధికమొత్తంలో కరెంట్ను కొనుగోలు చేసి రూ.86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా.. రాష్ట్రానికి లక్షా పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా...ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు రూ.20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు.. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము’ అని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
KSR Live Show: ఈనాడు తప్పుడు కేసులు.. చెత్త మాటలు
-
KSR Live Show: కరెంట్ చార్జీలు పెంచి కప్పిపుచ్చే కుట్ర.. డైవెర్షన్ లో బాబు సిద్ధహస్తుడు
-
ఏపీ చరిత్రలోనే అత్యంత తక్కువ ధరకు డీల్ కుదిరింది తమ హయాంలోనే
-
నాకు క్షమాపణ చెప్పాలి.. లేదంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి జగన్ వార్నింగ్
-
మంచి చేసినోడిపై రాళ్లు వేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను సంపద సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘డిసెంబర్ 1న సెకీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్ల సంతకాలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది?. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. ధర్మం లేదు.. న్యాయం లేదు.. మంచి చేసిన వాళ్లపై బండలు వేయడమే పని’’ అంటూ చందబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా నాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చింది. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి.. మాటలంటున్నారు. సంపద సృష్టి నేను చేస్తే.. బాబు ఆవిరి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరణ చేసి రాస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లో మీడియా వక్రీకరించి మాట్లాడటం ధర్మమేనా?. ఈ ప్రతిపాదన అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు ఎజెండా ఐటమ్ కింద వచ్చింది. టీవీ రేట్లు తగ్గినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు’’ అంటూ వైఎస్ జగన్ వివరించారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
అదానీతో గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
-
చంద్రబాబు, ఎల్లో మీడియా.. నిజం చెబితే ఒట్టు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ఇందులోకి లాగి.. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం అబద్ధమని తేలిపోయింది. ఈనాడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వండి వారుస్తున్న తప్పుడు కథనాలు దురుద్దేశ పూరితమని స్పష్టమైంది. జరగనిది జరిగినట్లు.. లేనిది ఉన్నట్లు అందంగా అసత్యాలను అచ్చేస్తున్నారని తేటతెల్లమైంది. విద్యుత్ కొనుగోలు విషయంలో ఈనాడు దుష్ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కళ్ల ముందు స్పష్టంగా సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపిస్తున్నా.. అన్నింటినీ వదిలేసి కేవలం దుర్బుద్ధితో అప్పటికప్పుడు అబద్ధాన్ని సృష్టించడం.. దానిపై విష ప్రచారం చేయడం అనే విద్యను ఈనాడు నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాగే విషం చిమ్ముతోంది. రాష్ట్ర అప్పులపై కూడా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఒప్పుకున్నారు. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. మళ్లీ బయటకు వచ్చి వారు రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు, రూ.11 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు. ఈనాడు నిస్సిగ్గుగా అలాగే తప్పుడు కథనాలు వండివారుస్తోంది. వారు బడ్జెట్లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. తిరుమల లడ్డూ విషయంలో కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. అసలు ఆ నెయ్యిని వాడనే లేదని, ఆ ట్యాంకర్లను తిరుమలకు అనుమతించనే లేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే చెప్పారు. తిరుపతి నుంచే వెనక్కు పంపామని మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. అయినా కల్తీ నెయ్యి వాడారంటూ అబద్ధాలు చెబుతూ విషం చిమ్మారు. తిరుమలలో ప్రసాదాల తయారీకి సంబంధించి దశాబ్దాలుగా స్పష్టమైన ప్రొసీజర్ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వాటిని పాటిస్తున్నప్పటీకీ దుర్మార్గంగా అబద్ధాలు చెప్పారు. మొన్న విజయవాడ వరదల విషయంలోనూ అదే పాట పాడారు. అసలు నగరంలోకి వరదను మళ్లించిందే వారు కదా! ఎన్నికలకు ముందు ఇదే ఈనాడు, ఇదే దుష్టచతుష్టయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన యాగీ, దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంతా చేసి ఇప్పుడు రీసర్వేను కొనసాగిస్తామని చెబుతున్నారంటే అర్థమేంటి? ఆ యాక్ట్ మంచిదనే కదా! ఇదేంటని అడిగితే వెంటనే మాట మార్చేస్తారు. లేదా టాపిక్ డైవర్ట్ చేస్తారు. చౌకగా సౌర విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కు ఇన్సెంటివ్ ఉంది. లేఖలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అయినా కూడా పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారు. కళ్లెదుటే ఎన్నో సాక్ష్యాలుసౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ(ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సెకీ చెప్పినా ఎల్లో మీడియాకు కనపడదు. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల్చినా వారికి పట్టదు. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) స్పష్టం చేసినా వారి చెవికెక్కదు. చివరికి సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోరు. కేవలం గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. ఇదే అజెండాగా కొద్ది రోజులుగా టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వందసార్లు వారంతా వాదించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ‘సెకీ’ ఒప్పందం నేపథ్యంలో నమోదైన ఏ వాస్తవం కూడా మారిపోదు.తీరు మార్చుకోని ఎల్లో మీడియాసెకీ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవంటూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, సీఈఆర్సీ, సెకీతో జరిగిన ఒప్పందంలోనూ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ, దాని అనుబంధ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఐఎస్టీఎస్ ఛార్జీల భారాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తుందంటూ మళ్లీ అదే అబద్ధాన్ని పదే పదే వండి వారుస్తున్నాయి.సీఈఆర్సీ కూడా చెప్పింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్కు ఎక్స్ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్సీ స్పష్టం చేసింది.ప్రతిపాదన లేఖలోనే స్పష్టత‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థిక భారం పడుతుందంటూ మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాన్ని బుధవారం అచ్చేసింది. ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని ఇప్పటికే అనేకసార్లు నిజాలు వెల్లడించినప్పటికీ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూనిట్ రూ.2.49 చొప్పున చవక్చ ధరకే సౌర విద్యుత్ను అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖ ద్వారా ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి ఛార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది.కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లలో స్పష్టం2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్లో భాగంగా సెకీ టెండర్ ద్వారా స్థాపించే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు ఈ ప్రయోజనం అందుతుందని కేంద్రం స్పష్టం చేసింది. 2021 నవంబర్ 30న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ సీఈఆర్సీ కూడా చెప్పింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(సీఈఆర్సీ) ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం (మొదటి సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. ఉత్పాదక ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్కు ఎక్స్ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్పీఓ) ఉన్న సంస్థలకు కొంత కాలం పాటు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు లభిస్తుంది. అది సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు వస్తుందని సీఈఆర్సీ స్పష్టం చేసింది.సెకీ ఒప్పందంలోనూ అదే..ఐఎస్టీఎస్ చార్జీల ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశాన్ని భాగం చేసింది. సెకీతో జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయని పేర్కొన్న భాగం -
ఓ కరపత్రం ఏడుపు కథ!
-
ప్రజల దృష్టి మళ్లించాలనే జగన్పై దుష్ప్రచారం
నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్ జగన్ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్ రూ.6.90 చంద్రబాబు కొన్నారని, కానీ వైఎస్ జగన్ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారన్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్ మెప్పు కోసం అబద్ధాలాడుతున్నారని చెప్పారు. -
‘పచ్చ’ ముదురు రాతలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఇంకోసారి భళ్లున కక్కినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషం చూస్తే వారికి జగన్పై ఉన్న అక్కసో ఏ స్థాయిదో సామాన్యుడికీ తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే.. రోకటికి చుట్టమన్నట్లు.. ఇప్పుడు వారు అమెరికా కోర్టుల తరఫున కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా స్థాయికి ఎదిగారన్నమాట. ప్రజలను మోసం చేసేందుకు వీరు కల్లుతాగిన కోతుల్లా అర్థంపర్థం లేని కథనాలు వండి వార్చారు.అదానీ కంపెనీలకు చెందిన ఏడుగురిపై అమెరికా కోర్టులో ఒక కేసు నమోదైంది. సౌర విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారాయన్నది కేసులో మోపిన అభియోగం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కొన్ని భారత్లోని కొన్ని రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాల వెనుక లంచాలు ఉన్నాయని ఆరోపణ. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదానీతో నేరుగా ఒప్పందం చేసుకోలేదు. సెకీ ద్వారా తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేస్తూంటే అధికారులకు ముడుపులు ఎలా చెల్లిస్తారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సరైన సమాధానం ఈ పచ్చమీడియా ఇవ్వదు. పైగా.. అదాని కంపెనీ ఉద్యోగులపై మోపిన అభియోగాలను మాజీ సీఎం జగన్కు అంటకడుతూ ఎల్లోమీడియా చిందులు తొక్కింది. లంచాల ఆరోపణలే నిజమైతే అది ఏ రూపంలో జరిగిందో కూడా ఎల్లోమీడియా కథనాలు చెప్పాలి. అది మాత్రం వాటిల్లో ఉండదు. దీంతో ఈ కథనాల్లో వాస్తవికతపై సందేహాలు వస్తున్నాయి.ఈ తాజా పరిణామాల నేపథ్యంలో భారత దర్యాప్తు సంస్థలపై మాదిరిగానే అమెరికాలోనూ విమర్శలు వస్తూంటాయేమో అన్న ఆలోచన వస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అమెరికాలోని చాలా కోర్టుల్లో ఆయనపై నమోదైన కేసుల్లో శిక్షల తీర్పులను నిరవధికంగా వాయిదా వేసుకోవడం ఇందుకు పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరూ అదానీపై లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీలను పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. అన్ని ఆరోపణలూ జగన్పైనే మోపుతూండటంలోనే వారి డొల్లతనం స్పష్టమవుతోంది.ఈనాడు వంటి ఎల్లో మీడియా అశ్శరభ శరభ అంటూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇదే సంస్థ తన మార్గదర్శి కంపెనీలోకి రూ.800 కోట్ల నల్ల ధనం వచ్చి చేరిందని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చెప్పినప్పుడు మాత్రం మాటమాత్రపు సమాధానమైనా ఇవ్వకుండా జారుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఈనాడు సోదర సంస్థ మార్గదర్శి చట్టాలతో సంబంధం లేకుండా రూ.2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం తప్పా? కాదా? అని హైకోర్టు స్వయంగా ప్రశ్నించినా నిమ్మకు నీరెత్తినట్లు నీళ్లు నమిలిందే కానీ మాట పెగిల్చే ధైర్యం చేయలేదు. ఇతరుల విషయానికి వచ్చేసరికి మాత్రం పత్తిత్తు కబుర్లన్నీ చెబుతోంది. విలువలతో నిమిత్తం లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్కిల్ స్కామ్ ఆరోపణలు చేస్తూ, సూట్కేస్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాలోకే చేరిందని సీఐడీ ఆధార సహితంగా చెప్పినా.. అది అక్రమ కేసంటారు చంద్రబాబు. ఎల్లో మీడియా ఇదే ప్రచారం చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినా.. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని వీరు శివాలూగి పోతూంటారు. అంటే.. ఆంధ్రప్రదేశ్లోని దర్యాప్తు సంస్థలనైతే మేము నమ్మమూ.. అమెరికా పోలీసులు చెబితే అదే వేదం మాకు అన్నట్టుగా ఉంది ఈ పచ్చమూక వ్యవహారం.అదానీ కంపెనీపై మోపిన కేసు విషయానికి వస్తే.. అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను రాష్ట్రాలు సెకి ద్వారా తీసుకోని నేపథ్యంలో అదానీ గ్రూపు నేరుగా సంప్రదింపులు జరిపిందన్నది ఆరోపణ. ఇందులో తప్పేమిటి? ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు లాభం కలిగిందా లేదా? అన్నది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్తోపాటు చత్తీస్గఢ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్లు కూడా సెకితో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి అదానీతో కాదు. ఈ రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒప్పందాలు కుదిరే సమయానికి కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఆంధ్రప్రదేశ్కు సెకీ ఒప్పందం కారణంగా రూ.2.49లకే ఒక యూనిట్ సౌర విద్యుత్తు లభిస్తుంది. ఇంతే మొత్తం విద్యుత్తుకు అప్పటివరకూ ఐదు రూపాయల కంటే ఎక్కువ చెల్లిస్తూండేవారు. రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా అందించే విద్యుత్తు కోసం తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నమాట. ఒకవేళ ఈ ఒప్పందాల్లో ఏదైనా మతలబు ఉంటే అందుకు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది!ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటివారు ప్రధాని మోడీపై విమర్శలు చేయగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుడిని చేస్తూ, అవినీతి అవినీతి అంటూ పేజీలకు పేజీలు వార్తలిచ్చేశాయి. వీరి కథనాలే నిజమైతే.. ఇతర రాష్ట్రాల విషయంలోనూ కథనాలు ఇవ్వాలి కదా? కానీ వాటి గురించి పిసరంతైనా రాయలేదు.దీన్నిబట్టే తెలిసిపోతుంది వారి కథనాలు అవాస్తవమూ అని. ఇక పార్టీ మారగానే స్వరమూ మార్చసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి.... ఒకప్పుడు ఈనాడు మీడియా బాలినేని దారుణాతి దారుణంగా కథనాలు ప్రచురించింది. కానీ.. ఇప్పుడు వారికి బాలినేనిలో గొప్ప నిజాయితీ పరుడు కనిపిస్తున్నాడు. బాలినేని అసత్యాలు చెబుతున్న సంగతిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎండగట్టారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉన్న అదాని నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని వారైనా ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వ్యవహారలేవీ జరగవన్న విషయం పచ్చమీడియాకు తెలియదా?అమెరికాలో సెక్యూరిటీల ద్వారా నిధులు సమీకరించడానికి అదానీ గ్రూప్ ఈ అవినీతికి పాల్పడిందన్నది ఆరోపణ. అమెరికా అధికారులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా కేవలం రాజకీయ లక్ష్యంతోనే ఈ అభియోగాలు కూడా మోపి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతో ఏ ఒప్పందమూ చేసుకోనప్పుడు ముడుపుల అంశం ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్పై ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవమున్నా ఆయన ప్రధాన ప్రత్యర్ది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనపై విరుచుకుపడి ఉండేవారు. ఏదో మాట మాత్రంగా ఎల్లోమీడియా ప్రచారం కోసం జగన్పై నింద మోపారు. ప్రభుత్వ పరంగా అదానీ, జగన్లపై విచారణ చేస్తామని చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదో ఎల్లో మీడియా తెలపాలి!.అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్నిటి పనులు ఆరంభించింది. జమ్మలమడుగు వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కూడా వీటిల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ సిబ్బందిపై లంచాలకోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మనుషులు అప్పట్లో దాడి కూడా చేశారన్న వార్తలు వచ్చాయి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకూ అదానీ సంస్థ ముందుకు వచ్చింది. 2014-19 టర్మ్లో రూ.70 వేల కోట్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే.. జగన్ ప్రభుత్వం దాన్ని రూ.14 వేల కోట్లకు తగ్గించిందని ఇదే ఈనాడు మీడియా విమర్శించింది. అంటే ఒక్క కంపెనీ ఏర్పాటుకు చంద్రబాబు రూ.70 వేల కోట్లకు ఓకే చేస్తే అది విజన్. గొప్ప విషయం. అదే జగన్ టైమ్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడితో పది చోట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరిస్తే అదంతా అదానీకి రాసిచ్చినట్లు!!!అదానీ తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కలిస్తే అది ముడుపుల చర్చకు.. చంద్రబాబు కలిస్తే మాత్రం రాష్ట్రం కోసమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతులు ప్రచారం చేస్తూంటాయి. అంతెందుకు... అదానీ గ్రూప్ ఎండీ రాజేశ్ అదానీ తదితరులు ఈ మధ్యే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్ రోడ్డు,ఐటీ, టూరిజమ్, కృత్రిమ మేధ రంగాలతోపాటు అమరావతి నిర్మాణానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోందని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నిటికి కలిపి ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది..? తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరస్కరించే ధైర్యం చేస్తుందా? అక్కడిదాకా కూడా అవసరం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన సౌర విద్యుత్తు కొనుగోళ్ల అంశం తాలూకూ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఎల్లో మీడియా బాబును ఎందుకు కోరలేకపోయింది?సౌర విద్యుత్తు యూనిట్ రూ.1.99కే దొరుకుతుంటే, జగన్ ప్రభుత్వం సెకీతో రూ.2.49లకు ఒప్పందం చేసుకుందని ఈనాడు మీడియా ఆరోపణ. అందులో ఏ మాత్రం నిజం ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి లేదా, ధర తగ్గించడానికి సెకీకి నోటీసు ఇవ్వవచ్చు కదా?గతంలో చంద్రబాబు యూనిట్ విద్యుత్తుకు ఏకంగా రూ.5 ఇచ్చి కొనుగోలు చేస్తే, జగన్ సెకీ ఒప్పందం ద్వారా యూనిట్ ధర 2.49 రూపాయలకు తగ్గిందంటే అది తప్పని ఎల్లో మీడియా ప్రచారం చేసింది.పోనీ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలో సత్యం ఉందని భావిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం వీరిపై, అలాగే మోడీ ప్రభుత్వంపై విచారణకు ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు కదా! ఆయన ఎక్కడా అదానీని కానీ, మోడీని కానీ ఒక్క మాట అనకుండా జగన్ వల్ల రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? మరి స్కిల్ స్కామ్లో జర్మనీ కంపెనీ సీమెన్స్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన స్కామ్ వల్ల అప్రతిష్ట రాలేదా? చంద్రబాబుకు ముఖ్య స్నేహితుడు ఈశ్వరన్ తో అమరావతిని ప్రమోట్ చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తీరా చూస్తే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనివల్ల ఏపీ పరువుకు నష్టం జరగలేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలకు ఎవరు జవాబివ్వాలి? కేవలం జగన్ పై ద్వేషంతో మాట్లాడితే సరిపోతుందా? జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ఎల్లో మీడియా ద్వారా టీడీపీ రాజకీయం చేస్తున్నదన్నది అర్ధం కావడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీకు చౌకగా విద్యుత్ ఇస్తాం
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ పాతికేళ్ల పాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానుగా తొలుత ప్రతిపాదించింది. అందుకు 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆర్థికంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి.ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీతో ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. -
వాస్తవాలు దాచి.. అడ్డగోలు రాతలా?
మరి ధరలెందుకు తగ్గలేదు..?ఎల్ఈడీ టీవీ ధర 2016లో రూ.రెండు లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన సదుపాయాలతో అవే కంపెనీ టీవీలు ఇప్పుడు రూ.55 వేలకే దొరుకుతున్నాయంటూ ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు కరెంట్ ధరలు మాత్రం ఎందుకు తగ్గవనే సందేహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఈనాడు చేస్తున్న వాదనే గనుక నిజమైతే 2020లో రూ.1.99 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కాకుండా)గా ఉన్న యూనిట్ విద్యుత్తు ధర 2024 నాటికి రూ.1.50 లేదా అంతకంటే తక్కువకు పడిపోవాలి. కానీ అలా జరగలేదు. రూ.2.70 కంటే ఎక్కువకు పెరిగింది. అయిన్పటికీ గత ప్రభుత్వం యూనిట్ రూ.2.49 (అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు కలిపి)కే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదీగాక భారత ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది.సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందించేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తాపత్రయపడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్తు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనంతట తానే ముందుకొచ్చి స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసింది. చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు సైతం సెకీ కల్పించింది. అత్యంత చౌక ధరకు విద్యుత్తు అందించే గొప్ప కార్యక్రమం అది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా, డిస్కమ్ల చరిత్రలో తొలిసారిగా చౌక ధరకు విద్యుత్తు పొందేలా ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం అది. అలాంటి కార్యక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి ‘ఈనాడు’ బురద చల్లేందుకు తెగబడింది. చౌకగా విద్యుత్తు ఇస్తామని సెకీ స్వయంగా లేఖ రాసినప్పుడు గత ప్రభుత్వం స్పందించకుంటే ఇదే ఎల్లో మీడియా నిందించేది కాదా? అయినా ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి మధ్య జరిగిన ఒప్పందం. మధ్యలో లంచాలెక్కడ? కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలిస్తాయా? అసలు మూడో వ్యక్తికి తావెక్కడ? ఇందులో అదానీతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అమెరికాకు చెందిన సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే వైఎస్ జగన్పై విషం చిమ్మడం ఏమిటి? అంతా అసంబద్ధ వాదనలు.. పసలేని ఆరోపణలు!! సెకీతో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం వల్ల ఏటా రూ.3,750 కోట్ల విద్యుత్తు భారం తగ్గుతుంది. 25 ఏళ్లలో రాష్ట్రంపై రూ.లక్ష కోట్ల మేర భారాన్ని తప్పించే గొప్ప నిర్ణయం అది. రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చర్యగా భావించవచ్చు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్తు అందించే ఒప్పందం కుదిరిందంటూ ఈనాడు ఓ పసలేని వాదన తెరపైకి తెచ్చింది. సరఫరా చార్జీల కింద వాటిపై మరో రూ.రెండు అదనంగా భారం పడుతుందనే విషయాన్ని దాచిపెట్టింది. మన రాష్ట్రానికి ఆ విద్యుత్తు చేరవేసేందుకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలతో కలిపితే అది రూ.3.98 నుంచి రూ.4 వరకు అవుతుంది. అంటే ఒక మెగావాట్కే నెలకు రూ.4 లక్షలు చొప్పున సరఫరా చార్జీల భారం అదనంగా పడుతుంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ మభ్యపెట్టేందుకు యత్నించడం ఈనాడు మార్కు జర్నలిజానికి నిదర్శనం. ఐఎస్టీఎస్ చార్జీల భారం పడుతోందంటూ ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్రోత్సాహకంగా దాని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు సెకీ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ నిలువెల్లా విషం చిమ్ముతోంది. ఇక అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చంద్రబాబును వెనకేసుకొస్తూ ఈనాడు ఆదివారం ఓ కట్టుకథ అల్లింది. తక్కువ ధరకు సౌర విద్యుత్ను కొనడం తప్పన్నట్లు అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టే.. గుజరాత్లో నెలకొల్పే ప్లాంట్ల నుంచి మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2020 డిసెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్ఎల్) 2020 సెపె్టంబర్ 28న ఫేజ్ 11లో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు జారీ చేసింది. ఈ టెండర్లో యూనిట్ రూ.1.99కి ఇచ్చేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. విషయం ఏమిటంటే గుజరాత్, రాజస్థాన్లోని ప్రదేశాలు ఎడారి భూభాగం కారణంగా అధిక సూర్యరశ్మి తీవ్రత(వికిరణం) ఉన్న ప్రాంతాలు. మన రాష్ట్రంలో పీఎల్ఎఫ్ 17 శాతం నుంచి 18 శాతం ఉంటే అక్కడ 23.5 శాతం ఉంటుంది. అంటే అక్కడ ఒక యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మన రాష్ట్రంలో కంటే దాదాపు 60 నుంచి 70 పైసలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం అంత తక్కువగా ఉన్నప్పుడు అక్కడ తక్కువ ధరకు సౌర విద్యుత్ లభించడంలో విశేషమేముంది. అదే విధంగా 1,070 మెగావాట్ల విద్యుత్కు సెకీ టెండర్లు పిలవగా టారిఫ్ యూనిట్కి రూ.2కి ఒప్పందం కుదిరింది. అయితే ఆ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యేది కూడా రాజస్థాన్లోనే కాబట్టే ఆ రేటు! 2020లో ఆంధ్రప్రదేశ్లో 6,400 మెగావాట్ల పీవీ సోలార్ ప్రాజెక్టుల స్థాపనకు టెండర్ జారీ చేసినప్పుడు యూనిట్ రూ.2.49, రూ.2.58 చొప్పున ఇచ్చేందుకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ రెన్యూవబుల్, హెచ్ఇఎస్ ఇన్ఫ్రా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పాల్గొన్నాయి. ప్రసార చార్జీలు లేనందున తక్కువే కదా..మరో అంశాన్ని కూడా ఈనాడు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చింది. ఒకవేళ యూనిట్ రూ.1.99 లేదా రూ.2.01, రూ.2.36కి ఇస్తామని చెప్పినా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) లేని కారణంగా ఆ ప్రాజెక్ట్లకు ఛార్జీల మినహాయింపు వర్తించదు. ఈ విద్యుత్ను గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే అత్యధిక ప్రసార చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఆ విద్యుత్ ఖరీదు యూనిట్కు రూ.3.98 (యూనిట్ రూ.1.99కి కొంటే మరో రూ.1.99) చెల్లించాలి. అదే యూనిట్ రూ.2.01కి కొంటే దానికి ఐఎస్టీఎస్ చార్జీ రూ.1.99 కలిపి యూనిట్కు మొత్తం రూ.4.00 కట్టాలి. ఇక యూనిట్ రూ.2.36కు తీసుకుంటే దానికి రూ.1.99 జోడిస్తే యూనిట్ ధర రూ.4.35 పడుతుంది. అంటే నెలకు ఒక మెగావాట్కు రూ.4 లక్షలు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలకే చెల్లించాల్సి వస్తుంది. అదే సెకీ నుంచి తీసుకుంటే ఈ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ఈ లెక్కన సెకీ అందిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 తక్కువే కదా. కోవిడ్ తర్వాత పెరిగిన సోలార్ ప్యానల్స్ ధరలు.. జీయూవీఎన్ఎల్ ఫేజ్ 9 టెండర్ గుజరాత్ ప్రభుత్వం చేపట్టే నాటికి కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులోనూ ధరలు అదే స్థాయిలో కొనసాగుతాయని ఆ ప్రభుత్వం భావించింది. కానీ కోవిడ్∙తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్యానెల్ ధరలు పెరిగాయి. దీంతో తర్వాత టెండర్లలో సోలార్ టారిఫ్లు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు జీయూవీఎన్ఎల్ 2024 మార్చి 15న గుజరాత్లోని ఖవ్డా ప్రాంతంలో అధిక సూర్యరశ్మి తీవ్రత, అధిక పీఎల్ఎఫ్ ఉన్న ప్రాంతాల్లో టెండర్ను జారీ చేసింది. ఈ టెండర్లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్కు వచ్చిన టారిఫ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...టీడీపీ హయాంలో అత్యధిక ధరలతో పీపీఏలు.. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలు గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందానికి భిన్నంగా ఉన్నాయి. అధిక ధరలకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు టీడీపీ హయాంలో పీపీఏలు కుదుర్చుకున్నారు. 2019–20 నాటి ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం సౌర విద్యుత్ సగటు ధర రూ.5.90కి పెరిగింది. అంత ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను డిస్కంలు హడావుడిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కారణమయ్యారని ఈనాడు పత్రిక ఏనాడైనా ప్రశ్నించిందా? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆందోళన చెంది ఉంటే చంద్రబాబును దీనిపై ఎందుకు నిగ్గదీయలేదు?ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అని చెప్పిన కేంద్రం 2021 నవంబర్ 30 నాటి విద్యుత్ మంత్రిత్వ శాఖ 23వ ఆదేశాల్లోని క్లాజ్ 3.3 ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ కెపాసిటీ స్కీమ్లో భాగంగా సెకీ టెండర్ ద్వారా ఏర్పాటయ్యే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఐఎస్టీఎస్ చార్జీలు మాఫీ అవుతాయి. అంతేకాదు రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆరీ్పఓ)తో సంబంధం లేకుండా అది ఉన్న సంస్థలకు కూడా ఈ ప్రయోజనం అందుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహంతో సెకీ టెండర్ ద్వారా స్థాపించే ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా అందుతుంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల మన రాష్ట్రంపై ఈ భారం యూనిట్కు రూ.1.99 నుంచి రూ.2 వరకూ పడుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు గత ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈ విషయాలను కథనంలో ప్రస్తావించకుండా వదిలేసింది. -
Editor Comment: ఎల్లో మీడియాకు మాత్రమే తెలిసిన స్ట్రాటజీ
-
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్సెన్స్లో అనేక సందేహాలు తలెత్తుతాయి.సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్ పొదుపు తప్పు ఎట్లయింది?సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?‘సెకీ’తో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!జగన్ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్గఢ్, జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్గఢ్ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్కేను బయ టకు పంపించాలనీ డిమాండ్ చేయగలరా?అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్దాన్లోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్బీఐ నేరారోపణ చేసింది. ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. భారత్లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబ్బల్ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్కో ముక్కలను, ట్రాన్స్కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.కేజీ బేసిన్లో గ్యాస్ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.ఒక్క విద్యుత్రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిజాలను పాతరేసి నిస్సిగ్గుగా వైఎస్ జగన్ పై నిందలు
-
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
-
చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియాపై పోసాని హాట్ కామెంట్స్ !
-
రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!
వారి మాటల్లో మారీచ తంత్రం ఉంటుంది... ఓట్ల కోసం బంగారు జింకలమని చెప్పుకున్నారు కదా! చేతలు మరీచికా సదృశాలు... అమలుకాని హామీలు ఎండమావుల్ని తలపించడం లేదా? ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న కూటమి సర్కార్ అనాటమీ ఓ కుతంత్రాన్ని తలపిస్తున్నది. గుండెల్లో గోబెల్స్ను పూజిస్తూ జెండాపై ఊసరవెల్లిని ఎగరేసినట్టుగా వారి చర్యల తాత్పర్యం తేటతెల్లం చేస్తున్నది. ఎన్నికల ముందు చేసిన బాసలకూ, ఇప్పుడు మాట్లాడుతున్న భాషకూ పొంతన కుదరడం లేదు. దగా, మోసం, వంచన... మూడు పార్టీల కూటమికి ముచ్చటైన స్ఫూర్తి వాచకాలేమో!గద్దెనెక్కడం వరకే ఈ దగా పర్వం పూర్తి కాలేదు. ప్రజల ప్రశ్నించే హక్కును హైజాక్ చేయడానికి డైవర్షన్ కమెండోలను రంగంలోకి దించుతున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు. రణనీతిని రాక్షసరీతి కమ్మేసింది. అసత్యాలను కూడిక చేసి, హెచ్చ వేసి, ఆపైన అచ్చేసి మెదళ్లను కలుషితం చేస్తున్నారు. వారి పరిపాలనా వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎవరూ మాట్లాడకూడదు. తాము ఎత్తిపోసిన బురదను కడుక్కునే పనికి మాత్రమే ప్రతిపక్షం పరిమితమై ఉండాలి. ఇదీ ఎత్తుగడ!కూటమి సర్కార్ వంచనా శిల్పం ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబడుతున్నది. ప్రజల ప్రాథమిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నది. అసభ్య పోస్టింగ్లనే ముద్రవేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ ఝళిపిస్తున్నది. నోళ్లు నొక్కేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తున్నది. సమాచార విప్లవ ఫలితంగా ప్రభవించిన సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. భావప్రకటనా స్వేచ్ఛను సకల జనులకూ అందుబాటులోకి తెచ్చిన యుగమిది. తప్పుడు హామీలిచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా ఇప్పుడు జనం మిన్నకుండిపోవడం లేదు. ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నవి.ఏ నాయకుడు ఎప్పుడేమి మాట్లాడిందీ సాక్ష్యాధారాలతో జనం చేతిలో ఉంటున్నది కనుక ఇప్పుడు పబ్లిక్ ఆడిట్ను ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. అబద్ధాల పునాదులపై మొలకెత్తిన రాజకీయ నాయకులను ఈ పబ్లిక్ ఆడిట్ భయ పెడుతున్నది. ఈ భయపెడుతున్న మీడియానే భయపెట్టడానికీ, గొంతునొక్కడానికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. రాజకీయ పోస్టులు పెడుతున్న దాదాపు 700 మందికి గత కొద్దిరోజులుగా పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 176 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 55 మందిని చెప్పాపెట్టకుండా అరెస్ట్లు చేసి, స్టేషన్ మార్చి స్టేషన్కు తిప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైతే తప్ప చాలా అరెస్టులను చూపనే లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు.అరెస్టయిన, కేసులను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల పోస్టుల్లో అత్యధికం రాజకీయపరమైనవే. నిజమే, అసభ్య పోస్టులు అనే జాడ్యం సోషల్మీడియాలో ప్రమాదకరంగా మారింది. ఈ జాడ్యానికి మందు వేయాల్సిందే! కానీ ఈ పేరుతో సర్కార్ తనకు గిట్టని పోస్టులు పెడుతున్నవారిని వేటాడుతున్నది. తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తూ బూతు పోస్టులు పెట్టే వారిపై ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే వేటాడటం దేన్ని సూచిస్తున్నది? రాజకీయ కక్షనే కదా! ఈ కక్ష ఎంత దూరం వెళ్లిందంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్పై పెట్టే సెక్షన్లను ఈ యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. టెర్రరిస్టులు, స్మగ్లింగ్, డ్రగ్స్ ముఠాలు వగైరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. పైగా రెండు మూడేళ్ల కిందటి పోస్టులకు కూడా ఈ యేడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ సెక్షన్లను ఆపాదిస్తున్నారు. అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాల తీర్పులున్నప్పటికీ మనవాళ్లు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన శిక్షాస్మృతి ప్రకారం సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగిరీలోకి వస్తాయి. సోషల్మీడియాను కూడా సైబర్ నేరాల పరిధిలోకి తీసుకొనిరావడమనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ. రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించే గ్రూపుల్లో అత్యంత ఆర్గనైజ్డ్ గ్రూప్ ‘ఐటీడీపీ’ అనే సంగతి జగమెరిగిన సత్యం. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నదనే సంగతి కూడా తెలిసిందే. అసభ్య పోస్టులు, బెదిరింపు పోస్టులు పెట్టడంలో కూడా ‘ఐటీడీపీ’దే అగ్రస్థానమని విశ్లేషకులు ఎవరైనా చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వెల్లడించారు. తనకు తెలిసినంత వరకూ ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులకూ, బెది రింపులకూ తెగబడలేదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు తన లాంటి తటస్థ రాజకీయ విశ్లేషకులను కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆయన వాపోయారు. తెలుగు దేశం అభిమానులు అర్ధరాత్రి, అపరాత్రి కూడా ఫోన్లు చేసి తిడుతున్నారని ఆరోపించారు. తమకు గిట్టనివారు సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించకపోతే... ఈ–మెయిళ్ల ద్వారా బూతు పంచాంగాలు పంపించడం ఆ పార్టీ అభిమానులకు రివాజుగా మారింది. ఈ పత్రిక సంపాదకుడు కూడా ఇటువంటి బూతు మెయిళ్ల బాధితుడే!‘ఐటీడీపీ’ వంటి నెంబర్ వన్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గ్రూప్ సభ్యులపై కేసు కూడా పెట్టలేదంటేనే ప్రభుత్వ ఉద్దేశమేమిటో స్పష్టమవుతున్నది. తమ రాజకీయ ప్రత్యర్థుల పైనా, వారి కుటుంబ సభ్యుల పైనా ఏ తరహా పోస్టులను ఈ గ్రూప్ సభ్యులు పెట్టారో తెలియదా? ఎంతగా వేధించారో తెలియదా? ఈ ఉద్యమకారుల సృజనాత్మకత కూడా చాలా పదునైనది. పేర్లను మార్చుకొని పరకాయ ప్రవేశం చేసి పెట్టిన కామెంట్లతో కల్లోలం సృష్టించడం వారికో హాబీ. వర్రా రవీందర్ రెడ్డి అనే వైసీపీ అభిమాని పేరుతో జగన్ మోహన్రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఓ తెలుగుదేశం అభిమాని పెట్టిన పోస్టులు కూడా అటువంటి కల్లోలాన్నే సృష్టించాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు కాదనీ, మరొకరు పెట్టిన ఫేక్ పోస్ట్ అనీ తేల్చారు. ఆ రంగులు మార్చిన మారీచు డిని కూడా గుర్తించారు.జరిగింది ఇదైతే... తెలుగుదేశం పార్టీ విభాగాలన్నీ కలిసి చేసిన నీచప్రచారం మరొకటి! నిన్న అసెంబ్లీలో కూడా ఈ దుష్ప్రచారపు బాణీనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చు కున్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం మరొకటి కనిపించదు. ‘ఐటీడీపీ’ చేయించిన తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే తందానా అన్నారు. తల్లి మీద, చెల్లి మీద జగన్ నీచమైన ప్రచారం చేయించారని దారుణమైన నిందను మోపారు. ఇది హీనమైన ప్రచార మనీ, మీ పార్టీ వాళ్లే సృష్టించిన పన్నాగమనీ నిజంగానే మీకు తెలియదా బాబు గారూ! మీ సతీమణి భువనేశ్వరమ్మను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడ్చారే! మరి అసెంబ్లీలో ఒక దుష్ప్రచారాన్ని ఉటంకిస్తూ జగన్ తల్లి, చెల్లెలి ప్రస్తావన స్వయంగా మీరే తేవడం సమంజసమేనా?ఎన్నికల్లో గెలవడం కోసమే అలవిగాని హామీలిచ్చామనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. హామీల అమలుకు డబ్బుల్లేవు గానీ ఆలోచనలున్నాయని, ఆలోచనల్లోంచే సంపద సృష్టి జరుగుతుందనీ, అప్పుడు గానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోవనేది ఆయన ప్రసంగంలోని సారాంశం. ఆయన మేధలో ఏయే విత్తనాలను నాటుకున్నారో మనకు తెలియదు. అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేము. ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఆ ఫలాలను పేద వర్గాలకు అందజేయడం జరుగుతుందనే భరోసాతో ఎదురుచూడక తప్పదు. అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని జనం తిరగబడ వచ్చు. అందుకు విరుగుడు మంత్రమే... ఈ గోబెల్స్ నాజీల తరహా విషప్రచారం! ఫాసిస్టు పాలనను తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు!జగన్ ఐదేళ్లపాటు విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని ఐదేళ్లపాటు తెలుగుదేశం నేతలు, యెల్లో మీడియా, ‘ఐటీడీపీ’ బృందాలు నిర్వహించాయి. నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తున్నది. పల్లెపల్లెకూ, గడప గడపకూ ప్రజావైద్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది. ఐదేళ్లలో రెండు లక్షల డెబ్భయ్ మూడువేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలనైందని అనుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటి తలుపు తట్టి, పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడం అరాచక పాలనగానే కనిపించింది. గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసి, పదిహేను వేల మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలేగానీ, పదిహేను వేల పల్లె రాజధానులెందుకని వారికి చిరాకు కలిగి ఉంటుంది.ఏకబిగిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించడం విధ్వంసం కాక మరేమిటి? నాలుగు భారీ ఓడరేవులకు పనులు ప్రారంభించడమేమిటి? పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఎందుకోసం? రైతుల కోసం ఊరూరా ‘ఆర్బీకే’ కేంద్రాలు అవసరమా? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా పునర్విభజించి పాలనా సంస్కరణలకు తెగబడటమేమిటి? అంతకు ముందు పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుగారు ఒక్క జిల్లానైనా కొత్తగా చేర్చారా? అది కదా పొదుపంటే! ...ఇటువంటి అనేకా నేక కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారనే ప్రచారాన్ని కూటమి ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ముఖ్యమంత్రి నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కూడా దానిని కొనసాగించారు. అప్పుల గురించి, అభివృద్ధి గురించి తెలుగు దేశం... యెల్లో మీడియా కూటమి చేసిన అరోపణలకు ఇప్పటికి కొన్ని డజన్ల పర్యాయాలు అధికారిక గణాంకాల ఉటంకింపులతో వైసీపీ వాళ్లు ధీటైన సమాధానాలు చెప్పారు. మొన్నటి బడ్జెట్ తర్వాత రెండు గంటల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి జగన్ మోహన్రెడ్డి కూటమి వాదనను పూర్వపక్షం చేశారు. అయినా సరే చంద్రబాబు నిన్న అదే పాటను మళ్లీ పాడారు. పాడిన పాటే పాడటంపై తెలుగులో మనకు చాలా సామెతలున్నాయి!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
బాబు బ్యాండ్ మేళం ప్రచారం మళ్లీ మొదలు: విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు పాలనపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే, గతంలలో మాదిరిగానే అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు, అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మధ్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతిని సింగపూర్లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, భాజాబజంత్రీలతో హడావిడి చేశారు. చివరికి 2019 ఎన్నికల చివరి నాటికి పెట్టుబడులు, అభివృద్ధి శూన్యం. మరి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది..ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. అవే యెల్లో పత్రికలు.. అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు...అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు...ఇవేవీ వాస్తవరూపం దాల్చవు. యెల్లో మీడియా గ్రాఫిక్స్లో మాత్రమే ఉంటాయి. అందుకే అనేది చంద్రబాబువి ఉత్తిత్తి బ్యాండ్ ప్రచారాలు అని అంటూ సెటైర్లు వేశారు.చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మద్య కాలంలో ఎల్లో పత్రికల నిండా వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతి ని సింగపూర్ లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, బాజాభజంత్రీలతో హడావిడి చేసారు. చివరికి 2019 ఎన్నికల…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
ఏపీలో పేట్రేగిపోతున్న పచ్చ తాళిబన్లు
-
బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?: పోసాని
సాక్షి, హైదరాబాద్: ప్రజల తరఫున టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ప్రశ్నించడం మానేశాయని వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్లు చేయిస్తున్నాడు’’ అంటూ పోసాని నిలదీశారు.‘‘నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ 5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని.. పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు టీవీ5 నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?’’ అని పోసాని ప్రశ్నించారు.‘‘పని చేయని ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లతో ప్రమాదం లేదు. ఓట్లు వేయించుకుని హామీలు నెరవేర్చని వాళ్లతోనే ప్రమాదం. అమ్మాయిలకు ముద్దు పెట్టాలి లేదా కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణపై ఎందుకు కేసులు పెట్టలేదు?. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు టీవీ5కి ఇది కనిపించలేదా?. నిజాయితీ గల జర్నలిజం అయితే ఎస్సీల తరపున ప్రశ్నిచావా?. పవన్ కల్యాణ్ తల్లిని లోకేష్ ఘోరంగా తిట్టించాడు. ఈ మాట పవన్ కల్యాణే స్వయంగా చెప్పాడు. మరి లోకేష్, ఆయన అనుచరుల మీద ఎవరైనా కేసులు పెట్టారా?. వైఎస్ జగన్ను టీడీపీ నేత తిట్టినప్పుడు టీవీ5 ఏమైంది?’’ ’ అని పోసాని మండిపడ్డారు. -
అప్పులపై ఇన్నిరోజులూ పచ్చి అబద్ధాలే..!
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్కు రూ.91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల పన్నులు ఆధారంగా ఉండటం విశేషం. ఓసారి రూ.14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమవారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యేనాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్ పత్రాల్లో మంత్రి పేర్కొన్నారు. ఇందులో బడ్జెట్ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్ అప్పులు రూ.5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు.వైఎస్ జగన్ పాలనలోనే అప్పులు తక్కువఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది. -
బాబు బిల్డప్కు ఎల్లో మీడియా డప్పులు
సాక్షి, అమరావతి : ‘సీ ప్లేన్ నడిపితే రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. దేశంలో తొలిసారిగా సీ ప్లేన్ నడిపినట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తుండటం.. అందుకు ఎల్లో మీడియా డప్పు కొడుతుండటం చూస్తుంటే పిట్టల దొర డైలాగ్లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టిŠంచిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ ప్లేన్తో అభివృద్ధి జరిగిపోయినట్లు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు చర్యలను చివరకు ప్రజలు తప్పక నిలదీస్తారని, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు గురించి చెప్పాలంటే.. మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసం చేస్తాడు. ఇందుకోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ ప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెబుతున్న చంద్రబాబు, ఇప్పుడు సీ ప్లేన్ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేదన్నట్టుగా, సీ ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.2 సీ ప్లేన్ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారు. గుజరాత్లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా పలుమార్లు నిలిచిపోయాయి. ప్రతి రాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు?3 ఆపరేషన్స్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యలు, ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలని అనేక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి 14 మంది ప్రయాణికుల సీ ప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లో మీడియా కీర్తించడం.. పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా?4 సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి, తద్వారా అభివృద్ధి చేసి.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టి, ప్రజలకు అందుబాటులో ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం. ఇలాంటివి కాకుండా సీ ప్లేన్ మీద పబ్లిసిటీ స్టంట్లు ఏమిటి?5 చంద్రబాబూ.. రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టడం సంపద సృíష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా?6 సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91 కోట్లతో మూలపేట, రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నం వద్ద.. మొత్తంగా మూడు పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? లేక సీ ప్లేన్లో తిరిగి ఈ పోర్టుల ఆస్తులను మీ వారికి స్కామ్ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? ప్రభుత్వ రంగ పోర్టుల వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా? లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మడంతో పాటు, సీ ప్లేన్స్ వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా?7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734 కోట్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రజల ఆస్తి కాదా? ప్రజల కోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్ల ముందు లేవా? ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో రూ.లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?8 చంద్రబాబూ.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా.. మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజల కోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో మంచి స్కూల్స్ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు. -
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట
‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్బుక్ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం! సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్లు మా ఆయన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన పోస్ట్ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ మడ్డు జస్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జస్వంత్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్ఎస్ సెక్షన్తో ఎఫ్ఐఆర్ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్.. వేధింపులు ఫుల్! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పరచకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది. -
ఎల్లోమీడియా తప్పుడు వార్తలపై మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
-
టీడీపీ కన్నా హీనంగా.. డైవర్షన్ పాలిటిక్స్ కోసం నానా తంటాలు
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ. 6 వేలకోట్లకుపైగా భారం!’’, ‘‘అభివృద్ధికి రోడ్ మ్యాప్’’.. ఈ రెండింట్లో ఏది ప్రజలకు సంబంధించిన వార్త? ఏది భజంత్రీ వాయించే వార్త? ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ,ప్రజలు అసలు సమస్యపై దృష్టిపెట్టకుండా ఉండడంకోసం పచ్చి మోసపూరితంగా కథనాలు ఇస్తున్నాయి. .. నిజంగానే ఏపీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఉంటే రాయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ఏపీలోని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన ఒక వర్గం మీడియా ఓ రాజకీయపార్టీకన్నా హీనంగా మారి పచ్చి అబద్ధాలను రాస్తోంది.ఏపీలో వచ్చే ఐదేళ్లపాటు కరెంట్ చార్జీలు పెంచబోమని, పైగా అవసరమైతే 30శాతం చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ.6వేలకోట్లకుపైగా చార్జీలను సర్దుబాటు పేరుతోనో, మరో పేరుతోనో పెంచుతున్నారంటే అది వాగ్ధానభంగం అవుతుందా? కాదా? దీనిపై ప్రజల్లో నిరసన వస్తుంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఓ రాజకీయ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుట్రలకు పన్నవచ్చు. అందులోను అది ఆయన సహజ లక్షణంకూడా. ఉదాహరణకు కరెంటు చార్జీల పెరుగుదలను డైవర్ట్ చేయడం కోసం సరిగ్గా ఇదే టైమ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద ఒక బండ ఇచ్చి పండగ చేసుకోమని చెబుతున్నారు.ఇందులో చాలా మతలబులు ఉన్నాయి.అరకోటిమందికి ఎగనామం పెట్టడం, ముందుగానే ప్రజలు డబ్బు కట్టాలని చెప్పడం తదితర అంశాలుఉన్నాయి.విషయం ఏమిటంటే గ్యాస్ బండ ద్వారా నెలకు వచ్చే రాయితీ సుమారు రెండువందల రూపాయలు. అయితే..కరెంటు చార్జీల బాదుడు వల్ల ప్రజలపై పడే భారం సుమారు 400 రూపాయలుగా ఉంటుంది. ఇక నిత్యావసర సరుకుల ధరలు,వంట నూనెల ధరల పెరుగుదలపై జనం గగ్గోలు పెడుతున్నారు. ఇవన్ని లెక్క వేస్తే జనంపై కనీసం ఏడు, ఎనిమిది వందల రూపాయల అదనపు భారం పడుతోంది.ఇతర హామీల సంగతి సరేసరి. టీడీపీ కన్నా దారుణంగా ఎల్లో మీడియా పన్నాగాలు పన్నుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఆర్సీ సిఫార్సులమేరకు కొద్దిపాటి సర్దుబాటు చార్జీలు పెంచినా ఇంకేముంది అంటూ గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇప్పుడు వేలకోట్ల భారం వేస్తున్నా కనిపించడం లేదు. చార్జీలు పెంచడం కూడా అభివృద్ధికి రోడ్ మ్యాప్ అని ప్రజలు అనుకోవాలని అన్నట్టుగా అభూతకల్పనలు సృష్టించి కథనాలు వండుతున్నారు.అలాగే జగన్ సోదరి షర్మిలను అడ్డం పెట్టుకొని ఆమెతో పిచ్చిప్రకటనలు చేయించి, అదేదో ప్రజా సమస్య అన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ, షర్మిల అంశానికి ముగింపు పలికి ప్రజాసమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ,కూటమి నయవంచనలను బహిర్గతం చేయాలని నిర్ణయించింది. నెలకొక అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ చెబుతోంది. అందులో భాగంగానే జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కూడా టీడీపీ పూనుకుందని ఆ పార్టీ పేర్కొంది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కలిసిందన్న ఆరోపణ, ముంబాయి నటి జత్వానీ వ్యవహారం, ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర, మదనపల్లె ఫైల్స్..ఇలా రకరకరాల అంశాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు కాలం గడుపుతున్నారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తలుచుకోకుండా చూడాలనేది వారి ప్రయత్నం. షర్మిల ఇష్యూకు సంబంధించి అసలు స్పందించకుండా ఉంటే వైఎస్సార్సీపీకి ఇబ్బందిగా ఉండేది. అందువల్ల ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వక తప్పదు.ఇక దాన్ని ముగించి జనంలోకి కీలకమైన అంశాలను తీసుకుపోయే లక్ష్యంతో జగన్ కూడా కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని, 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారని అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజలు క్షమించరని రాజకీయ పార్టీగా తాము చూస్తూ వూరుకోబోమని జగన్ హెచ్చరించారు. పైగా ఈ ప్రభుత్వంలో పెంచుతున్న చార్జీలకు కూడా వైఎస్సార్సీపీ కారణమని ప్రచారం చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ కరెంటు చార్జీల పెంపు విషయంగానీ, జగన్ వ్యాఖ్యలుగానీ ఎల్లోమీడియాకు అసలు వార్తలే కాదు. అభివృద్ధికి రోడ్డు మ్యాప్ అంటూ మోసపూరిత కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఇది కూడా డైవర్షన్ లో భాగమని అర్థం చేసుకోవచ్చు.లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ అతి పెద్ద సవాళ్లు అని వీటిని అధిగమించడం ఆషామాషీ కాదని ఈ మీడియాకు ఇప్పుడు తెలిసింది.నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీని విస్మరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది అంటూ బ్యాండ్ వాయించింది. మరి ఇదే మీడియా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమల గురించిగానీ, పెట్టుబడులగురించిగానీ ఎన్నడూ ఒక్క మంచిమాట రాయలేదు. జగన్ తీసుకొచ్చిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల గురించి ఎప్పుడూ వ్యతిరేక వార్తలే రాసింది. జగన్ టైమ్లో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో వస్తుంటే దాన్ని ఎలా చెడగొట్లాలా అని తెగ ఆరాటపడింది.ఆ కంపెనీలకు భూములు ఇవ్వడమే తప్పన్నట్టుగా రాసింది.ఇప్పుడేమో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది అని, వరాల వర్షం కురిపిస్తోంది అని బాకా ఊదుతోంది. తాజాగా వచ్చిన కథనం ప్రకారం రామాయంపేట, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లను కూడా ప్రైవేట్ పరం చేయాలని తలపెట్టి వీటన్నిటికీ బిడ్లు పిలిచారు. గతంలో గంగవరం పోర్టులో కొద్దిపాటి ప్రభుత్వవాటాను విక్రయిస్తేనే నానాయాగీ చేసిన ఎల్లో మీడియా తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పుడు మొత్తం రూ. వేలకోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రైవేట్ కు అప్పగించడానికి సిద్దపడుతోంది. టీడీపీ,జనసేన మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నడుపుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి కంపెనీలనుంచి, జనంనుంచి విరాళాలు సేకరిస్తారట. మరి ఇది వాగ్ధానభంగమో లేక ఇంకేమనాలో ఆలోచించుకోవచ్చు. దీనికి ఆదాయపన్ను మినహాయిస్తారంటూ ఈనాడు బిల్డప్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లలో నాసిరకం ఆహారం పెడుతున్నారని సామాన్యులు వాపోతున్న విషయాన్ని మాత్రం చెప్పరు. వరద పడగొట్టింది, పరిహారం నిలబెట్టింది అంటూ ఈనాడు మీడియా రైతులకు వరద సాయం చేయడంతో, వారంతా విత్తనాలు వేశారని ,దాంతో మళ్లీ పచ్చదనం వచ్చేసిందంటూ మొదటి పేజీలో ప్రచారం చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే జనం సంగతేమోగానీ, ఈనాడుకు అంతా పచ్చగా కనిపిస్తుందని,అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. ఇవన్నీ ఉదాహరణలే అవుతాయి.మరో పత్రిక ఆంధ్రజ్యోతి అయితే జగన్ ఆస్తులు పెరిగాయంటూ ఒక కథనాన్ని జనంమీదకు వదిలింది. ఇదేదో ఇప్పుడు కొత్తగా రాసిన వార్త కాదు. ఇప్పటికి పలు సార్లు రాసిన వార్త. మళ్లీ మళ్లీ రాస్తున్నారంటే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు 1989లో తన ఆదాయం ఎంతని ప్రకటించారు.. మరి ఆయనదిగానీ, ఆయన కుటుంబ ఆస్తిగానీ ప్రస్తుతం ఎన్ని రెట్లు పెరిగిందో ఎందుకు రాయడం లేదు? ఇవన్నీ చూస్తే ఒకటి మాత్రం స్పష్టం. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరుగుదల , హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టడానికి కూటమి ప్రభుత్వ నేతలకన్నా, ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పడుతున్న తంటాలే ఎక్కువగా ఉన్నాయని అర్ధం అవడం లేదూ!.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గురి తప్పిన బాణం వెనుక..!
గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.ఈ సంకల్పానికి కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. ‘ఫోర్బ్స్’ మేగజైన్ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్ టెన్లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్తో జతకట్టి జగన్ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్ టీడీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్ మోహన్రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్ మోహన్రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్ పవర్ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్ వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్ మోహన్రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్కు మారింది. జగన్ మోహన్రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. మార్కెట్ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ మోహన్రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్ వైఎస్సార్ పంపకం చేశారు. భారతి సిమెంట్స్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ జగన్ మోహన్రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్ రాశారు. అప్పుడు వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్ ఔన్నత్యం మరింత పెరిగింది.క్విడ్ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్ఓయూ (అన్రిజిస్టర్డ్)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్ మోహన్రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్ జగన్కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్లో వాటాలతో పాటు సరస్వతి పవర్ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్ డీడ్ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన ఎన్సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. జగన్ ముందు గానే ఎన్సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
టీడీపీ, ఎల్లోమీడియాల పావుగా షర్మిల..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ కుట్రలు పెద్ద ఎత్తునే సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి షర్మిలను పావుగా మార్చుకున్న టీడీపీ నేతలు, ఎల్లోమీడియా జగన్పై అభాండాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్కు వ్యతిరేకంగా టీడీపీ కుట్ర చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. మీడియా సంస్థలు నడుపుతున్నవారు ఇందులో భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మెట్టు పతనమయ్యాయి అనేందుకు నిదర్శనం. రాజకీయంగా జగన్ను పూర్తిగా దెబ్బతీయకపోతే తమ మనుగడకే ప్రమాదం అన్నంత కసితో వీరంతా కుమ్మక్కై నైతిక, మానవీయ విలువలకు కూడా తిలోదకాలిస్తున్నారు.అక్టోబరు 21న పచ్చమీడియాలో భాగమైన ఆంధ్రజ్యోతి ఒక కథనం వండింది. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ తన చెల్లి షర్మిలతో కాళ్లబేరానికి దిగారన్నది ఆ కథనం సారాంశం. ఆస్తుల పంపకంపై బెంగళూరు వేదికగా చర్చలు జరిగాయని, ఒప్పందం దాదాపుగా కుదిరిందని కూడా ఈ కథనంలో చెప్పేశారు. కాంగ్రెస్తో దోస్తీ కోసం జగన్ ఇలా చేశాడని కూడా ఆ పత్రిక కనిపెట్టేసింది. ప్రత్యక్ష సాక్షులం తామే అన్నట్టుగా ఈ కథనాన్ని అల్లారు. పైగా షర్మిలపై ఎనలేని సానుభూతి వ్యక్తమైంది దీంట్లో. మూడు రోజులు కూడా గడవకముందే.. అంటే అక్టోబరు 24న అదే పత్రికల్లో ఇంకో కథనం ప్రత్యక్షమైంది. మునుపటి దానికి పూర్తి వ్యతిరేకమైన వాదనతో ఈ కథనం ఉండటం గమనార్హం. జగన్ సొంత చెల్లిపైనే కేసులు వేశారని, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని 'మమకారం మాయం" శీర్షికతో సదరు పత్రిక మొసలి కన్నీరు కార్చింది కూడా. ఆస్తుల పంపకంపై అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ అని రాసిన మూడు రోజులకే ఈ రకమైన కథనం రాయడంలోనే కుట్ర ఉంది. జగన్పై ఏదో ఒకలా నిత్యం అబద్ధాలు ప్రచారం చేయకపోతే జనంలోకి దూసుకెళుతున్న ఆయన్ను రాజకీయంగా ఆపడం కష్టమని వారికి అర్థమైనట్టుంది. అందుకే ఎక్కడలేని దుగ్ధతో వాళ్లు ఈ రకమైన కథనాలు వండి వారుస్తునే ఉన్నారు. జగన్, షర్మిలల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవం. షర్మిల... సోదరుడు అని కూడా చూడకుండా జగన్ రాజకీయ ప్రత్యర్ధులతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి దుర్మార్గులతో కుమ్మక్కై ఇష్టారీతిన జగన్ వ్యతిరేక ప్రచారం చేసింది నిజం. అయినప్పటికీ గత పదేళ్లలో జగన్ నుంచి ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా సుమారు రూ.200 కోట్ల మొత్తం పొందిన తర్వాత కూడా ఆశ తీరక షర్మిల తన అన్నను అప్రతిష్టపాలు చేయబోయి తానే పరువు పోగొట్టుకుంటున్నారన్న సంగతి తెలుసుకోలేక పోతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ సమర్పించిన అఫిడవిట్లోనే జగన్ నుంచి రూ.80 కోట్లు పొందినట్లు షర్మిల పేర్కొనడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఎంత అభిమానం లేకపోతే జగన్ జగన్ అంత మొత్తం చెల్లికి ఇస్తారు? చివరికి అన్న బెయిల్ రద్దుకు కొందరు చేస్తున్న కుట్రలో ఆమె ఒక పాత్ర పోషించడం హేయమైన చర్యగా కనిపిస్తుంది. షర్మిల రాజకీయంగా అంత పరిపక్వత లేని వ్యక్తి కావడం ఎల్లో మీడియా ఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేసి తాను గతంలో చెల్లెలికి ఇవ్వదలచిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకుంటున్నానని, తనకు తెలియకుండా జరిగిన షేర్ల బదిలీని ఆమోదించవద్దని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినట్లు ఇది కేసు కాదు. కేవలం ఒక అభ్యర్థన మాత్రమే. కోర్టు ధిక్కారం జరగకుండా ఉండేందుకు తీసుకున్న ఒక జాగ్రత్త మాత్రమే. ఈ విషయాలపై జగన్, షర్మిల మధ్య లేఖలు నడిచాయి. వాటిని చదివితే జగన్కు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరిగిందని అర్థమవుతుంది. గిఫ్ట్డీడ్ తాను ఎందుకు రద్దు చేసుకోదలించింది కూడా జగన్ ఆ లేఖల్లో స్పష్టంగా రాశారు. తన వాదనను ఆయన బలంగా వినిపించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై అభిమానంతోనే ఆయన ఇలా చేయాలని అనుకున్నారు. పైగా దీన్ని లిఖితపూర్వకంగా ఒక అవగాహన పత్రం రూపంలో 2019 ఆగస్టు 31న ఇచ్చారు. తనపై వచ్చిన కోర్టు కేసుల పరిష్కారం ఆ గిఫ్ట్ డీడ్ తర్వాతే అమలు అవుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నారు కూడా. సరస్వతి పవర్ కంపెనీలో జగన్, ఆయన సతీమణి భారతిలకు ఉన్న వాటాలలో కొంత భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని భావించి, ఆమె సంతృప్తి కోసం తల్లి విజయమ్మ ను ట్రస్టీగా పెట్టుకుని డీడ్ రాశారు. షేర్ల బదిలీకి తమ అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అయితే షర్మిల తన తల్లిపై ఒత్తిడి తెచ్చి వాటిని జగన్ కు తెలియకుండా తన పేర బదిలీ చేసుకునే యత్నం చేసింది. ఈ సంగతి తెలిసిన వెంటనే జగన్ లాయర్లు స్పందించి, అలా చేయడం చెల్లదని చెబుతూ పిటిఫన్ వేశారు. ఎల్లో మీడియా దీనిని వక్రీకరిస్తూ, జగన్ తన తల్లి, చెల్లిపై కేసు పెట్టారని తప్పుడు ప్రచారం చేసింది. కేసుకు, పిటిషన్కు మధ్య ఉన్న తేడాను ప్రజలకు తెలియకుండా ఇలా రాశారన్నమాట. జగన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయకపోతే, ఆయన గతంలో తనకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లవుతుంది. షర్మిల పాత్ర ముగిసిన వెంటనే టీడీపీ వారు మరో పాత్రను ప్రవేశపెట్టి, జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ఆ మేరకు టీడీపీ ఎల్లో మీడియా కుట్ర నుంచి జగన్ బయటపడ్డారు. ఇదే సందర్భంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలో తనపట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరం చెప్పారు. ఎల్లో మీడియా కొత్త, కొత్త సూత్రీకరణలు చేస్తోంది. జగన్ తన స్వార్జితమైన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకపోతే అది అన్యాయమట. నిజానికి మన సమాజంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పిల్లల మధ్య ఆస్తుల పంపకం జరిగిన తర్వాత, సోదరుడు మళ్లీ తోడబుట్టిన వారికి తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్దపడే పరిస్థితి ఉంటుందా? అయినా జగన్ సోదరిపై ఆప్యాయతతో అలా తన ఆస్తిని కూడా కొంత ఇవ్వాలని తలపెట్టారు. షర్మిల మొత్తం వ్యవహారాన్ని గందరగోళం చేసి, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు ఈడ్చారు. తమ కుటుంబానికి శత్రువు వంటి ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో చేతులు కలిపి ఇలాంటి కుట్రలకు తెరదీశారు. రాధాకృష్ణ వెనుక ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమే. దీనిని గుర్తించిన జగన్ ఆ కుట్రలను చేధించారు. విజయనగరం పర్యటనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కేవలం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలాంటి ఉదంతాలను వాడుకుంటున్నారని, ఏ కుటుంబంలో గొడవలు ఉండవని ప్రశ్నిస్తూ, రాష్ట సమస్యలకు దీనికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు షర్మిలకు మద్దతుదారుగా నటిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో తన సొంత మామ ఎన్.టి.రామారావును సీఎం. సీటు నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు లాగిపారేస్తే ఆయన కుమిలి ,కుమిలి ఏడ్చారు. ఆ తర్వాత ఎన్.టి.రామారావుకు పార్టీ తరపున ఉన్న రూ.75 లక్షల డబ్బు కూడా ఆయనకు అందకుండా కోర్టు ద్వారా చంద్రబాబు లాగేసుకున్నారు. దాంతో తీవ్ర అవమాన భారంతో ఎన్.టి.ఆర్. మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఎన్.టి.ఆర్ ఒక వీడియోలో మాట్లాడుతూ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చి, పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. అంతేకాదు. ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆయన ఆస్తిలో సరైన వాటా దక్కకుండా ఆమెను రోడ్డుకు ఈడ్చారా? లేదా? చివరికి ఆమె తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇది మామ పట్ల చంద్రబాబు వ్యవహరించిన అమానుష ధోరణి అయితే, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తో కూడా ఆయనకు తగాదా వచ్చింది. రామ్మూర్తి చివరికి అన్నపై కోపంతో కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ తగాదాల కింద రావా? చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలతో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారే. చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆయన బావమరిది హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకుని పెద్ద ఎత్తున దూషణలు చేశారు. హరికృష్ణకు అప్పట్లో ప్రస్తుత ఎమ్.పి దగ్గుబాటి పురందేశ్వరి మద్దతు ఇచ్చేవారు. చంద్రబాబు తల్లి అమ్మాణమ్మకు హైదరాబాద్లోఉన్న అత్యంత విలువైన ఐదెకరాల భూమిని ఇతర సంతానానికి గాని, ఇతర మనుమళ్లకు కాని ఇవ్వకుండా చంద్రబాబు కుమారుడు లోకేష్ కు మాత్రమే ఆమె ఎందుకు ఇచ్చారన్న దానిపై జవాబు దొరుకుతుందా? జగన్, షర్మిల మధ్య వివాదంతో రాష్ట్రం అంతా ఏదో అయిందన్న భ్రాంతి కల్పించాలని చూస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలలో ఇలాంటివి జరగలేదా? ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావుపై ఆయన రెండో కుమారుడు సుమన్ ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో తెలియదా? నిజమో, కాదో కాని కొంతకాలం క్రితం ఆస్తుల పంపిణీపై రామోజీ కుటుంబంలో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఆంధ్రజ్యోతి పునరుద్దరణలో కీలక భూమిక పోషించి పెట్టుబడి పెట్టిన విజయ ఎలక్ట్రికల్స్ దాసరి జయరమేష్, నూజివీడు సీడ్స్ ప్రభాకర్ రావు ల వాటా ఎలా తగ్గిపోయింది? రాధాకృష్ణ వాటా ఎలా పెరిగింది? మొత్తం పెత్తనం అంతా ఈయన చేతికే ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తుంటారు. మరికొన్ని ప్రముఖుల కుటుంబాల గొడవలకు సంబంధించి పాత విషయాలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఆయన మొదటి భార్య నందిని ఏకంగా కేసు పెడితే, రెండో భార్య రేణు దేశాయ్ ఆయన గురించి ఏమి చెప్పారో గుర్తు చేస్తున్నారు. తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నారు కనుక పవన్ కళ్యాణ్ ను ఆయన గొప్పవాడని ప్రచారం చేస్తారు. తేడా వస్తే ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబు అవమానిస్తారు. ప్రధాని మోడీ పెళ్లాన్ని ఏలుకోలేని వాడని చంద్రబాబు అన్నారా? లేదా? తదుపరి తన అవసరార్థం ప్లేట్ మార్చి మోడీ చాలా గ్రేట్ అని ఉపన్యాసాలు చెబుతున్నారు కదా! రిలయన్స్ అంబానీ సోదరులు ఇద్దరూ ఆస్తుల విషయంలో కొంతకాలంం గొడవ పడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై ఆమె రెండో కోడలు మేనకా గాందీ కొన్ని ఆరోపణలు చేస్తూ తనకు ఎలా అన్యాయం చేశారో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు వస్తాయి. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే షర్మిలపట్ల జగన్ అతి ప్రేమ చూపి అనవసరంగా చికాకు కొని తెచ్చుకున్నారని అనిపిస్తుంది. అయినా ఆయన ఇప్పటికీ కూడా తన అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు. షర్మిల తప్పు సరిదిద్దుకుంటే మళ్లీ ఆస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తామని చెప్పడం కొసమెరుపు. కాని ఆమె ఇప్పటికే టీడీపీ ఎల్లో మీడియా వేసిన చక్రబంధంలో ఇరుక్కున్నారు.ఆమెను అడ్డు పెట్టుకుని వారు ఆడుతున్న ఈ డ్రామాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పెద్ద కుట్రలో పావుగా షర్మిల..?
-
నా కుటుంబం గురించి తర్వాత.. ముందు రాష్ట్రాన్ని కాపాడండి
-
మా కుటుంబ గొడవలు మీకెందుకు..
-
వైఎస్సార్సీపీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు.. నారాయణ స్వామి సీరియస్ వార్నింగ్
-
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్ను, ట్రాఫిక్ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్గా, లాజికల్గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్గా సాక్షి డాట్ కామ్లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్
-
నిజం కక్కిన జేత్వాని.. అంతా వాళ్లే చేయించారు..
-
ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు ముంబయి నటి జత్వానీ షాక్ ఇచ్చింది. తన కేసులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని జత్వానీ తెలిపింది. హోంమంత్రి అనితను కలిశాక జత్వానీ ఈ వ్యాఖ్యలు చేసింది. మీ కేసు విషయంలో గత ప్రభుత్వ ముఖ్యుల పాత్ర ఉందా..? అంటూ మీడియా ప్రశ్నకు సమాధానం మిస్తూ.. రాజకీయ ప్రమేయం లేదని జత్వానీ స్పష్టం చేసింది.పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్పై నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. తన కేసు విషయంలో మేనిపులేషన్ మాత్రం జరిగింది. దీనిని రాజకీయం చేయొద్దని తాను కోరుకుంటున్నానని చెప్పిందామె.ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ..జిందాల్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై జత్వానీ నోరు విప్పలేదు. జిందాల్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందా..? అంటూ మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ కాదంబరీ జత్వానీ వెళ్లిపోయారు. ఆమె మాట్లాడ దల్చుకోలేదని జత్వానీ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు వెనుక అసలైన వివాదం జిందాల్ దే కదా అంటూ ప్రశ్నించగా.. తాను కామెంట్ చేయలేనని జత్వానీ పేర్కొంది. -
ఫేక్ వార్తలు ప్రచారం.. టీవీ ఛానెల్కు పెద్దిరెడ్డి పరువు నష్టం నోటీసులు
సాక్షి, తిరుపతి: తనపై నిరాధార వార్తలు వేసినందుకు బిగ్ టీవీకి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై బిగ్ టీవీ తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చర్యలకు దిగారు.కాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు వెళ్లాయి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు బిగ్ టీవీకి ఇప్పటికే పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు పంపించారు. ఇక, తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.ఇక, గతంలో ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసిన కారణంగా ఈనాడు, ఈటీవీకి రూ.50కోట్లు.. మహా న్యూస్కు రూ.50కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
ఇక నా జగన్నామం ఆపవా చంద్రం
-
ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకొచ్చిన బోట్లు టీడీపీవే
-
బోటు రాజకీయం బోల్తా
-
‘సాక్షి’ ఓ పక్క.. మరోపక్క మొత్తం పచ్చమంద
నిజం నిప్పులాంటిది అంటారు. ఆ నిప్పును ఎంత దాచిపెట్టాలన్నా అది సాధ్యం కాదు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందిన విషయాన్ని సాధ్యమైనంత మేర బయట ప్రజలకు తెలియకుండా చేయాలని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి విశ్వ ప్రయత్నం చేశాయి.కానీ, జనం నుంచి వచ్చిన ఆగ్రహావేశాల నేపధ్యంలో ఆ మీడియా సైతం ఎంతో కొంతమేర ప్రజల కష్టాలను కవర్ చేసి తమ మీడియాలో ఇవ్వక తప్పలేదు. వరద బాధితులు పడుతున్న బాధలు, కష్టాలను సాక్షి మీడియా విస్తారంగా ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మిగిలిన మీడియాలో చాలా భాగం వరకు ఆయన మేనేజ్ చేయగలిగారు. అందువల్లే ఏపీలో ముఖ్య నగరం అయిన విజయవాడలో ప్రజలు వరదకు గురై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమాచారాన్ని ఆంగ్ల పత్రికలు సైతం అంతంత మాత్రంగానే ఇచ్చాయి. హైదరాబాద్ ఎడిషన్లలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై వార్తలు రావడం లేదు.సాధారణంగా ఇలాంటి పరిస్థితులను జాతీయ స్థాయిలో కవర్ అయితే కేంద్రం కూడా బాగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ, దేశ స్థాయిలో చంద్రబాబు పరువు పోతుందన్న భావనతో ఈ వార్తలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే విజయవాడ వరద బాధితుల కష్టాలు వెలుగులోకి వచ్చేవి కావు. చంద్రబాబు ఆగ్రహావేశాలు, టీడీపీకి చెందిన కొందరు చేసిన దాడులను తట్టుకుని ‘సాక్షి’ మీడియా విస్తారంగా వార్తలు కవర్ చేసింది. దాని ఫలితంగానే ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. బాధితులకు సాయం చేయడానికి చివరికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో వలంటీర్లుగా పనిచేసినవారి సేవలను వినియోగించుకోక తప్పలేదు.వైఎస్ జగన్ అప్పట్లో ప్రతీ బాధితుడికి ఇంటి వద్దే సాయం అందించాలని స్పష్టంగా ఆదేశించేవారు. ఆ ప్రకారమే వలంటీర్లు, సిబ్బంది పనిచేసేవారు. కానీ, ఇప్పుడు పాల ప్యాకెట్ల కోసం, ఆహార పొట్లాల కోసం ప్రజలు వాహనాల వద్ద ఎగబడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. అయినా అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆహారం అందలేదు. పాలు దొరకలేదు. నీటి సమస్య అయితే అంతా ఇంతా కాదు. పారిశుద్ద్యం క్షీణించడంతో వరద ప్రాంతాలలో ప్రజలు నివసించడమే గండంగా ఉంది. ఎక్కడ అంటు రోగాలు వస్తాయోనని అంతా భయపడుతున్నారు. ఇప్పటికైనా వలంటీర్లను వాడుకోవాలన్న ఆలోచన రావడం గుడ్డిలో మెల్ల.ప్రజలకు అలాగే గత ప్రభుత్వం ప్రజలకు రేషన్ అందించడానికి వేల సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి వారి ఇళ్ల వద్దకే సరఫరా చేసేది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. అవన్ని వృథా అని భావించారు. కానీ, ఇప్పుడు అవే వాహనాల ద్వారా బాధితులకు సరుకులు సరఫరా చేస్తున్నారు. బుడమేరు వరద కారణంగా విజయవాడలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఎంత మంది మరణించారో ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. అస్వస్థతకు గురైన వారిని కానీ, మరణించిన వారి శవాలను కానీ తరలించడానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. దాంతో ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తోసుకువెళుతూ కనిపించిన దృశ్యం అందరిని కలచివేసింది. పద్నాలుగు మంది కుటుంబం ఒక ఇంటిలో నిలబడిపోతే ఒక్క ఆహార పొట్లాన్ని మాత్రమే ఇచ్చారని, దీనిని ఎలా సర్దుకోవాలని ఒక మహిళ ప్రశ్నించింది.ఈ కథనాలను అత్యధికంగా సాక్షి మీడియానే ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇతర ప్రాంతాల ప్రజలకు తెలియ చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రజల బాధలను విస్మరించాయి. దాంతో విజయవాడ ప్రాంతంలో ప్రజలలో ఈ మీడియా పత్రికలు, టీవీలపై అసంతృప్తి ఏర్పడింది. ఆ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. తెలుగుదేశం యువగళంలో పనిచేసిన ఒక కార్యకర్త సాక్షి టీవీ రిపోర్టర్ వద్దకు వచ్చి వరద పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం అసలు పనిచేస్తున్నట్లు లేదని, తాను టీడీపీ వ్యక్తిని అయినా ఈ విషయం చెప్పడానికి వచ్చానని కెమెరా ముందు తెలిపారు.గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు జాగ్రత్తలు తీసుకున్నా, బాధితులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా వలంటీర్ల మొదలు, అధికార యంత్రాంగం అంతా వేగంగా పనిచేసేలా చర్యలు చేపట్టినా, ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా విపరీతమైన ద్వేషంతో వ్యతిరేక వార్తలు ఇచ్చేవి. అత్యధిక భాగం అవాస్తవాలను వండివార్చేవి. వాటి ఆధారంగా చంద్రబాబు అప్పట్లో తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వ్యతిరేక వార్తలు రాకూడదని శాసించాలని చూస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా అదంతా అధికారుల తప్పే కాని తనది కాదని ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే రీతిలో వార్తలను ఇస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సుమారు పాతిక మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు వైఎస్సార్సీపీ అని ముద్రవేసి పక్కనబెట్టారు. మిగిలిన వారంతా తమకు అనుకూలమైన వారిగా భావించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా వైఎస్సార్సీపీ భక్తులని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అసలు ముఖ్యమంత్రి చేయవలసిన విధులను నిర్వర్తించకుండా, అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా, తనతో పాటు వరదలలో తిప్పుకుని, ఇప్పుడేమో వారిపైన విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సరిగా పనిచేయలేదని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ కుట్రలు అన్నట్లుగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అధికారులు, ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీడీపీ మీడియా కూడా రెండు రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను కొంతమేర అయినా కవర్ చేయక తప్పలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక 'కష్టాలు కన్నీళ్లు’ హెడింగ్తో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. హాహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితం అయినా సాయం అంటూ కొన్ని వాస్తవాలను రాయకతప్పలేదు. ఈనాడు పత్రిక బుధవారం నాడు 'మూడో రోజూ ముంపులోనే’ అన్న హెడ్డింగ్ పెట్టింది. అదే సమయంలో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు అని సబ్ హెడింగ్ పెట్టింది. పునరావాస శిబిరాలకు వేల మందిని తరలించారని, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యవేక్షిస్తున్నారని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు శనివారం రాత్రికి రాత్రే ఎత్తడంతో విజయవాడ మునిగిపోయిందని ఈనాడులో స్థానికంగా ఒక వార్త ఇచ్చారు. బుడమేరు వరద కృష్ణాలో అధికంగా కలిస్తే నీరు వెనక్కి తన్నుతుందన్న భావనతో షట్టర్లు ఎత్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు ముంపునకు గురి కాకుండా ఉండడానికి అని మాత్రం రాయకుండా వీటీపీఎస్కు ఇబ్బంది రాకూడదని గేట్లు ఎత్తారని పేర్కొంది. ఈనాడుకు, చంద్రబాబుకు మధ్య ఉన్న లింక్ అందరికి తెలిసిందే. మార్గదర్శి అక్రమాలకు సంబంధించి హైకోర్టులో ఉన్న అప్పీళ్లను ప్రభుత్వం ఉపసంహరించుకుని ఆ సంస్థ యాజమాన్యానికి గిప్ట్ ఇచ్చింది. దీనిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న వైనాన్ని ప్రజలంతా గుర్తు చేసుకోవడమే కాకుండా , ఈ ఐదేళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో తమకు ఈ బాధలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎల్లో మీడియాకి కావలిసింది ఇలాంటివే... వెంకట్ రెడ్డి ఫైర్
-
టీడీపీ నేతలు, ఎల్లో మీడియాపై సజ్జల పరువునష్టం దావా
-
‘ఆ ఫొటోలు మార్ఫ్ చేసినవే..కావాలంటే ఫోరెన్సిక్ పరీక్ష చేయండి’
సాక్షి,హైదరాబాద్ : ఆమెకు ప్రముఖులు, పారిశ్రామక వేత్తలు, బ్యూరోక్రాట్లే టార్గెట్. ఆయనికి అచ్చంగా వాళ్లే టార్గెట్. ఇద్దరికి పెద్ద తేడాం ఏం లేదు. ఆమె పేరు కాదంబరి జత్వానీ. ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. పచ్చమీడియా గత నాలుగైదు రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు. అది ఈ రోజు దాకా చల్లారలేదు. ఇప్పట్లో చల్లారే అవకాశమే లేదు. అసలు ఎవరికోసం ఈ పరమాన్నం వండుతున్నారా? అని ఆరా తీస్తే. విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి.కాదంబరి జత్వానీ అలియాస్ కిలాడీ కాదంబరి జత్వానీ. చోటా నటి. బడా బ్లాక్మెయిలర్. అందమే ఆమె పెట్టుబడి. సినిమాల్లో నటన పార్ట్టైం. హనీట్రాప్ బిజినెస్ ఆమె ఫుల్ టైం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపుల వల విసిరి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్ కిలాడీ లేడి. ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు. వ్యభిచార ముఠాలతో మిలాఖత్లు.. ఆమె డెయిలీ డ్యూటీలో భాగాలు. సంతకాలు ఫోర్జరీ చేయడం. భోగస్ పత్రాలు సృష్టించడం, భారీగా ఆస్తులు పోగేయడం ఆమె అసలు ప్రొఫెషన్. ఈ మాయలేడిని దందాను ఆసరగా చేసుకుని చంద్రబాబు సరికొత్త దందా తెరతీశారు. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికిన కాడుకి దండుకోవాలనుకునే వ్యూహం పన్నారు.నిజం చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లను బ్లాక్ మెయిల్ చేసి, కోట్లను కొల్లగొట్టింది ఈ కాదంబరి జత్వానీ.ఏషియన్ పెయింట్ ప్రమోటర్ మాలవ్ దాని కూడా ఆమె బాధితుల జాబితాలో ఒకరు. అయన ఫిర్యాదుతో ముంబై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అచ్చం అలాగే ఆంధ్రప్రదేశ్లో కుక్కల విద్యాసాగర్కు వలపుల వల విసిరింది. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పుచుకునేందుకు బాబు మనల్ని హనీట్రాప్లోకి లాగుతున్నారు. తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదందరికి న్యాయం చేసేస్తారంట. ఆమెను అడ్డుపెట్టుకుని పారిశశ్రామిక వేత్తలను బ్యూరోక్రాట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నాడు ఓ సినీనటి నేడు ఈ మహానటి. చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది. ప్రజలపై చంద్రబాబు హనీట్రాప్ విసిరిన వేళ కాదంబరి జత్వానీ అలియాస్ కిలాడీ కాదంబరి జత్వానీకి తాను కూడా ఓ బాధితుడినేంటూ కుక్కల విద్యాసాగర్ ముందుకు వచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, కేవలం తనకు న్యాయం కావాలని కోరుతూ మీడియా ముందుకు వచ్చినట్లు చెబుతున్న విద్యాసాగర్తో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ. సాక్షి ఇంటర్వ్యూలో కాదంబరి జత్వానీ.. కుక్కల విద్యాసాగర్ని ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.సాక్షి: కాదంబరి జత్వానీ మీకు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పరిచయం అయ్యిందికుక్కల విద్యాసాగర్ : 2009లో నేను వ్యాపార వేత్తను.నేను చేస్తున్న వ్యాపారం బాగా జరిగేది. ఆ సమయంలో నాకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన కాదంబరి ట్రాప్లో చిక్కుకున్నాను. ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి నాతో పరిచయం పెంచుకోవడం. అవసరానికి డబ్బులు అడిగేది.సాక్షి : మీరు ట్రాప్లో పడ్డాను అని అంటున్నారు? ఆమె ట్రాప్లో పడ్డాను అన్న విషయం మీకు ఎప్పుడు? ఎలా తెలిసింది? విద్యాసాగర్ : కొన్నేళ్ల తర్వాత తెలిసింది. నా వ్యాపారం నిమిత్తం ముంబైలో సెటిల్ అయ్యాను. 2014 నుంచి కాదంబరి,ఆమె తల్లి నాకు సమయం, సందర్భం లేకుండా డబ్బులు కావాలని బెదిరించే వారు. అన్ని లక్షలు కావాలి. ఇన్ని లక్షలు కావాలి అని ఓ పది, పదేహేను నెంబర్ల నుంచి ఫోన్ చేసేవారు. స్పందించపోతే.. నేను నీ గురించి అందరికి చెబుతాను అని బ్లాక్ మెయిల్ చేసేది. చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకు గురి చేసేది.సాక్షి: బ్లాక్ మెయిల్ అంటే? ఏ విధమైన బ్లాక్మెయిల్. మీకు సంబంధించిన విషయాలు ఆమె దగ్గర ఏమున్నాయి? ఆమెకు భయపడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?విద్యాసాగర్: వ్యక్తిగత విషయాలు ఏమీలేవు. మీకు చెప్పాను కదా హైదరాబాద్లో బిజినెస్ చేసే సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన కాదాంబరిని అప్పుడప్పుడు కలిసే వాడిని. అలా కలిసినప్పుడు నాతో సెల్ఫీలు దిగింది. ఆ సెల్ఫీలను మార్ఫ్ చేసింది. ఆ ఫొటోల్ని నా తల్లిదండ్రులకు చూపిస్తా అని బెదిరించేది. లక్షలు కావాలి. కోట్లు కావాలి అని అడిగేది. సడెన్గా ఎయిర్పోర్ట్కి వచ్చేది. సమయం, సందర్భం లేకుండా నా ఇంటి దగ్గర కారు అపేది. అక్కడికి వచ్చి నాకు డబ్బులు కావాలనే ఫోన్ చేసి విసిగించేది.సాక్షి: అంటే ఆమెతో ఫొటోలు దిగడం మీకు చుట్టుకుంది’అని కోవాలా?విద్యాసాగర్ : అవునుసాక్షి : ఫొటోలు మార్ఫింగ్ అంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఎల్లో మీడియాలో కొన్ని అర్ధనగ్న ఫోటోలు ప్రసారం అవుతున్నాయి. ఆమె కూడా చూపించింది. ఆ ఫొటోలు మీవేనా?అలాంటి ఫొటోలు మీవి ఆమె దగ్గర ఉన్నాయా?విద్యాసాగర్ : లేవు.అవన్ని మార్ఫ్ చేసినవే. అలా ఫొటోల్ని మార్ఫ్ చేయడం ఆమెకు అలవాటు. అలవాటు ప్రకారం నా ఫొటొల్ని మార్ఫ్ చేసింది. వాటిని చూపించి బెదిరించేది.సాక్షి : ఆ ఫొటోలు మీవి కావని అంటున్నారు. ఆ ఫొటోలు మీవి కావు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా?విద్యాసాగర్ : ఎస్. ఆ ఫొటోలు నావి కావు. మార్ఫ్ చేసినవే. కావాలంటే ఫోరెన్సిక్ పరీక్ష చేయండి. పైగా నేనెప్పుడూ ఆరోగ్యంగా బొద్దుగా ఉండేవాడి. ఆ ఫొటోల్లో చూపించినట్లుగా నాకు కండలు లేవు. నాకు జిమ్ చేసే అలవాటు లేదు.సాక్షి: మిమ్మల్ని బెదిరింది ఏం కావాలని డిమాండ్ చేసేవారు.విద్యాసాగర్ : డబ్బులు,ఫ్లైట్ టికెట్లు,హోటెల్ బుకింగ్స్,షాపింగ్ కోసం ఎక్కువ శాతం డబ్బులు అడిగేవారు.సాక్షి : మీలాగే బాధితులు చాలా మంది ఉన్నారని మీకు ఇప్పుడే తెలిసిందా? లేదంటే గతంలోనే తెలిసిందా?విద్యాసాగర్ : నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందిసాక్షి : ఈ మధ్యనే తెలిసిందని అంటున్నారు. మీలాగే చాలామందిని ఇబ్బంది పెట్టింది అంటున్నారు. హనీట్రాప్,బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా?విద్యాసాగర్ : 10ఏళ్లుగా నేను డాక్టర్ని అని చెబుతున్న జత్వానీ.. ఏ ఒక్క పేషెంట్కైనా ట్రీట్మెంట్ ఇచ్చిందో చెప్పమనండి. ఏ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేసేందో అడగండి. దీంతో పాటు అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ ఇంటర్నల్ మెడిసిన్లో నేను డాక్టర్ని అని చెప్పుకుని తిరుగుతుంది.పాస్పోర్ట్లు, డేటాబర్త్ సర్టిఫెట్లు చెక్ చేయండి. సమాజానికి నేను బాగా చదివాను.డాక్టర్ని అని ఒక హైప్ క్రియేట్ చేసింది. ప్రముఖులతో కూడా ఇలాగే చెప్పుకునేవారు. వాళ్లు కూడా నమ్మేవారు. నేను రెండు సార్లో, మూడు సార్లో ఆమెతో మాట్లాడాను. నాలుగో సారి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది.సాక్షి : మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారా?విద్యాసాగర్ : జత్వానీ, ఆమె తల్లి ఇద్దరు ఫోన్ చేసి అడిగారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని. -
అసత్య కథనాలపై ఆగ్రహం.. ఎల్లోమీడియాపై సజ్జల పరువు నష్టం దావా
సాక్షి, అమరావతి : టీడీపీ నేతలు, ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’ పేరుతో ఎల్లోమీడియా అసత్య కథనాలు ప్రచురించడమే కాకుండా, టీవీ ఛానల్స్లోనూ దుష్ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అసత్య కథనాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా టీడీపీ ఆఫీసులో మాట్లాడిన వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే అందరికీ లీగల్ నోటీసులు పంపించారు. -
కాదంబరి అసలు రూపం.. అడ్డంగా దొరికిన ఎల్లో మీడియా
-
ఎల్లోమీడియా దుష్ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
-
ప్రభుత్వంపై, పచ్చ పత్రికపై రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం
-
అది నేనే.. ఇదీ నేనే
యూపీఎస్ను మేం వ్యతిరేకిస్తున్నాంకేంద్రం తెచ్చిన యూపీఎస్ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగులకు నష్టదాయకం. ఉద్యోగుల సంపదంతా ప్రభుత్వానికి పుణ్యానికి ఇవ్వడమే. ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. – ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘంముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను తెస్తే బాబు కిమ్మనడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్ను వ్యతి రేకించే సాహసం చంద్రబాబు చేయడం లేదు. దీంతో ఆయన వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను నిలువెల్లా మోసం చేయడమే బాబు ఉద్దేశమని నిప్పులు చెరుగుతున్నారు.సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పింఛన్ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మెరుగైన పింఛన్ వచ్చేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచారం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంయక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పేరుతో జీపీఎస్ తరహాలోనే తెచ్చినా నోరుమెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ తరహాలోనే యూపీఎస్ను తెచ్చినా.. దాదాపు జీపీఎస్ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన యూపీఎస్ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని దుయ్యబడుతున్నారు. బయటపడ్డ చంద్రబాబు మోసపూరిత నైజం.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు. జీపీఎస్ అమలు కోసం గెజిట్ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. గెజిట్ విడుదల విషయం మీడియాలో రావడంతో ‘చంద్రబాబు ఆగ్రహం’ అంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని, గెజిట్ అమలు నిలిపేయాలని ఆదేశించారంటూ కూడా కథనాలు అచ్చేశాయని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు గెజిట్ నిలుపుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాబు ఆగ్రహమనేది ఉత్తి మాటేననేది.. గెజిట్ నిలుపుదల చేయకపోవడంతోనే అర్థమైందని మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు, కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే సీపీఎస్ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమేనని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందో మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడంలో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోందని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పెన్షన్ భిక్ష కాదు.. ప్రాథమిక హక్కు..తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్.. ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీమ్. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్ పథకాన్ని అందించాలి. పెన్షన్ భిక్ష కాదు.. ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు. ఇది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగుల ఆకాంక్షలకు సోమనాథన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడున్న ఎన్పీఎస్ పథకంలో రిటైరయ్యాక వచ్చే 60 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 35, 40 ఏళ్ల పాటు ఉద్యోగి సర్వీసులో బేసిక్ పే, డీఏలో పది శాతం నొక్కేసి.. మ్యాచింగ్ గ్రాంట్ అంటూ దానికి కొంత పోగేసి, చివర్లో రిటైరయ్యాక మొత్తం కార్పస్ ఫండ్ను మింగేసే కుట్రే యూపీఎస్. ఉద్యోగుల పెన్షన్ సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం?. – సీఎ దాస్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుయూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్లో ప్రాన్ ఎమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుని 50 శాతం పింఛన్ను డీఆర్తో కలిపి ఇస్తారా? లేక ప్రస్తుత పింఛన్ పథకంలో ఉన్నట్లు 60 శాతం ప్రాన్ అమౌంట్ ఇస్తారా? అనేది తేల్చాలి. అలాగే యూపీఎస్ పెన్షన్ను ఏ విధంగా, ఎవరి ద్వారా చెల్లిస్తారనేదానిపైనా స్పష్టత ఇవ్వాలి. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగికి కుటుంబ పింఛన్ 60 శాతం చెల్లిస్తారా? స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో కనీస సర్వీస్ ఎంతగా నిర్ణయిస్తారు? రిటైర్ అయ్యాక అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తారా? లేకపోతే యూపీఎస్, లంప్సమ్ ఎమౌంట్తో సరిపెడతారా? వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలి. – కె.సతీష్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు -
‘మార్గదర్శి స్కాం’ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. నాపై దాడులు చేసి.. మళ్లీ నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు.‘‘టీడీపీ కరపత్రంలా ఈనాడు మారింది. ఇప్పటికే ఎల్లో మీడియాకు నోటీసులు పంపాం. మదనపల్లె ఘటనపై విచారణ చేయమని మొదట్నుంచీ కోరుతున్నాం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్.. నిజాలు నిగ్గు తేలేవరకు తాను పార్లమెంట్లో పోరాడతా’’ అని మిథున్రెడ్డి తెలిపారు.వైఎస్సార్సీపీలో కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందన్నారు. గడిచిన కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మదనపల్లి ఘటనలో నిజానిజాలు తేలాలని ఇప్పటికే మూడుదఫాలు మీడియా ముందు చెప్పామని… ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.ఈనాడులో తమపై వరుసగా వస్తున్న తప్పుడు కథనాలన్నీ ఒక పద్దతిప్రకారం జరుగుతున్నాయన్నారు. ఈ తప్పుడు వార్తలపై పరువునష్టం దావా కోసం నోటీసులు కూడా ఇచ్చామని.. అయినా ఇంకా వరుసగా తప్పుడు కథనాలు రాస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై ఆధారాలు చూపమంటే స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రచారం చేసినా తాము ఎన్నికల్లో విజయం సాధించామని.. దీంతో ఓర్వలేక అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు.దేశంలో అతిపెద్ద కుంభకోణమైన మార్గదర్శిపై తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారంలో తప్పుపడుతూ కోర్టుకెళ్లిందన్నారు. అడిగేవాళ్లు లేరని అవాస్తవాలు ప్రచురించి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న ఈనాడు సంస్ధలు, మార్గదర్శి చిట్ఫండ్స్ తో సహా వీళ్ల అక్రమాలన్నీ బయట పెడతామన్నారు. తమను మానసికంగానూ, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈనాడు ఈ కథనాలు రాస్తోందని.. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.ఈనాడు యాజమాన్యం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారిపోయి.. టీడీపీ నేతలు ఎవరిని నిర్ణయిస్తే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన కథనాలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తరహా రాతలు రాస్తున్నారని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న దాడులతో టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారని.. తమపై దాడి చేసి కేసులు కూడా తిరిగి తమపై పెడుతున్నారని మిథున్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
పచ్చ పత్రికలు, ఛానల్స్ కు గడ్డి పెట్టిన ఢిల్లీ హైకోర్టు
-
ఎల్లో ‘కుల’ మీడియాపై విజయసాయి రెడ్డి సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎల్లో కుల మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సీఎం చంద్రబాబు తృప్తిపరిచి ఆయన మెప్పు పొందేందుకు స్వార్థంతో నీచంగా పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబును సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈటీవీ, ఆర్ టీవీ, వంటి కుల మీడియా యజమానులు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నీతిబాహ్యమైన రీతిలో దుష్ట పన్నాగాలతో బరితెగించి వైఎస్సార్సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నాయి.వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జర్నలిజం నిబద్ధతను గాలికొదిలి కట్టుకథలను ప్రసారం చేస్తున్న క్రమంలో పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం తెస్తూ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలనే నిజాలుగా చిత్రీకరిస్తూ విలువలకూ తిలోదకాలు ఇచ్చి సత్యానికి పాతరేస్తున్నారు. ఈ కుల మీడియా యజమానుల దుర్మార్గమైన ప్రవర్తన పాత్రికేయ సూత్రాలను మంటగలుపుతూ రాజకీయ వాతావరణాన్ని స్వార్ధంతో నీచానికి ఒడికడుతూ కలుషితం చేస్తున్నారు. చంద్రబాబు గారిని సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈ టీవీ, ఆర్ టీవీ, వంటి కులమీడియా యజమానులు తీవ్రంగా పోటీపడుతూ నీతిబాహ్యమైన రీతిలో దుష్టపన్నాగాలతో బరితెగించి వైస్సార్సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2024 -
విజయసాయి రెడ్డిపై తప్పుడు కథనాలు.. ఎల్లో మీడియాకు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్..
-
ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు షాక్
-
విజయసాయి రెడ్డిపై తప్పుడు కథనాలు.. ఎల్లో మీడియాపై హైకోర్టు సీరియస్!
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని తొమ్మిది మీడియా సంస్థల(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎల్లో మీడియాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.ఇక, విచారణ సందర్బంగా.. ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా తొమ్మిది మీడియా సంస్థలు(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్) వ్యవహరించాయి. వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఆయన ప్రతిష్టకు, రాజకీయ భవిష్యత్కు భంగం కలిగే విధంగా మీడియాలో తప్పుడు ప్రసారాలు అందించారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను, వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కథనాలను ప్రజలకు అందించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. గోబెల్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? అన్ని ప్రశ్నించింది. బొత్స సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదు. నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా?’ అని ప్రశ్నించింది.నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం.స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డిగారు లోపలికి వెళ్లలేదు.నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? pic.twitter.com/m8TrwbOfh3— YSR Congress Party (@YSRCParty) August 12, 2024 -
మళ్లీ అదే పచ్చ ఉత్సాహం!
అమరావతి, సాక్షి: టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయం హత్యలు, దాడులతోనే ఆగిపోవడం లేదు. అక్రమ కేసులు పెట్టైనా సరే వైఎస్సార్సీపీ నేతల్ని కటకటాలపాలు జేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు దుష్ట రాజకీయానికి ఎల్లో మీడియా తోడైంది.వల్లభనేని వంశీ షయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పేరును పోలీసులు ఏ-71 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఎల్లో మీడియా ఛానెల్స్, వెబ్సైట్స్ మాత్రం రెండ్రోజులుగా మరోలా హడావిడి చేస్తున్నాయి. ఒకానొక దశలో వంశీపై తప్పుడు ప్రచారానికి సైతం దిగాయి. ఇంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రమంతా చూసింది. ఈవీఎం కేసులో ఆయనకు న్యాయస్థానం ఊరట ఇచ్చినప్పటికీ.. అక్రమ కేసులు బనాయించి మరీ ఆయన్ని జైలుకు పంపేదాకా వదల్లేదు. అయితే.. ఆ టైంలోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదీ చదవండి: ఇంతకీ మంత్రి లోకేష్ ఎక్కడ?ఇక ఇప్పుడు వంశీ.. హైదరాబాద్లో ఉన్నారని ఓసారి, అమెరికా వెళ్లిపోయారని మరోసారి, ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ ఇంకోసారి.. కథనాలు ఇచ్చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తలన్నింటినీ ఖండించారు. దీంతో ప్రత్యేక బృందాలతో ఆయన కోసం గాలింపు కొనసాగుతోందంటూ మళ్లీ కథనాలు మొదలుపెట్టాయి. అంతేకాదు.. ఏ 71గా ఉన్న ఆయన్ని ఈ కేసులో ఏ1గా మార్చేయబోతున్నారంటూ పోలీసుల తరఫున నిర్ణయాల్ని కూడా భవిష్యవాణి తరహాలో ప్రచురిస్తున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగిలేదు. వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులను సైతం ఇందులోకి లాగుతూ అడ్డగోలు రాతలు రాస్తున్నాయి. -
పచ్చ మీడియా డైరెక్షన్..పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయాల్లో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా? ఆర్డీవో, సీసీఎల్ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డులు భద్రంగానే ఉంటాయి. కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం.. ఉన్నతాధికారులను హుటాహుటిన హెలికాఫ్టర్లో పంపి అక్కడేదో జరిగిపోయిందనే అనుమానాలు రేకెత్తించడం.. అనుమానితుల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు, విచారణ పేరుతో బెదిరించడం.. ప్రజలను రెచ్చగొట్టడం.. పూర్తిగా ఓ వర్గం మీడియా డైరెక్షన్లో దర్యాప్తు సాగడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.» ఘటన జరిగిన మర్నాడే ఈనెల 22న సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వయంగా డీజీపీ, సీఐడీ చీఫ్లు హెలికాప్టర్లో మదనపల్లె చేరుకుని విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య రహస్యంగా విచారణ చేపట్టినట్లు చెబుతున్నా ఆ వివరాలన్నీ ఎల్లో మీడియాకు లీక్ కావడం గమనార్హం. ఆ కథనాల ఆధారంగా దాడులు, విచారణలు సాగుతుండటంతో ఇక విచారణ ఎంత నిష్పాక్షపాతంగా సాగుతుందో ఊహించవచ్చు. డీజీపీ, సీఐడీ చీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా మీడియాను అనుమతించని పోలీసులు టీడీపీ నేతల కార్లను మాత్రం సాదరంగా లోపలికి పంపారు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది. » విచారణ మొదలైన తొలిరోజు సాయంత్రం ఎల్లో మీడియాను మాత్రమే లోపలకు అనుమతించారు. అంతకుముందు టీడీపీ నేతలను లోపలకు పంపారు. వారితో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. » అటు వార్తలు.. ఆపై దాడులు ఎల్లో మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకుల గురించి వార్తలు రావడమే ఆలస్యం పోలీసులు దాడులు, తనిఖీలకు దిగుతున్నారు. ఈనెల 23న వైఎస్సార్సీపీకి చెందిన మాధవరెడ్డిపై ఈనాడులో వార్త రాగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అదే పత్రికలో ఈనెల 25న వైఎస్సార్సీపీకి చెందిన మరోనాయకుడు బాబ్జాన్ గురించి కథనం ప్రచురించడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడులకు దిగి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ 28న పరోక్షంగా నవాజ్ బాషానుద్దేశించి కథనాన్ని వెలువరించడంతో ఉదయమే పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు. » శనివారం మదనపల్లె మున్సిపల్ వైస్చైర్మన్ జింకా వెంకటా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. మరో నాయకుడు బండపల్లి అక్కులప్ప విచారణ హాజరు కాగా ఎల్లో మీడియాలో హంగామా సృష్టించారు.ఎలాంటి తప్పు చేయలేదు – మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషాఐదేళ్ల పదవీకాలంలో ఎక్కడా కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి తప్పు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా స్పష్టం చేశారు. శనివారం రాత్రి తాను బెంగళూరులో ఉన్న సమయంలో 22(ఏ) నిషేధిత భూముల బదలాయింపులకు సంబంధించిన ఆరోపణలపై తన నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తాను ఆదివారం ఉదయం వస్తున్నట్లు చెప్పి తనిఖీలకు సహకరించినట్లు తెలిపారు. రెవెన్యూ, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శక పాలన అందించినట్లు గుర్తు చేశారు. ఎక్కడా తలదించుకునేలా వ్యవహరించలేదన్నారు.పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో సోదాలుటాస్క్ఫోర్స్: మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు ఆదివారం హైదరాబాద్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో పది మంది పోలీసులు పాల్గొన్నారు. -
టీడీపీ, ఎల్లో మీడియాపై మిథున్ రెడ్డి ఫైర్
-
గౌరవాన్ని ఇచ్చిన పార్టీని మేమేందుకు వదిలేస్తాం
-
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను...ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అని అన్నారు.అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2024 ఈ వ్యవహారంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఎల్లో మీడియా రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విజయసాయి రెడ్డి
-
సాయిరెడ్డిపై ఎల్లో కుట్ర.. బాబు పిచ్చి ( శ్వేత ) పత్రం
-
పేదలపై అక్కసు.. అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం
అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా? దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు ప్రయోజనం తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?అసైన్డ్ భూముల రైతులకు చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను ప్రశ్నించేలా ఎల్లో మీడియా.. ప్రధానంగా ‘ఈనాడు’ వింత ధోరణి ప్రదర్శిస్తోంది. వారి భూములపై వారికి హక్కులు ఇవ్వడమే నేరమన్నట్లు వక్ర భాష్యాలు చెబుతోంది. పేద రైతులు, దళితులు ఇంకా బానిసత్వంలోనే బతకాలని కోరుకుంటోంది. వారి భూములకు వారు యజమానులుగా మారడం సరికాదంటూ ఏడుపుగొట్టు రాతలతో దుష్ప్రచారం చేస్తోంది. పేదలు, దళితులు ఆరి్థకంగా ఎదగడానికి వీల్లేదంటూ పెడబొబ్బలు పెడుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైన్డ్ రైతులు అష్టకష్టాలు అనుభవించారు. ఏళ్ల తరబడి ఆ భూములకు హక్కులివ్వాలని ప్రాధేయపడినా ఏ ప్రభుత్వం కనికరించడంలేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళిత, ఇతర పేద రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు లభించాయి. తద్వారా 20 ఏళ్లకు పైబడి తమ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములపై పేద, దళిత రైతులకు సంపూర్ణ అధికారాలు దఖలు పడ్డాయి. లక్షలాది మంది పేద రైతులు వారి భూములపై యాజమాన్య హక్కులు పొంది సంపూర్ణ రైతులుగా మారారు. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. ఆ సొమ్ము ద్వారా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతరత్రా ఆరి్థక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ను వెనకేసుకొస్తున్న ‘ఈనాడు’కు ఇది ఏమాత్రం గిట్టడం లేదు.సాక్షి, అమరావతి: ఏపీలో అసైన్డ్ భూముల చట్టాన్నే అపహాస్యం చేసేలా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేశారంటూ పేద, దళిత రైతులు తమ భూములపై నిర్ణయం తీసుకోవడాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్తగా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూమిని అమ్ముకుంటే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయట పడటంతో.. తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి ‘బాబు అండ్ కో’ అసైన్డ్ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా, ప్రధానంగా ఈనాడు శకుని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి.. ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మేలు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని, తీసివేయాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయడం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదవాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్లో మీడియా ఉన్నట్టు మరోసారి రుజువైంది. చంద్రబాబు, తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్ అనుకోవడం దుర్మార్గం. అసైన్డ్ భూములు దోచిందెవరు? నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ల చేతిలో ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్లోకి తీసుకుని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోందిం. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా నాలుగు వాక్యాలు రాసిందా? అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నాం కష్టం వస్తే.. దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా.. చేసుకోలేని పరిస్థితి. పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబరు 27న దీనికి గెజిట్ జారీ అయ్యింది. నిజంగా ఎవరో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పేవారు. కాని అలా జరగలేదు. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్ అసైనీగా ఉన్నాడో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వండని చెప్పింది. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా? ఇదీ అసైన్డ్ భూముల నేపథ్యం వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయం కోసం భూమి అసైన్డ్ చేసే విధానం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. 1954కు ముందు అసైన్ చేసిన భూములది ఒక కేటగిరీ, 1954 తర్వాత మరో కేటగిరీ. 1954కు ముందు అసైన్డ్దారులకు ఇచ్చిన పట్టాల్లో ఎక్కడా అమ్ముకోకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ పట్టాల్లో మాత్రం ఈ నిబంధన పెట్టారు. దీంతో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన వెబ్ల్యాండ్ దుర్మార్గాల వల్ల 1954కు ముందు అసైన్డ్ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని తొలగించుకోవడానికి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిం, లంచాలు ఇచ్చిం విసిగిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. 1954 నుంచి కూడా పేదలకు భూములు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఆ భూముల మీద వారికి హక్కులు లేవు. అదే స్వాతంత్య్ర సమరయోధులో, ఎక్స్ సర్వీస్మెన్ అయితే అసైన్ చేసిన తర్వాత పదేళ్లకు అమ్ముకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఈ విషయంలో వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకు మాత్రం హక్కులు లేవు. 2, 2.5 ఎకరాల వరకూ అసైన్మెంట్ పట్టా ఉన్న వాళ్లు తమ అవసరాలకు ఒక అరెకరం అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోవడం కుదరదు. దీంతో సాదా బైనామా పద్ధతిలో భూముల అమ్మకాలు జరిగాయి. దీనివల్ల నిరుపేదలైన అసైనీలకు రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా వచ్చేది కాదు. భూమిని అమ్ముకోకుండా సాగు చేసుకున్న వారు కూడా టైటిల్ లేకపోవడం వల్లం రెవిన్యూ శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు వస్తాయని, ఆ భూమిని ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందోనని, ఎక్కడ రిజర్వ్ చేస్తుందోనని భయాందోళనలు ఉండేవి. ఇటు అసైనీకి.. అటు కొనుక్కున్న వారికి లబ్ధి లేదు.రెవెన్యూ రికార్డులు క్షేత్ర పరిస్థితిని తెలియజెప్పేలా లేవు. రికార్డులు ఒకరి పేరు మీద ఉంటే.. భూములు మరొకరి ఆదీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలను ప్రభుత్వాలు అసైన్మెంట్ చేస్తే.. ఆ రికార్డులేవీ క్షేత్ర స్థాయికి అనుగుణంగా లేవు. పూర్తి అధ్యయనం తర్వాతే అసైన్డ్ చట్ట సవరణ జిల్లా కలెక్టర్లు పలుమార్లు జగన్ ప్రభుత్వం దృష్టికి అసైన్డ్ భూముల సమస్యను తీసుకు వచ్చాక రెవెన్యూ మంత్రి నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30వ తేదీన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించిం అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కేరళలో అయితే అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తమిళనాడులో నిబంధన ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసలైన ఒరిజనల్ లబ్ధిదారులకు, లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ) 1977కు సవరణలు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. అంటే అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయగా, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపి, చట్టానికి సవరణలు చేసింది. అదే సందర్భంలో 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎలాంటి హక్కులూ రావు. వారి విషయంలో 1977 నాటి పీఓటీ చట్టం అమల్లో ఉన్నట్టే. 2007,2008 నాటి సవరణలు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకు అసైన్మెంట్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకే మేలు కలుగుతుంది. అంటే ఒరిజనల్ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అందులో తప్పులు జరిగాయని, రద్దు చేయాలనే వాదనలో ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటే ఒరిజనల్ అసైనీలకే హక్కులు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు? 27 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులువైఎస్ జగన్ హయాంలో జరిగిన అసైన్డ్ చట్ట సవరణ ద్వారా సుమారు 15,21,160 మంది భూమిలేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. అలాగే ప్రభుత్వం వ్యవసాయ భూములే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా నిరుపేదలకు ఇచ్చింది. జగన్ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరుమీద నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు కల్పించేలా ఉన్న చట్టాన్ని, జగన్ హయాంలో 10 సంవత్సరాలకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేశారు. ఫలితంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందినవారితోపాటు, మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి పేదలకు ఇచ్చారా? పైగా అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుపడటం వాస్తవం కాదా? భూముల పేరుతో అన్యాయం చేసింది చంద్రబాబు కాదా? 2016లో ఒక్క మెమో ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములను ఉద్దేశ పూర్వకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఎలో పెట్టి ఆ రైతులను సర్వనాశనం చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక చుక్కల భూముల విషయంలో నష్టపోయిన 97,472 రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారిని కూడా రోడ్డుకు లాగేస్తారా? షరతులు గల పట్టా భూములున్న వేల మంది రైతులకు సంబంధించిన 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వైఎస్ జగన్ మేలు చేశారు. ఇప్పుడు వీరిని కూడా రోడ్డున పడేస్తారా? గిరిజనులకు 2.83 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చారు. వాళ్లనూ రోడ్డున పడేస్తారా? ఇవన్నీ పేద రైతులకు మంచి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు. వాళ్లందరినీ రోడ్డున పడేయాలన్న చంద్రబాబు కోరికకు ఎల్లో మీడియా అక్షర రూపం ఇస్తోంది. దళిత రైతులను అవమానిస్తారా? అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడాన్ని ఎల్లో మీడియో ఓర్వలేకపోతోంది. తమ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి దళితులు ఎదురుచూశారు. భూములపై హక్కు వస్తే తమకు సమాజంలో గౌరవం పెరుగుతుందని భావించారు. దాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. దీన్ని తప్పు పట్టడం అన్యాయం. హక్కులు వచ్చిన కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడం తప్పెలా అవుతుంది? వారి అవసరాల కోసమో, లేక ఆ భూమికి ఎక్కువ రేటు రావడం వల్లో అమ్ముకుని ఉండవచ్చు. ఆ భూములన్నింటినీ వైఎస్సార్సీపీ వాళ్లు కొన్నారనడం నిరాధారం. దళితులను అవమానించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారు. – జూపూడి ప్రభాకర్రావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుపెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? అసైన్డ్ భూములపై 20 సంవత్సరాల తర్వాత హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ దళితులు, పేద రైతుల తల రాతను మార్చారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఆయన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధైర్యంగా ఈ పని చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. మావి అసైన్డ్ భూములు కావు, పట్టా భూములని చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఎవరైనా అమ్ముకుంటున్నారు. దాని కోసమే, ఆ హక్కు కోసమే వారు పోరాడారు. సాధించుకున్న భూమిపై వారికి హక్కు ఉండదా? దళితులు పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? – మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడులక్షల మంది అసైన్డ్ రైతులకు లబ్ధి దళిత, పేద రైతులకు మేలు చేయడాన్ని కూడా తప్పు పట్టడం దారుణం. అసైన్డ్ భూములకు హక్కులివ్వడం వల్ల లక్షల మంది పేద, దళిత రైతులు ప్రయోజనం పొందారు. అసైన్డ్ భూములంటేనే వివాదాస్పద భూములుగా చిత్రీకరించిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆ భూమిపై వారికి హక్కు ఉండేది కాదు. తమకు హక్కు ఇస్తే ఆ భూమిని అవసరానికి ఉపయోగించుకుంటామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని రైతులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. ఎవరూ వినలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రమే విన్నారు. ఆయన ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. అసైన్డ్ రైతులకు యాజమాన్య హక్కులిచ్చిన ఘనత వైఎస్ జగన్ది. దాన్ని వక్రీకరించి ఇష్టానుసారం మాట్లాడడం తగదు. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు -
మూడు వారాల్లో రూ.7 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం అప్పు చేయందే గడవదంటూ ఇన్నాళ్లూ వైఎస్ జగన్ సర్కారుపై రాసిందే పదే పదే రాస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా విషం కక్కాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రతీ మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బాబు సర్కారు ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాకు సంపద సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులు బాటు కల్పిస్తూ ప్రతి మూడు నెలలకు ఆర్బీఐ వేలం వేసే తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది. ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర అప్పు చేస్తాయో.. ఎన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు తీరుస్తాయో ఆర్బీఐకి తెలియజేస్తాయి. అదే తరహాలో గత వైఎస్ జగన్ సర్కారు పరిమితికి లోబడి అప్పులు చేస్తే.. ప్రతి మంగళవారం అప్పు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నిత్యం దు్రష్పచారం చేస్తూ కథనాలు వండి వారుస్తూ నానా యాగీ చేశాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు 20 రోజుల వ్యవధిలోనే రూ.7000 కోట్లు అప్పు చేసినా.. అదీ ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. దాని గురించి ఒక్క ముక్క రాయడం లేదు. అంటే తమకు ఇషు్టడైన చంద్రబాబు అధికారంలో ఉన్నందున, ఎన్ని అప్పులు చేసినా.. ఆ పత్రికలకు సంపద సృష్టిలా కనిపిస్తుందేమోనని ఉన్నతాధికారి ఒకరు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అంటే ఇష్టం లేనందున పరిమితికి లోబడి అప్పులు తెచ్చినా సరే ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ పెద్ద నేరం చేసినట్లు నిత్యం ఆ పత్రికలు కథనాలు రాసినట్లు ఇప్పుడు స్పష్టం అవుతోందని ఆ అధికారి విశ్లేషించారు. సంపద సృష్టి ఏమైందో! వైఎస్ జగన్ సర్కారు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్లు విషం కక్కారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి అప్పులు చేయడం కాదు.. సంపద సృష్టిస్తానని, ఆ సంపద ఎలా సృష్టించాలో తనకే తెలుసంటూ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పులు చేస్తామంటూ ఆర్బీఐకి స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ప్రతి మంగళవారం అప్పులతో పాటు ఎంత సంపద సృష్టిస్తారో కూడా చెబితే బాగుంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన సెక్యురిటీల వేలం ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. వచ్చే నెల 2వ తేదీన మంగళవారం మరో రూ.5,000 కోట్లు అప్పు చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీన రూ.1,000 కోట్లు తమ్మిది సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 12 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 17 ఏళ్ల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 21 ఏళ్ల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 24 ఏళ్ల కాల వ్యవధికి సెక్యురిటీల విక్రయం ద్వారా అప్పు చేయనుంది. ఆ తర్వాత మంగళవారం కూడా అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలియజేసింది. -
టీడీపీ, ఎల్లో మీడియాకు తోపుదుర్తి కౌంటర్
-
చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
-
పచ్చ మీడియా విషం..
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లా డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలను స్వీకరించారు.సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పులివెందులలో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. అందరితోనూ ఓపికగా మాట్లాడారు. పలువురు నేతలను పేరుపేరునా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు. ‘వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో ఉండిపోయింది. తప్పకుండా ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రెండు కుటుంబాలకు పరామర్శ పులివెందుల నారాయణ పాఠశాల సమీపంలోని పురుషోత్తం నగర్లో నివాసముంటున్న దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు మైఖెల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది. అప్పట్లో రాలేక పోయిన వైఎస్ జగన్.. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైఖెల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైఖెల్ సతీమణి అమూల్యారాణి, కుమారుడు వినీత్లను ఓదార్చారు. సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డిలు నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి.. సంగిరెడ్డి భార్య సత్యవతి, కుమారులు సుధాకర్రెడ్డి, సునీల్రెడ్డిలను జగన్ దంపతులు ఓదార్చారు. ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో పాటు చవ్వా సుదర్శన్రెడ్డి, మిట్టా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మరోసారి విషం కక్కిన ఎల్లో మీడియాసాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. వైఎస్ జగన్పై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని ఒక మార్ఫింగ్ వీడియోను వదిలారు. వైఎస్ జగన్ సోమవారం పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసం వద్దకు వందలాదిగా చేరుకున్నారు. జగన్తో మాట్లాడాలని, ఫొటో దిగాలని పెద్ద సంఖ్యలో యువకులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంటి వద్దకు ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది గిట్టని ఎల్లో మీడియా కొద్ది గంటల్లోనే ఈ వీడియోలోని వాయిస్ను మార్చి ‘జగన్ డౌన్ డౌన్..’ అన్నారని నిస్సిగ్గుగా విషం కక్కింది. పులివెందులలో సైతం ఇదే రీతిలో దుష్ప్రచారం చేసి ఖంగుతింది. అయినా పద్ధతి మార్చుకోక బెంగళూరులోనూ అదే వైఖరి ప్రదర్శించి అభాసుపాలైంది. -
ఎల్లో మీడియాపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన కామెంట్స్
-
టీడీపీ వికృత పోస్టులు..
-
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జిగా భూపేష్రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే. లోపాయికారి ఒప్పందం టీడీపీదే.... కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు. హవ్వా...ఓటమి భయమా..?! కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
సజ్జల అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయ్ బాబు
-
ఓటమి భయంతో టీడీపీ, టాయిలెట్ మీడియా కుట్రల మేళా
-
మాచర్లలో వీధి నాటకాలు!
సాక్షి, నరసరావుపేట/మాచర్ల: వీధి గొడవలకు రాజకీయ రంగు పులిమి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల ద్వారా తాపీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.కారంపూడిలో ఘర్షణలు జరిగిన వారం తరువాత పిన్నెల్లి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం తెలిసిందే. పాల్వాయి గేట్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడి చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయగా తనను చంపుతానని పిన్నెల్లి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. ఇవి చాలవన్నట్లు కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్తో పిన్నెల్లి సోదరులపై మంగళగిరి పోలీసుస్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మద్యం మత్తులో దాడి.. మాచర్ల 22వ వార్డులో శనివారం రాత్రి మల్లె లీలావతి అనే మహిళపై అదే వీధికి చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. ఎల్లో మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది. బాధిత మహిళ టీడీపీకి ఓటు వేయడమే ఈ ఘర్షణకు కారణమంటూ కథనాలు అల్లేసింది. పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో దాడులు జరిగినట్లు తప్పుడు కథనాలు వెలువరించింది. పార్టీలకు సంబంధం లేదు.. నాపై జరిగిన దాడితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ పార్టీకి ఓటు వేయడంతో దాడి చేశారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదు. నన్ను ఏ మీడియా వాళ్లు వివరణ అడగలేదు. ఇష్టానుసారంగా వార్తలు రాయడం బాగాలేదు. మమ్మల్ని పార్టీల గొడవల్లోకి లాగొద్దు. మద్యం సేవించి నాపై దాడి చేస్తే పార్టీలకు అంటగట్టడం సరికాదు. నాపై దాడికి పాల్పడిన వెంకటేష్ పై పోలీసులు చర్య తీసుకోవాలి. లీలావతి, బాధిత మహిళ, మాచర్ల -
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
ఆరోగ్యశ్రీ ఆగలేదు.. పచ్చ మీడియా కుట్ర
-
కూటమి సేవలో 'ఘనాపాఠి'
సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. పోలింగ్ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తున్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!పోలింగ్కు ముందు పల్నాడులో పచ్చ జట్టు పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు.జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్లచంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్ సీఐ పి.శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.పోలీసులను కట్టడి చేసి..పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.అరాచకాలకు అండదండలు⇒ పోలింగ్కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్కు పిలిచి కూడా మాట్లాడలేదు.⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. ⇒ పోలింగ్కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్ను ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.కుట్రలకు సహకారం..కీలకమైన పోలింగ్ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్ గెస్ట్ హౌస్, జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్ ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.రిగ్గింగ్ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.పదేపదే ఫోన్లు చేసినా..పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్ బూత్ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్లకు వైఎస్సార్సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించారు.కౌంటింగ్ రోజు అక్రమాలకు అభయం!ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్
నెల్లూరు, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారాయన. ‘‘ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమే. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా వారికి అర్ధమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు. .. రేపవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. రేవ్ పార్టీ వ్యవహారంపై బెంగుళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంత్రి కాకాణి మీడియాతో అన్నారు. -
ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్బాబును గుర్తించారు. ఆయన సెల్ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్పోర్ట్కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు. -
దాష్టీకానికి పరాకాష్ట
-
కూటమి గుండెల్లో ఓటమి భయం..
-
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
-
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
-
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
చంద్రబాబు అండ్ కో దొంగ మాటలు..
-
మీ భూమి మీది కాదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు