లెక్కింపు గణాంకాలు | - | Sakshi
Sakshi News home page

లెక్కింపు గణాంకాలు

Published Mon, Mar 3 2025 12:19 AM | Last Updated on Mon, Mar 3 2025 12:19 AM

-

● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో.. ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్‌లో కౌంటింగ్‌ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా

కై లాస్‌నగర్‌: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగ ర్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించే మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీ కృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా.. పట్టభద్రుల కౌంటింగ్‌ ఆలస్యమయ్యే అవకాశముంది.

ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ ప డ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్‌ నుంచి వూ ట్కూరి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్‌ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరి కృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నా రు. బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు సైతం తమ మద్దతుదారుల గెలు పునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలు తుందా లేక రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

తొలి ఫలితం టీచర్స్‌ ఎమ్మెల్సీదే

టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొ మురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్‌టీయూ టీఎస్‌ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్‌, టీఎస్‌యూటీఎఫ్‌ పక్షాన అశోక్‌కుమార్‌ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్‌టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలి తం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధి స్తాడా.. లేదంటే అశోక్‌ కుమార్‌ గెలుస్తాడా అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీ ల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యా య సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓట ర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు సైతం ఏర్పాటు చేశాయి. పోలింగ్‌ సరళిసాగిన తీరు పై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చి తే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్‌ ఎమ్మెల్సీ ఫలిత మే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా లేక రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్‌ ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేదిక: అంబేడ్కర్‌ స్టేడియం, కరీంనగర్‌

మొత్తం టేబుళ్లు: 35

పట్టభద్రుల టేబుళ్లు : 21

టీచర్ల టేబుళ్లు : 14

లెక్కింపు సిబ్బంది: 800

రిజర్వ్‌ స్టాఫ్‌: 20 శాతం

నియోజకవర్గం బరిలో నిలిచిన అభ్యర్థులు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్‌ శాతం

పట్టభద్రుల 56 3,55,109 2,50,328 70.48

ఉపాధ్యాయుల 15 27,088 24,968 92.17

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌– ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయే ట్‌, టీచర్‌ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్‌, టీచర్‌ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబు ళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్‌ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నా రు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్‌, ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని విని యోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్‌ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్‌ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement