ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు

Mar 31 2025 6:43 AM | Updated on Mar 31 2025 6:43 AM

ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు

ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని ఈద్గా మై దానంతో పాటు అన్ని మసీదులు, ము ఖ్యౖ మెన ప్రదేశాల్లో పికెట్స్‌ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. సో మవారం రంజాన్‌ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో దాదా పు 250 మంది సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్‌ డీఎ స్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్‌, టూటౌన్‌ సీఐలు సునీల్‌కుమార్‌, కరుణాకర్‌రావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement